Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, December 28, 2011

మూడు వేల కొలువులు (apspsc.gov.in )

- 2,805 ఉద్యోగాల భర్తీ
- ఒకేసారి 10 నోటిఫికేషన్‌లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
- అత్యధికంగా 1,716 ఏఈఈ పోస్టులు
- జీవో 420 ప్రకారమే ఉద్యోగాల నియామకాలు
- మెరిట్ లిస్టు ఆధారంగానే భర్తీ

హైదరాబాద్, డిసెంబర్ 27 ():రాష్ట్ర ప్రభుత్వంలోని 10 శాఖలకు చెందిన 2,805 పోస్టుల భర్తీకి ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్లూఎస్ శాఖల్లోని 1,716 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 432 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో అత్యధికంగా 397అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, అత్యల్పంగా పోర్టు ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఎలక్షిక్టికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 9 ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ సంస్కరణల ఆధారంగా విడుదల చేసిన జీవో 420 ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ జీవో ప్రకారం కేవలం రాత పరీక్ష మెరిట్ లిస్టు ఆధారంగా మాత్రమే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా బోర్డు ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో 420 విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూ పద్దతి ఉండాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో 420ని ఉపసంహరించుకోవాలని బోర్డు సభ్యులు ముఖ్యమంవూతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవో అమలుపై గత సోమవారం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కమిటీ సిఫారసుల మేరకు ప్రస్తుత నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుం దా? లేదా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ల వరకు జీవో 420 అమలు చేసి, మిగితా నోటిఫికేషన్లకు కమిటీ సిఫారసులు వర్తింపజేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు www.apspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ప్రకటించారు.

Take By: T News

Read more...

కేబినెట్‌లో మార్పులకు కిరణ్ కసరత్తు!

- సీఆర్, గంటా కోసమే చిరు పట్టు?
- పీఆర్పీ కోటాలో తెలంగాణకు మొండిచెయ్యే..
- బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణ
- బొత్స, కాసు, సబిత, శంకర్‌రావుకు ఉద్వాసన?


హైదరాబాద్, డిసెంబర్ 27 ():సంక్రాంతిలోపే మెగాస్టార్ చిరంజీవి బృందం (పీఆర్పీ) కిరణ్ కేబినెట్‌లో చేరబోతున్నది. చిరు కోటాలో ఈసారికి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఉగాది నాటికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పీ శంకర్‌రావు, సబితా ఇంద్రాడ్డిలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పీఆర్పీ కోటాలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగినా, పదవుల విషయంలో పీఆర్పీ కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించనున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకున్నారు. చిరు బృందం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నప్పటికీ చిరంజీవి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆ పార్టీ టికెట్‌పై ఇద్దరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వీరిలో వెనుకబడిన తరగతులకు చెందిన అనిల్‌కు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది.

అయితే చిరంజీవి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా, సీమాంధ్ర నుంచే సీ రామచంవూదయ్య (కడప ఎమ్మెల్సీ), గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా ఎమ్మెల్యే)లకు మంత్రి వర్గంలో తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా జనవరి తొలి వారంలో తన మంత్రివర్గంలో పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణ అనేది పీఆర్పీకే పరిమితం చేయాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఉగాది నాటికి చేపట్టనున్న మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణలో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఆర్‌తో కొత్త సమస్యలా?
కడప జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్సీ సి.రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కిరణ్‌కుమార్‌కు కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో సీనియర్ నేత రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయక పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆయన్ని శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. రోశయ్య తరువాత కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందడ్డికి ఆ జిల్లా రాజకీయ సమీకరణలు, ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతిలో పరాజయం పొందడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయనకు మంత్రిగా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే జిల్లాకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్సీ సీ రామచంవూదయ్యకు మంత్రి పదవి కోసం చిరు పట్టుబడుతున్నారు.

నలుగురికి ఉద్వాసన?
ఫిబ్రవరి రెండవ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు జరిగే అవకాశాలుంటాయి. దీని కంటే ముందు మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరణ, శాఖల మార్పులు చేపడితే బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతానికి పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలను వారికి కేటాయించాలని ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పి.శంకపూరావు, సబితా ఇంద్రాడ్డిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. జోడు పదవులు, రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించు కోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. అదే విధంగా పనితీరు ఆశాజనకంగా లేక పోవడంతో మంత్రి కాసు వెంకటకృష్ణాడ్డి కూడా ఉద్వాసన పలకాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ నుంచి మంత్రి శంకర్‌రావును మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జగన్‌వర్గంతో సంబంధాలున్నాయని ప్రచారంలో ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రాడ్డికి కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు.


సబితను అప్పుడు తొలగించకపోయినా హోంశాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఖాయమని పారీ ్టవర్గాలంటున్నాయి. ఇప్పటికే హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పట్టుబడుతున్నట్లు సమాచారం. శంకర్‌రావును తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని సీఎం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే నిజమైతే రంగాడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ లేదా, ప్రభుత్వ విప్ కొండ్రు మురళికి మంత్రివర్గంలో అవకాశాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అప్పటి వరకు మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మరో ఒకరిద్దరిని తప్పించడం ద్వారా కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో కిరణ్ ఉన్నట్లు సమాచారం. 

 Take By: T News

Read more...

ఎట్టకేలకు లోక్‌పాల్

-లోక్‌సభలో రోజంతా చర్చ..
-లొసుగులపై విపక్షాల రచ్చ
-తొందరేంలేదు.. మళ్లీ తీసుకురండి
-2, 3 నెలలైనా ఫర్వాలేదు: సుష్మ
-అవినీతిపై పోరుకు సహకరించండి
-లోక్‌పాల్‌ను ఆమోదించండి
-పార్లమెంటుకు ప్రధాని విజ్ఞప్తి
-సీబీఐని చేర్చేది లేదని స్పష్టీకరణ


న్యూఢిల్లీ, డిసెంబర్ 27:ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లోక్‌పాల్ బిల్లును మంగళవారం ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదించింది. ఒకవైపు బలమైన లోక్‌పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ముంబైలో నిరాహార దీక్షకు కూర్చోగా, మరోవైపు ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై పలు పార్టీలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఆమోదం కోసం ప్రభుత్వం ముందుకొచ్చింది. బిల్లుపై చర్చలో భిన్నాభివూపాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తి లోపాలతో ఉన్న బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త బిల్లును తేవాలని బీజేపీ డిమాండ్ చేయగా, మార్పులు అవసరమని వివిధ పార్టీలు సూచించాయి. సమతుల్యతతో రూపొందించిన బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం కోరింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య పలుమార్లు తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు నేతలు తమదైన శైలిలో విమర్శలు, విసుర్లు, ఛలోక్తులతో ఆసక్తి కలిగించారు.లోక్‌సభలో బిల్లు పెడుతున్న సందర్భంగా మంత్రి నారాయణస్వామి పార్లమెంటు ఔన్నత్యం గురించి నొక్కిచెప్పారు. ‘‘మనం ఈ సభకు మాత్రమే తలవంచాలి. అంతేతప్ప మరెవరికీ కాదు’’ అని పరోక్షంగా అన్నాను ఉద్దేశించి అన్నారు. అవినీతికి సంబంధించిన నేరానికి పాల్పడ్డట్లు విశ్వసించిన పక్షంలో అలాంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదిత బిల్లు ప్రకారం అధికారం లభిస్తుందని, లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయని మంత్రి చెప్పారు. లాలు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాల లోకాయుక్తలకు సంబంధించి కూడా జోక్యం చేసుకోవడం రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. లోకాయుక్తల ఏర్పాటు గురించి, గుజరాత్‌లో అవినీతి నిరోధక వ్యవస్థ లేకపోవడం గురించి మంత్రి ప్రస్తావిస్తుండగా ఏఐఏడీఎంకే, బీజేపీ సభ్యులు లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బిల్లు పూర్తి లోపాలతో ఉందని ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు.

‘‘బిల్లును ఉపసంహరించాలి. హడావిడిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. తిరిగి స్థాయీసంఘానికి పంపించండి. 3, 4 నెలల తర్వాత తిరిగి ప్రవేశపెట్టండి. ఈ సమావేశాల్లోనే బిల్లు కావాలని మేం కోరాం. కాని, మేము ఇలాంటి బిల్లును కోరుకోలేదు’’ అన్నారు. రాష్ట్రాల్లో లోకాయుక్తలకు సంబంధించి ప్రభుత్వం తొలుత గందరగోళాన్ని తొలగించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రాలు దానిని తప్పనిసరిగా అనుసరించాలా లేదా వాటి ఇష్టవూపకారం వ్యవహరించవచ్చా అన్నది స్పష్టం చేయాలన్నారు. మంత్రి కపిల్ సిబల్ ఐచ్ఛికమంటుంటే మరోమంత్రి నారాయణస్వామి విధిగా నెలకొల్పాల్సిందేనంటున్నారని ఆమె తప్పుబట్టారు. బిల్లు సమాఖ్య స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. లోక్‌పాల్‌లో మైనారిటీల రిజర్వేషన్‌కు సంబంధించి ఆమె రెండో అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ ప్రతిపాదన విభజనకు విత్తనాలను నాటుతుందని విమర్శించారు. రిజర్వేషన్లు లేకుండానే మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఉన్నత పదవులను నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె లాలూను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ కుటిలత్వాన్ని లాలు అర్థం చేసుకోలేకపోతున్నారనిపిస్తోంది. ఇప్పుడాయన తెలుసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆమె వ్యాఖ్యానించగా, ‘‘బీజేపీ దేశాన్ని విడదీయాలని కోరుకుంటోంది’’ అని లాలూ బదులిచ్చారు. లోక్‌పాల్‌ను ప్రభుత్వం అన్ని రకాలుగా నియంవూతించేలా ప్రస్తుత బిల్లు ఉందని, ప్రధానికి చాలా రక్షణలు కల్పించారని, దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని సుష్మా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కపిల్‌సిబల్ బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. బిల్లును ఆలస్యం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. చర్చ సందర్భంగా యూపీఏ మిత్రపక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా లోకాయుక్తల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంతో విభేదించాయి. బలమైన లోక్‌పాల్ అవసరమని, ఆ వ్యవస్థ పార్లమెంటుకు, సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలని సీపీఎం నేత బసుదేవ్ ఆచార్య కోరారు.

-సీబీఐని లోక్‌పాల్‌లో చేర్చం
-ప్రధాని మన్మోహన్ స్పష్టీకరణ

లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐని తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్ తోసిపుచ్చారు. దేశ రాజ్యాంగ స్వరూపానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేప లేదని స్పష్టం చేశారు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన జోక్యం చేసుకుంటూ అవినీతిపై పోరాటంలో ఫెడరలిజం అడ్డంకి కాకూడదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అవినీతి క్యాన్సర్‌పై పోరాటంలో కలిసిరావాలని, బిల్లు ఆమోదానికి సహకరించాలని ఆయన కోరారు. ‘‘సీబీఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావడమనే ప్రతిపాదన సరికాదు. దానివల్ల పార్లమెంటుకు వెలుపల ఒక కార్యనిర్వాహక నిర్మాణం ఏర్పడుతుంది.. అది ఎవరికీ జవాబుదారీకాకుండాపోతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది’’ అని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు. అవినీతి, దాని పర్యవసానాలు ఎలా దారితీస్తున్నాయో గుర్తుంచుకోవాలని, గత ఏడాది కాలంలోనే ప్రజాక్షిగహం ఎలా వ్యక్తమయిందో గమనించాలని అన్నారు. అందుకే ప్రతిపాదిత బిల్లును ఆమోదించాలని కోరారు. బిల్లును రూపొందించే ముందు విసృ్తతంగా సంప్రతించామని, రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. లోక్‌పాల్‌పై రోజంతా చర్చ కొనసాగగా, ప్రధానమంత్రి అలాగే కూర్చున్నారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, అవినీతిపై పోరాటంలో సభ అభివూపాయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉందని అన్నారు. లోకాయుక్తల ఏర్పాటు అవసరాన్ని ప్రధానమంత్రి గట్టిగా సమర్థించారు. ‘ఆమ్ ఆద్మీ’ (సాధారణ పౌరుడు) పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నాడని ఆయన పేర్కొన్నారు. నీరు, విద్యుత్, మునిసిపల్ సేవలు, భూమి రికార్డులు, పోలీస్, రేషన్‌షాపులు.. తదితర నిత్యావసర సమస్యలన్నీ రాష్ట్రాలకు, స్థానిక అధికార సంస్థలకు సంబంధించినవని, ఈ సమస్యల పరిష్కారానికి లోకాయుక్తల ఏర్పాటు అవసరమని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘లోకాయుక్తలను ఏర్పరచకపోతే అవినీతి క్యాన్సర్ విస్తరిస్తుంది. ఈ విషయంలో మనం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయరాదు’’ అని ఆయన అన్నారు.

లోక్‌పాల్‌తో అవినీతి పోదు: ములాయం
లోక్‌పాల్ బిల్లుతో అవినీతి సమసిపోదని, పార్లమెంటు మాత్రమే ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చలో పాల్గొంటూ- పార్లమెంటు కన్నా మరేదీ ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు. ‘‘లోక్‌పాల్ బిల్లు అవినీతిని నిర్మూలించదు. బిల్లులో చాలా లోపాలున్నాయి. అది చాలా అంశాలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం లోక్‌పాల్ కన్నా పెద్దది. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలిస్తుంది. దానికన్నా మరేదీ ఉన్నతం కాదు. ప్రజలు తమను ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఎంపీలు భయపడతారు’’ అని ఆయన అన్నారు. ‘‘సీబీఐపై చేసిన ఆరోపణలను లోక్‌పాల్‌పైనా చేయొచ్చు. ఈ లోక్‌పాల్ బిల్లు అమలుచేయాల్సినంత మంచిదేంకాదు’’ అని ములాయం వ్యాఖ్యానించారు.

సీబీఐకి స్వేచ్ఛ, కొత్త లోక్‌పాల్ అవసరం: జేడీ (యూ)
ప్రభుత్వం మెరుగైన బిల్లు తేవాలని, సీబీఐకి స్వేచ్ఛ కల్పించాలని జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు అవినీతిని నిరోధించలేదని ఆయన లోక్‌పాల్‌పై చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఫలితంగా కోర్టు కేసుల సంఖ్య పెరగడం తప్ప అసలైన ఫలితం ఉండదని ఆయన పేర్కొన్నారు. సభలో బీజేపీకి మంత్రి కపిల్ సిబల్ ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని చెప్పే బదులు బిల్లును మెరుగుపరచాలని సూచించారు.‘‘ప్రజలు ఈ నాటకాన్ని అర్థంచేసుకోవడం లేదని సిబల్ భావిస్తున్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు అవినీతిని నిర్మూలిస్తుందనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. అవినీతి వ్యతిరేక చట్టాలను తేవాలనుకునేవారు బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

తొలి లోక్‌పాల్.. మన్మోహన్!
తొలి లోక్‌పాల్‌గా నిజాయితీపరుడైన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎన్నుకోవాలని ఆర్‌జేడీ నేత లాలూవూపసాద్ యాదవ్ సూచించగా మంగళవారం లోక్‌సభలో నవ్వులు విరిశాయి. అందరు బిగ్గరగా నవ్వగా, ప్రధాని మన్మోహన్ చిరునవ్వుతో స్పందించారు. లోక్‌పాల్ ఎన్నిక ప్రక్రియ గురించి లాలూ మాట్లాడుతూ తనకు ఆయన కంటే నిజాయితీపరుపూవరో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు మరొకరిని ప్రధానమంవూతిగా చేసుకోండి’’ అని అధికార కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా అన్నా హజారే తీరుపై లాలూ మండిపడ్డారు.

Take By: T News

Read more...

Tuesday, December 27, 2011

RTC launches toll-free helpline

Hyderabad, December 25 : To address the grievances of commuters, the Andhra Pradesh State Road Transport Corporation on Saturday launched a Toll Free Number.

Launching the Toll Free Number, RTC Managing Director Prasada Rao said that passengers could call 1800 200 4599 to seek redressal of their grievances at anytime and from anywhere. The Toll Free Number would also provide information on bus timings and other vital information.

Prasada Rao appealed to the commuters to utilize the facility and make their journey hassle-free. He also expressed confidence that the debt-ridden RTC would become a profit-run organization soon with the active support of government. 

Take By: Siasat News


Read more...

Happy Birthday ‘Jana Gana Mana’

‘Jana Gana Mana’, the country’s national anthem penned by Nobel Laureate Rabindranath Tagore, turned 100 on Tuesday as it was first sung on this day a century ago at the 1911 Calcutta Session of the Indian National Congress.

Written in highly Sanskritised Bengali in 1911 by one of the greatest poets of the 20th century, the song fired patriotism in every Indian during the Independence movement.
The song was adopted as the country’s national anthem by the Constituent Assembly on January 24, 1950.

The anthem was first performed on December 27, 1911 at the Indian National Congress session in Calcutta when the outfit was associated with the country’s independence movement.

Rabindranath Tagore translated “Jana Gana Mana” from Bengali to English in 1911 and also set it to music in Madanapalle, a small town in Rayalaseema region of Andhra Pradesh.

After it was translated into English, Indian students took the song beyond the country’s borders making it ‘The Morning Song of India’ and subsequently the national anthem.

Netaji Subhash Chandra Bose’s Indian National Army adopted Jana Gana Mana as the National Anthem, while Father of Nation Mahatma Gandhi had in 1946 said the “the song has found a place in our national life.”

The song was selected as the national anthem of India in 1950 after considerable debate overruled Bankim Chandra Chattopadhyay’s popular Bengali song ‘Vande Mataram’ in the face of opposition from certain communities.

Read more...

Teacher held for raping student

New Delhi, December 26: A government school teacher has been arrested for allegedly raping a woman who took private tuitions from him as a schoolgirl. 



The teacher, identified as Ram Avtar (40), is also charged with making an obscene MMS of the woman and blackmailing her into continuing in a physical relationship with him over the last several years. 

The victim, who is 22 years old now, has told the police that Ram Avtar, who teaches Hindi at a government school in south Delhi's Ambedkar Nagar, took her to Rajasthan in 2004 and had intercourse with her. 

After that, the Madangir area resident repeatedly lured her away from home on various pretexts and continued exploiting her. 

The woman alleged that in 2008 she understood Avtar was taking undue advantage of her and objected to his acts. The accused, however, recorded an MMS of her and blackmailed her into submission.

Read more...

Gujarat helped establish Islam in South East Asia


http://www.siasat.com/files/imagecache/topstory_image/english/understandislam.jpg
 Ahmedabad, December 27: Gujarat's flourishing trade with Southeast Asian countries in the 15th and 16th century is well known. But a lesser known fact is that the state played a pivotal role in establishing Islam in this region. 

The Portuguese invasion of Southeast Asia in the 17th century resulted in the decline in number of Gujaratis and their trade. Yet, there was no shrinking of their legacy. 

"One of these legacies was Islam. There were influential scholars and teachers of Islam from Gujarat who, though few in number, planted the seeds of their belief in local disciples who in turn spread the word throughout the (Malay-Indonesian ) archipelago. 

Gujarat was also the base of Islamic scholars from the archipelago who returned home to propagate the religion," writes Leonard Andaya, a professor of Southeast Asian History at University of Hawaii at Manoa, in the book 'Gujarat and the Sea.

' Two renowned Islamic teachers who served in Aceh, an important port town in Sumatra - Shaikh Muhammed Jailani and his nephew Nuruddin ar-Raniri - hailed from a community of Hadramis in Gujarat . 

Nuruddin later became one of the leaders of Islamic reformism in the Malay-Indonesian archipelago in the 17th century. Such was Nuruddin's influence at the court that the Dutch complained that Gujarati merchants were being favoured above all other. 

Moreover, several merchants, seamen and passengers on board Gujarati ships to Southeast Asia were Muslim, and hence no surprise that Gujarat played a role in the Islamisation process in southeast Asia, Andaya notes.

Take By: Siasat News 

Read more...

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం

హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్ బజార్‌లో మిట్ట మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి భయంతో పరుగులు తీసి పారిపోయినట్లు సమాచారం. దాడి చేసిన దుండగులు పరారీలో ఉన్నారు. హత్యకు పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 

Take By: T News 

Read more...

Monday, December 26, 2011

Anna Hazare was an 'active RSS Pracharak,’ reveals media report

New Delhi, December 26: Just two days before Ana Hazare’s three-day fast at the MMRDA Ground in Mumbai on December 27, startling facts have emerged in the media, which point towards Anna Hazare’s strong association with the Rashtriya Swayamsevak Sangh (RSS), something which Hazare and team Anna have been categorically denying till now. According to a report published in Hindi daily “Nai Duniya” Anna Hazare was an 'RSS Pracharak’ who received his ‘Diksha’ from senior RSS leader Nanaji Deshmukh in 1983 in Gonda.

Front page story of Hindi daily Nai Duniya dated 25th Dec. 2011
According to this report, as a very close aid of senior RSS leader Nanaji Deshmukh, Anna Hazare learnt and developed his worldview of village development because of his works on the issue while he was with RSS. It was this worldview, which he later replicated and experimented at Ralegan Siddhi.

RSS, on several occasions has acknowledged and accepted its open and tacit support of Hazare’s so called anti-corruption campaign. In fact, RSS chief Mohan Bhagwat had, at the organisation's annual Dussehra rally in Nagpur in October 2011 said that its volunteers "are already active in all movements against corruption without craving for their own position and credit".

According to this report, Hazare worked on several RSS projects, shoulder to shoulder with Deshmukh. He used to be the general secretary of one RSS affiliate group which was headed by Nanaji Deshmukh.

One old picture has also surfaced in the media, in which Anna Hazare is shown in company of the senior RSS leader Nanaji Deshmukh. Deshmukh had praised Anna Hazare in several RSS meetings and it was on his insistence only that Anna is seen as a very respectable figure in RSS.



 Front page story of Hindi daily Nai Duniya dated 25th Dec. 2011
Interestingly till now Anna Hazare himself or his team haven’t commented or disputed the claims made in the report.
According to this Nai Dinuya report which goes in detail about Anna Hazare’s involvement in RSS activities Hazare was actively involved with several projects related to village development which were started by Nanaji Deshmukh. “Gram Wishva’ (Village World), an organization devoted to the development of village, was established with Hazare being a very active member of the group.

According to Ramprakash Gupta, who had attended meetings with Nanaji Deshmukh, in 1983 an important 3-days meeting of Gram Wishva was organized in which Anna Hazare actively participated in the meetings with Nanaji Deshmukh.

Even though Anna Hazare and his team have categorically denied his RSS connection in the past, the recent evidence of Anna Hazare’s links with RSS, is some thing which Anna Hazare and his team will find very hard to dispute.

This development has emboldened and provided the Congress and its allies with fresh evidence of Anna Hazare’s RSS links. Congress general secretary Digvijaya Singh has criticized Anna Hazare for hiding his RSS connection till now.

"And he denied any association with RSS! Now whom do we believe Facts with Picture and the claim of RSS or Anna? I am again proved right", tweeted Singh.

Digvijaya Singh has in the past, accused Mr Hazare of being hand in gloves with the RSS. He had also alleged that Hazare’s fast against corruption at the Ramlila Maidan in August this year had the backing of the right-wing group with the latter's members also participating in the event.

Political activist Shehzad Poonawalla, who has since the beginning doubted the purpose of the Anna campaign, said: "I had always maintained that the Anna movement is nothing but a Jansangh sponsored event. Their aim is simple - enforce mid term polls upon the country perhaps to dislodge ongoing investigations into saffron terror by the NIA."

Poonawalla says that Sangh since the exposure of saffron terror has tried to scuttle the terror probes.

"The Jansangh has always been finding ways and means to scuttle the investigations of right wing terror by saffron groups and almost got an allergic attack when the Communal Violence Bill came into the public domain. Thereafter they have used Anna Hazare to deflect attention from issues like Modi's culpability in 2002 riots, communal violence and food security bill," alleges Poonawalla.

Take By: Siasat News : http://www.siasat.com/english/news/anna-hazare-was-active-rss-pracharak%E2%80%99-reveals-media-report

Read more...

అరుదైన వ్యాధి గుర్తింపు

- దేశంలోనే మొట్టమొదటి ఆపరేషన్
- వర్తించని ఆరోగ్యశ్రీతో రోగి ఆందోళన
- ఆదుకోవాలని తెలంగాణ బిడ్డ వేడుకోలు


హైదరాబాద్ డిసెంబర్ 25 (): అరుదైన వ్యాధితో ఏళ్ల తరబడిగా బాధపడుతున్న నల్గొండ జిల్లా గుడిపల్లికి చెందిన రవీందర్‌డ్డి అనే యువకుడికి హైదరాబాద్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఈ వ్యాధి పేరు స్టిఫ్‌మాన్ సిండ్రోమ్. నాలుగేళ్లుగా అప్పులు చేసి దవాఖానల చుట్టూ తిరిగినా ఇది ఏ వ్యాధో అంతుపట్టలేదు.

వ్యాధిపేరు తెలియకపోగా కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లు మడవలేని స్థితిలో నాలుగేళ్లుగా రవీందర్‌డ్డి ఇబ్బంది పడుతున్నారు. చివరకు నగరంలోని ‘సన్‌షైన్’ ఆస్పవూతిలో ఉన్న వెన్నుపూస స్పెషలిస్టు నరేష్‌బాబు పరీక్షలు చేసి ‘‘స్టిఫ్‌మాన్ సిండ్రోమ్’’గా గుర్తించారు. ఈ జబ్బు సోకినవారికి వెన్నుపూసకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానే ఉపశమనం ఉంటుంది. అయితే ఈ మందు గంటకు మించి పనిచేయదు.

ఈ నేపథ్యంలో వెన్నుపూస ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో వెన్నుపూసకున్న ప్రధాన నరానికి నిత్యం సూదిమందు అందేందుకు పొట్టలో ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. ఒక్కసారి నింపితే వంద రోజులకు మందు సరఫరా అవుతుంది. మందు అయిపోతుంటే ఆ మిషన్ ఆలారం మోగిస్తుంది. కాగా రాష్ట్రంలోనే కాక, దేశంలోనే దీనిని మొట్టమొదటి కేసుగా గుర్తించారు.

ఇలాంటి పరికరం అమర్చడం దేశంలోనే మొట్టమొదటి సారి అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయకపోవడంపై పేషెంట్ రవీందర్‌డ్డి, ఆయన కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత ధృక్ఫథంతో సాయం అందిచాలని కోరుతున్నారు. మందు నింపుకునేందుకు ప్రతి వంద రోజులకు రూ.5వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Take By: T News

Read more...

మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం .... ( కోటా రాజకీయం)

మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంక్షేమం కన్నా రాజకీయ లబ్ధికే ప్రాధాన్యం ఇచ్చిందనే అభివూపాయం కూడా వ్యక్తమవుతున్నది. ఏదైనా సామాజిక వర్గాన్ని బాగుపరచాలనే చర్చ వచ్చినప్పుడల్లా ప్రభుత్వం కోటాతో సరిపెట్టి వివాదాల తుట్టె కదుపుతున్నది. కానీ ఆయా సామాజిక వర్గాల సమక్షిగాభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతులకున్న 27 శాతం రిజర్వేషన్‌లలో మైనారిటీలకు నాలుగున్నర శాతం ఉప కోటా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది.

ఉత్తరప్రదేశ్, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఆ తరువాత సార్వవూతిక ఎన్నికలు కూడా సమీపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనడంలో సందేహం లేదు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో ముస్లింలు 18 శాతం ఉన్నారు. దాదాపు 115 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు.

ఈ కోటా ముస్లింలకు తమ ప్రభుత్వ కానుక అనీ, యూపీ ఎన్నికల్లో ములాయం పార్టీకి పడే ముస్లిం ఓట్లన్నీ తమకే వస్తాయని, ఇక యూపీలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించడం కోటా రాజకీయానికి నిదర్శనం. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల దేశంలో అంతర్యుద్ధం వస్తుందనే రీతిలో ఒక ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందడానికి అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి.

మరోవైపు జమాతే ఇస్లామీ హింద్ వంటి సంస్థలు మాత్రం ఈ కోటా కల్పించడాన్ని ముస్లింలను మోసం చేయడంగా అభివర్ణించాయి. ఇప్పటికే ముస్లింలలోని కొన్ని కులాలు బీసీలకు కేటాయించిన 27 శాతం కోటాలో రెండు నుంచి మూడు శాతం పొందే అవకా శం ఉందని, ఇప్పుడు మైనారిటీలు అందరికీ కలిపి కేటాయించే 4.5 శాతం కోటాలో వారికి అదనంగా ఒరిగేదేమీ ఉండదని ముస్లిం మత పెద్దలు కొందరు అంటున్నారు. ఉదాహరణకు జైనులు ఎంతో అభివృద్ధి చెందారని 4.5 శాతంలో వారితో ముస్లింలను కలపడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు. అయితే 27 శాతం కోటాలో వెనకబడిన తరగతుల వారితో పోటీ పడే బదులు, నాలుగున్నర శాతంలో మిగతా మైనారిటీలతో పోటీ పడడం సులభమనే వారూ ఉన్నారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచి వినబడుతున్నది.


ముస్లింలతో పాటు మైనారిటీలందరికీ కలిపి నాలుగున్నర శాతం రిజర్వేషన్ కల్పించడం కంటి తుడుపు చర్య అనే అభివూపాయం ముస్లిం మేధావులలో వ్యక్తమవుతున్న ది. రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా ముస్లింలకు పది శాతం రిజర్వేష న్ కల్పించాలని వారు కోరుతున్నారు. పైగా ఈ మేధావి వర్గం అభివూపాయపడుతున్నట్టు ముస్లింల సమక్షిగాభివృద్ధికి చర్యలు తీసుకోకుండా కేవలం కోటా కల్పించడం వల్ల కూడా ఫలితం ఉండదు. యూపీఏ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కానీ, ఆ తరువాతి రంగనాథ్‌మిశ్రా కమిషన్ కానీ ముస్లింల దయనీయ పరిస్థితిని వివరించాయి.

ప్రణాళికా సంఘం విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక (2011) కూడా ముస్లింల వెనుకబాటుతనాన్ని కళ్ళకు కట్టింది. ముస్లింల పరిస్థితి దళితుల కన్నా అధ్వాన్నంగా ఉన్నది. పేదరికం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని చూస్తే ముస్లింల అభివృద్ధి రేటు తక్కువగా ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలను ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసిందని కాదు.

ఈ సామాజిక వర్గాలు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కానీ ముస్లింల పరిస్థితి చెప్పడానికే భిన్న వెనుకబడిన వర్గాలతో పోల్చడం. 2004-05 నుంచి 2007-08 నాటికి పోల్చి చూస్తే నగర ప్రాంతాలలో ముస్లింలలో విద్యాభివృద్ధి 5.3 శాతం కాగా, ఎస్సీలలో 8.7, ఎస్టీలలో 8 శాతం ఉంది. శిశు మరణాల సంఖ్య కూడా మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే ముస్లింలలో ఎక్కువగా ఉన్నది. దేశ జనాభాలో ముస్లింలు 14 శాతం ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలలో 2.5 శాతం మాత్రమే ఉన్నారు.


ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనాన్ని మించిన సమస్యలను ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నది. ముస్లింలను ప్రధాన స్రవంతిలో భాగం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రధాన స్రవంతి చేయడానికి ఇష్టపడని, గిట్టుబాటు కాని పనులను వారు చేపట్టవలసి వస్తున్నది. భద్రతా రాహిత్యం, అస్తిత్వ సంక్షోభం, వివక్ష, దేశ భక్తిని శంకించడం వంటి సమస్యలను ముస్లింలు ఎదుర్కొంటున్నారని సచార్ కమిటీ పేర్కొంది.

వీరికి అసమ్మతిని వ్యక్తం చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాలలో కోటా కల్పించడం వల్ల కొన్ని తక్షణ ప్రయోజనాలు ఉంటాయి. అయితే కోటాతోనే సమస్యలన్నీ తీరుతాయనే భ్రమలను ప్రభుత్వం కల్పించకూడదు. దీర్ఘకాలిక సామాజిక - ఆర్థికాభివృద్ధి వ్యూహంలో కోటా కల్పించడం కూడా ఒక భాగం కావాలె. ప్రత్యేకించి ఆత్మాభిమానంతో బతికే గౌరవనీయ పరిస్థితులు కల్పించాలె.

అంతే తప్ప ముస్లింలకు ఏదో ఒరగ బెడుతున్న అభివూపాయాన్ని ఇతర మతాల వారికి కల్పించడం, బీసీ ల కోటా నుంచి కేటాయించి తగవులు పెట్టడం వంటి చర్యలు తక్షణ రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తాయేమో కానీ, సామాజిక సామరస్యానికి, సంక్షేమానికి దోహదపడవు. కాంగ్రెస్ వంటి బాధ్యతాయుత రాజకీయ పక్షం, కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో అడుగులు వేయాలే తప్ప రాజకీయ ఎత్తుగడలకు దిగడం భావ్యం కాదు.

Take By: T News

Read more...

మహిళా కమిషన్ చైర్మన్‌గా జయసుధ?

- ఆమె ైవైపే సీఎం మొగ్గు
- అధిష్ఠానం ఆమోదం?
- త్వరలో అధికారిక ఉత్తర్వులు
- జగన్ వర్గం నుంచి వచ్చినందుకు నజరానా?


jaya-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 25 (:సినీనటి, సికింవూదాబాద్ ఎమ్మెల్యే జయసుధను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి స్ఫూర్తితో సినీపరిక్షిశమ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జయసుధ, ఆయన ప్రోత్సాహంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింవూదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత నాలుగు నెలలకే ఊహించని రీతిలో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

వైఎస్సార్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రయాణంపై ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత పార్టీకి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్ తనయుడు జగన్‌కు బాసటగా నిలుస్తూ ఆయనకు మద్దతిస్తూ వచ్చారు. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నప్పటికీ అతనికి అండగా ఉంటూ కాంగ్రెస్‌లో జగన్ వర్గం ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు.

వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించిన జగన్ వర్గం ఎమ్మెల్యేల బృందంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ ప్రయోగించిన పునరాకర్షక్ మంత్రం తో జయసుధ జగన్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

అప్పటి నుంచి ఆమె సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని పలు సందర్భాల్లో ఒక మంచి ముఖ్యమంవూతిగా పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కిరణ్ కూడా సినీ గ్లామర్ ఉన్న జయసుధ పార్టీ నుంచి చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సికింవూదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పలు అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించారు. అంతే కాకుండా పునరాకర్షక్ మంత్రంలో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు జయసుధకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కిరణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవికి వన్నె తెచ్చే నాయకురాలి కోసం పార్టీ అన్వేషిస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జయసుధను మించి ఆ లక్షణాలు, అర్హతలున్న నేతలు ఎవరూ లేరని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. జయసుధకు ఆ పదవి ఇవ్వడం ద్వారా జగన్ వర్గం నుంచి కాంగ్రెస్‌కు వచ్చినందుకు ఆమెకు నజరానాగా చెప్పుకోవచ్చని, జగన్‌కు మద్దతుగా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, నేతలను కూడా సొంతగూటికి రప్పించుకోవచ్చని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఈ విషయంలో ఆయన పార్టీ అధిష్ఠానంతో చర్చించి జయసుధ పేరుకు ఆమోదం కూడా పొందినట్లు సమాచారం. గతంలో మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మేరి రవీంవూధనాథ్, కమిషన్ సభ్యులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వీధి పోరుకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ కమిషన్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి కమిషన్ చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. నాటి నుంచి పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలు ఆ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Take By: T News

Read more...

బీడీ మతుకుల్ని చుట్టేన్తున్నారు!

- కనీస వేతనాలకు కత్తెరేసే కుతంత్రం
- యాజమాన్యాల అమానుషం
- ‘స్టార్’ సమావేశాల్లో ‘మెజారిటీ’ నాటకం
- అదే జరిగితే సేట్ల జేబుల్లోకి వేల కోట్లు
- భారీ మొత్తాలు కోల్పోనున్న కార్మికులు
- జీవో మార్పుకోసం నెల్లూరు మాజీ ఎమ్మెల్సీ తంటాలు
- దానం, షబ్బీర్, రాజేశ్వర్ పాత్రపై కార్మికుల మండిపాటు
- సమరానికి సిద్ధం.. కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం
-జీవో 41 సవరణకు సీమాంధ్ర సర్కారు సిద్ధం


beedip-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema( - నిజామాబాద్):ప్రభుత్వ జీవో ప్రకారం కనీసం వేతనం రూ. 150 చెల్లించలేమని అలా చేస్తే నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదముందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలుకుతున్నారు. సీమాంధ్ర సర్కారులోని పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే బీడీ కార్మికులు వెయ్యి బీడీల ఉత్పత్తిపై రూ.60 నష్టపోయే ప్రమాదముంది. బీడీ కార్మికుల జీవితాలు మసిబారిపోతూనే ఉంటాయి. జీవనాధారంగా ఎంచుకున్న పని వారి జీవితాలను గొప్పగా నిలబెట్టకపోగా, ఆరోగ్యాన్ని పలు విధాలుగా హరించి వేస్తూనే ఉంటుంది.

సంతృప్తికరమైన, సుఖవంతమైన జీవనమో, ఆరోగ్య భద్రతకు హామీయో ఉండదు. అయినా ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళదీయాలికదా అనే భావనతోనే కూటికోసం తెలంగాణలో కోట్ల కుటుంబాలు బీడీ పరిక్షిశమనే ఆధారం చేసుకున్నాయి. వాళ్ల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిజేసే ఈ పని సేట్లకు, యాజమాన్యాలకు మాత్రం కోట్ల సంపదను సమకూర్చుతోంది. కార్మికులకేమో సరైన కనీస వేతనాలు లభించవు. సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఈ ఏడాది జూన్‌లో వెయ్యి బీడీల తయారీకి కనీస వేతనాన్ని రూ.150గా ఖరారుచేస్తూ జీవో నంబర్ 41 విడుదలయింది. కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, కార్మిక శాఖ, ప్రభుత్వం.. అన్నీ ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే విడుదలైన ఆ ఉత్తర్వు పని అంతటితోనే ముగిసిపోయింది.

ఆచరణకు రాలేదు. కారణం?.. స్వార్థపర యాజమాన్యాల దురాశ! తమ లాభాలు కొల్లగొట్టుకపోతాయనే అపోహ. అంతే.. ఆ జీవోకు అడ్డుచక్రం వేయాలనుకున్నారు. అధికారంలో ఉన్న నేతలను అందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కావాలనుకున్న వర్గాలన్నింటినీ సంప్రదించారు. విలాసవంతమైన నక్షత్ర హోటళ్లలో సంప్రతింపుల ప్రహసనం నడిపారు. అన్యాయం కదా అనేవారికి అవకాశమీయలేదు. అన్ని రకాల మాయోపాయాలూ ప్రయోగించారు. చివరికి.. ‘మెజారిటీ’ పేరిట కార్మికుల కడుపు కొట్టేందుకు ఏకమయ్యారు. పదకొండు సంవత్సరాల పోరాటం ఫలితంగా కనీస వేతనాన్ని రూ.102 నుంచి రూ.150కు పెంచాలని ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినా.. ఇప్పుడు కుట్రపూరితంగా ఆ మొత్తం రూ.115కు పడిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. స్వార్థపర యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారుకు తోడు ఇక్కడి తెలంగాణ ద్రోహులు కూడా ఈ దారుణానికి అండగా నిలవడం కార్మిక వర్గాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. స్వయానా కార్మికమంత్రి దానం నాగేందర్, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నెల్లూరు జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అండదండలతో బీడీ యాజమాన్యాలు జీవో 41ని సవరింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ దారుణ చర్య గురించి తెలుసుకున్న బీడీ కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం కుయుక్తులకు తలొగ్గితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. యాజమాన్యాల ప్రయత్నాలను తిప్పికొ సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం కావాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో వ్యవసాయం తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు తమ జీవనోపాధిగా ఎంచుకున్న బీడీ పరిక్షిశమ తనను నమ్ముకున్న కార్మికులను కాపాడుకోలేకపోతోంది. ఆ కార్మికులకు అండగా నిలబడి పోరాడుతున్న సంఘాలను దెబ్బతీసేందుకు ఎన్నో మాయోపాయాలు..

కపట నాటకాలు. ఇప్పుడు ఆ కార్మికవర్గం వెన్ను విరిచేందుకు స్వార్థ యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారు పథకం ప్రకారం పావులు కదుపుతున్న తీరు రోత కలిగిస్తోంది. గుండెలను రగిలిస్తోంది. లక్షల మంది కార్మికులు లడాయిచేసి సాధించుకున్న కనీసవేతనాల జీవోను సవరించే నయవంచన ఎత్తుగడలు ఇప్పుడు తీవ్ర ప్రతిఘటనను చవిచూసే పరిణామాలను కొని తెచ్చుకోనున్నాయి. కుట్రలు ఫలిస్తే ఈ ఒక్క ఆరు నెలల్లోనే తెలంగాణ జిల్లాల్లోని ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికులు రమారమి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. హైదరాబాద్ కేంద్రంగా సీమాంధ్ర సర్కారు పెద్దలు, బీడీ యాజమాన్యాలు కూడబలుక్కుని నడుపుతున్న గూడుపుఠాణీ వల్ల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, రంగాడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని లక్షలాది మంది బీడీ కార్మికుల బతుకులు బుగ్గికానున్నాయి.

నయవంచన.. కుట్రల పరంపర..
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణ సూచికల ప్రాతిపదికన కనీస వేతనాలు అందజేయాలని 11ఏళ్లుగా తెలంగాణ జిల్లాల్లోని బీడీ కార్మిక రంగంలో అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సీమాంధ్ర పాలకులు పట్టించుకోని కారణంగా జాతీయ కార్మిక సంఘాల నేతృత్వంలో 2010 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 2 వరకు చరివూతాత్మకమైన సమ్మె జరిగింది. 32 రోజులపాటు కొనసాగిన సమ్మెవల్ల తెలంగాణ జిల్లాల్లోని బీడీ యాజమాన్యాలు కోట్లాది రూపాయల ఉత్పత్తిని కోల్పోయాయి. దీంతో రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 56 సంఘాలతో సమ్మె కాలంలోనే నవంబర్ 24, 25, 26 తేదీల్లో చర్చలు జరిపింది. దీని ఫలితంగానే డిసెంబర్ 30న కనీస వేతనాలను ఖరారు చేస్తూ కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ 1381 నంబరుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

వెయ్యి బీడీల తయారీకి 130 రూపాయలు కనీస వేతనంగా పేర్కొంటు జారీచేసిన నోటిఫికేషన్‌పై మంత్రి దానం నాగేందర్ సమక్షంలో బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. జీవన ప్రమాణ సూచికలు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రాతిపదికన ప్రతి వెయ్యి బీడీల తయారీకి 150 రూపాయల కనీస వేతనం అమలు పూర్తిగా శాస్త్రీయబద్ధమేనని కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆ సమావేశంలో స్పష్టంచేశారు. ఆ సమావేశం కొనసాగింపుగానే జూన్ 31వ తేదీన ప్రభుత్వం 130 రూపాయలు కనీస వేతనంగా, 7 రూపాయల 50 పైసలు కరువు భత్యంతోపాటు ఇతర అంశాలపై చెల్లింపుల ద్వారా 150 రూపాయలను ఖరారు చేస్తూ జీవో నంబర్ 41ను జారీ చేసింది.

ఆ జీవోను అమలుచేయాలని కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే బీడీ యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జూలై 6 నుంచి పదిరోజులపాటు అక్రమంగా లాకౌట్ ప్రకటించాయి. సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జూలై 27న త్రైపాక్షిక కమిటీని వేసింది. బీడీ సేట్లకు అనుకూలమైన సంఘాలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల బాధ్యులకు ఎక్కువ సంఖ్యలో కమిటీలో ప్రాతినిధ్యం కల్పించారు. బీడీ పరిక్షిశమతో ఏమాత్రం సంబంధంలేని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ రాధాకృష్ణను (నెల కిందట పదవీ కాలం ముగిసింది) సైతం త్రైపాక్షిక కమిటీ సభ్యుడిగా నియమించారు. ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, డీఎంఎస్, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాలతోపాటు ముఖ్యమైన బీడీ సంఘాల యాజమాన్యం ప్రతినిధులను కమిటీలో చేర్చారు. ఏనాడూ ఆ పని చేయని త్రైపాక్షిక కమిటీ మొక్కుబడిగా సెప్టెంబర్ 12న, నవంబర్ 9న మాత్రమే సమావేశాలు జరిపింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుండానే కార్మిక సంఘాల అభివూపాయాలను మాత్రమే స్వీకరించింది.

రెండ్రోజుల్లోనే తారుమారు.. ఆరునెలల్లోనే వెయ్యి కోట్ల నష్టం
Bidi-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకనీస వేతనాల జీవో అమలుకోసం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా చర్చలపేరిట సమావేశాలను నిర్వహించాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 150 రూపాయలు చెల్లించలేమని, నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదం ఉందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలికారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలో కనీస వేతనాలు ఇస్తుండగా లేని నష్టాలు ఇక్కడెందుకు వస్తాయని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అయినా మెజార్టీ మంత్రాంగాన్ని తెరపైకి తెచ్చిన యాజమాన్యాలు 70 సంఘాల అంగీకారం ఉందంటూ కనీస వేతనాల జీవోను సవరించాలంటూ సర్కారును ఆశ్రయించాయి. వెయ్యి బీడీల తయారీపై ఇప్పుడు ఇస్తున్న 102 రూపాయలను 115 రూపాయలకు మాత్రమే పెంచగలుగుతామని యాజమాన్యాలు చేసిన ప్రతిపాదనకు బీడీ కార్మికసంఘాలు పచ్చజెండా ఊపాయి. సీమాంధ్ర సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే ప్రతి బీడీ కార్మికుడు వెయ్యి బీడీల ఉత్పత్తిపై భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. జీవో విడుదలైనప్పటినుంచి ఈ ఆరు నెలల కాలంలోనే ఆ మొత్తం రూ. వెయ్యి కోట్ల పైగా ఉంటుంది.

రోజుకు వందకోట్ల బీడీ ఉత్పత్తి
సంక్షోభంలో ఉన్నామంటూ నమ్మబలుకుతున్న సేట్లు కనీస వేతనాలు పెంచితే పరిక్షిశమనే తరలిపోతుందని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. బీడీ కంపెనీలు వెయ్యి బీడీలను 40 కట్టలుగా బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడం ద్వారా 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు లాభాలను గడిస్తుంటాయి. ఉత్పత్తిచేస్తున్న కార్మికులకు మాత్రం 102 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఈ లెక్కన యాజమాన్యాలకు రోజువారీగా అంతులేని లాభాలు వస్తూనే ఉన్నాయి.

ప్రతిరోజు తెలంగాణ జిల్లాల్లో వందకోట్ల సంఖ్యలో బీడీ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఒక్క దేశాయి కంపెనీలోనే లక్షమంది కార్మికులు 10 కోట్ల బీడీలను ఉత్పత్తి చేస్తున్నారు. శివాజీ, టెలిఫోన్, చారుబాయి, ఠాకూర్, హిమ్మత్‌లాల్ తదితర కంపెనీలు ప్రతిరోజు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బీడీలను తయారుచేయిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది, కరీంనగర్‌లో లక్షన్నర మంది, మెదక్ జిల్లాలో లక్ష 20 వేల మంది, ఆదిలాబాద్ జిల్లాలో లక్ష మంది, వరంగల్‌లో 30వేల మంది బీడీలు చుడుతూ జీవనం గడుపుతున్నారు.

గూడుపుఠాణిపై సమరం: ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్
కనీస వేతనాల జీవోను సవరించేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకుంటామని ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ చెప్పారు. జీవో 41ని యథాతథంగా అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నామన్నారు.

కాంగ్రెస్‌కు కష్టకాలమే: ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్
జీవోను సవరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పదని ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సిద్ధిరాములు హెచ్చరించారు. సీమాంధ్ర పాలకులు, కాంగ్రెస్ పెద్దలు బీడీ యాజమాన్యాలతో కుమ్మకై్క లక్షలాది మంది తెలంగాణ బీడీ కార్మిక కుటుంబాలను నిలువు దోపిడీ చేయబోతున్నారని ఆయన ఆరోపించారు.

మెజార్టీ సంఘాలపేరిట జీవోను సవరించే కుట్రను అడ్డుకునేందుకు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడాలని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. జీవోను మార్చితే తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీడీ కార్మికుల ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి, కార్మిక మంత్రిని కలిసి మాట్లాడుతామని తెలిపారు.

Take By: T News

Read more...

చంద్రబాబూ ఖబర్దార్..

-కరీంనగర్‌కు రావొద్దు.. ‘తెలంగాణ’ వార్నింగ్
-రెండు కళ్లపై తెలంగాణ మండిపాటు
-వైఖరి తేల్చందే అడుగుపెట్టొద్దు
-తెదేపా నేత పెద్దిడ్డికి హుస్నాబాద్‌లో భంగపాటు
-700 ఆత్మహత్యలు బాబుకు కనిపించలేదా?
-అడ్డుకుని నిలదీసిన తెలంగాణవాదులు
-టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట
-చంద్రబాబును అడ్డుకుంటాం: కోదండరాం స్పష్టీకరణ
-ఆంధ్రా పెత్తనం చాటేందుకే ఆయన పర్యటనలు
-తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలి
-టీడీపీకి స్పష్టత లేనందునే జేఏసీలో కలుపుకోలేదు
-ఆంధ్రా సంపన్న వర్గాల ప్రతినిధులున్నారు
-ఆ నేతలే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ


TRS-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో, రెండు నాల్కల వైఖరితో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వారిని మరింతగా మండిపడేలా చేస్తోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించి చేదు అనుభవాలను ఎదుర్కొన్న చంద్రబాబు కరీంనగర్ జిల్లాలోనూ తిరుగుతానంటే సహించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ముందుగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిడ్డిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణవాదులు నిలదీశారు.

సమైక్యవాద చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో చేపట్టే పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పలువురు నేతలు, యువజన, మహిళా విభాగం కార్యకర్తలు పెద్దిడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు నాయుడికి కనిపించలేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పెద్దిడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబునాయుడు వైఖరిని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన వరంగల్, కరీంనగర్ పర్యటనల్లో తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణ వైఖరిని తేల్చని చంద్రబాబును తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత లేనందునే జేఏసీలో టీడీపీని కలుపుకోలేదని తెలిపారు. ఆంధ్రా పెత్తనం చాటేందుకే బాబు పర్యటనలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలని, లేకుంటే నిరసనలు తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు.

రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకుపోతున్న చంద్రబాబుకు ఇక్కడికి తెలుగుదేశం నాయకులు, ప్రజావూపతినిధులే కవచంగా నిలుస్తున్నారని ఆయన తప్పుబట్టారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులు మన ప్రాంతంలో తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు సహా ఆంధ్రా సంపన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న తెలంగాణ నాయకులు, ప్రజావూపతినిధులే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే నాయకులను కలుపుకుని ఉద్యమించాలని కోరారు

Take By: T News

Read more...

Sunday, December 25, 2011

US blaming Iran for 9/11, unbelievable

New York, December 25: A New York judge has signed a judgment that finds Iran, along with the Taliban and al-Qaida, liable in the Sept. 11 2001 terrorist attacks.


Press TV has interviewed Joshua Blakeney of the Scholars for 9/11 Truth & Veterans Today from Calgary, Alberta to discuss the situation. What follows is a rough transcription of the 

interview:


Press TV: Josh Blakeney, let's focus for a moment on the many doubts and questions as [another speaker on the show] Foad Izadi said that exist about the 9/11 commission.


The US waged two wars using the 9/11 attacks as a pretext. What do you think about the 9/11 commission report and didn't the US allow an international investigation led by the UN over the terrorist attacks?


Blakeney: Yeah, I'm doing my graduate work at the university of Lethbridge here in Canada on the events of 9/11. I've been studying 9/11 intensively for four years now.


And indeed I'm the recipient of the Queen Elizabeth student graduate scholarship and having studied 9/11 for 4 years I can conquer with [another speaker on the show] professor Fetzer that the official story of 9/11 is provably false.


The 9/11 commission report was a complete hoax. Philip Zelikow [executive director of the 9/11 Commission] was a Neo-conservative and therefore wasn't disinterested enough to be conducting such an investigation.


And apparently his academic field of expertise was the creation and maintenance of public myth which is nonsensical although I must say one doesn't know whether to laugh or cry when we hear these things.


When Ahmadinejad, President Ahmadinejad did his speech at the United Nations, an exemplary speech in September 20/11 with his engineering background, he implied that the official story of 9/11 must be false, especially the notion that airplanes brought down towers on 9/11.


And we were then told that Al-Qaida were angry at President Ahmadinejad, that Al-Qaida were mythed that Ahmadinejad was trying to steal their thunder for the crime that they allegedly did.


Now we are told that President Ahmadinejad is collaborating with Al-Qaida and with the Taliban when anyone who has read a History of the War on Terror knows that after 9/11 the Iranian government were actually saying to the US government look we could be an ally if you want in your war against the Taliban.


Because the Taliban are no friends of the Iranian government, being Sunni, the Iranian government being Shia and so as they say if it wasn't for the fact that this was a harbinger of a storm, a harbinger of wars to come, yet more wars, massacres in the Middle East, we'd have to laugh.


Of course it's quite jovial the fact that on 9/11 they blamed this on Palestinians. They said the popular front for the liberation of Palestine committed this atrocity and they showed footage from 1993 of Palestinians celebrating apparently the attacks on 9/11, you know, several years in advance.


And then we were told Saddam Hussein was complicit in the events of 9/11. A lady named Laurie Mylroie from the American Enterprise Institute was authoring propaganda against Saddam Hussein, even though he was the enemy of Islamists, you know the likes of Al-Qaida.


Then we were told the Saudis were involved even though there is no evidence that the alleged hijackers even boarded the planes or were Islamists and so that's irrelevant. So why not add one more to the table and say that Iran was involved.


Hey, why not Syria now or North Korea, this official story of 9/11 is taking on a life of its own, how Judge George Daniels could find this in the court is beyond belief, and it indicates that the rule of law is breaking down even further in the United States.


Judge Daniels was a former professor of Brooklyn law school, I don't know if that might have something to do with it, but this is ridiculous and as Professor Fetzer suggested Israel and the US, their fingerprints are all over the events of 9/11.


And of course Israel's role in this is so significant because Israel wants to balkanize the Middle East. It wants the Arabs and Muslims fighting each other in a civil war type situation.

The Middle East is highly fissiparous and so that's why Israel's happy to have the Saudis, the Iranians, the Palestinians, any Arab regime or Arab government, Muslim government or in your case Persian government because it wants to have regional hegemony.


It doesn't want the Saudis or the Iranians to have regional hegemony and it's very smart. Those who support Israel in the United States, they realize that a key part if they're going to try to attack Iran is demonizing the Iranian government and dehumanizing the Iranian people in the eyes of the American people.


And so our job is, 9/11 truth is, to tell the American people that they ought to empathize with the Palestinians because 3000 of their citizens were killed on 9/11 with the complicity of the Israeli government.


Press TV: Joshua Blakeny, I believe there is a popular movement happening in the United States: the Occupy movements which are criticizing the US government for a host of issues including the wars.


So is that where hopes should be, maybe pinned on when it comes to, at least to foreign policy, which obviously does drain money out of the economy, in order to point out to the world on the double standards that the United States perhaps has and we could refer to what appeared in this New York court.


Blakeney: Yeah, I mean, I think the ruling class in the United States are digging their own graves. There is an increasing disconnect between the ruling class, the elite, you know judges like Judge Daniels and the professors, academicians in the United States who are just repeating the mythology of the global war on terror.


And the people of the United States who are more and more educated. You know there was this stereotype when I was growing up that Americans aren't intelligent, they're stupid.

But that isn't actually borne out by the reality. I've travelled from coast to shining coast in the United States, the United States' people are highly educated.


And I do believe that you know the degradation of our public institutions, I mean we know that politicians and journalists are kind of bought and paid for and they lie, but when the judiciary and the professoria failed to distinguish between fact and fiction, when presented with evidence, then we're in a lot of trouble.


A lot of people said that, you know, with the failure of the Warren Commission to deal with the death of JFK [former US President John F. Kennedy] what will come next and what came next was 9/11.


And many say now with 9/11 what will come next? You know we look at Fokushima; we look at the Norway incident; the massacre in Norway in which the whole generation of labor activists were taken out, young children who would grow up to be left-wing.


Norway being highly supportive of the Palestinian struggle, a professor in Norway now named Professor Tinanda has just published an article this week in a peer-reviewed academic journal insinuating that Israel was involved in the massacre in Norway.

You look at Japan, another country which collaborated with the Nazis in World War II incidentally and you see what's happened in Fokushima, was that just completely coincidental?


Are we allowed to be skeptical of these? I think we ought to and I think it's such a shame that academics like Professor Fetzer and Professor Holm, my graduate study supervisor, are so isolated and why is it that academics are repeating time and time again these lies.


Of course, [a US Senator from Idaho] Senator Frank Church did uncover in the Cold War, in the seventies that up to 5000 university professors and 3000 journalists were conspiring with the CIA to spread this information against any country that wanted to express self-determination during the Cold War and called them Communists or part of a Soviet conspiracy.


So invariably, it's the media and the professors who are the conspiracy theorists and those like Professor Fetzer and I who are debunking state-sponsored conspiracy theories.

So I think we have to be highly vigilant as a people against the degradation of our public institutions by reckless elites.

Take By: Siasat News : http://www.siasat.com/english/news/us-blaming-iran-911-unbelievable

Read more...

Condition of poor Muslims in India worse than Dalits

New Delhi, December 24: Justifying the Congress-led UPA government's proposed move of providing a sub-quota for minorities, a union minister on Saturday said that condition of poor Muslims and Buddhists in the county was "worse" than Dalits. "The condition of poor Muslims and Buddhists in the country was worse 

than Dalits, therefore 4.5 % quota within quota was necessary," coal minister Sriprakash Jaiswal today said.

The union minister alleged that corruption in Uttar Pradesh was at its peak and blamed the chief minister Mayawati for it. "Though union government wants to set up projects, the state is not making land available and corruption is at its peak," Jaiswal said.

Jaiswal claimed that this time Congress is going to form government in Uttar Pradesh, and "behenji" (Mayawati) and "bhai saheb" should shun their lure of power.

He also said that Congress is not worried about Anna Hazare and is ready to face him if he decides to campaign against the party in the state. "Congress is not worried about the agitation of Anna Hazare or anyone else, and if Anna or his team comes to Uttar Pradesh to campaign against it, the party is ready to face them," Jaiswal told newspersons here.

"Congress looks ahead ... In the past also many people have campaigned against it but what happened," Jaiswal said adding that his is a democratic party which is not afraid of any individual or agitation.

"Congress only thinks about the sentiments of the people following which it has introduced a strong Lokpal Bill in Parliament, which covers Prime Minister as well as employees of group C and D and would try to get it passed," he said.

Take By: Siasat News

Read more...

క్రిస్మస్‌కు ముస్తాబైన మెదక్ చర్చి



Cherch talangana patrika telangana culture telangana politics telangana cinemaమెదక్, డిసెంబర్ 24 (): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం వారం రోజులుగా సమష్టి కృషితో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెవండ్ బిషప్ కనకవూపసాద్ భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఇక్కడ జరిగే వేడుకలకు మెదక్ డయాసిస్ పరిధిలోని హైదరాబాద్, రంగాడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన క్రైస్తవ సోదరులే కాకుండా మతాలకతీతంగా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు రానున్నారు. దాదాపు రెండు లక్షల మంది దాకా రావచ్చని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 

వేడుకలను పురస్కరించుకొని మెదక్‌కు ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ తెలిపారు.

Read more...

కిరణ్‌కు కొత్త టీం!

- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.

.
1-(6)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

కిరణ్‌కుమార్‌డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.

వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్‌కుమార్‌డ్డి సర్కార్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్‌కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.

ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్‌ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.


ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్‌కుమార్‌డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్‌కుమార్‌డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్‌కుమార్‌డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్‌ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.

కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్‌లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్‌కుమార్‌డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.

తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.

ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్‌కుమార్‌డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్‌కుమార్‌డ్డి కోరినట్టు చెబుతున్నారు.

ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్‌కుమార్‌డ్డి వాదిస్తున్నారు.

Take By: T News  

Read more...

కదులుతోంది.. చంద్రబాబు దండు యాత్ర

- ప్రైవేట్ సైన్యంతో పాదయావూతలకు..తెలంగాణ పర్యటనకు పక్కా వ్యూహం
- కాన్వాయ్‌లో 500 వాహనాలు!
- నిలదీతలు అడ్డుకునేందుకు చంద్రదండు
- ప్రశ్నించినవారిపై గుత్పలతో దాడులు
- జనం లేకపోతే ఉపన్యాసాలు వినేదీ వారే
- ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్..మూడు జిల్లాల్లోనూ ఇదే తీరులో పర్యటన
- కరీంనగర్‌కూ ఇదే భరోసాతో పయనం
- అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న జనం


chandra-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్) అధినాయకుడి ఇంటి నుంచి అంగరక్షకులు, అనుయాయులు సహా పది వాహనాలు బయల్దేరుతాయి! కొద్దిదూరంలో ప్రధాన మార్గంపైకి చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న దాదాపు 200 వాహనాలు డిక్కీల్లో గుత్పలు కుప్పలు పోసుకుని జతచేరుతాయి! ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు వెళుతూ.. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తుంటుంది! అధినాయకుడు స్పాట్‌కు చేరుకునే సరికి అప్పటికే అక్కడికి 300 వాహనాలకు సరిపడా ఒక ప్రత్యేక దండు చేరుకుని ఉంటుంది! వీరికి తీసిపోని స్థాయిలో పోలీసు భద్రత! అధినాయకుడు కారుదిగి నడవడం మొదలు పెట్టే సరికి.. మూడు వరసల్లో ప్రైవేటు సేన కాపలా! ఈలోపు అధినేత ఎవరినో పలకరించాలని అనుకుంటాడు.. సదరు రైతును కనీసం వందమంది చుట్టుముడతారు! కంటి చూపుతో చంపేస్తామన్న పద్ధతిలో నిలబడతారు!

దీంతో బిక్కచచ్చిపోయిన రైతును అధినాయకుడు పలకరిస్తాడు.. పరామర్శిస్తాడు..! ఈలోపు ఎవరైనా అధినాయకుడిని ప్రశ్నించినా.. నిలదీసినా.. దండు గుత్పలు తీస్తుంది.. తన ప్రతాపం చూపిస్తుంది! లైన్ క్లియర్ చేసి.. అధినాయకుడు ‘ఆ విధంగా ముందుకు పోయేందుకు’ వీలు కల్పిస్తుంది! ఇదేదో ఫ్యాక్షన్ సినిమా సీన్ అనుకుంటున్నారా? కాదు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చేసిన పోరుబాట యాత్రలో భాగం! రైతుల పరామర్శకు వస్తున్నారో.. జనంపై దండెత్తడానికి వస్తున్నారో అర్థం కాని రీతిలో సాగిస్తున్న పాదయాత్ర దృశ్యం! ఇదే పద్ధతిలో ఈ నెల 27న కరీంనగర్‌కు వెళ్లేందుకు బాబు సమాయత్తమవుతున్నారు! మరి జనం ఎలా స్పందిస్తారో!!

రైతు పోరుబాట పాదయావూతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలపైకి దండెత్తి వస్తున్న పద్ధతిలో కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 500 వాహనాలతో ఎంతలేదన్నా మూడు వేల మంది అనుచరులు, నాయకగణం, దండుతో బాబు చేస్తున్న పాదయావూతలు రైతులను పరామర్శించేందుకు ఉద్దేశించినట్లు కనిపించడం లేదని అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం.. తదుపరి తటస్థ విధానంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రెండేళ్ల క్రితం డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను అడ్డుకోవడంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అన్నఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు జనం అడ్డు తగులుతున్నారు. దీన్ని నివారించేందుకు, తన రైతు పోరుబాట యాత్ర నిరాటంకంగా కొనసాగేందుకు చంద్రబాబు అండ్ కో పెద్ద పథకమే వేసినట్లు కనిపిస్తోంది. తన పాదయావూతకు ఎలాంటి విఘాతం కలగకుండా భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని చంద్రబాబు వెంట తీసుకుపోతుండటం విశేషం. దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. తన యాత్రకు పూర్తి రక్షణ ఒక కోణమైతే.. పర్యటనలో ఏ సెంటర్‌లో బాబు మాట్లాడినా కనీసం మూడునాలుగు వేల మంది పోగైనట్లు కలరింగ్ ఇచ్చుకోవడం రెండవ కోణం. వాస్తవానికి ఇది వైఎస్ జగన్ తన ఓదార్పు యాత్రను జైత్రయావూతలా జరుపుకొన్న తరీఖాయే! జగన్ తన ఓదార్పు యాత్రలకు ప్రతి సెంటర్‌కు ఒకే జనాన్ని, కడప నుంచి ప్రత్యేక రక్షకులను తెచ్చుకున్నట్లే చంద్రబాబు కూడా పాదయాత్ర సాగిస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అధినేత కదిలేది ఇలా
పర్యటనకోసం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహం నుంచి బయలుదేరుతుంది. బ్లాక్ కమెండోలు, పార్టీ సీనియర్ నాయకులు ఓ పది వాహనాల్లో కదులుతారు. చూడటానికి సాధారణ పర్యటనలానే ఉంటుంది. కొంచెం దూరం వెళ్లాక అసలు సీన్ మొదలవుతుంది. ఏడవ నెంబరు జాతీయ రహదారిపై నగర శివారు ప్రాంతమైన సుచిత్ర వద్దకు బాబు కాన్వాయ్ చేరుకోగానే దాదాపు రంగాడ్డి, హైదరాబాద్‌ల నుంచి 200 వాహనాలు కలుస్తాయి. చూసేవాళ్లకు ఏదైనా దాడి జరగబోతోందా? అన్న అనుమానాలు కల్గించే రీతిలో చీమలబారులా కాన్వాయ్ రయ్యిన దూసుకుపోతుంటుంది. వీటన్నింటికీ ముందు ఒక వాహనం రెండు కిలోమీటర్ల ముందు ఉండి.. పరిస్థితులను పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా తెలంగాణవాదులు గుమిగూడినట్లు అనుమానం కలిగితే వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌కు సంకేతాలు పంపిస్తుంది.

చివరకు పాదయాత్ర ప్రారంభించాల్సిన స్థలానికి కాన్వాయ్ చేరుకుంటుంది. వివిధ జిల్లాల నుంచి సమీకరించిన చంద్రబాబు దండు దాదాపు 300 వాహనాల్లో అప్పటికే అక్కడకు చేరుకుని ఉంటుంది. దాదాపు ఇంతే స్థాయిలో పోలీసులు కూడా ఉంటారు. ఇక చంద్రబాబు తన కారుయాత్ర ఆపి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్రకు మూడంచెల భద్రతా వలయం ఉంటుంది. దీన్ని దాటుకుని చంద్రబాబును సమీపించడానికి ఎవరికీ అవకాశం ఉండని స్థాయిలో ప్రైవేట్ సైన్యం మోహరించి ఉంటుంది. ఎవరైనా తెగించి చొరబడ్డారో.. చంద్రదండు తన ప్రతాపం చూపిస్తుంది. వారిని చితకబాది.. పోలీసులుకు అప్పగిస్తుంది. ఇదంతా చూసిన స్థానికులు.. చంద్రబాబు పాద యాత్ర రైతులను పరామర్శించడానికా లేక ప్రజలపై దాడి చేసేందుకా? అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, 21న మెదక్ జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగిన తీరు ఇలానేఉంది. ఈ పర్యటనల్లో లభించిన భరోసాతో తెలంగాణ ఉద్యమం కేంద్రంగా భాసిల్లుతున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

పట్టుదలతోనే పర్యటన
తెలంగాణలో పర్యటించి తీరాలనే పట్టుదలతోనే చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే ఎదురుదాడులు చేసేందుకు సైతం తన కేడర్‌ను ఆదేశించారని సమాచారం. స్థానికంగా తెలంగాణవాదులను అడ్డుకునే ధైర్యం స్థానిక క్యాడర్‌కు ఉండదని భావించే చంద్రబాబు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇదే పద్ధతిలో చంద్రదండు స్థానిక తెలంగాణవాదులపై దాడులు చేసిందని అంటున్నారు. దీనితో స్థానిక ప్రజలు బాబు పర్యటనకు రాకపోయినా.. తన వెంట వచ్చే దాదాపు 500 వాహనాల్లోని వ్యక్తులే జనంగా అవతారమెత్తుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చంద్రదండు పేరుతో ప్రత్యేకంగా టీషర్టులు ధరించిన బాబు ప్రైవేట్ సైన్యం తెలంగాణ ప్రజలపై యధేచ్ఛగా దాడులకు దిగుతున్నదని, టీడీపీ టీ ఫోరం నేతలు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

దాడులు చేయించడం ద్వారా ఏం సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. దండయావూతలా సాగుతున్న చంద్రబాబు పోరుయావూతపై టీడీపీలోని కిందిస్థాయి నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘చంవూదబాబుతో మాట్లాడిస్తాం.. మీటింగ్‌కు రమ్మంటే.. ఆయన ఎవరు? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాబుతో మేం మాట్లాడేదేమిటని అసహ్యించుకుంటున్నారు’ అని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారు. స్థానికులు మీటింగ్‌కు రాకపోతే వచ్చిన చంద్రదండునే ప్రజల మాదిరిగా భావించి ఉపన్యాసాలు చేశాడని అంటున్నారు. స్థానిక ప్రజలు సభలకు రాకపోయినా.. చంద్రదండుతో కవరింగ్ ఇచ్చుకున్నంత మాత్రాన తమ పార్టీ బలపడినట్లు ఎలా భావిస్తామని ఒక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది బాబే...
2009 ఎన్నికల తరువాత తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ చెప్పింది. అఖిలపక్ష సమావేశం నిర్ణయాల మేరకు డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు సంబురాలు జరుపుకొన్నారు. కానీ.. ఆ సంతోషాలను చంద్రబాబు తెలంగాణ ప్రజలకు 24గంటలు కూడా ఉండనీయలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటూ మరుసటి రోజే అడ్డం తగిలిన బాబు.. కేంద్రం ఏకపక్షంగా తెలంగాణ ఎలా ఇస్తుందంటూ అడ్డుకున్నారు.

ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కేంద్రం ఇచ్చిన తెలంగాణను చంద్రబాబే అడ్డుకున్నారన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. ఆయన సీమాంవూధలో కృత్రిమంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయించడం, రాజీనామాల డ్రామాకు తెరతీయడంతోనే కేంద్రం ఇచ్చిన మాటపై వెనుకంజ వేసిందని, ఫలితంగానే డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేసిందని వారు నమ్ముతున్నారు. చంద్రబాబు ఆనాడు తెలంగాణను అడ్డుకోకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలనలో ఉండే వాళ్లమని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును, ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలపై స్థానిక ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రామాల్లో జేఏసీలుగా ఏర్పడిన తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానీయకూడదని తీర్మానాలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాలకు వెళితే ప్రజలు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వీరు రాజధానికే పరిమితమయ్యారు.

అయినా బాబులో మార్పు రాలేదు. టీడీపీ టీ ఫోరం ఏర్పడినా.. దాన్నీ జనం నమ్మలేదు. చంద్రబాబు నుంచి స్పష్టమైన ప్రకటనకు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయింది. దీని ప్రభావం సీమాంవూధలోనూ ఉంటుందని భావించిన ఆ ప్రాంత నేతలు.. తెలంగాణలో చంద్రబాబ పర్యటించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటనకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి జనం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే!

Take By: T News   :

Read more...

Saturday, December 24, 2011

Court orders summons to websites for webcasting objectionable content

In yet another blow to 21 social networking sites including Facebook, Microsoft, Google, Yahoo and Youtube, a Delhi court on Friday issued summons to them for facing trial for allegedly webcasting objectionable contents. 

Metropolitan Magistrate Sudesh Kumar took cognizance on a private criminal complaint and directed the Centre to take “immediate appropriate steps” and also file a report in the court by January 13. 

The court's order came three days after another court in a civil case restrained these sites from webcasting any “anti-religious” or “anti-social” content promoting hatred or communal disharmony. 

In the fresh case, the court said: 

“It appears from a bare perusal of the documents that prima facie the accused, in connivance with each other and other unknown persons, are selling, publicly exhibiting and have put into circulation obscene, lascivious content which also appears to the prurient interests and tends to deprave and corrupt the persons who are likely to read, see or hear the same. 

“It is also evident that such contents are continuously openly and freely available to everyone who is using the said network irrespective of their age and even the persons under the age of 18 years have full and uncensored access to such obscene contents.” 

The Magistrate has summoned the accused companies to face trial for allegedly committing the offence punishable under Section 292 (sale of obscene books etc.), 293 (sale of obscene objects to young persons etc.) and 120-B (criminal conspiracy) of the IPC. 

The Magistrate noted that the website material submitted by the complainant, Vinay Rai, a journalist, contained obscene pictures and derogatory articles pertaining to Islam, Christianity and Hindu gods and godesses.
The Magistrate said that as per the records placed before the court by the complainant, there were defamatory and obscene articles pertaining to various Indian political leaders which are being webcasted by these sites. 

“The contents are certainly disrespectful to the religious sentiments and faith and seem to be intended to outrage the feelings of religious people whether Hindu, Muslim or Christian.
“There are certain degrading and obscene photographs of various political leaders belonging to different political parties and photographs pasted and the language used is also obscene, filthy and degrading,” the court said. 

It said that prima facie the accused were also liable to be summoned for offences of promoting enmity between classes and causing prejudice to national integration but due to an embargo under the Code of Criminal Procedure, the court could not summon them under these offences without prior sanction of the Central or State government or District Magistrate. 

“I find prima facie that the accused persons are liable to be summoned for offences under section 153-A [promoting enmity between classes], 153-B [assertion prejudicial to national integration]and 295-A [insulting religion or religious belief of any class] IPC… However, owing to the embargo under Section 196 of the Cr.PC, which prohibits taking of cognizance under the said provisions except with the previous sanctions of the Central or State government or district magistrate, the accused persons are not summoned for the said offences.” 

Mr. Rai, in his complaint filed through advocate Shashi Tripathi, said the contents hosted on these were “inflammatory” and sought to create enmity and communal violence among various religious communities. 

He alleged that the contents on these sites were obscene and might lead to “creation of obscene books, pamphlets, papers which can easily be downloaded from these social networking websites affecting the minds of children and were harmful for social harmony and may lead to increase in crime against women also.” 

Take By: The Hindu News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP