Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, November 13, 2011

సీమాంధ్ర బాబుల కరెంటు కబ్జా

- సింగరేణి బొగ్గుతో సీమాంధ్రకు సోకులు
- పేపర్లకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులు
- సీమాంధ్ర పెద్దల గుప్పిట్లో విద్యుత్ ఉత్పత్తి

power-alpha-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 12 (): ఇది సీమాంధ్ర బడాబాబుల కరెంటు కబ్జా కథ! దొరికిన అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు కుమ్మరించేసి ఆంధ్రతో పాటు తెలంగాణనూ ఆక్రమించేసిన రాజకీయ అండదండలున్న ఘనాపాటీల కథ! రోడ్డు కాంట్రాక్టులు, ప్రాజెక్టు నిర్మాణాలను పంచుకుంటున్న సీమాంధ్ర రాజకీయ నాయకత్వం ఇందులోనూ చేయి పెట్టింది. తెలంగాణ ప్రాజెక్టులను తుత్తునియలు చేసి.. సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకున్నవారిలో పలువురు సీమాంధ్ర బడాబాబులతో పాటు.. రాజకీయ నేతలూ ఉన్నా రు. ఇప్పుడు తెలంగాణను అడ్డుకుంటున్న లగడపాటీలు సమైక్యవాదాన్ని వినిపించడం వెనుక ఉద్దేశాలివే! తమ ప్రాజెక్టులకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళనే! విద్యుత్ రంగంలో ఆది నుంచీ సీమాంవూధులదే పెత్తనం. ఒక విధంగా గత మూడు దశాబ్దాలుగా సీమాంవూధులు విద్యుత్ రంగాన్ని కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. విద్యుత్ రంగంలో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాల ఎల్లలుదాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించి.. విదేశాల్లో పెట్టుబడుల స్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి సహజవాయు నిక్షేపాలు, సహజ వనరులను సొంతం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. సమైక్యవాదాన్ని తరచూ ఊదరగొట్టే విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి లాంటి వాళ్ళు ‘కేజీ బేసిన్ ఆంధ్రుల హక్కు’ అంటూనే తెలంగాణ పవర్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులు జరగకుండా కుట్రపన్ని తమ స్వంత ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా చేయించుకుని వ్యాపారం చేస్తున్నారు.

నేటికీ వారిదే పెత్తనం
ఇప్పటికీ విద్యుత్‌రంగంలో అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులుగా, డైరెక్టర్లుగా సీమాంవూధులే అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఒక్క ట్రాన్స్‌కోలోనే రిజిస్టర్ అయిన 21 మంది బడా కాంట్రాక్టర్ల జాబితాలో 19 మంది సీమాంవూధులే. విద్యుత్ సంస్కరణల పేరుతో చంద్రబాబు చేపట్టిన యజ్ఞం సీమాంధ్ర పెట్టుబడిదారీవర్గాలకు వరంగా మారింది. ఫలితంగా ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తి (జనరేషన్) మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోకెళ్ళి వారికి కాసులపంటను పండిస్తున్నది. రాష్ట్ర ప్రయోజనాలను ఖాతరు చేయకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాలు జరిపి కోట్లు గడిస్తున్నారు. భవిష్యత్తులో ప్రయివేటు రంగంలో వచ్చే పవర్‌వూపాజెక్టులు కూడా సీమాంవూధులవే ఉన్నాయి. సీమాంవూధుల లాలూచీ వ్యవహారాలతో ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు అటకెక్కాయి. సీమాంధ్ర పెట్టుబడివర్గాల పవర్‌వూపాజెక్టులకు ఆరంభం నుంచి కాంగ్రెస్, టీడీపీ అండదండలుండడం గమనార్హం.

విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఆంధ్రవూపదేశ్ విద్యుత్‌బోర్డు(ఏపీఎస్‌ఈబీ) నాటి నుంచే సీమాంధ్ర గుత్తేదార్లు, విద్యుత్ ఉత్పత్తిదారులు కుట్రలు కుతంవూతాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో మెజారిటీ డైరెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన దాఖలాలున్నాయి. అప్పట్లో ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ బోసు తనయుడికే ఎక్కువ కాంట్రాక్టులు దక్కాయి. అతడు చేసిన భారీ విద్యుత్ టవర్లు అనతికాలంలోనూ కుప్పకూలిపోవడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. తదనంతరం విద్యుత్ బోర్డులో పని చేస్తున్న వారి బంధువులకు కాంట్రాక్టులు ఇవ్వకుండా కొన్ని చర్యలుచేపట్టాల్సి వచ్చింది. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించుకుంటూ వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా కుట్రపూరితంగా అనుమతులు, ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు అదే సీమాంధ్ర పవర్ ప్రాజెక్టుల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అతీగతీ లేని తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులు
ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్‌కో పరిధిలోనూ కొత్త ప్రాజెక్టులు రాకుండా, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెరగకుండా సీమాంధ్ర పెట్టుబడి వర్గాలు అడ్డుకుంటున్నాయి. సింగరేణి బొగ్గుతో మణుగూరులో కట్టాల్సిన ప్రాజెక్టును తరలించి విజయవాడ వద్ద వీటీపీఎస్ కట్టారు. సత్తుపల్లిలో 600మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. చుట్టూ బొగ్గు ఉన్నా బొగ్గు కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కరీంనగర్‌జిల్లా నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు, రంగాడ్డి జిల్లాలో శంకరపల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నేదునూరు గ్యాస్ పవర్‌వూపాజెక్టు నిర్మాణం కాకుండా సీమాంధ్ర పెట్టుబడి వర్గాలు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. సకాలంలో నేదునూరు ప్రాజెక్టు పూర్తి అయితే 2100మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. దాంతో ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కోకు పేరు ప్రతిష్ఠలు రావడంతోపాటు తెలంగాణ ప్రాంతం వ్యవసాయ, పారిక్షిశామిక రంగాల్లో ముందుకు దూసుకు పరిస్థితులుండేవి. అయితే కేజీ బేసిన్ నుంచి నేదునూరు ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు ఇస్తే తమ ప్రాజెక్టులు నిర్వీర్యమై పోతాయనే కుట్రతో ఈనాటి వరకు నేదునూరుకు గ్యాస్ కేటాయింపులు జరగకుండా సీమాంవూధులు ఢిల్లీ స్థాయిలో కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా శంకరపల్లి పవర్‌వూపాజెక్టు భూమి కేటాయింపులు ఏనాడో జరిగినా నిర్మాణం ఊసే లేకుండా ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది.

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే భూ సేకరణ జరిగింది. తొలుత నాఫ్తా ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా..తదుపరి దానిని గ్యాస్ పవర్ ప్రాజెక్టుగా మార్చారు. అయితే ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు లేవని కొన్నేళ్ళు, నీరు లేదని, ఆ తర్వాత గ్యాస్ పైప్‌లైన్ లేదని మరికొంతకాలం ఉద్దేశపూర్వకంగా జ్యాపం చేశారని ఆరోపణలు ఉన్నాయి. శంకరపల్లిని కాదని దాని కంటే ఎంతో వెనుక వచ్చిన సీమాంధ్ర ప్రాజెక్టులకు కేంద్రం 2003 సంవత్సరంలో గ్యాస్ కేటాయింపులు చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపుల కోసం సీమాంధ్ర పాలకులు కేంద్రానికి కంటి తుడుపుగా లేఖలు రాస్తూ తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతూ వస్తున్నారని తెలంగాణలోని విద్యుత్ నిపుణులు విమర్శిస్తున్నారు.నేదునూరు ప్రాజెక్టు కన్నా ఎంతో వెనుక వచ్చిన సీమాంధ్ర పవర్ ప్రాజెక్టులైన ల్యాంకో కొండపల్లి, జీవీకే, కోనసీమ వంటి వాటికి కేంద్రం గ్యాస్ కేటాయింపులు జరపడమే ఇందుకు నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.

ల్యాంకోకు గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎంతో మతలబు చోటుచేసుకుందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో పవర్ ప్రాజెక్టు ఏకంగా విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతో ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ మతలబులున్నాయి. అంతే కాకుండా మర్చెంట్ పవర్ ప్రాజెక్టుగా ల్యాంకో ప్రాజెక్టుకు ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫారసు చేసిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ విధంగా వచ్చిన ల్యాంకో ఇటీవల సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడు రాష్ట్రానికి విక్రయాలు జరిపింది. ఫలితంగా కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోగా, పరిక్షిశమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి.

నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమలో ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్ళు లేవని సాకులు చెప్పిన ఆనాటి పాలకులు నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, పోతిడ్డి పాడు నుంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయి. ఆర్టీపీపీ కోసం దాదాపు 200 కి.మీ. మేరకు పైప్‌లైన్ నిర్మించి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.

హిందుజా.. ఆజా...
దాదాపు దశాబ్దం కిందట విశాఖపట్నం జిల్లాలో హిందుజా గ్రూప్ తలపెట్టిన హిందుజా పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వపరంగా కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకున్నా ప్రస్తుత ప్రభుత్వం హిందుజా పవర్‌కు మర్చెంట్ హోదా కల్పించేందుకు యుద్దవూపాతిపదికన చర్యలకు ఉపక్షికమించింది. గతంలో హిందుజాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కాలం చెల్లడంతో వైఎస్ హయాంలో తిరిగి పునర్జీవం కల్పించారు. హిందుజాకు కేటాయించిన భూములు వక్ఫ్ బోర్డుకు చెందినవి కావడం, ఆ భూములకు ధర నిర్ణయించి హిందుజా యాజమాన్యం వాటిని కొనుగోలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

power-telangnaa-Newstalangana patrika telangana culture telangana politics telangana cinema











Read more...

ఢిల్లీ నోట... ఉల్టామాట!

- సమస్యను మొదటికి తెచ్చిన ప్రధాని
- ఏకాభివూపాయంతోనే తెలంగాణ సాధ్యం
- అది జాతీయ స్థాయిలో ఇప్పటికీ రాలేదు
- పెనం నుంచి పొయ్యిలో పడకూడదు
- రాష్ట్రం ఇస్తే దేశంలో మరిన్ని సమస్యలు
- మన్మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- భగ్గుమన్న తెలంగాణవాదులు
- కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తాం
- తెలంగాణ కోపాగ్ని చవిచూడక తప్పదు
- నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్ అధినేత
- ప్రధాని హోదాకు తగని వ్యాఖ్యలు:
జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శ
- ఉద్యమం తీవ్రం చేస్తాం: ఎర్రబెల్లి
- ఇంత జరిగాక తిరకాసు మాటలేంటి?
- టీ కాంగ్రెస్ నేతల సమాధానమేంటి?
- నిలదీస్తున్న తెలంగాణ సమాజం


KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
న్యూఢిల్లీ, హైదరాబాద్, నవంబర్ 12 (
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఏడాదిపాటు కాలం గడిపేసింది. దాని సిఫారసులు సాధ్యం కావంటూ కేంద్రమే వాటిని పక్కనపె అమ్మ రావాలన్నారు. సోనియా విదేశాల నుంచి వచ్చేశారు. ఈలోపు ఆజాద్ సంప్రతింపుల ప్రక్రియ నడిచింది. కోర్‌కమిటీలన్నారు. పండుగల తర్వాత నిర్ణయమన్నారు. యూపీఏ అభివూపాయమే పార్టీ అభివూపాయమన్నారు. జాతీయ స్థాయిలో అభివూపాయ సేకరణ అవసరం లేదన్నారు. దీపావళి, బక్రీద్ వెళ్లిపోయాయి. రాష్ట్ర విభజనపై ఇదిగో నిర్ణయం అతి త్వరలో.. అందరికీ ఆమోదయోగ్యంగా శాశ్వత పరిష్కారం.. అంటూ నేతల నోటి నుంచి మాటలు వచ్చాయి. కొద్ది రోజుల్లో చిదంబరం ప్రకటన అంటూ లీకులు వదిలారు. మధ్యలో ఆర్థిక మండళ్లంటూ ఫీలర్లు ఇచ్చారు. ఎస్సార్సీయే సర్వరోగ నివారణి అంటూ తన ప్రతినిధులతో కొత్త పల్లవి పాడించారు. వ్యతిరేకత రావడంతో అబ్బే అది యూపీకేనంటూ వివరణ ఇచ్చారు. ప్యాకేజీల ప్రస్తావనలు తెచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మరో అడుగు ముందుకేశారు. సాక్షాత్తూ ప్రధాని మన్మోహనే తెలంగాణ ఇప్పట్లో ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. విషయం మళ్లీ మొదటికి వచ్చే రీతిలో పెను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకాభివూపాయంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని సమస్యను మళ్లీ మొదటికి తెచ్చారు. తెలంగాణ ఇచ్చి మరిన్ని సమస్యలు కొనితెచ్చుకోవాలని అనుకోవ అసలు సంగతి బయటపెట్టారు. ప్రధాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం యావత్తూ భగ్గుమన్నది. ఇంత ప్రక్రియ నడిపి, త్వరలో నిర్ణయం అని చెప్పి, మళ్లీ ఈ తిరకాసు మాటలేంటని మండిపడింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించి, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. ప్రధాని వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నాయకత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీసింది. పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి చూడలేని కబోది అంటూ ప్రధానిపై ధ్వజమెత్తారు.

మాల్దీవుల్లో జరిగిన సార్క్ సమావేశాల నుంచి తిరిగి వస్తూ విమానంలో విలేకరులతో జరిపిన ఇష్టాగోష్ఠిలో తెలంగాణ అంశంపై ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ప్రధాని మన్మోహన్... ఏకాభివూపాయంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ సంక్లిష్టమైన సమస్య. అందరికీ అమోదయోగ్యమైన నిర్ణయం కోసం ఏకాభివూపాయం రావాలని కోరుకుంటున్నాం. ప్రశాంత పరిస్థితుల్లోనే సమస్యకు పరిష్కారం లభించగలదు. ఈ విషయంలో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఓ జాతీయ సమస్యపై పెనంలోంచి పొయ్యిలో పడటం సరైన పరిష్కారం కాదు’’ అని ప్రధాని అన్నారు. తెలంగాణ అంశంపై అన్ని వర్గాల్లో ఏకాభివూపాయానికి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ సమస్యపై జాతీయ స్థాయిలో ఏకాభివూపాయం వచ్చిందని చెప్పలేమని ప్రధాని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తెలంగాణేతర ప్రాంతాల్లో అశాంతి, గందరగోళం నెలకొన్నందున ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ సమస్య పరిష్కారం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి అడిగినపుడు, ‘‘భా స్వాములందరూ అమోదించే విధంగా సరైన పరిష్కార మార్గం కోసం కృషి చేస్తున్నాం’’ అని ప్రధాని సమాధానమిచ్చారు.

ప్రధాని కళ్లున్నకబోది: కేసీఆర్ ఫైర్
తెలంగాణపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి చూడలేని కబోది అంటూ ప్రధానిపై ధ్వజమెత్తారు. ప్రధానికి ప్రజా ఉద్యమాల మీద గానీ, ప్రజాస్వామిక విలువల మీద గానీ ఏమాత్రం గౌరవం లేదని కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. తెలంగాణపై ఏకాభివూపాయం తర్వాతే నిర్ణయమన్న ప్రధాని వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. శనివారం టీఆర్‌ఎస్ అధినేత మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా, అధికార కాంగ్రెస్‌పైనా నిప్పులు చెరిగారు. ‘‘తెలంగాణ ప్రజలారా బాధపడకండి, భయపడకండి. మీతో నేనున్నాను. అన్ని రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ సాధిద్దాం’’ అంటూ ె లంగాణ ప్రజలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ప్రజా పోరాటలకు ఎవరైనా తల వంచక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను భూ స్థాపితం చేస్తారని ఆయన ఘాటుగా స్పందించారు. ఇది తన శాపమని అన్నారు. తెలంగాణ ప్రజల కోపాగ్నిని కాంగ్రెస్ పార్టీ రుచి చూస్తుందని హెచ్చరించారు. తెలంగాణ సాధించే వరకు ఉద్యమాన్ని అపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రధాని హోదాకు తగినట్టుగా మాట్లాడాలి: కోదండరాం
ప్రధాని వ్యాఖ్యలపై జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే ‘కాంక్షిగెస్ కో ఖతం కరో’ అనే నినాదాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన్మోహన్‌సింగ్ ఆయన హోదాకు తగ్గట్టు మాట్లాడాలని హితవుపలికారు. ఢిల్లీ పెద్దల తీరు చూస్తుంటే తెలంగాణ అంశాన్ని కోల్డు స్టోరేజీలోకి నెట్టే పరిస్థితి దాపురించిందన్నారు.

రెండు రకాలుగా మాట్లాడొద్దు: మల్లెపల్లి లక్ష్మయ్య
ఎన్ని సార్లు ఏకాభివూపాయం తీసుకుంటారని జేఏసీ కో చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రశ్నించారు. ఇంకెన్ని సార్లు అఖిలపక్ష భేటీలు జరుపుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రధానికి దమ్మూ, ధైర్యం ఉంటే తెలంగాణ ప్రక్రియ షురూ చేయాలి. లేదా ఇచ్చేది లేదని సూటిగా చెప్పాలి. కానీ రెండురకాలుగా మాట్లాడి ప్రజల్ని మోసం చేయవద్దు’’ అని సూచించారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్య విలువలపై నమ్మకముంటే వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: విఠల్
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లుపెట్టి ప్రత్యేక తెలంగాణపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని ఉద్యోగ సంఘం నేత విఠల్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నది : వీ ప్రకాశ్
కాంగ్రెస్ తన గొయ్యిని తానే తవ్వుకుంటుందని రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి బయటపడినందున తెలంగాణ కాంగ్రెస్ నాయకులు యూపీఏ, కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని హితవుపలికారు. మరోసారి చర్చలు జరపడమంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడమేనని ఆయన తెలిపారు.

ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: దేవీవూపసాద్
తెలంగాణ సమస్యను పరిష్కరిస్తేనే తెలంగాణలో శాంతి నెలకొంటుందని టీఎన్జీవో నేత దేవీవూపసాద్ అన్నారు. తెలంగాణపై ఇప్పటికే ఎన్నో మార్లు ఏకాభివూపాయం కుదిరిందన్నారు. మరోసారి ఏకాభివూపాయం కావాలనడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించడమే అవుతుందని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ మరోసారి ద్రోహం: గోవర్ధన్
తెలంగా ప్రజల ఆకాంక్షలకు కాంగ్రెస్ మరోసారి ద్రోహం చేస్తోందని న్యూ డెమొక్షికసీ నేత గోవర్ధన్ మండిపడ్డారు. ఏకాభివూపాయం అంటూ ప్రధాని పాతపాటతో కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం అనే భావన స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తే తప్ప తెలంగాణ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోరుకునే పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగులు, ప్రజలు అంతా విభేదాలు మాని పార్టీలకు అతీతంగా పోరాడి తెలంగా సాధించుకోవాలని గోవర్థన్ పిలుపిచ్చారు.

ఉద్యమం తీవ్ర రూపం: ఎర్రబెల్లి
తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతమౌతుందని టీడీపీ టీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. తెలంగాణవాదులంతా పరస్పర విమర్శలు మాని కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు.

Take By: T News


Tags: Telangana News,  Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy,  Telangana agitation, statehood demand,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP