Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, February 25, 2011

Let us Boycott

Come!! Join the Non-Cooperation Movement
We have done everything from fast-unto-deaths, rallies, dharnas, garjanas, rail-rokos, rasta-rokos, vanta-varpu, human chains, bandhs, poojas, homams, walking on knees, walking backwards, sweeping streets, cleaning up vehicles, to protesting in hot sun heads-down and legs-up and with sit-ins in ponds all day. What not, we offered fruits and roses and told Andhrites ‘get-well-soon’. We also attempted seizing collectorates and the secretariat! Yet, we end up here where we were on Nov 29, 2009.
Why? Because although we found the most innovative ways to convey our justified aspirations to the world and almost made it on Dec 9, the Andhra businessmen-politicians did just one thing that mattered – lobbying.


Boycott Seemandhra Products


Telangana Kavitha


Let us Boycott


The goal should be to undermine the strength of our opposition – money and market. Let us re-look at our daily lives and count the number of ways in which we are taking the services/products of our opposition.

We have to design ways to eliminate these from our lives and instead use those created by Telangana brethren.


Boycott Seemandhra Products Boycott Seemandhra Products
 

Electronic Media
Please unsubscribe these, or stop watching these channels, as they are not transparent on Jai Telangana Movement. Let their TRP ratings come down and hit their revenues.

TV9 NTV Sakshi TV



Dairy / Milk Products - Boycott
Please don't purchase Heritage Products.

Boycott Heritage Products - Milk products, Ice Creams stc
http://www.creamlinedairy.com/milkproducts.html


Print Media - Boycott

Boycott Deccan Chronicle


Soaps/Detergents
X-tra and XXX.

Real Estate
Lanco Hills, Kavuri Hills, GMR, JayaBheri

Clubs
Country Club

Shopping - Boycott

Boycott Chandana Brothers Boycott RS Brothers


Hospitals - Boycott

Boycott Medwin Hospitals



Telugu Movies
Stop watching Telugu movies in Theatres . Instead rent DVD/CD and watch at home with family.


Chranjeevi Ramcharan
Boycott Chiranjeevi's son movies
Boycott all the movies produced by Allu Aravind Allu Arjun Boycott Kodala Nani produced movies
Boycott all the movies produced by "Allu Aravind" Boycott all the movies produced by "Kodala Nani"
Mohan Babu Vishnu
Boycott all the movies produced by "Mohan Babu"


AP Govt.
Don't pay the taxes to A.P govt.

Don't drink alcohol Don't pay tax to Seemandhra Govt. Don't pay water bills
Don't drink alcohol Don't pay the taxes Don't pay waterbills


Examples of Boycott

1) When Aamir Khan spoke in favor of the Narmada Bachao Andolan (NBA) on the ills of Sardar Sarovar Dam, with justifiable reason, Gujaratis considered it an Anti-Gujarat position because the dam, they thought, is being built to benefit their state. Gujaratis hence decided to boycott all his movies. So ever since ‘Fanaa’, even as Aamir Khan rules the box office all over the country, he remains boycotted in Gujarat! So much so that the dealers of all TOYOTA INNOVA decided to boycott his images on the promos! Gujarat showed us the way. Let us follow it.

2) When Rajinikanth made comments supporting the Hogenakkal water project, Kannadigas boycotted his movies before he arrived at a compromise!

3) When the Americans invaded the Gulf, Muslim brethren here protested by making our cable operators remove CNN accusing it of carrying American propaganda!


Take By: http://telanganayatra.com/boycott_seemandhra_products.html

Read more...

The big fat lie by Moily



Union Law Minister Veerappa Moily’s statement that
The Bill cannot be taken up Parliament till it is passed by the Assembly.
has come as a surprise to many. Article 3 of Indian Constitution clearly states that the state assembly resolution is not necessary or mandatory for passing a bill in the Parliament.

Following is the step wise procedure as proscribed by the Constitution for formation of the new state.

1. The President of India Must FIRST Refer Telangana State Bill to the AP Assembly.


The President will do this after he receives a request from a member of Parliament requests his recommendation for his bill.

This request can be made either by the MPs from the Party in Power or any other MP.

Article 3 of India Constitution specifically removed this power to create a state from the Government of India and gave it to the President of India.

Article 3 also gave the power, to introduce a Bill to create a State, to every MP in office.

2. The President of India is ASKING for AP Assembly’s “VIEWS” ONLY. And NOT FOR Asembly’s CONSENT.

3. The President Must give a TIME FRAME within which the Assembly can submit its “Views”.

4. THEN ONLY the AP Assembly Shall submit its “Views” or even elect not to submit its views.

5. It is IMMATERIAL whether the AP Assembly submits its Views OR NOT

6. The President, after receiving the AP Assembly’s “Views” or after the expiration of the Time Frame stipulated. MUST ADVISE the Parliament to consider the T Bill for discussion EVEN if the AP Assembly does not submit its views.

7. The Parliament will then vote on it to Approve it – Telangana State.

8. Article 3 of India Constitution deliberately disallowed any requirement for Consent of any Institution of the State concerned – Neither the Assembly, nor the Chief Minister, nor the Political parties, nor the Governor nor the majority population of the State concerned. The Constitution clearly states that the Sovereignity is with the People of the State and NOT with the Government or the Legislature or the Governor of the State.
With this understanding, its very clear that Moily has made a big fat lie. The most unfortunate thing is that even the Country’s Law Minister does not know the Constitution, does not even attempt to learn, does not even think, and above all, does not even care for it. DEMOCRACY.

Read more...

Police officers join Non-Cooperation

Amid growing demands for carving a separate Telangana state out of Andhra Pradesh, staff of a senior police officer in Medak district Thursday joined the on-going non-cooperation movement against the state government.

Employees of the office of the Medak district police superintendent joined the Telangana movement and demanded a bill in parliament for the formation of a separate Telangana state.

Leaders of the Telangana Joint Action Committee (JAC) staged a sit-in outside the police superintendent’s office following reports that he warned employees against joining the movement.

K. Tarakarama Rao appealed to policemen to join other government employees participating in the movement. He told reporters that the policemen in other districts should emulate their counterparts in Medak.
Andhra Pradesh Police chief Aravinda Rao, however, as expected, denied that any police have joined the movement!

Read more...

Open debate on Hyderabad by all party leaders

ABN Andhra Jyothi has conducted an open debate on Hyderabad. A must watch.


Click this Link or Copy and Paste  Watch
http://www.simplytelangana.com/2011/02/25/open-debate-on-hyderabad-by-all-party-leaders/

Read more...

All-party meet to discuss Hyderabad as ‘free zone’

The Supreme Court’s refusal to review its order declaring Hyderabad a “free zone” for recruitments in government jobs triggered a fresh row, with Andhra Pradesh Chief Minister K. Rosaiah Wednesday calling an all-party meeting to decide future course of action.

Rosaiah told the state assembly that he had no objection to passing a resolution urging the central government to bring a constitutional amendment to set aside the Supreme Court order.

Amid strong protests by Telangana leaders of the Telugu Desam Party (TDP), Bharatiya Janata Party (BJP), Communist Party of India (CPI) and Communist Party of India-Marxist (CPI-M), the chief minister called the meeting to discuss the issue.

“Hyderabad is part of sixth zone and not a free zone,” Rosaiah told the agitating members. He, however, said the issue was sensitive and could not be discussed in an open house.

Hyderabad had remained part of zone VI, along with Ranga Reddy, Mahabubnagar, Nalgonda, Nizamabad and Medak districts of Telangana.

Telangana, which comprises 10 districts including Hyderabad, was merged with then Andhra State in 1956 to form Andhra Pradesh. But the people of Telangana were given certain safeguards in appointments under the Gentlemen’s Agreement of 1956 and a subsequent Presidential Order and six point formula.

Following the October order of the Supreme Court, the Telangana Rashtra Samiti (TRS) revived the movement for separate statehood for the region.

The latest judgment came at a time when a five-member committee headed by Justice Srikrishna is looking into the issue of statehood for Telangana.

TRS leader Harish Rao said the court order would cover appointments to 18 departments, including the police. “This will badly affect the interests of Telangana people,” he said.

Read more...

పల్లె పల్లె పట్టాలపైకి ఉద్యమం - మార్చి 1 న పట్టాలపైనే వంటావార్పూ : కోదండరాం పిలుపు

రెండోవారంలో ఈజిప్ట్ తరహాలో హైదరాబాద్ దిగ్బంధం

హైదరాబాద్, ఫిబ్రవరి 25 : పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదంతో మార్చి ఒకటవ తేదీన వినూత్న ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. మార్చి మొదటివారంలో ఈజిప్ట్ తరహా ఉద్యమంతో హైదరాబాద్‌ను దిగ్బంధం చేయనున్నట్టు ్ల తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. మార్చి ఒకటవ తేదీన రైలు మార్గం వె ంట గల పల్లెలనుంచి ప్రజలు తరలివచ్చి పట్టాలపైనే వంటావార్పూ చేస్తారని ఆయన ప్రకటించారు. 24 గంటల పాటు జరిగే ఈ ఉద్యమంలో ఢిల్లీకి ఒక్క రైలును కూడా కదలనివ్వమని ఆయన హెచ్చరించారు.

ఇదివరకు ఎన్నడూ జరగని రీతిలో ఈ రైల్ రోకో ఉద్యమం కోదండరామ్ ప్రకటించారు. జిల్లా జేఏసీలు ఎక్కడికక్కడ మండల జేఏసీ నేతలతో కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనుసరించవలసిన పద్ధతులను చర్చించుకోవాలని, ఎక్కడికక్కడ మండలి జేఏసీలు పల్లె పల్లెకి తిరిగి ప్రచారం చేయాలని, ప్రతి పల్లె పట్టాలపైకి తీసుకురావడమనేది ఈ కార్యక్రమ ఉద్దేశంగా కోదండరాం పేర్కొన్నారు.

రైలు పట్టాల వెంట ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలను మార్చి ఒకటినాడు పట్టాలపైకి తీసుకు వస్తామని, 'పల్లె పల్లె పట్టాలపైకి' అనే ఈ కార్యక్రమంతో కేంద్రానికి ఒక సంకేతాన్ని పంపాలనే ఆలోచనతో ఉన్నామని కోదండరాం చెప్పారు. అందరినీ సమన్వయపరుచుకుని విస్తృతస్థాయిలో గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని, పాదయాత్రలు, మోటారు సైకిల్ ర్యాలీలు ఏది వీలైతే ఆ పద్ధతిలో ప్రచార యాత్రలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పుటు తెలంగాణలో అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం తెలంగాణపై ఒన నిర్ణయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి, ఈజిఫ్టులో ఉద్యమం ఏ రీతిలో జరిగిందో అదే మాదిరిగా మార్చి ఒకటిన ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పట్టాలపైకి కదిలి కేంద్రానికి సంకేతాలు పంపాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నామని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

గురువారం సాయంత్రం ఉద్యోగస్తులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ వచ్చేదాకా సహాయ నిరాకరణ సాగిస్తాం. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని ఉద్యోగులు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఇది మామూలు నిర్ణయం కాదు, తమ జీతం, జీవితం ఏమైనా పర్వాలేదు. తెలంగాణ వచ్చేవరకు పోరాటానికి నిర్ణయం తీసుకోవడమనేది అత్యంత సాహసోపేతమైనదని, ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉద్యమాన్ని బతికించాలని ఉద్యోగస్తులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నందుకు, తెలంగాణా సా«ధనకు కలిసికట్టుగా కదలాలని నిర్ణయించుకున్నందుకు తెలంగాణ ప్రజలందరి తరఫున ఉద్యోగులను అభినందిస్తున్నట్టు ఆయన చెప్పారు.

Read more...

విడిపోతే ప్రాంతేతరులకు పూర్తి రక్షణ ఏబీఎన్ 'ఓపెన్ డిబేట్'లో తెలంగాణ నేతల పూచీ


విడిపోతే ప్రాంతేతరులకు పూర్తి రక్షణ
ఏబీఎన్ 'ఓపెన్ డిబేట్'లో తెలంగాణ నేతల పూచీ
విద్వేష వ్యాఖ్యలు వద్దు.. సీమాంధ్ర నేతల సూచన


అపోహల నివృత్తికి కమిటీ: యాదవరెడ్డి సూచన
హైదరాబాద్‌పై రిఫరెండమ్ కోరాలి: జేసీ
ఆస్తుల పంపిణీ జరగాల్సిందే: హరిరామ జోగయ్య
ప్రజాభిప్రాయం తీసుకోండి: కోడెల
భయాలు అవసరం లేదు: హారీశ్
హైదరాబాద్ సమస్య కాదు: కోదండరామ్
సమైక్యాంధ్రే కావాలి: ఆనం వివేకా
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : రాష్ట్ర విభజన జరిగితే.. హైదరాబాద్‌లో ప్రాంతేతరులకు రాజ్యాంగపరంగా ఎటువంటి రక్షణలు ఇవ్వడానికైనా సిద్ధపడతామని తెలంగాణ నేతలు హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగానికి లోబడి ఉంటామని స్పష్టం చేశారు. భయాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తథ్యమని తేల్చి చెప్పారు. పెట్టుబడులు పెట్టినంత మాత్రాన హక్కులు ఉండవని స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లా విడిపోదామని సూచించారు.

అయితే, హైదరాబాద్‌పై తప్పనిసరిగా రిఫరెండమ్ నిర్వహించాల్సిందేనని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అధ్యక్షతన 'ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి' గురువారం ఇక్కడి ఓ హోటల్‌లో 'ఓపెన్ డిబేట్' చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర విభజనకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ అంశంపై అపోహలు, ఆందోళనలు, విద్వేషాలు తొలగిపోయేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నేతలు సమావేశమై శాశ్వత పరిష్కారం చూపాలన్న అభిప్రాయం చర్చా వేదికలో వ్యక్తమైంది.

చర్చా వేదికను ప్రారంభిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం క్లైమాక్స్‌కు చేరుకుందని, ఏదో ఒకటి తేలిపోవాలని అంతర్గత సంభాషణల్లో చాలామంది అభిప్రాయపడుతున్నారని, కానీ, ఏది జరగాలి? అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారని వివరించారు. తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు, సెంటిమెంట్ బలంగా ఉందని, అదే సమయంలో సీమాంధ్ర ప్రజలు కూడా తేలిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు.

కానీ, ప్రజల ఆలోచనలకు భిన్నంగా పార్టీలు వేటి వ్యూహాలతో అవి ముందుకు సాగుతున్నాయని, దీంతో సామాన్యు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. "సీఎం నుంచి పార్టీల వరకు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని అంటున్నారు. మరి, కేంద్రం ఏ నిర్ణయం ఎందుకు తీసుకోదు? ఎందుకంటే.. అక్కడ వచ్చిన సమస్య.. హైదరాబాద్ గురించి తేల్చమంటున్నారు'' అని తెలిపారు. అభ్యంతరాలు చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని, ఒక్కో అడుగు ముందుకేస్తే వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చని సూచించారు.

ఈ చర్చలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పౌరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి ఆస్తిగా పంచుకోవాలని ఆంధ్రా ప్రాంత నేతలు సూచించగా.. కుదరదని, అది ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. విభజన అనివార్యమైన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఉంటున్న ఇతర ప్రాంతాల ప్రజల సందేహాలు, భయాలను నివృత్తి చేసేందుకు ప్రజా సంఘాలు, పౌరులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి చేసిన ప్రతిపాదనకు పలువురు నేతలు మద్దతు పలికారు.

Read more...

హైదరాబాద్‌పై అటూ ఇటూ! ఏబీఎన్ ఓపెన్ డిబేట్‌లో ఎవరేమన్నారంటే..

సహృదయంతో సహకరించండి: హరీశ్
రాష్ట్రం విడిపోయే సమయం ఆసన్నమైన ఈ తరుణంలో సహృదయంతో సహకరించాలి. హైదరాబాద్ సమస్యను సృష్టించి తెలంగాణవాదుల్లో ఆందోళన రేపవద్దు. హరిరామ జోగయ్య వాదనను ఖండిస్తున్నాం. నెల్లూరువాళ్లు చెన్నైలో, బెంగళూరులో పెట్టుబడులు పెట్టారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టారు. అలా అని ఆ ప్రాంతాలపై హక్కులు కోరతారా? కోరగానే ఇస్తారా? గుజరాత్ విభజన సమయంలో ముంబై ఇవ్వాలన్నారు. ఇచ్చారా?

ముంబైలో పెట్టుబడి పెట్టినంత మాత్రాన హక్కులు రావని గుజరాత్ విభజన సమయంలోనే నెహ్రూ, అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. ఇది హైదరాబాద్‌కు కూడా వర్తిస్తుంది. హైదరాబాద్‌లో ఉంటున్న గుజరాతీలకు లేని భయం మీకెందుకొచ్చింది? రాజకీయంగా తెలంగాణను అడ్డుకోవడానికే అపోహలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోం. కేంద్ర పాలిత ప్రాంతం అన్నది ఆచరణ సాధ్యం కాదు. కేంద్ర పాలిత ప్రాంతమైతే ఎమ్మెల్యేలుండరు.

అభివృద్ధి ఉండదు. సీమాంధ్రవారు కావాలనే అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారు. మేం జాగో భాగో అన్నది తెలంగాణ వ్యతిరేకులను, దోపిడీదారులను. సామాన్యులకు వ్యతిరేకం కాదు. వ్యాపారాలు చేసుకునే వారికి వ్యతిరేకం కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రాజ్యాంగబద్ధంగానే పాలన ఉంటుంది. మేం సామాన్య సీమాం«ద్రుల జోలికి రావడం లేదు. తెలంగాణను అడ్డుకునే పెట్టుబడిదారుల గురించే మాట్లాడుతున్నాం.

మీరు పెట్టుబడి పెట్టింది వ్యాపారం కోసం. మాపై ప్రేమతో కాదు. ఇక విభజన తథ్యం. ఏదో ఒక చోట ముగింపు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను విలీనం చేసుకున్నారు. కాబట్టి అదే తెలంగాణను ఇవ్వండి. మీకేమైనా అనుమానాలు ఉంటే తీరుస్తాం. హైదరాబాద్‌లో ఏ రకమైన రక్షణలు కావాలి? భారత రాజ్యాంగానికి లోబడి ఉంటాం. హైదరాబాద్ సమస్య కొందరిదే. సాగునీటి సమస్య తేలాలి. దానిపై చర్చలు అవసరం.

రిఫరెండం నిర్వహించాలి: జేసీ దివాకర్‌రెడ్డి
తెలంగాణవారు ఎవరో.. తెలంగాణేతరులు ఎవరో ముందు తేల్చాలి. అందుకు నిర్వచనం చెప్పాలి. 'ఆంధ్రావాలా భాగో' అని కేసీఆరే అన్నప్పుడు ఈజీగా ఎలా తీసుకుంటాం? హైదరాబాద్‌పై ఓటింగ్ పెట్టమనండి. రిఫరెండమ్ నిర్వహించాలి. ప్రజలు ఏది చెబితే దానినే పరిగణనలోకి తీసుకోండి. రాయలసీమలో పుట్టిన నన్ను పొమ్మంటే అర్థం ఉంటుంది. హైదరాబాద్‌లో పుట్టిన నా పిల్లలనూ పొమ్మనడంలో అర్థం ఉందా?

ఇక్కడినుంచి వెళ్లడం కుదరదు: కోడెల
ఒక పార్టీలో ఉన్నవాళ్లమే రకరకాలుగా మాట్లాడుతున్నాం. ఏడాదిగా రావణ కాష్టంలా రగులుతోంది. తేల్చాల్సిన వాళ్లు తేల్చడం లేదు. హైదరాబాద్‌లో పెట్టి పెరిగినవాళ్లు ఏం కోరుకుంటున్నారో వారి అభిప్రాయం తీసుకోండి. సీమాంధ్ర నుంచి వచ్చినవారు ఇక్కడ అడుక్కు తింటున్నారు. చెన్నై, బెంగళూరుల్లో ఇతర ప్రాంతాలవారు గౌరవంగా బతుకుతున్నారు. ఈ ప్రాంతాన్ని మనమంతా కలిసి అభివృద్ధి చేసుకున్నాం. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటే కుదరదు.

అభ్యంతరాలను పరిష్కరించాలి: రేవంత్‌రెడ్డి
ఇక్కడ పుట్టినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తే తెలంగాణకు వ్యతిరేకులే. వారిని ఇక్కడి పౌరుల కింద గుర్తించం. ఉద్యమం చివరి దశకు వచ్చింది. నిర్ణయం తీసుకునే ముందు అభ్యంతరాలకు రాజ్యాంగ రక్షణ ఇవ్వాలా? వద్దా? అని పరిశీలించాలి. విడిపోతున్న వారి అభ్యంతరాలను పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. పెట్టుబడిదారుడు ఏ దేశంలో అయినా పెట్టుబడి పెడతాడు. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టినవాళ్లు ఇక్కడి ప్రజలకు రాయితీలు ఏమైనా ఇచ్చారా? రాష్ట్ర విభజన కావాలి. మిగిలినవారి అభ్యంతరాలను పరిశీలించాలి. హైదరాబాద్‌ను కొంతకాలం వారికి కూడా రాజధానిగా ఉంచాలి. ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లకూడదంటే.. లగడపాటి, మేకపాటి, దగ్గుబాటి, రాయపాటి అనే పెట్టుబడిదారులకు ప్రజాస్వామ్యాన్ని కట్టబెట్టకూడదు.

నేను సమైక్యవాదిని: ఆనం వివేకానందరెడ్డి
నేను సమైక్యవాదిని. రాష్ట్ర రాజధాని అనే హైదరాబాద్ వచ్చాం. దీనిపై సెంటిమెంట్, ప్రేమ, అభిమానం ఉంది. హైదరాబాద్ నేతలకే సమస్య. 90 లక్షల జనాభా కలిగిన హైదరాబాద్‌ను నిర్ణయించేది మీరా ప్రజలా? ప్రజలతో ఓటింగ్ పెట్టండి.

తేల్చనిది కాంగ్రెస్, టీడీపీలే: వీరయ్య, సీపీఎం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా లేదా అనేదానిపై ఏకాభిప్రాయం రాదు. తెలంగాణపై తేల్చనిది కాంగ్రెస్, టీడీపీలే. ఏం చేయాలనుకుంటోందో కేంద్రం చెప్పాలి.

అన్నదమ్ముల్లా...: సాంబశివరావు, సీపీఐ
ఆరని చిచ్చులా ఎగసిపడుతోంది. దీనికి పరిష్కారం కావాలి. జాగో భాగోలు తప్పు. విశాలాంధ్ర కోసం నిలబడినవాళ్లు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విడిపోవడం మంచిది. గతంలోకి వెళ్లవద్దు. అన్నదమ్ముల్లా విడిపోదాం.

హైదరాబాద్ సమస్య కాదు: కోదండరామ్
విభజనకు అంగీకరిస్తే హైదరాబాద్ సమస్య కాదు. విభజనకు అంగీకరించడం లేదు కాబట్టే హైదరాబాద్‌ను సమస్యగా చూపిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే మిగతా సందేహాలను పరిష్కరించే సామర్థ్యం అందరికీ ఉంది. అది అప్రధానం. ప్రధాన సమస్య విభజనకు అంగీకరించడమే. ఇక్కడ ఉన్న ఇతర ప్రాంతాల ప్రజల ఆక్షేపణలను పరిశీలిస్తున్నాం

ఆస్తుల పంపిణీ జరగాలి: హరిరామజోగయ్య
1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను వ్యాపార ఒప్పందంగా చూడాలి. ఇద్దరు వ్యాపారుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవాలనుకుంటే ఎవరూ ఆపకూడదు. అయితే, విడిపోవాలని అనుకున్నప్పుడు ఆస్తుల పంపిణీ జరగాలి. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతంపై సీమాంద్రులకు హక్కు లేదు. కానీ హైదరాబాద్‌ను అడిగే హక్కు ఉంది. ఇక్కడ అనేకమంది సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టారు. విడిపోయే సమయంలో పెట్టుబడుల సమస్యను పరిష్కరించాలి. హైదరాబాద్‌ను ఎలా పంచుకోవాలో చర్చించుకోవాలి.

అన్నదమ్ముల్లా విడిపోదాం: నాయిని
1956లో ఏ ప్రాంతాన్ని కలిపారో దానినే విభజించాలని చెబుతున్నాం. అన్నదమ్ముల్లా విడిపోదామని అంటున్నాం. మీ ప్రాంతాన్ని మీరు.. మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుందాం.

రిఫరెండం ఎందుకు?: దిలీప్‌కుమార్, ఎమ్మెల్సీ
తట్టా బుట్టా పట్టుకొని ఎవరు వెళ్లమన్నారు? నెపాలుపెట్టి సాగదీయవద్దు. బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెడితే వాటికి కూడా హైదరాబాద్‌లో హక్కులు కల్పిస్తామా? రిఫరెండం ఏమిటి? ఎందుకు పెట్టాలి? అవకాశం లేని అంశాన్ని ముందుకు తీసుకురావడం మంచిది కాదు.

పౌరుల కమిటీ ఉండాలి: యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
అపోహలు సృష్టించే యంత్రాంగాన్ని ఓడించాలి. రాష్ట్ర విభజన జరిగితే ఎవరికీ ఎలాంటి హానీ జరగదని చెప్పేందుకు పౌరుల కమిటీ ఏర్పాటు చేయాలి. దీనివల్ల అనుమానాలు తీరడమే కాకుండా అపోహలూ తీరిపోతాయి.

ఇదో కుట్ర: శ్రావణ్, టీఆర్ఎస్
హైదరాబాద్ లేని తెలంగాణను ఇవ్వడం అంటే తల్లి స్తనాలను కోసి పాలు తాగమన్నట్లే. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర వారే ఆంధ్రా ప్రజలా? ఇతర జిల్లాల్లో ఉన్న ఆంధ్రా వారికి భయం లేదా? ఇదో కుట్ర. లేని అభద్రతా భావాన్ని కల్పిస్తున్నారు. పొట్టకొట్టాలనుకునే వారికే భయం. పొట్టకూటి కోసం వచ్చే వారికి భయం లేదు.

అందరి బాధ్యత: తీగల కృష్ణారెడ్డి, టీడీపీ
ప్రణబ్ కమిటీ ముందే టీడీపీ తన వాదన చెప్పింది. హైదరాబాద్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ.

రాజీకి సిద్ధపడితేనే..: కఠారి శ్రీనివాస్, లోక్‌సత్తా
హైదరాబాదే సమస్య అయితే కూర్చొని మాట్లాడుకుందాం. ఎంతో కొంత రాజీకి సిద్ధపడకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. హైదరాబాద్‌లోని కోటిమందికి అభివృద్ధి కుంటుపడని పరిష్కారం కావాలి. ఎమ్మెల్యేల కోసం ప్రాంత, ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టవద్దు.

ఏకాభిప్రాయానికి వచ్చాం: ప్రభాకర్, బీజేపీ
బీజేపీ పక్షాన అందరినీ ఒప్పించి ఒకే మాట మీదకు తీసుకొచ్చి ఏకాభిప్రాయానికి వచ్చాం. ఇది ప్రజా ఉద్యమంగా మారింది. విధ్వంసం, విద్రోహం, విద్వేషం లేని రాష్ట్రం తీసుకురావాలనేది మా లక్ష్యం.

వెళ్లిపొమ్మని చెప్పడం లేదు: విమలక్క
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే. ఎవరూ ఎవరినీ వెళ్లిపొమ్మని చెప్పడం లేదు. సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇక్కడ తిష్ట వేశారు. పెట్టుబడులు పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలకు, మాకు ఏ లొల్లి లేదు. పెట్టుబడిదారులతోనే లొల్లి.

ఉమ్మడి రాజధాని సహేతుకం కాదు: కవిత
ఉమ్మడి రాజధాని సహేతుకం కాదు. చండీగడ్ ఒప్పందం విఫలమైంది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని సీమాం«ద్రులు అపోహలు సృష్టిస్తున్నారు. ఉమ్మడి రాజధాని వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలకే ఉపయోగం. అభద్రతాభావానికి గురైన వారికి హక్కులు కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.

హైదరాబాద్ రెండో సమస్య: చలసాని శ్రీనివాస్
ఈ నగర నిర్మాణంలో తెలంగాణతోపాటు ఆంధ్రా ప్రాంత ప్రజల రక్తం ఉంది. మా ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ నగరంపై మాకు హక్కు ఉంది. సామాన్య ఉద్యోగస్తులు భయాందోళనలో ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలి. నీటిపారుదలే తొలి సమస్యే. హైదరాబాద్ రెండో సమస్య.

వివాదాస్పదం చేశారు: కుటుంబరావు, రియల్ ఎస్టేట్ పరిశీలకుడు
స్నేహపూర్వకంగా విభజించే అంశాన్ని వివాదాస్పదం చేశారు. రిఫరెండం అవసరం లేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం స్పందించాలి.

అపోహలు తొలగాలి: కిరణ్, సుచిరిండియా
హైదరాబాద్ అభివృద్ధి కావాలి. ఇలాంటి చర్చా వేదికలు మరిన్ని జరగాలి. అప్పుడే అపోహలు తొలగి .. సమస్య పరిష్కారం అవుతుంది.

ప్రాంతాలుగా విడిపోదాం: బాలలక్ష్మి, ఓయూ
హైదరాబాద్ మాది. ప్రాంతాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసుందాం.

Take By: Andhrajyothi

Read more...

తెలంగాణ బంతి మళ్లీ అసెంబ్లీకే

(సూర్య ప్రధాన ప్రతినిధి)తెలంగాణ బంతి ఢిల్లీ చుట్టూ తిరిగి మళ్లీ రాష్ట్ర శాసనసభకే చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేయాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ తాజాగా స్పష్టం చేయడంతో యుపీఏ సర్కారు వైఖరి తేటతెల్లమవుతోంది. తనను కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో.. శాసనసభలో తీర్మానం చేయవలిసి ఉం దని, ఆలోగా మీరు ఎలాంటి తొందరపాటు చర్యలకు దిగ వద్దని మొయిలీ పలికిన హితవులో ఎంతో గూడార్థం ఇమిడి ఉంది. ఇక దీనితో తెలంగాణ వ్యవహారం మళ్లీ శాసనసభ ముందు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.



నిజానికి ఇప్పటికే తెలంగాణపై సభలో తీర్మానం చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సభను ప్రతిరోజూ స్తంభింపచేస్తుండగా, తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైతం అదే డిమాండ్‌తో ఆందోళన కొనసాగిస్తున్నారు. తీర్మానంపై సీపీఐ, బీజేపీ సైతం పట్టుపడుతున్నాయి. ఆ మేరకు ఆ పార్టీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాయి. అటు కేంద్రం వైఖరి కూడా శాసనసభలోనే తీర్మానం పెట్టాలన్న వాదనకు అనుకూలంగా ఉండటంతో రాష్ర్ట అసెంబ్లీలో తీర్మానంప్రవేశపెట్టడం అనివార్యంగానే కనిపిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, తెలుగుదేశం సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ గత కొద్దిరోజుల నుంచి డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.



తీర్మానం ప్రవేశపెడితే, సమైక్యాంధ్ర-తెలంగాణ వాదానికి శాసనసభలో ఎంత బలం ఉందో అధికారికంగా స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఆ ప్రక్రియపై ఇంకా నాన్చుడు వైఖరి అనవసరమని, ఆలస్యమయ్యే కొద్దీ వివాదాలు మరింత పెద్దవుతాయన్న అభిప్రాయం సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలలో ఉంది. తీర్మానం ప్రవేశపెడితే ఎవరి బలం ఎంతో స్పష్టమవుతుంది కాబట్టి, ఇక ఆ తర్వాత సభను సజావుగా నడిపించుకోవచ్చని, ప్రజా సమస్యలపైనా చర్చించే అవకాశం వస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సభ సజావుగా జరిగే పరిస్థితి లేదని, ఒక్క అంశంపైనా చర్చ జరగకుండా ప్రతిరోజు సస్పెన్షన్లు, ప్రతిబంధకాలు ఎదురవుతున్న వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల తమకు స్థానికంగా నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



సభలో తీర్మానం ప్రవేశపెడితే ఆ తర్వాత టీఆర్‌ఎస్‌-తెలుగుదేశం సభ్యులకు ఇక అంశమే ఉండదని స్పష్టం చేస్తున్నారు. తీర్మానం ఫలితం వెలువడిన తర్వాత మళ్లీ ఆ అంశంపై మాట్లాడేందుకు వారు సైతం నైతికంగా-సాంకేతికంగా సాహసించరని చెబుతున్నారు. సభలో ఫలితం సమైక్యాంధ్రకు అనుకూలంగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా ఆ తర్వాత దాని ఆమోదం-చర్చ అంతా ఢిల్లీకి చేరుతుందని వివరిస్తున్నారు. అప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని, తెలంగాణ-సమైక్యాంధ్ర కోరుకునే పార్టీలు ఇక ఢిల్లీలో ఉద్యమాలు, లాబీయింగ్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు.



ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అనుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. మొయిలీ వ్యాఖ్యలు పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ నాయకత్వ వైఖరి కూడా తీర్మానం ప్రవేశపెట్టేందుకే అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. చివరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సైతం.. తనను కలసిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో ఏకాభిప్రాయం రావడం లేదని వ్యాఖ్యానించడం చూస్తే తెలంగాణ అంశం మళ్లీ శాసనసభ గడప తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.దీనికి సంబంధించి అధిష్ఠానం ముఖ్యమంత్రికి స్పష్టమైన విధాన నిర్ణయం నిర్దేశించనున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం. శాసనసభలో తీర్మానం ప్రవేశపెడితే, అక్కడ తెలంగాణకు సానుకూలత లభించలేదు కాబట్టి, దానిపేరుతో తెలంగాణ అంశాన్ని మరికొంతకాలం సాగదీయవచ్చని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.



ఎన్నికల తర్వాత అఖిలపక్షం

తెలంగాణ అంశంపై రాష్ట్రానికి చెందిన అఖిలపక్షంతో కేంద్రప్రభుత్వం చర్చలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అప్పటివరకూ తెలంగాణ అంశంపై దృష్టి సారించకూడదని ప్రాధమిక నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. వచ్చేనెల 1న లోక్‌సభలో తెలంగాణపై చర్చ జరగనున్నందున, దాని కొనసాగింపు ప్రక్రియను మరికొంతకాలం సాగదీయవచ్చన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్లిష్ట సమయంలో అఖిలపక్షం ఏర్పాటుచేస్తే కొత్త సమస్యను కోరి తెచ్చుకున్నట్లేనని, దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించవలసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికీ అంత సమయం లేకపోవడం, సీనియర్‌ మంత్రులు బిజీగా ఉండటంతో పాటు.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అఖిలపక్షాన్ని పిలవడం వ్యూహాత్మకంగా సరైనది కాదని కాంగ్రెస్‌ నాయకత్వం కూడా భావిస్తున్నందున, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాతనే అఖిలపక్షం నిర్వహించవచ్చంటున్నారు.

Read more...

రణరంగం


సూర్యాపేట, : తెలంగాణ జేఏసి నాయకుల పై ఎమ్మేల్యే దామోదర్‌రెడ్డి వర్గీయులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఎమ్మేల్యే ప్రధాన అనుచరులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్‌, బైరు వెంకన్న ల ఆధ్వర్యంలో ఈ దాడికి పూనుకొని విచక్షణా రహితంగా చితకబదారు. ఈ దాడిలో జేఏసి కన్వీనర్‌ కుంట్ల ధర్మార్జున్‌, టిఆర్‌ఎస్‌ నాయ కులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, గండూరి రమేష్‌, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన డిఇఓ పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మేల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హజరుకావల్సి ఉన్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లేక్సీలు, బ్యానర్‌లను జేఏసి నాయకులు సీమాంధ్ర వ్యక్తికి సన్మానమా అంటూ వాటిని చింపివేశారు.



ఆ ప్లేక్సీల పై దామోదర్‌రెడ్డి ఫోటోలు ఉండటంతో దామోదర్‌రెడ్డి వర్గీయులు జేఏసి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరాహార దీక్ష టెంట్‌ను కూల్చివేశారు. ఈ సంఘటనతో జేఏసి నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాం వద్ద నిరసన తెలుపుతుండగా తిరిగి ఎమ్మేల్యే వర్గీయులు అక్కడికి చేరి జేఏసి నాయకుల పై దాడి చేశారు. దీంతో జేఏసి నాయకులు పరారైయ్యారు. తెలంగాణ వాదుల పై దాడికి నిరసనగా నేడు సూర్యాపేట బంద్‌కు జేఏసి పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహాకరించాలని కోరారు. స్వచ్చందంగా బంద్‌లో పాల్గొని తెలంగాణ వాదాన్ని చాటాలని కోరారు.జేఏసి నాయకులు ఇచ్చిన బంద్‌ పిలుపును అడ్డుకుంటామని దామోదర్‌రెడ్డి అనుచరుడు కొప్పుల వేణారెడ్డి తెలిపారు. వ్యాపార సంస్ధలు మూసివేయవద్దని, బంద్‌లో ప్రజలు పాల్గొనవద్దని కోరారు

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP