Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, December 26, 2011

Anna Hazare was an 'active RSS Pracharak,’ reveals media report

New Delhi, December 26: Just two days before Ana Hazare’s three-day fast at the MMRDA Ground in Mumbai on December 27, startling facts have emerged in the media, which point towards Anna Hazare’s strong association with the Rashtriya Swayamsevak Sangh (RSS), something which Hazare and team Anna have been categorically denying till now. According to a report published in Hindi daily “Nai Duniya” Anna Hazare was an 'RSS Pracharak’ who received his ‘Diksha’ from senior RSS leader Nanaji Deshmukh in 1983 in Gonda.

Front page story of Hindi daily Nai Duniya dated 25th Dec. 2011
According to this report, as a very close aid of senior RSS leader Nanaji Deshmukh, Anna Hazare learnt and developed his worldview of village development because of his works on the issue while he was with RSS. It was this worldview, which he later replicated and experimented at Ralegan Siddhi.

RSS, on several occasions has acknowledged and accepted its open and tacit support of Hazare’s so called anti-corruption campaign. In fact, RSS chief Mohan Bhagwat had, at the organisation's annual Dussehra rally in Nagpur in October 2011 said that its volunteers "are already active in all movements against corruption without craving for their own position and credit".

According to this report, Hazare worked on several RSS projects, shoulder to shoulder with Deshmukh. He used to be the general secretary of one RSS affiliate group which was headed by Nanaji Deshmukh.

One old picture has also surfaced in the media, in which Anna Hazare is shown in company of the senior RSS leader Nanaji Deshmukh. Deshmukh had praised Anna Hazare in several RSS meetings and it was on his insistence only that Anna is seen as a very respectable figure in RSS.



 Front page story of Hindi daily Nai Duniya dated 25th Dec. 2011
Interestingly till now Anna Hazare himself or his team haven’t commented or disputed the claims made in the report.
According to this Nai Dinuya report which goes in detail about Anna Hazare’s involvement in RSS activities Hazare was actively involved with several projects related to village development which were started by Nanaji Deshmukh. “Gram Wishva’ (Village World), an organization devoted to the development of village, was established with Hazare being a very active member of the group.

According to Ramprakash Gupta, who had attended meetings with Nanaji Deshmukh, in 1983 an important 3-days meeting of Gram Wishva was organized in which Anna Hazare actively participated in the meetings with Nanaji Deshmukh.

Even though Anna Hazare and his team have categorically denied his RSS connection in the past, the recent evidence of Anna Hazare’s links with RSS, is some thing which Anna Hazare and his team will find very hard to dispute.

This development has emboldened and provided the Congress and its allies with fresh evidence of Anna Hazare’s RSS links. Congress general secretary Digvijaya Singh has criticized Anna Hazare for hiding his RSS connection till now.

"And he denied any association with RSS! Now whom do we believe Facts with Picture and the claim of RSS or Anna? I am again proved right", tweeted Singh.

Digvijaya Singh has in the past, accused Mr Hazare of being hand in gloves with the RSS. He had also alleged that Hazare’s fast against corruption at the Ramlila Maidan in August this year had the backing of the right-wing group with the latter's members also participating in the event.

Political activist Shehzad Poonawalla, who has since the beginning doubted the purpose of the Anna campaign, said: "I had always maintained that the Anna movement is nothing but a Jansangh sponsored event. Their aim is simple - enforce mid term polls upon the country perhaps to dislodge ongoing investigations into saffron terror by the NIA."

Poonawalla says that Sangh since the exposure of saffron terror has tried to scuttle the terror probes.

"The Jansangh has always been finding ways and means to scuttle the investigations of right wing terror by saffron groups and almost got an allergic attack when the Communal Violence Bill came into the public domain. Thereafter they have used Anna Hazare to deflect attention from issues like Modi's culpability in 2002 riots, communal violence and food security bill," alleges Poonawalla.

Take By: Siasat News : http://www.siasat.com/english/news/anna-hazare-was-active-rss-pracharak%E2%80%99-reveals-media-report

Read more...

అరుదైన వ్యాధి గుర్తింపు

- దేశంలోనే మొట్టమొదటి ఆపరేషన్
- వర్తించని ఆరోగ్యశ్రీతో రోగి ఆందోళన
- ఆదుకోవాలని తెలంగాణ బిడ్డ వేడుకోలు


హైదరాబాద్ డిసెంబర్ 25 (): అరుదైన వ్యాధితో ఏళ్ల తరబడిగా బాధపడుతున్న నల్గొండ జిల్లా గుడిపల్లికి చెందిన రవీందర్‌డ్డి అనే యువకుడికి హైదరాబాద్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఈ వ్యాధి పేరు స్టిఫ్‌మాన్ సిండ్రోమ్. నాలుగేళ్లుగా అప్పులు చేసి దవాఖానల చుట్టూ తిరిగినా ఇది ఏ వ్యాధో అంతుపట్టలేదు.

వ్యాధిపేరు తెలియకపోగా కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లు మడవలేని స్థితిలో నాలుగేళ్లుగా రవీందర్‌డ్డి ఇబ్బంది పడుతున్నారు. చివరకు నగరంలోని ‘సన్‌షైన్’ ఆస్పవూతిలో ఉన్న వెన్నుపూస స్పెషలిస్టు నరేష్‌బాబు పరీక్షలు చేసి ‘‘స్టిఫ్‌మాన్ సిండ్రోమ్’’గా గుర్తించారు. ఈ జబ్బు సోకినవారికి వెన్నుపూసకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానే ఉపశమనం ఉంటుంది. అయితే ఈ మందు గంటకు మించి పనిచేయదు.

ఈ నేపథ్యంలో వెన్నుపూస ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో వెన్నుపూసకున్న ప్రధాన నరానికి నిత్యం సూదిమందు అందేందుకు పొట్టలో ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. ఒక్కసారి నింపితే వంద రోజులకు మందు సరఫరా అవుతుంది. మందు అయిపోతుంటే ఆ మిషన్ ఆలారం మోగిస్తుంది. కాగా రాష్ట్రంలోనే కాక, దేశంలోనే దీనిని మొట్టమొదటి కేసుగా గుర్తించారు.

ఇలాంటి పరికరం అమర్చడం దేశంలోనే మొట్టమొదటి సారి అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయకపోవడంపై పేషెంట్ రవీందర్‌డ్డి, ఆయన కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత ధృక్ఫథంతో సాయం అందిచాలని కోరుతున్నారు. మందు నింపుకునేందుకు ప్రతి వంద రోజులకు రూ.5వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Take By: T News

Read more...

మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం .... ( కోటా రాజకీయం)

మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంక్షేమం కన్నా రాజకీయ లబ్ధికే ప్రాధాన్యం ఇచ్చిందనే అభివూపాయం కూడా వ్యక్తమవుతున్నది. ఏదైనా సామాజిక వర్గాన్ని బాగుపరచాలనే చర్చ వచ్చినప్పుడల్లా ప్రభుత్వం కోటాతో సరిపెట్టి వివాదాల తుట్టె కదుపుతున్నది. కానీ ఆయా సామాజిక వర్గాల సమక్షిగాభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతులకున్న 27 శాతం రిజర్వేషన్‌లలో మైనారిటీలకు నాలుగున్నర శాతం ఉప కోటా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది.

ఉత్తరప్రదేశ్, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఆ తరువాత సార్వవూతిక ఎన్నికలు కూడా సమీపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనడంలో సందేహం లేదు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో ముస్లింలు 18 శాతం ఉన్నారు. దాదాపు 115 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు.

ఈ కోటా ముస్లింలకు తమ ప్రభుత్వ కానుక అనీ, యూపీ ఎన్నికల్లో ములాయం పార్టీకి పడే ముస్లిం ఓట్లన్నీ తమకే వస్తాయని, ఇక యూపీలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించడం కోటా రాజకీయానికి నిదర్శనం. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల దేశంలో అంతర్యుద్ధం వస్తుందనే రీతిలో ఒక ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందడానికి అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి.

మరోవైపు జమాతే ఇస్లామీ హింద్ వంటి సంస్థలు మాత్రం ఈ కోటా కల్పించడాన్ని ముస్లింలను మోసం చేయడంగా అభివర్ణించాయి. ఇప్పటికే ముస్లింలలోని కొన్ని కులాలు బీసీలకు కేటాయించిన 27 శాతం కోటాలో రెండు నుంచి మూడు శాతం పొందే అవకా శం ఉందని, ఇప్పుడు మైనారిటీలు అందరికీ కలిపి కేటాయించే 4.5 శాతం కోటాలో వారికి అదనంగా ఒరిగేదేమీ ఉండదని ముస్లిం మత పెద్దలు కొందరు అంటున్నారు. ఉదాహరణకు జైనులు ఎంతో అభివృద్ధి చెందారని 4.5 శాతంలో వారితో ముస్లింలను కలపడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు. అయితే 27 శాతం కోటాలో వెనకబడిన తరగతుల వారితో పోటీ పడే బదులు, నాలుగున్నర శాతంలో మిగతా మైనారిటీలతో పోటీ పడడం సులభమనే వారూ ఉన్నారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచి వినబడుతున్నది.


ముస్లింలతో పాటు మైనారిటీలందరికీ కలిపి నాలుగున్నర శాతం రిజర్వేషన్ కల్పించడం కంటి తుడుపు చర్య అనే అభివూపాయం ముస్లిం మేధావులలో వ్యక్తమవుతున్న ది. రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా ముస్లింలకు పది శాతం రిజర్వేష న్ కల్పించాలని వారు కోరుతున్నారు. పైగా ఈ మేధావి వర్గం అభివూపాయపడుతున్నట్టు ముస్లింల సమక్షిగాభివృద్ధికి చర్యలు తీసుకోకుండా కేవలం కోటా కల్పించడం వల్ల కూడా ఫలితం ఉండదు. యూపీఏ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కానీ, ఆ తరువాతి రంగనాథ్‌మిశ్రా కమిషన్ కానీ ముస్లింల దయనీయ పరిస్థితిని వివరించాయి.

ప్రణాళికా సంఘం విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక (2011) కూడా ముస్లింల వెనుకబాటుతనాన్ని కళ్ళకు కట్టింది. ముస్లింల పరిస్థితి దళితుల కన్నా అధ్వాన్నంగా ఉన్నది. పేదరికం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని చూస్తే ముస్లింల అభివృద్ధి రేటు తక్కువగా ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలను ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసిందని కాదు.

ఈ సామాజిక వర్గాలు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కానీ ముస్లింల పరిస్థితి చెప్పడానికే భిన్న వెనుకబడిన వర్గాలతో పోల్చడం. 2004-05 నుంచి 2007-08 నాటికి పోల్చి చూస్తే నగర ప్రాంతాలలో ముస్లింలలో విద్యాభివృద్ధి 5.3 శాతం కాగా, ఎస్సీలలో 8.7, ఎస్టీలలో 8 శాతం ఉంది. శిశు మరణాల సంఖ్య కూడా మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే ముస్లింలలో ఎక్కువగా ఉన్నది. దేశ జనాభాలో ముస్లింలు 14 శాతం ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలలో 2.5 శాతం మాత్రమే ఉన్నారు.


ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనాన్ని మించిన సమస్యలను ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నది. ముస్లింలను ప్రధాన స్రవంతిలో భాగం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రధాన స్రవంతి చేయడానికి ఇష్టపడని, గిట్టుబాటు కాని పనులను వారు చేపట్టవలసి వస్తున్నది. భద్రతా రాహిత్యం, అస్తిత్వ సంక్షోభం, వివక్ష, దేశ భక్తిని శంకించడం వంటి సమస్యలను ముస్లింలు ఎదుర్కొంటున్నారని సచార్ కమిటీ పేర్కొంది.

వీరికి అసమ్మతిని వ్యక్తం చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాలలో కోటా కల్పించడం వల్ల కొన్ని తక్షణ ప్రయోజనాలు ఉంటాయి. అయితే కోటాతోనే సమస్యలన్నీ తీరుతాయనే భ్రమలను ప్రభుత్వం కల్పించకూడదు. దీర్ఘకాలిక సామాజిక - ఆర్థికాభివృద్ధి వ్యూహంలో కోటా కల్పించడం కూడా ఒక భాగం కావాలె. ప్రత్యేకించి ఆత్మాభిమానంతో బతికే గౌరవనీయ పరిస్థితులు కల్పించాలె.

అంతే తప్ప ముస్లింలకు ఏదో ఒరగ బెడుతున్న అభివూపాయాన్ని ఇతర మతాల వారికి కల్పించడం, బీసీ ల కోటా నుంచి కేటాయించి తగవులు పెట్టడం వంటి చర్యలు తక్షణ రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తాయేమో కానీ, సామాజిక సామరస్యానికి, సంక్షేమానికి దోహదపడవు. కాంగ్రెస్ వంటి బాధ్యతాయుత రాజకీయ పక్షం, కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో అడుగులు వేయాలే తప్ప రాజకీయ ఎత్తుగడలకు దిగడం భావ్యం కాదు.

Take By: T News

Read more...

మహిళా కమిషన్ చైర్మన్‌గా జయసుధ?

- ఆమె ైవైపే సీఎం మొగ్గు
- అధిష్ఠానం ఆమోదం?
- త్వరలో అధికారిక ఉత్తర్వులు
- జగన్ వర్గం నుంచి వచ్చినందుకు నజరానా?


jaya-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 25 (:సినీనటి, సికింవూదాబాద్ ఎమ్మెల్యే జయసుధను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి స్ఫూర్తితో సినీపరిక్షిశమ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జయసుధ, ఆయన ప్రోత్సాహంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింవూదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత నాలుగు నెలలకే ఊహించని రీతిలో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

వైఎస్సార్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రయాణంపై ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత పార్టీకి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్ తనయుడు జగన్‌కు బాసటగా నిలుస్తూ ఆయనకు మద్దతిస్తూ వచ్చారు. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నప్పటికీ అతనికి అండగా ఉంటూ కాంగ్రెస్‌లో జగన్ వర్గం ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు.

వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించిన జగన్ వర్గం ఎమ్మెల్యేల బృందంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ ప్రయోగించిన పునరాకర్షక్ మంత్రం తో జయసుధ జగన్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

అప్పటి నుంచి ఆమె సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని పలు సందర్భాల్లో ఒక మంచి ముఖ్యమంవూతిగా పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కిరణ్ కూడా సినీ గ్లామర్ ఉన్న జయసుధ పార్టీ నుంచి చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సికింవూదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పలు అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించారు. అంతే కాకుండా పునరాకర్షక్ మంత్రంలో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు జయసుధకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కిరణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవికి వన్నె తెచ్చే నాయకురాలి కోసం పార్టీ అన్వేషిస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జయసుధను మించి ఆ లక్షణాలు, అర్హతలున్న నేతలు ఎవరూ లేరని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. జయసుధకు ఆ పదవి ఇవ్వడం ద్వారా జగన్ వర్గం నుంచి కాంగ్రెస్‌కు వచ్చినందుకు ఆమెకు నజరానాగా చెప్పుకోవచ్చని, జగన్‌కు మద్దతుగా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, నేతలను కూడా సొంతగూటికి రప్పించుకోవచ్చని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఈ విషయంలో ఆయన పార్టీ అధిష్ఠానంతో చర్చించి జయసుధ పేరుకు ఆమోదం కూడా పొందినట్లు సమాచారం. గతంలో మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మేరి రవీంవూధనాథ్, కమిషన్ సభ్యులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వీధి పోరుకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ కమిషన్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి కమిషన్ చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. నాటి నుంచి పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలు ఆ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Take By: T News

Read more...

బీడీ మతుకుల్ని చుట్టేన్తున్నారు!

- కనీస వేతనాలకు కత్తెరేసే కుతంత్రం
- యాజమాన్యాల అమానుషం
- ‘స్టార్’ సమావేశాల్లో ‘మెజారిటీ’ నాటకం
- అదే జరిగితే సేట్ల జేబుల్లోకి వేల కోట్లు
- భారీ మొత్తాలు కోల్పోనున్న కార్మికులు
- జీవో మార్పుకోసం నెల్లూరు మాజీ ఎమ్మెల్సీ తంటాలు
- దానం, షబ్బీర్, రాజేశ్వర్ పాత్రపై కార్మికుల మండిపాటు
- సమరానికి సిద్ధం.. కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం
-జీవో 41 సవరణకు సీమాంధ్ర సర్కారు సిద్ధం


beedip-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema( - నిజామాబాద్):ప్రభుత్వ జీవో ప్రకారం కనీసం వేతనం రూ. 150 చెల్లించలేమని అలా చేస్తే నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదముందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలుకుతున్నారు. సీమాంధ్ర సర్కారులోని పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే బీడీ కార్మికులు వెయ్యి బీడీల ఉత్పత్తిపై రూ.60 నష్టపోయే ప్రమాదముంది. బీడీ కార్మికుల జీవితాలు మసిబారిపోతూనే ఉంటాయి. జీవనాధారంగా ఎంచుకున్న పని వారి జీవితాలను గొప్పగా నిలబెట్టకపోగా, ఆరోగ్యాన్ని పలు విధాలుగా హరించి వేస్తూనే ఉంటుంది.

సంతృప్తికరమైన, సుఖవంతమైన జీవనమో, ఆరోగ్య భద్రతకు హామీయో ఉండదు. అయినా ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళదీయాలికదా అనే భావనతోనే కూటికోసం తెలంగాణలో కోట్ల కుటుంబాలు బీడీ పరిక్షిశమనే ఆధారం చేసుకున్నాయి. వాళ్ల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిజేసే ఈ పని సేట్లకు, యాజమాన్యాలకు మాత్రం కోట్ల సంపదను సమకూర్చుతోంది. కార్మికులకేమో సరైన కనీస వేతనాలు లభించవు. సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఈ ఏడాది జూన్‌లో వెయ్యి బీడీల తయారీకి కనీస వేతనాన్ని రూ.150గా ఖరారుచేస్తూ జీవో నంబర్ 41 విడుదలయింది. కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, కార్మిక శాఖ, ప్రభుత్వం.. అన్నీ ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే విడుదలైన ఆ ఉత్తర్వు పని అంతటితోనే ముగిసిపోయింది.

ఆచరణకు రాలేదు. కారణం?.. స్వార్థపర యాజమాన్యాల దురాశ! తమ లాభాలు కొల్లగొట్టుకపోతాయనే అపోహ. అంతే.. ఆ జీవోకు అడ్డుచక్రం వేయాలనుకున్నారు. అధికారంలో ఉన్న నేతలను అందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కావాలనుకున్న వర్గాలన్నింటినీ సంప్రదించారు. విలాసవంతమైన నక్షత్ర హోటళ్లలో సంప్రతింపుల ప్రహసనం నడిపారు. అన్యాయం కదా అనేవారికి అవకాశమీయలేదు. అన్ని రకాల మాయోపాయాలూ ప్రయోగించారు. చివరికి.. ‘మెజారిటీ’ పేరిట కార్మికుల కడుపు కొట్టేందుకు ఏకమయ్యారు. పదకొండు సంవత్సరాల పోరాటం ఫలితంగా కనీస వేతనాన్ని రూ.102 నుంచి రూ.150కు పెంచాలని ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినా.. ఇప్పుడు కుట్రపూరితంగా ఆ మొత్తం రూ.115కు పడిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. స్వార్థపర యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారుకు తోడు ఇక్కడి తెలంగాణ ద్రోహులు కూడా ఈ దారుణానికి అండగా నిలవడం కార్మిక వర్గాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. స్వయానా కార్మికమంత్రి దానం నాగేందర్, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నెల్లూరు జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అండదండలతో బీడీ యాజమాన్యాలు జీవో 41ని సవరింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ దారుణ చర్య గురించి తెలుసుకున్న బీడీ కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం కుయుక్తులకు తలొగ్గితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. యాజమాన్యాల ప్రయత్నాలను తిప్పికొ సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం కావాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో వ్యవసాయం తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు తమ జీవనోపాధిగా ఎంచుకున్న బీడీ పరిక్షిశమ తనను నమ్ముకున్న కార్మికులను కాపాడుకోలేకపోతోంది. ఆ కార్మికులకు అండగా నిలబడి పోరాడుతున్న సంఘాలను దెబ్బతీసేందుకు ఎన్నో మాయోపాయాలు..

కపట నాటకాలు. ఇప్పుడు ఆ కార్మికవర్గం వెన్ను విరిచేందుకు స్వార్థ యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారు పథకం ప్రకారం పావులు కదుపుతున్న తీరు రోత కలిగిస్తోంది. గుండెలను రగిలిస్తోంది. లక్షల మంది కార్మికులు లడాయిచేసి సాధించుకున్న కనీసవేతనాల జీవోను సవరించే నయవంచన ఎత్తుగడలు ఇప్పుడు తీవ్ర ప్రతిఘటనను చవిచూసే పరిణామాలను కొని తెచ్చుకోనున్నాయి. కుట్రలు ఫలిస్తే ఈ ఒక్క ఆరు నెలల్లోనే తెలంగాణ జిల్లాల్లోని ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికులు రమారమి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. హైదరాబాద్ కేంద్రంగా సీమాంధ్ర సర్కారు పెద్దలు, బీడీ యాజమాన్యాలు కూడబలుక్కుని నడుపుతున్న గూడుపుఠాణీ వల్ల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, రంగాడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని లక్షలాది మంది బీడీ కార్మికుల బతుకులు బుగ్గికానున్నాయి.

నయవంచన.. కుట్రల పరంపర..
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణ సూచికల ప్రాతిపదికన కనీస వేతనాలు అందజేయాలని 11ఏళ్లుగా తెలంగాణ జిల్లాల్లోని బీడీ కార్మిక రంగంలో అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సీమాంధ్ర పాలకులు పట్టించుకోని కారణంగా జాతీయ కార్మిక సంఘాల నేతృత్వంలో 2010 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 2 వరకు చరివూతాత్మకమైన సమ్మె జరిగింది. 32 రోజులపాటు కొనసాగిన సమ్మెవల్ల తెలంగాణ జిల్లాల్లోని బీడీ యాజమాన్యాలు కోట్లాది రూపాయల ఉత్పత్తిని కోల్పోయాయి. దీంతో రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 56 సంఘాలతో సమ్మె కాలంలోనే నవంబర్ 24, 25, 26 తేదీల్లో చర్చలు జరిపింది. దీని ఫలితంగానే డిసెంబర్ 30న కనీస వేతనాలను ఖరారు చేస్తూ కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ 1381 నంబరుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

వెయ్యి బీడీల తయారీకి 130 రూపాయలు కనీస వేతనంగా పేర్కొంటు జారీచేసిన నోటిఫికేషన్‌పై మంత్రి దానం నాగేందర్ సమక్షంలో బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. జీవన ప్రమాణ సూచికలు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రాతిపదికన ప్రతి వెయ్యి బీడీల తయారీకి 150 రూపాయల కనీస వేతనం అమలు పూర్తిగా శాస్త్రీయబద్ధమేనని కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆ సమావేశంలో స్పష్టంచేశారు. ఆ సమావేశం కొనసాగింపుగానే జూన్ 31వ తేదీన ప్రభుత్వం 130 రూపాయలు కనీస వేతనంగా, 7 రూపాయల 50 పైసలు కరువు భత్యంతోపాటు ఇతర అంశాలపై చెల్లింపుల ద్వారా 150 రూపాయలను ఖరారు చేస్తూ జీవో నంబర్ 41ను జారీ చేసింది.

ఆ జీవోను అమలుచేయాలని కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే బీడీ యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జూలై 6 నుంచి పదిరోజులపాటు అక్రమంగా లాకౌట్ ప్రకటించాయి. సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జూలై 27న త్రైపాక్షిక కమిటీని వేసింది. బీడీ సేట్లకు అనుకూలమైన సంఘాలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల బాధ్యులకు ఎక్కువ సంఖ్యలో కమిటీలో ప్రాతినిధ్యం కల్పించారు. బీడీ పరిక్షిశమతో ఏమాత్రం సంబంధంలేని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ రాధాకృష్ణను (నెల కిందట పదవీ కాలం ముగిసింది) సైతం త్రైపాక్షిక కమిటీ సభ్యుడిగా నియమించారు. ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, డీఎంఎస్, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాలతోపాటు ముఖ్యమైన బీడీ సంఘాల యాజమాన్యం ప్రతినిధులను కమిటీలో చేర్చారు. ఏనాడూ ఆ పని చేయని త్రైపాక్షిక కమిటీ మొక్కుబడిగా సెప్టెంబర్ 12న, నవంబర్ 9న మాత్రమే సమావేశాలు జరిపింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుండానే కార్మిక సంఘాల అభివూపాయాలను మాత్రమే స్వీకరించింది.

రెండ్రోజుల్లోనే తారుమారు.. ఆరునెలల్లోనే వెయ్యి కోట్ల నష్టం
Bidi-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకనీస వేతనాల జీవో అమలుకోసం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా చర్చలపేరిట సమావేశాలను నిర్వహించాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 150 రూపాయలు చెల్లించలేమని, నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదం ఉందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలికారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలో కనీస వేతనాలు ఇస్తుండగా లేని నష్టాలు ఇక్కడెందుకు వస్తాయని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అయినా మెజార్టీ మంత్రాంగాన్ని తెరపైకి తెచ్చిన యాజమాన్యాలు 70 సంఘాల అంగీకారం ఉందంటూ కనీస వేతనాల జీవోను సవరించాలంటూ సర్కారును ఆశ్రయించాయి. వెయ్యి బీడీల తయారీపై ఇప్పుడు ఇస్తున్న 102 రూపాయలను 115 రూపాయలకు మాత్రమే పెంచగలుగుతామని యాజమాన్యాలు చేసిన ప్రతిపాదనకు బీడీ కార్మికసంఘాలు పచ్చజెండా ఊపాయి. సీమాంధ్ర సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే ప్రతి బీడీ కార్మికుడు వెయ్యి బీడీల ఉత్పత్తిపై భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. జీవో విడుదలైనప్పటినుంచి ఈ ఆరు నెలల కాలంలోనే ఆ మొత్తం రూ. వెయ్యి కోట్ల పైగా ఉంటుంది.

రోజుకు వందకోట్ల బీడీ ఉత్పత్తి
సంక్షోభంలో ఉన్నామంటూ నమ్మబలుకుతున్న సేట్లు కనీస వేతనాలు పెంచితే పరిక్షిశమనే తరలిపోతుందని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. బీడీ కంపెనీలు వెయ్యి బీడీలను 40 కట్టలుగా బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడం ద్వారా 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు లాభాలను గడిస్తుంటాయి. ఉత్పత్తిచేస్తున్న కార్మికులకు మాత్రం 102 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఈ లెక్కన యాజమాన్యాలకు రోజువారీగా అంతులేని లాభాలు వస్తూనే ఉన్నాయి.

ప్రతిరోజు తెలంగాణ జిల్లాల్లో వందకోట్ల సంఖ్యలో బీడీ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఒక్క దేశాయి కంపెనీలోనే లక్షమంది కార్మికులు 10 కోట్ల బీడీలను ఉత్పత్తి చేస్తున్నారు. శివాజీ, టెలిఫోన్, చారుబాయి, ఠాకూర్, హిమ్మత్‌లాల్ తదితర కంపెనీలు ప్రతిరోజు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బీడీలను తయారుచేయిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది, కరీంనగర్‌లో లక్షన్నర మంది, మెదక్ జిల్లాలో లక్ష 20 వేల మంది, ఆదిలాబాద్ జిల్లాలో లక్ష మంది, వరంగల్‌లో 30వేల మంది బీడీలు చుడుతూ జీవనం గడుపుతున్నారు.

గూడుపుఠాణిపై సమరం: ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్
కనీస వేతనాల జీవోను సవరించేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకుంటామని ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ చెప్పారు. జీవో 41ని యథాతథంగా అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నామన్నారు.

కాంగ్రెస్‌కు కష్టకాలమే: ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్
జీవోను సవరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పదని ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సిద్ధిరాములు హెచ్చరించారు. సీమాంధ్ర పాలకులు, కాంగ్రెస్ పెద్దలు బీడీ యాజమాన్యాలతో కుమ్మకై్క లక్షలాది మంది తెలంగాణ బీడీ కార్మిక కుటుంబాలను నిలువు దోపిడీ చేయబోతున్నారని ఆయన ఆరోపించారు.

మెజార్టీ సంఘాలపేరిట జీవోను సవరించే కుట్రను అడ్డుకునేందుకు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడాలని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. జీవోను మార్చితే తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీడీ కార్మికుల ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి, కార్మిక మంత్రిని కలిసి మాట్లాడుతామని తెలిపారు.

Take By: T News

Read more...

చంద్రబాబూ ఖబర్దార్..

-కరీంనగర్‌కు రావొద్దు.. ‘తెలంగాణ’ వార్నింగ్
-రెండు కళ్లపై తెలంగాణ మండిపాటు
-వైఖరి తేల్చందే అడుగుపెట్టొద్దు
-తెదేపా నేత పెద్దిడ్డికి హుస్నాబాద్‌లో భంగపాటు
-700 ఆత్మహత్యలు బాబుకు కనిపించలేదా?
-అడ్డుకుని నిలదీసిన తెలంగాణవాదులు
-టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట
-చంద్రబాబును అడ్డుకుంటాం: కోదండరాం స్పష్టీకరణ
-ఆంధ్రా పెత్తనం చాటేందుకే ఆయన పర్యటనలు
-తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలి
-టీడీపీకి స్పష్టత లేనందునే జేఏసీలో కలుపుకోలేదు
-ఆంధ్రా సంపన్న వర్గాల ప్రతినిధులున్నారు
-ఆ నేతలే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ


TRS-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో, రెండు నాల్కల వైఖరితో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వారిని మరింతగా మండిపడేలా చేస్తోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించి చేదు అనుభవాలను ఎదుర్కొన్న చంద్రబాబు కరీంనగర్ జిల్లాలోనూ తిరుగుతానంటే సహించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ముందుగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిడ్డిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణవాదులు నిలదీశారు.

సమైక్యవాద చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో చేపట్టే పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పలువురు నేతలు, యువజన, మహిళా విభాగం కార్యకర్తలు పెద్దిడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు నాయుడికి కనిపించలేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పెద్దిడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబునాయుడు వైఖరిని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన వరంగల్, కరీంనగర్ పర్యటనల్లో తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణ వైఖరిని తేల్చని చంద్రబాబును తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత లేనందునే జేఏసీలో టీడీపీని కలుపుకోలేదని తెలిపారు. ఆంధ్రా పెత్తనం చాటేందుకే బాబు పర్యటనలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలని, లేకుంటే నిరసనలు తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు.

రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకుపోతున్న చంద్రబాబుకు ఇక్కడికి తెలుగుదేశం నాయకులు, ప్రజావూపతినిధులే కవచంగా నిలుస్తున్నారని ఆయన తప్పుబట్టారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులు మన ప్రాంతంలో తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు సహా ఆంధ్రా సంపన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న తెలంగాణ నాయకులు, ప్రజావూపతినిధులే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే నాయకులను కలుపుకుని ఉద్యమించాలని కోరారు

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP