Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, November 24, 2011

Maoist leader Kishenji killed in West Bengal

Elusive Maoist leader Kishenji was on Thursday killed in an encounter with the joint forces at Burisole forest in West Midnapore district, a day after he narrowly escaped from there. 


The body of 58-year-old Molajula Koteswar Rao, better known as Kishenji, was found and identified after the “Jungalmahal encounter”, a top counter-insurgency force official said. 
 

After receiving specific information that he and some of his associates and Suchitra Mahato, the wife of a slain leader he was living with, were hiding in the Kushboni jungle, the area was cordoned off and an encounter ensued after breaking the four tiers of security that Kishenji had, the official said. 


It was from Kushboni forest that the Maoist Polit Bureau member, the second in-command of the outfit and in-charge of military operations in Jungalmahal since 2009, and Suchitra had eluded the joint forces on Wednesday. 


The encounter which began this morning at Burisole jungle in Jamboni police station area was close to Kushboni near the Jharkhand border. 


The official said Kishenji’s body was identified by the AK-47 rifle he was carrying. Suchitra and others fled. 


A laptop bag, some letters written by Kishenji and Suchitra and a few important documents were earlier seized by the joint forces from Gosaibandh village nearby. 

Read more...

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఎన్‌కౌంటర్



Amint-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకోల్‌కత : మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత కిషన్‌జీని పోలీసలు కాల్చి చంపారు. పశ్చిమబెంగాల్‌లో రాష్ట్రం పశ్చిమ మిడ్నాపూర్‌లోని సాల్పోనీలో కిషన్‌జీని పోలీసులు కాల్చిచంపారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు కూడా ధృవీకరించారు. కుష్బునీ అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందినట్లు తెలుస్తోంది. కిషన్‌జీ అసలు పేరు మల్లోజులు. మల్లోజులుతోపాటు మరో నలుగురు మావోయిస్టులు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజులు మావోయిస్టు ఉద్యమంలో తొలితరానికి చెందిన వ్యక్తి. సిరిసిల్లలో ఇంటర్, కరీంనగర్‌లో డిగ్రీ చేశాడు. ఉస్మానియాలో న్యాయశాస్త్రం చదువుతూ మధ్యలో ఆపేశాడు. 1956 లో కిషన్‌జీ జన్మించారు. ఉద్యమంలో తిరుగులేని నేతగా మల్లోజుజుల కోటేశ్వరరావు ఒక వెలుగు వెలిగారు. ఉద్యమంలో ఆయన రాజీలేని పోరాటం చేశారు. ప్రభుత్వాలు జనం గొంతు నొక్కినంతకాలం ఆయుధాలు వదలమని ఎన్నోసార్లు కిషన్‌జీ విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ కోసం కిషన్‌జీ తన జీవితాన్ని ధారపోసారని చెప్పవచ్చు. 1975లో ఆయన ఉద్యమంలోకి అడుగు పెట్టారు. కిషన్ జీ తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. కిషన్‌జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్‌రావ్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. కిషన్ జీ మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. పార్టీలో ముప్పాళ్ల గణపతి తరువాత కిషన్ జీదే అగ్రస్థానం.

తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఓ నాటకమని, దాన్ని బహిష్కరించాలని కిషన్‌జీ గతంలో పిలుపునిచ్చారు. కమిటీల పేరుతో తెలంగాణ అంశాన్ని కేంద్రం అటకెక్కించిందని కిషన్‌జీ చెప్పారు. తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర నేతలు చేసిన రాజీనామాలను ఆయన పవర్ పాలిటిక్స్‌లో భాగమేనని చెప్పారు. 

Take By: http://www.namasthetelangaana.com/News/article.asp?Category=1&subCategory=1&ContentId=47700

Read more...

ఒకే నినాదం జై తెలంగాణ

లోక్‌సభలో తెలంగాణం

- రెండోరోజూ కొనసాగిన నిరసనలు
- నేడు మళ్లీ టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
- తెలంగాణకు మద్దతిస్తాం.. కేసీఆర్‌కు శరద్‌పవార్ హామీ
- నల్లధనంపై నేడు చర్చ
- సర్కారు, బీజేపీ మధ్య అవగాహన
- సుష్మ, ప్రణబ్ ముఖర్జీ మంతనాలు
- రాత్రి పొద్దుపోయాక ఒప్పందం!
- ధరల పెరుగుదలపై సోమవారం చర్చ?



PPPp-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 23 (): అవినీతి, అధిక ధరలు, నల్లధనం అంశాలపై నిరసనలతో ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో రెండో రోజు కూడా తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. అధిక ధరలపై చర్చకు అనుమతినివ్వాలని వామపక్షాలు పట్టుపట్టగా తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై ఆ ప్రాంత ఎంపీలు పట్టువీడలేదు. బుధవారం సభ ప్రారంభమైనప్పటి నుంచి మరుసటి రోజుకు సభ వాయిదా పడేంతవరకూ తమ నిరసన కార్యక్షికమాలను కొనసాగించారు. అత్యం త ప్రాధాన్యం గల తెలంగాణ అంశాన్ని చర్చించాల్సిందేనని పట్టుబడుతూ టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతితో పాటు కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాల సమయంలో తమ తమ స్థానా ల్లో నిలబడి నిరసన తెలిపిన ఎంపీలు, సభ అధికారిక కార్యక్షికమాలను అనుమతిస్తున్నానని స్పీకర్ మీరా కుమార్ ప్రకటించిన వెను తెలంగాణ అంశాన్ని చర్చించాలని పట్టుబట్టారు.

తామిచ్చిన వాయి దా తీర్మానంపై చర్చకు అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్‌ను పదేపదే కోరారు. చర్చకు అనుమతి నిరాకరించడంతో వారిరువురూ వెల్‌లోకి వెళ్లి, తమ నిరసనను కొనసాగించారు. ‘పార్లమెంటులో తెలంగాణ బి ల్లును ప్రవేశపెట్టండి’ అని రాసి ఉన్న ప్లకార్డులతో కాం గ్రెస్ ఎం పీలు కూడా వెల్‌లోకి చేరారు. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌డ్డి, మందా జగన్నాథం, రాజయ్య, బలరాంనాయక్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, మధు యాష్కీ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసేంత వరకు సభను కొనసాగనివ్వబోమని టీడీపీ ఎంపీ రమేష్ రాథోడ్ వారితో జత కలిశారు. అదే సమయంతో అధిక ధరలపై చర్చించాలని లెఫ్ట్ సభ్యులు సైతం వెల్‌లోకి రావడంతో సభలో గందరగోళం నెలకొంది.

సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సభాపతి పదేపదే విజ్ఙప్తి చేసినప్పటికీ పరిస్థితులు కుదుటపడకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో తెలంగాణ నినాదాలు మారుమోగినంత సేపు ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రేక్షక పాత్ర పోషించారు. తమ పార్టీ ఎంపీల చేతుల్లోని తెలంగాణ ప్లకార్డులు చదవటానికే పరిమితమైన వారు సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదు. సభ వాయిదాతో తెలంగాణపై బుధవారం నాటి తమ వాయిదా తీర్మానం చర్చకు రాకపోవడంతో టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం మరో వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌కు అందించనున్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల నాలుగున్నర కోట్ల ప్రజల్లో నెలకొన్న అశాంతి, ఆందోళన’’పై చర్చకు ఆ పార్టీ ఎంపీలు పట్టుపట్టనున్నారు. సభ ప్రారంభానికి ముందే ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. 600 మంది ప్రాణ త్యాగాలు గుర్తించైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు.

నేడు నల్లధనంపై చర్చ?
ఇదిలా ఉండగా.. నల్లధనంపై చర్చ విషయంలో ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తున్నది. గురువారం వీరి మధ్య ఒక ఒప్పందం జరగనున్నట్లు సమాచారం. దీంతో గురువారం నుంచి సమావేశాలు సజావుగా సాగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. నల్లధనం అంశంపై బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై గురువారం చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో సభా నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ జరిపిన సమావేశంలో ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్న వామపక్షాలు.. తాజా పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

దీంతో ప్రత్యేకంగా ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తున్నాయి. ధరల పెరుగుదల అంశంపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. అటు డీఎంకే సభ్యులు డ్యామ్ 999 అనే త్రీడీ సినిమా విడుదలను అడ్డుకోవాలని పట్టుబట్టారు. ఎన్సీపీ సభ్యులు ఉల్లిపాయల ఎగుమతులపై పరిమితులు ఎత్తివేయాలని కోరుతూ తమ తమ స్థానాల్లో నిలిచి నినాదాలు చేశారు. ఈ అంశాలు కూడా తోడవడంతో బుధవారం నాడు ఉభయ సభల్లోనూ ఎలాంటి కార్యక్షికమాలు సాగలేదు. తీవ్ర గందరగోళ పరిస్థితులు కనిపించాయి.



Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News,
Lok Sabha,  

Read more...

తెలంగాణ కోసం ఎప్పుడో తీర్మానం చేశాం: పవార్

సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు చేరుకున్న టీఆర్‌ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి తెలంగాణకు ప్రభుత్వ, మిత్రపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణకు మద్దతివ్వాలని కేసీఆర్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ తమకు తో డ్పాటునివ్వాలని కోరా రు. దానికి సానుకూలం గా స్పందించిన పవార్ తెలంగాణకు అనుకూలంగా తన వైఖరిని ఏనాడో స్పష్టం చేశానన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

తెలంగాణ ఇవ్వాలని సోనియాకు పవార్ గతంలోనే స్పష్టం చేశారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీలు ఇద్దరు ముగ్గురు సభ్యులున్న చిన్న పార్టీల నాయకులతో చర్చించారు. తెలంగాణ కోసం జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రక్రియలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో సెంట్రల్ హాల్‌కు చేరుకున్న టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ నిరసన కార్యక్షికమాలను సమీక్షించుకున్నారు. తాము రెండు రోజులుగా సభ లోపల, వెలుపల నిరసన తెలిపినా అధిష్ఠానం పట్టించుకోకపోవడంపై వారు కొంత అసంతృప్తికి లోనయ్యారు. గత శీతకాల సమావేశాల మాదిరిగా పార్టీ పెద్దలు తమను సంప్రంతించి తెలంగాణపై ప్రకటన చేస్తారన్న నమ్మకంతో నిరసనలను కొనసాగించాలని భావించారు. అధిష్ఠానం ప్రతిస్పందనలను బట్టి నిరసన కార్యక్షికమాల తీవ్రత పెంచడమో తగ్గించడమో చేయాలని నిర్ణయించారు. ఎక్కడా పార్టీని ధిక్కరించేటట్లు వ్యవహరించకుండా తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలన్న తపనను వ్యక్త పరచాలని వారంతా నిశ్చయించుకున్నట్లు సమాచారం.

Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP