Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, February 17, 2011

తేల్చే వరకు ఢిల్లీ వదలం


tlg-mlasహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ రాష్ట్రం విషయంలో అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన కాంగ్రెస్‌ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేయనంత వరకు తాము హైదరాబాద్‌ వెళ్ళేది లేదని భీష్మించి కూర్చున్నారు. బుధవారం హస్తినలో పార్టీ హైకమాండ్‌ తాజా వైఖరి చూసిన తరువాత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను, గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించాలని వారు నిర్ణయించు కున్నట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు పార్టీ నాయకత్వం తెలంగాణపై ఒక ప్రకటన చేసే వరకు తాము ఢిల్లీలోనే ఉంటామని స్పష్టం చేయడంతో గురు వారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు హజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కోర్‌ కమిటీ సభ్యులు తమకు అపా యిం ట్‌మెంట్‌ ఇవ్వక పోవడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మె ల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. సోమవారంఅహ్మద్‌ పటేల్‌తో భేటి సందర్భంగా కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తానని అతను తమను నమ్మించి మోసం చేశారని పలువురు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎ.కె.ఆంటోనని కలిసిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ వీరప్ప మొయిలీతో భేటి అయ్యారు.

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో ఈ గోలేంటి అని మొయిలీ ఎమ్మెల్యేలపై ఫైర్‌ అయినట్లు తెలిసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించడం సరైంది కాదని, తెలంగాణ విషయంలో అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు ఆయన నచ్చజెప్పడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాస్త మెత్తబడ్డారు. కాగా ప్రకటన లేకుండా ఒట్టి చేతుల్తో తిరిగి వస్తే తెలంగాణవాదులు, టిఆర్‌ఎస్‌ వారి నుంచి దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున స్పష్టమైన ప్రకటన చేసే వరకు హైదరాబాద్‌ వెళ్ళబోమని హస్తినలోనే భీష్మించి కూర్చున్నారు. వారు ఢిల్లీలోనే ఉండటంతో గురువారం నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను హజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమావేశాలను బహిష్కరించాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అదే విధంగా మరి కొన్ని రోజుల్లో సమావేశాల్లో టిఆర్‌ఎస్‌తో తెలంగాణ కోసం గొంతు కలపాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తాజాగా బుధవారం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భగ్గుమంటున్నారు. ప్రధాని వ్యాఖ్యలను ఫూలిష్‌గా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అభివర్ణించారు. డిసెంబర్‌ 9వ తేదీ ఏకాభిప్రాయం లేకుంటే ఎందుకు ప్రకటన చేశారని, మళ్ళీ ఏకాభిప్రాయం సాధించడం అంటే అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్‌ 7 అఖిలపక్ష సమావేశం అభిప్రాయం, సిఎల్పీ తీర్మానం వచ్చిన తరువాత కూడా ఏకాభిప్రాయం లేదనడంలో అర్ధం లేదని ఆయన ప్రధానిపై చిందులు వేశారు.

ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెలీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని కలిసి తమ గోడు వెల్లదీసినట్లు సమాచారం. కోర్‌ కమిటీ సభ్యులతో, సోనియాతో అపాయింట్‌ మెంట్‌ ఇప్పించి ప్రకటన చేయించాలని, లేక పోతే ఇక తాము పదవులకు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు తప్పవని వారు జైపాల్‌తో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అధిష్ఠానం నుంచి తగిన స్పందన లేక పోవడంతో ఏం చేయాలో తెలియక, రాష్ట్రానికి వెళ్ళి ఏం చెప్పుకోవాలో అర్ధం కాక తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తలపట్టుకుంటున్నారు.


take BY: Suryaa.com

Read more...

సహాయం బంద్ గురువారం నుంచే తెలంగాణ ఉద్యోగుల నిరాకరణం

సహాయం బంద్
గురువారం నుంచే తెలంగాణ ఉద్యోగుల నిరాకరణం
చర్యలు తీసుకుంటే ప్రతిఘటిస్తాం
సర్కారుకు హెచ్చరిక

సీమాంధ్ర సిబ్బందీ సహకరించాలి
ఎమ్మెల్యేలు, మంత్రులూ పాల్గొనాలి: స్వామిగౌడ్
ఈగవాలినా ఊరుకోం: కేసీఆర్
సహకరించాలని డీఎస్‌కు జేఏసీ వినతి
సహకరిస్తాం: తెలంగాణ టీడీపీ
ప్రతి పౌరుడూ పాల్గొనాలి: యాష్కీ





హైదరాబాద్, ఫిబ్రవరి 16 : ఉద్యోగులూ ఉద్యమబాట పట్టారు. తెలంగాణ కోసం రణం తప్పదని తేల్చి చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిందేనన్న డిమాండ్‌తో గురువారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెడుతున్నారు. రాష్ట్ర రాజధాని సహా మొత్తం తెలంగాణ జిల్లాలన్నింటిలోని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు.. ఇలా ఏ ఒక్కచోటా పనిచేసేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో.. ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులపై చర్యలు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని, మాట తప్పితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని టీఎన్జీవో నేతలు హెచ్చరించారు.

ఉద్యమంపై ప్రభుత్వ స్పందనను బట్టే తమ విధానం కూడా ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో బుధవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్వామిగౌడ్, శ్రీనివాసగౌడ్, విఠల్, దేవీప్రసాద్, మధుసూదన్‌రెడ్డి కలిశారు. తమ ఉద్యమానికి సహకరించాలని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టించాలని డీఎస్‌ను కోరారు. ఆ తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు.

పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానీకం ఉద్యమం చేస్తుంటే.. వారు చెల్లించే పన్నుల నుంచి జీతాలు తీసుకునే తాము మౌనంగా ప్రేక్షకపాత్రలో ఉండలేమని స్వామిగౌడ్ చెప్పారు. తాముకూడా గురువారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమంలోకి వెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. గురువారం నుంచి విధులకు హాజరై ఉద్యోగులు సంతకం చేస్తారే కానీ, విధులు నిర్వహించబోరని స్వామిగౌడ్ ప్రకటించారు.

ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగానే నిరసన తెలియజేస్తామని, వ్యవస్థను కుప్పకూల్చబోమన్నారు. తమ ఉద్యమానికి సహకరించాలని సీమాంధ్ర ఉద్యోగులను కోరారు. తమ సీట్లలో కూర్చుని పని చేయవద్దని, తమ మనోభావాలను, ప్రయత్నాలను దెబ్బతీయవద్దని స్వామిగౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామిక విలువలు చెడిపోకుండా, వ్యవస్థలు పాడుకాకుండా, పేదలకు నష్టం కలగకుండా తమ నిరసన తెలియజేయాలని డీఎస్ సూచించినట్టు ఆయన చెప్పారు.

'మా నిరసన ప్రజల కోసం. తెలంగాణ యువకులకు ఉద్యోగాల కోసం. మా బతుకుతెరువు, నదులు, నిధుల కోసం. కాబట్టి ఇందులో ప్రజలెవరినీ ఇబ్బంది పెట్టే ప్రశ్నే ఉండదు' అని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని భావిస్తున్నామని, ప్రభుత్వం దానిని భగ్నం చేస్తే ఉద్యోగుల మధ్య గొడవలు ఆరంభమవుతాయని శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేయాలని, మంత్రులు కూడా ఉద్యమంలో పాల్గొనాలని విఠల్ కోరారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నేతలు కోరినన్ని రోజులు సహాయ నిరాకరణోద్యమాన్ని నడిపిస్తామని స్వామిగౌడ్ ప్రకటించారు. సహాయ నిరాకరణ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా ఉద్యోగులకు సహకరించాలన్నారు.

మరోవైపు.. ఉద్యోగుల ఉద్యమానికి పలు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి. సహాయ నిరాకరణలో పాల్గొనే ఉద్యోగులను వేధించినా.. వారిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని, సర్కారును కూల్చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. చీమూ నెత్తురు ఉన్న ప్రతీ తెలంగాణ పౌరుడూ సహాయ నిరాకరణలో పాల్గొనాల్సిందేనని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు.

ఉద్యోగులపై కేసులు పెడితే ప్రత్యక్ష పోరుకు దిగుతామని హెచ్చరించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం నుంచే తమ సహాయ నిరాకరణ మొదలవుతుందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులది ఆషామాషీ నిర్ణయం కాదని, తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని ఉద్యోగులు చేస్తుండడం అద్భుతమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి అన్నారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP