అబ్బుర పరిచిన ‘మహాయోధ’
రవీంవూదభారతి, నవంబర్ 20 (): చరివూతకారులు చెబుతున్నట్లుగా వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి కాదని, ఝల్కారీబాయి నిజమైన వీరనారి అని చెబుతూ రవీంవూదభారతిలో ఆదివారం ప్రదర్శించిన ‘మహాయోధ’ నాటకం సభికులను కట్టిపడేసింది. ఈ నాటక ప్రదర్శనను ఆద్యంతం ఉత్కం ప్రేక్షకులు వీక్షించారు. ఝల్కారీబాయి ధీరత్వాన్ని, పోరాటపటిమను చూసి వారు విస్మయానికి లోనయ్యారు. ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయిగా ద్విపావూతాభినయం చేసిన రైల్వే ఉద్యోగి సత్యవాణి నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ నాటకానికి సౌదా అరుణ దర్శకత్వం వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్థానంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడింది ఝల్కారీబాయి అని నేటి ప్రపంచానికి తెలియజేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నత కుటుంబంలో జన్మించి ప్రాణాలకు భయపడి, ఆమె పోలికలతోనే ఉన్న ఝల్కారీ బాయిని రక్షణగా ఏర్పాటు చేసుకున్న విషయం భారత సైనికులకు కూడా తెలియదని వివరించారు. ఝాల్కారీబాయి స్వగ్రామంలోని ఆదివాసుల ద్వారా వివరాలు సేకరించి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని దర్శకురాలి భర్త సౌదా మీడియాకు తెలిపారు.
మీడియాను దూషించిన సౌదా..
మహాయోధ నాటక ప్రదర్శనను చిత్రీకరిచేందుకు పలు చానళ్ల ప్రతినిధులు రవీంవూదభారతికి వచ్చారు. విరామ సమయంలో వారు నాటకంపై ప్రముఖుల అభివూపాయాలను సేకరిస్తుండగా.. ‘మీకు బుద్ధి, జ్ఞానం ఉందా.. మీపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ మీడియాపై దర్శకురాలి భర్త సౌదా విరుచుకుపడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు నాటక ప్రదర్శనను బహిష్కరించారు.
Take By: T News
Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)


హైదరాబాద్, నవంబర్ 20 (): టీఆర్ఎస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న జాతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమవనున్నారని సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మద్దతు తెలిపే పార్టీలతో కలిసి పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై ఇందులో చర్చిస్తారని తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం టీ ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసినా.. కేంద్రం పూర్తి స్థాయిలో స్పందించలేదు. దీనికి తోడు తెలంగాణ వాదులు, టీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. తెలంగాణకు అనుకూలంగా 30కి పైగా పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవల సొంత పార్టీ నేతలతో తెలంగాణ విషయంపై చర్చలు జరిపింది. ప్రస్త్తుతం మరికొన్ని పక్షాలతో కూడా చర్చల ప్రక్రియ కొనసాగిస్తోంది. కాగా, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకుండా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణవాదులు మండి పడుతున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20 ():మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ విషయంలో కేంద్రం నుంచి ఒక ప్రకటన రానున్నదా? రాష్ట్ర విభజనపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతున్న యూపీఏ ప్రభుత్వం.. ఈ సమావేశాలను సజావుగా సాగించుకునేందుకు మధ్యేమార్గాన్ని అనుసరించనున్నదా? పూటకో ప్రకటన చేస్తూ రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణాన్ని కొనసాగిస్తోందని కేంద్రంపై మండిపడుతున్న విపక్షాలను శాంతపర్చేందుకు.. విపక్షాలతో గొంతు కలుపుతున్న అధికార పక్ష సభ్యుల ఆగ్రహాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేందుకు పాచిక వేయనున్నదా? అవుననే అంటున్నాయి ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు! తెలంగాణ అంశంపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో పెద్ద ఎత్తున రగడ జరగనున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం.. ఈ అడ్డంకిని అధిగమించేందు కు ఒక ప్రకటన చేయనున్నదని తెలుస్తున్నది. ఇది తెలంగాణపై నిర్ణయాత్మక అడుగు కాకపోయినా.. తక్షణ గండం గట్టెక్కేందుకే ఉద్దేశించారని చెబుతున్నారు. తెలంగాణ విషయం లో ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న హోం మం త్రి చిదంబరం తాజా ప్రకటన చేయనున్నారని తెలుస్తున్నది.






















