Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, January 17, 2012

గిలానీకి ఊరట



raza_gilani telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema-ప్రజాస్వామ్యానికే పాకిస్థాన్ పార్లమెంట్ ఓటు
-విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రధాని.. మూడింట రెండొంతుల మెజారిటీ
-19న సుప్రీంకోర్టుకు హాజరవుతా: గిలానీ ప్రకటన
-రాజీనామా చేయరన్న పీపీపీ నేత
-నష్టనివారణ చర్యల్లో అధికార పక్షం
-కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటన
-‘ధిక్కారం’ కేసులో 19న హాజరవ్వాలని గిలానీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశం
-ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
-జర్దారీని కలిసిన గిలానీ
-స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్


మెమోగేట్ కుంభకోణం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సైన్యం ఓవైపు.. అవినీతి కేసులను తిరిగి తెరిచే విషయమై నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు మరోవైపు.. ప్రజలను గాలికొదిలేసి, నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్న ప్రతిపక్షాలు ఇంకోవైపు.. ముప్పేట దాడిలా చుట్టుముట్టిన సమస్యలతో, నిత్యం మనుగడ ప్రశ్నార్థకమైన పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య అనుకూల తీర్మానాన్ని పార్లమెంట్ దిగువ సభ సోమవారం రాత్రి మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించింది. దీంతో యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వానికి ఊరట లభించింది. వారం రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు సుప్రీంకోర్టు గిలానీకి కోర్టు ధిక్కార నోటీసు జారీచేయడంతో ఆయన ఇక పదవి నుంచి దిగిపోవడం ఖాయమనిపించింది. కానీ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం ఆయనలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా గిలానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇవాళ చాలా మంచి రోజని అభివర్ణించారు. పార్లమెంట్ రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాస్వామ్యమే అన్నింటికన్నా గొప్పదని అన్నారు. సర్వాధికారాలు గల పార్లమెంట్‌కే అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. మిలిటరీ, న్యాయవ్యవస్థలతో తమకు విభేదాలున్నా ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కూడా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతానని, కోర్టు ధిక్కారం కేసులో బేషరతు క్షమాపణ చెబుతానని అన్నారు.


supreme-court_PK telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇస్లామాబాద్, జనవరి 16:రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం చుక్కెదురైంది. ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోపాటు మరో ఎనిమిది వేల మందిపై అవినీతి ఆరోపణల కేసులను తిరిగి తెరవాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదో ఈ నెల 19వ తేదీన తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణను జస్టిస్8 నజీర్ ఉల్ ముల్క్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. తమ ఆదేశాలను పాటించాలంటూ సుప్రీంకోర్టు గిలానీకి పలుమార్లు గుర్తుచేసినా ఆయన కావాలనే పెడచెవిన పెట్టారని, అందువల్ల తనపై కోర్టు ధిక్కార విచారణను ఎందుకు చేపట్టకూడదో ఆయన చెప్పాలని పేర్కొంది.

ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
అవినీతి కేసులను తిరిగి తెరవాలంటూ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ అందలేదని అటార్నీ జనరల్(ఏజీ) అన్వర్‌ఉల్‌హక్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనకు చీవాట్లు పెట్టింది. తమ ఆదేశాలకు ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో తమకు ఎందుకు తెలియజేయలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలను దేశ అధ్యక్షుడికి, ప్రధానికి, ఇతర అధికారులకు తెలిపానని, వారి నుంచి తనకు ఎలాంటి స్పందనలూ రాలేదని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలిస్తోందని ఏజీ.. కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముల్క్.. ఏజీపై మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలపటం, వారి స్పందనలను కోర్టుకు చెప్పటం మీ బాధ్యత కాదా?, ఇందులో మీరు కొత్తగా చేస్తున్నదేమిటి? అని సూటిగా ప్రశ్నించారు.

ఏదేమైనా కేసులను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వ ఆదేశాలు కావాలని తేల్చిచెప్పారు. అనంతరం విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత ఏజీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేలా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అయితే ఈ సమయంలో అలాంటిదేమీ చేయొద్దని ధర్మాసనం ఏజీకి సూచించింది. అనంతరం గిలానీకి నోటుసు జారీ చేసింది. ‘కోర్టు ఆదేశాలను గిలానీ అమలుచేయనందునే ఆయనకు ఈ నోటీసు జారీచేశాం’ అని ముల్క్ విలేకర్లకు చెప్పారు. మెమోగేట్ కుంభకోణం విషయమై ఇప్పటికే సైన్యంతో ముఖాముఖి తలపడుతూ అస్థిత్వ ప్రమాదం ఎదుర్కొంటున్న పాక్ సర్కారు పరిస్థితిని సుప్రీంకోర్టు తీర్పు మరింత దిగజార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కాగా పాక్ ప్రధానికి కోర్టు ధిక్కార నోటీసులు రావడం ఇది రెండోసారి. 1997 నవంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కూడా ఈ తాఖీదులు అందాయి.

జర్దారీతో గిలానీ భేటీ
సుప్రీంకోర్టు నోటీసు, పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో ప్రధాని గిలానీ.. అధ్యక్షుడు జర్దారీ, అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అగ్రనేతలతో సోమవారం భేటీ అయ్యారు. కోర్టు నోటీసు జారీచేసిన కొద్దిసేపటికే ఆయన జర్దారీని కలిశారు. ప్రస్తుత పరిస్థితిని ఆయనతో చర్చించారు. అనంతరం పీపీపీ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ కమిటీతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జర్దారీ కూడా హాజరయ్యారు. కోర్టు నోటీసుపైన, సాయంత్రం పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌పైన ఈ భేటీలో చర్చించారు. సైన్యంతో జగడం, కోర్టు నోటీసుల వల్ల రాజకీయంగా వాటిల్లే నష్టాన్ని నివారించేందుకు గిలానీ చేత రాజీనామా చేయించాలని పీపీపీ అగ్రనేతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.

రాజీనామా చేస్తానన్న గిలానీ!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని గిలానీ అన్నట్లు వార్తలొచ్చాయి. తన రాజీనామా ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను సుస్థిర పరుస్తుందంటే పదని నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు ఆర్మీ న్యూస్8 చానెల్ తెలిపింది. గిలానీ దిగిపోతే కొత్త ప్రధానిగా పీపీపీ నేత ఖమర్ జమాన్ ఖైరా, ఆధ్యాత్మిక వ్యవహారాల మంత్రి ఖుర్షీద్‌షా, కీలక భాగస్వామ్య పక్షం(పీఎంఎల్-క్యూ) నేత పర్వేజ్‌ఇలాహీల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఈ మీడియో పేర్కొంది. కానీ ఆ వార్తలను అవామీ నేషనల్ పార్టీ చీఫ్ ఖండించారు.

ప్రధానితోపాటు కోర్టుకు వెళ్లనున్న పీపీపీ నేతలు
పీపీపీ నేతలు, భాగస్వామ్యపక్షాల నాయకులు ఈ నెల 19న ప్రధాని గిలానీతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి మౌలాబుక్స్ చందోలియా తెలిపారు. గిలానీ ప్రభుత్వం తన పూర్తికాలం అధికారంలో ఉంటుందని చెప్పారు. తమపై జరుగుతున్న ఈ కుట్రలల్నీ భగ్నమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కోర్టు నోటీసును స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్
ప్రధాని గిలానీకి సుప్రీంకోర్టు నోటీసు జారీచేయటాన్ని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. యావద్దేశం కూడా న్యాయస్థానం ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. ‘సామాన్యుల సాధకబాధకాలను తీర్చాల్సిన పాలకులు నేరస్తులను కాపాడేందుకు కృషిచేస్తున్నారు. ఈ మేరకు న్యాయవ్యవస్థను కూడా భష్ఠుపట్టించాలని చూస్తున్నారు. జర్దారీని రక్షించేందుకు వారు ఎంత మంది న్యాయవాదులను, న్యాయమూర్తులను మోహరించినా ప్రజలంతా దేశ అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకంతో ఉన్నారు’ అని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.

సమాచారం ఇచ్చేందుకు బ్లాక్‌బెర్రీ నో
మెమోగేట్ కుంభకోణానికి సంబంధించి పాక్-అమెరికా వ్యాపారి ఇజాజ్, అమెరికాలో అప్పటి పాకిస్తాన్ రాయబారి హుస్సేన్ హక్కానీలు తమ నెట్‌వర్క్ ద్వారా ఇచ్చిపుచ్చుకున్న సమాచారాన్ని వెల్లడించేందుకు బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్(రిమ్) నిరాకరించింది. వినియోగదారుల అనుమతి లేకుండా ఈ వివరాలను తాము బయటపెట్టలేమని తేల్చిచెప్పింది. ఈ కేసును విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్‌కు ఈ విషయాన్ని ఏజీ తెలిపారు. హక్కానీ ఉపయోగించిన రెండు బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు అమెరికాలోని అతని కార్యాలయంలోగానీ నివాసంలోగానీ దొరకలేదని కూడా చెప్పారు.

ఏమిటీ మెమోగేట్?
ఒసామా బిన్ లాడెన్ హతమైన అనంతరం పాక్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం కుట్ర పన్నుతోందని అధ్యక్షుడు జర్దారీ భయపడ్డారు. ఈ కుట్రను నిలువరించేందుకు అమెరికా సాయం కోరారు. ఈ మేరకు సంతకంలేని ఓ మెమో పంపారు. జర్దారీ తరఫున హక్కానీ రాసిన ఆ లేఖను ఆయన ఆదేశాల మేరకే తాను అమెరికాకు అందజేశానని పాకిస్తానీ-అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్‌ఇజాజ్ బహిరంగంగా చెప్పారు. ఇది వివాదాస్పదమవడంతో హక్కానీ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

‘మెమో’ దర్యాప్తునకు ఇజాజ్ డుమ్మా
మెమోగేట్ కుంభకోణంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఇజాజ్ ఈ కేసుపై సోమవారం జరిగిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తునకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిషన్ ముందుకు భద్రతా కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ నెల 25వ తేదీ దాక తనకు గడువు ఇవ్వాలని కోరారు. కమిషన్ మూడోసారి సోమవారం భేటీ అయిన కొద్దిసేపటికే ఇజాజ్ తరఫు న్యాయవాది అక్రమ్‌షేఖ్ ఈ విషయాన్ని కమిషన్‌కు తెలిపారు. కుంభకోణంలో.. ఇజాజ్, హక్కానీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న సమాచారాలను వెల్లడించేందుకు రిమ్ నిరాకరించిన నేపథ్యంలో ఇజాజ్ గైర్హాజరీ ప్రధాన్యం సంతరించుకుంది.

ఇజాజ్, హక్కానీ, పాషాలకు సమన్లు
జ్యుడీషియల్ కమిటీ దర్యాప్తునకు గైర్హాజరైన ఇజాజ్‌కు పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 26న జ్యుడీషియల్ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. మీరు కూడా 23వ తేదీన హాజరై వాంగ్మూలాలు ఇవ్వాలని హక్కానీ, ఐఎస్8ఐ చీఫ్ అహ్మద్‌షుజాపాషాలకు కూడా పార్లమెంటరీ కమిటీ సమన్లు ఇచ్చింది.

‘ముషారఫ్ తల’కు నూటొక్క మిలియన్లు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌ను హతమార్చిన వారికి పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని బలోచిస్తాన్ జాతీయ నేత అక్బర్‌బుగ్తి మనవడు షాజైన్‌బుగ్తి ప్రకటించారు. నగదు బహుమతితోపాటు వంద మిలియన్ల విలువైన బంగ్లాను కూడా ఇస్తామని విలేకర్లకు ఆదివారం చెప్పారు. 2006లో ముషారఫ్ ఆదేశాలతో బలోచిస్తాన్‌లోని కుహ్లు జిల్లాలో జరిగిన మిలిటరీ ఆపరేషన్‌లో అక్బర్‌బుగ్తి మృతిచెందారు?

ఏ సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదు
-‘ఎన్నార్వో’ తప్పు చేసింది ఎవరు: గిలానీ

ఇస్లామాబాద్, జనవరి 16: పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రధాని గిలానీ మాట్లాడుతూ సైన్యంగానీ న్యాయస్థానాలుగానీ వ్యవస్థను గాడితప్పించేలా వ్యవహరించకూడదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మెమోగేట్ కుంభకోణం, అవినీతి కేసుల విషయంలో సైన్యం, సుప్రీంకోర్టు ప్రభుత్వంతో వ్యవహరించిన తీరును గిలానీ ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉంది. కోర్టులపై మాకు పూర్తివిశ్వాసం ఉంది. అందుకే ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతాను. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంపై ఓటు విషయంలో మేము ఏ వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోలేదు. జర్దారీకి రాజ్యాంగం రక్షణకవచంలా ఉంది. సర్కారును నిందించేవారు.. అవినీతి కేసుల నుంచి నిందితులను కాపాడేలా జాతీయ సయోధ్య ఉత్తర్వులు (ఎన్‌ఆర్‌ఓ) రూపొందించినవారిపై ఎలాంటి చర్యలూ కోరకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని గిలానీ.. ముషారఫ్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఎన్‌ఆర్‌ఓను ఎవరు తెచ్చారు. ఆ తప్పు మేం చేయలేదు. ఆ పొరపాటు చేసినవారు ఇప్పుడు దేశం బయటున్నారు. మళ్లీ ఇప్పుడు దేశంలోకి రావాలనుకుంటున్నారు’’ అని పాక్‌లోకి మళ్లీ రావాలనుకుంటున్న ముషారఫ్ ప్రయత్నాలను గిలానీ ఎండగట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని ప్రపంచానికి చాటేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.

Take By: T News

Read more...

తెలంగాణ కాంగ్రెస్ పెద్దల దొంగాట



CMpostlist telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema -నాలుకలు మడతేస్తున్న నేతలు
-ముఖాలూ మార్చేస్తారు!
-అధికారమే పరమావధిగా మంత్రులు
-అభివృద్ధి నిధులతో ఎమ్మెల్యేలు
-ప్రలోభాలతో అందరూ కామోష్!
-తెలంగాణ ఉద్యమం బలిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను
-సీఎం రేసులో ఆరుగురు

ఈ నేతలకు రెండు నాల్కలే కాదు.. రెండు ముఖాలు కూడా! తెలంగాణ ఉద్యమం విషయంలో నాల్కలు మడతేయడమే కాదు.. ముఖాలూ మార్చేయగల నైపుణ్యం వీరి సొంతం! ఒక నాలుక తెలంగాణ ఉద్యమం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది! మరో నాలిక పార్టీ అధిష్ఠానం వద్ద వక్రభాష్యాలు చెబుతుంది! ఒక ముఖం ఉద్యమ శ్రేణుల ఎదుట వీర గంభీరంగా కనిపిస్తుంది.. మరొకటి నాలుగు గోడల మధ్య.. పార్టీ పెద్దల ముందు ముడుచుకుని కూర్చొంటుంది! అధికారం వీరి పరమావధి! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇందుకు వారధి! పదవులు ఓ లెక్క కాదంటారు.. కానీ వారి లెక్కలన్నీ పదవుల చుట్టూనే తిరుగుతుంటాయి! సచివాలయం దరిదాపులకు వెళ్లేది లేదని భీకర వచనాలు చెబుతారు.. కానీ.. ఇంటికే ఫైళ్లు తెప్పించుకుని సీఎం మెప్పు పొందేలా సంతకాలు బరికేస్తారు! ఉద్యమంలో దూకుతామంటారు.. ఇచ్చేది.. తెచ్చేదీ తమ పార్టీయేనంటారు.

నిర్ణయాత్మక దశలో మాత్రం పత్తా లేకుండాపోతారు! ఉద్యమ శ్రేణులు సెగ పెట్టినా తట్టుకుంటారు.. కానీ.. అధిష్ఠానానికి ఆ సెగ తీవ్రతను చెప్పడానికి ఇష్టపడరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలని ఒకసారి, అమ్మకు ఒంట్లో బాలేదని ఒకసారి, పండుగలు పబ్బాలని మరోసారి, ఆజాద్ చర్చిస్తున్నారని ఇంకోసారి, ఇదిగో కోర్ కమిటీ సమావేశం అదిగో సీడబ్ల్యూసీ భేటీ.. అంటూ ఎప్పటికప్పుడు తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల బూచిని ముందుకు తెస్తూ అధిష్ఠానం దోబూచులాడుతుంటే.. నిలువరించే సత్తా లేక.. అధిష్ఠానా నికే జీ హుజూర్..
అంటూ సాష్ఠాంగపడిపోయిన నేతలు! ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ వాళ్లను మోసం చేయడం.. తెలంగాణ ప్రాంత నేతలుగా తమకు తెలిసినంత మరెవరికీ తెలియదని ఢంకా బజాయించి మరీ చెప్పగలిగే నేతాక్షిగేసరులు! వీరిలో కొందరిది మరీ అత్యాశ! ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే వీరి కన్ను! సీఎం కుర్చీ అప్పగిస్తే ఉద్యమం అణచివేతలో తడాఖా చూపిస్తామని అధిష్ఠానం వద్ద తొడలు కొడతారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ను మార్చేస్తారన్న ఊహాగానాలతో.. ఉద్యమం ముసుగులో సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసుకుని.. కలలు కంటున్నారు! పదేళ్లుగా ఈ నేతల తీరిదే. ప్రత్యేకించి గత రెండేళ్లుగా మహోధృతంగా సాగుతున్న మలి విడత తెలంగాణ పోరాటంలో వీరిది ప్రతినాయక పాత్రే! ఇదీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకుల ద్రోహ చరిత్ర! అనేకానేక మంది నేతలు.. ఎన్నదగినవారు కొందరు! జానాడ్డి, జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, జే గీతాడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య! వీరు మచ్చుకే! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ రాజకీయ స్వలాభం కోసం తాకట్టు పెట్టిన పెద్దలు! సీమాంధ్ర పాలకులతో కుమ్మక్కయి.. ఉద్యమాన్ని నాశనం చేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్న ద్రోహచింతన గల నేతలు! ఉద్యమం గుండెలపై తన్ని.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్న టీ కాంగ్రెస్8 నేతలు ఎందరో! ఇది సకల తెలంగాణం చేస్తున్న విమర్శ!

ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక తెలంగాణ ఏర్పాటు విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు కాంగ్రెస్8 అధిష్ఠాన పెద్దలు. ఎన్నికలయిపోయి, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలేర్పడ్డాయి. ఆ తర్వాత సోనియాకు ఆరోగ్యం బాగోలేదు.. ఆమె విదేశాల నుంచి వచ్చాక నిర్ణయం అన్నారు. ఆమె తిరిగి వచ్చేశారు. దీపావళి, బక్రీద్ పండుగల సాకు చెప్పారు. ఆ తర్వాత ఆ మాట ఎవరన్నారని ప్రశ్నించారు. ఆజాద్ మాట్లాడుతున్నారని మరోసారి చెప్పారు. అజాద్ మాట్లాడేశారు. నివేదికలు ఇచ్చేశారు. జాతీయ స్థాయి నేతల అభివూపాయాలన్నారు. ఆ ప్రక్రియ కూడా ముగిసింది. కోర్‌కమిటీ భేటీలన్నారు. మినీ కోర్‌కమిటీ అని చెప్పారు. ఇదుగో సీడబ్ల్యూసీ అన్నారు. తెలంగాణ అంశం గుండ్రంగా ఉంటుందని నిరూపించాలని భావించినట్లున్నారు.. ఇప్పుడు మళ్లీ మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలను బూచిగా చూపిస్తున్నారు! ఈ మాటల మాయాజాలం సాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగింది.

పల్లెలు పట్టాలపైకెక్కి ఢిల్లీకి ఉద్యమ తీవ్రతను కూతవేసి చాటాయి. వంటావార్పుతో పొయ్యిల మంటతో జనం సెగ తగిలించారు. అన్నింటికీ మించి 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష బలాన్ని చాటిచెప్పారు. రోజువారీ ఆందోళనలు, నిరసనలు సరేసరి! ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బలమైన విమర్శలు వస్తున్నాయి.

CMpostlist_1 telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( హైదరాబాద్)ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా, 4కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకులు.. ఆ పని చేయకపోగా.. ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డారని ప్రత్యేకవాదులు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శలు నిజమేనని నేతలు ఆచరణలో రుజువు చేసుకుంటున్నారని పరిశీలకులంటున్నారు. కేసీఆర్ దీక్షనేపథ్యంలో డిసెం బర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన, దానిని సీమాంధ్ర నేతలు అడ్డుకోవడం,జేఏసీ ఆవిర్భావం, ఉద్యమాలు, ఆయా సమయాల్లో జరిగినపరిణామాల్లో టీ కాంగ్రెస్8 నేతల తీరుతెన్నులు వారిని ద్రోహులుగా నిలబెడుతున్నాయని విమర్శలు వెల్లు తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది మేమే అంటూ నినదించిన టీ కాంగ్రెస్8 నేతలు.. నేడు తెలంగాణవాదంపై మౌనం వహిస్తూ.. ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైగా ‘‘ఉన్నత పదవుల్లో మమ్మల్ని కూర్చోబెట్టండి. తెలంగాణవూపజలను మేమే పకడ్బందీగా భ్రమల్లో పెడుతాం. ఆ కళ మాకే తెలుసు. 4దశాబ్దాలుగా ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నాం. మా ప్రాంత ప్రజలను ఎలా మోసం చేయాలో మాకే ఎక్కువ తెలుసు’’ అంటూ అధిష్ఠానం వద్ద మహజరులు సమర్పించుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ అంటూ మాట్లాడిన జానాడ్డి లాంటి సీనియర్‌లు నేడు ప్రేక్షకపాత్ర వహించడమే నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కుర్చీ నుంచి కిరణ్‌కుమార్‌డ్డిని అధిష్ఠానం తప్పిస్తుందన్న అంచనాలో కొందరు టీ కాంగ్రెస్8 నేతలున్నారు.ఉద్యమం పేరుతో ఈ నేతలు సీఎం కుర్చీపై కన్నేసినట్లు తెలుస్తోంది.

సమైక్యరాష్ట్రానికి తమను సీఎంగా చేస్తే తెలంగాణవాదాన్ని ఎదుర్కొంటామని అధిష్ఠానం వద్ద నమ్మబలుకుతున్న వారిలో జానాతో పాటు జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, గీతాడ్డి, రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నట్లు వినిపిస్తోంది. దీనికోసం హైకమాండ్‌ను మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. సీఎం కుర్చీ కోసం తెలంగాణ కోటాలో కర్చీఫ్ వేసినట్లు చెబుతున్నారు. కిరణ్‌ను మార్చాల్సివస్తే ఈసారి తెలంగాణ ప్రాంతానికి సీఎం పదవి ఖాయమని, అందుకే ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చినప్పుడు టీ మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేయకుండా కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతోనే సరిపెట్టారు. దీనిపై విమర్శలు ఎదురైనా దులిపేసుకున్నారు. తెలంగాణలోని ఏడున్నర లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి 42 రోజుల పాటు సకలజనుల సమ్మెకు దిగడం, తెలంగాణ కోసం త్యాగాలు చేయడం, అడ్వాన్స్‌లు తప్ప ఇప్పటి వరకు వారి జీతాలపై నిర్ణయం జరగకపోవడం, విద్యార్థులు చదువులు కోల్పోవడం, రవాణా వ్యవస్థ స్తంభించి పోయి తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే టీ మంత్రులు మాత్రం దర్జాగా హోదాలు, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తూ గడిపారే తప్ప, తెలంగాణ కోసం ఉద్యమకారులతో కలిసిరాలేదనివారు విమర్శిస్తున్నారు.

సచివాలయ నాటకం..
మంత్రి పదవులకు రాజీనామాలు చేయలేదనే కానీ.. మేం అసలు సచివాలయానికి వెళ్లడం లేదని గప్పాలు కొట్టిన మంత్రుల నాటకం సీఎం వ్యాఖ్యలతోనే బయటపడింది. సచివాలయానికి వెళ్లని మంత్రులు.. ఫైళ్లను ఇంటికి తెప్పించుకుని చకచకా సంతకాలు లాగించేశారు. మంత్రులు సచివాలయానికి రాని కాలంలోనే ఎక్కువ ఫైళ్ళు పరిష్కారమయ్యాయని అప్పట్లో సీఎం చెప్పడం తెలంగాణపై టీ మంత్రుల చిత్తశుద్ధి ఏపాటితో చాటిచెప్పింది. ‘‘పదవులు, హోదాలు పోతే ఎవరూ పట్టించుకోరు. తొందరపడి రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ ఉండదు. తెలంగాణపై పోరాడుతున్నట్లు నటిస్తూనే మీ పనులు మీరు చూసుకోండి’’ అంటూ టీ మంత్రుల జోరుకు సీఎం బ్రేకు వేశారన్న ప్రచారం ఉంది. దీంతో బుగ్గకారు, హోదా, పీఎస్8, పీఎలు పోతారని, సర్కార్ పరంగా లభిస్తున్న సౌకర్యాలన్నీ వదులుకోవాల్సి వస్తుందని భావించే టీ అమాత్యులు తెలంగాణవాదాన్ని పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం
టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం పని చేసిందని విమర్శలున్నాయి. ‘‘నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు, పనులు కేటాయిస్తాను. పదవుల్లో ఉండి హాయిగా పనులు చేసుకోండి. భవిష్యత్తులో మీకు కావాల్సినవి అన్నీ చూసుకుంటా’’ అనే రీతిలో సీఎం వారికి భరోసా కల్పించడమే కాకుండా ప్రలోభాలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. టీ కాంగ్రెస్ ఎంపీలది మరో కథ. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ కేకే నేతృత్వంలో టీ కాంగ్రెస్8 ఎంపీలు దీక్షలు చేపట్టారు. రాజీనామా చేశామంటూ పార్లమెంట్ సమావేశాలకు మొదట్లో దూరం పాటించినా, తరువాత సమావేశాలకు హాజరై తెలంగాణ నినాదాలతో ప్లకార్డులు పట్టి కొంత హంగామా చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులతో పోల్చితే.. వారు అధిష్ఠానంతో కొంత ఘర్షణవైఖరిని, పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ.. చివరాఖరుకు వారూ మెత్తబడ్డారు.

నిరసన సెగలతో స్వరం పెంచిన నేతలు
తెలంగాణవాదం రోజురోజుకూ బలపడుతూ రాజకీయ నేతలు తెలంగాణలో తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీ కాంగ్రెస్ నేతలుస్వరాన్ని పెంచక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల శవాల వద్దకు వెళ్ళి తెలంగాణ తెచ్చే వరకు తాము వెనకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల నుంచి నిరసనలు పెరగడంతో తప్పనిసరై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామాలు చేయాలని, తెలంగాణ సాధన కోసం కలిసి ఉద్యమించాలని టీ కాంగ్రెస్8 ప్రజావూపతినిధులు, మంత్రులు నిర్ణయించుకున్నారు. టీ కాంగ్రెస్8 స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దికాలానికే దాని పస తేలిపోయింది. కమిటీ చైర్మనే దాని నిర్ణయాలను పాటించని దుస్థితి. ఎట్టకేలకు రాజీనామాలు చేసినా.. పై నాయకత్వం చక్రం తిప్పడంతో రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయన్న వాదన ఉంది. టీడీపీ టీ ఫోరం, టీఆర్‌ఎస్8, సీపీఐ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్8కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండ్‌తో రెండవ సారి రాజీనామా చేశారు. వీరితో పాటు రాజీనామాలు చేయడానికి టీ కాంగ్రెస్8మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ససేమిరాఅన్నారు.

మరో వైపు నాగం జనార్దన్‌డ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, టీ రాజయ్య తదితరులు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదించుకున్నారు. వారి తరహాలోనే మిగతా టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాల కోసం పట్టుబడితే తప్పకుండా ఆమోదం పొందడమో లేక కేంద్రం దిగిరావడమో జరిగేది. కానీ తెలంగాణ జన ఆకాంక్షలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, సీమాంధ్ర పాలకుల ప్రలోభాలకు లొంగి, తెలంగాణకు ద్రోహం చేశారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని నాయకులపై ఉద్యమ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఉద్యమాన్ని బలహీనపర్చే కుట్ర!
పదవులు, హోదాలు, పనులు, పైరవీల కోసం టీ కాంగ్రెస్8 నేతల మధ్య నెలకొంటున్న అంతర్గత కుమ్మలాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలహీనం చేయడానికి దోహదపడుతున్నాయనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్8 నేతల అనైక్యతను ఆసరా చేసుకుని కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా తన ఆట కొనసాగిస్తున్నారంటున్నారు. సెలక్షన్ కమిటీ హస్తినలో ఉందని నమ్మబలికిస్తూ గులాం నబీ ఆజాద్, సోనియాల వద్ద మార్కులు కొట్టేసేలా సీఎం తన స్కోరును పెంచుకుంటున్నారని అంటున్నారు. బలహీనమైన బౌలింగ్‌గా ఉన్న తెలంగాణ అగ్రనేతల కుమ్మలాటలతో, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో క్రికెటర్‌గా సీఎం దీటైన షాట్లతో అధిష్ఠానం వద్ద, రాష్ట్రంలో తన స్కోరు మరింత పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం కేంద్రం తరఫున ప్రకటించారు. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో... సీమాంధ్ర కాంగ్రెస్8 నేతలు మిగతా పార్టీల నేతలను ఉసిగొల్పి పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా వచ్చే తెలంగాణను అడ్డుకున్నారు. తదనంతరం తెలంగాణ కోసం రాష్ట్రంలో ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. తెలంగాణ కోరుతూ ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థులు సైతం తెలంగాణ కోసం కదం తొక్కారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ జాప్యాన్ని నిరసిస్తూ ఒక్కొక్కరుగా 700 మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కానీ.. టీ కాంగ్రెస్8 నేతల ద్రోహచింతనలో ఏమాత్రం మార్పు రాలేదని ఉద్యమకారులు వాపోతున్నారు.

Take By : T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP