Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, November 21, 2011

అబ్బుర పరిచిన ‘మహాయోధ’

రవీంవూదభారతి, నవంబర్ 20 (): చరివూతకారులు చెబుతున్నట్లుగా వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి కాదని, ఝల్కారీబాయి నిజమైన వీరనారి అని చెబుతూ రవీంవూదభారతిలో ఆదివారం ప్రదర్శించిన ‘మహాయోధ’ నాటకం సభికులను కట్టిపడేసింది. ఈ నాటక ప్రదర్శనను ఆద్యంతం ఉత్కం ప్రేక్షకులు వీక్షించారు. ఝల్కారీబాయి ధీరత్వాన్ని, పోరాటపటిమను చూసి వారు విస్మయానికి లోనయ్యారు. ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయిగా ద్విపావూతాభినయం చేసిన రైల్వే ఉద్యోగి సత్యవాణి నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ నాటకానికి సౌదా అరుణ దర్శకత్వం వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి స్థానంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడింది ఝల్కారీబాయి అని నేటి ప్రపంచానికి తెలియజేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నత కుటుంబంలో జన్మించి ప్రాణాలకు భయపడి, ఆమె పోలికలతోనే ఉన్న ఝల్కారీ బాయిని రక్షణగా ఏర్పాటు చేసుకున్న విషయం భారత సైనికులకు కూడా తెలియదని వివరించారు. ఝాల్కారీబాయి స్వగ్రామంలోని ఆదివాసుల ద్వారా వివరాలు సేకరించి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని దర్శకురాలి భర్త సౌదా మీడియాకు తెలిపారు.

మీడియాను దూషించిన సౌదా..
మహాయోధ నాటక ప్రదర్శనను చిత్రీకరిచేందుకు పలు చానళ్ల ప్రతినిధులు రవీంవూదభారతికి వచ్చారు. విరామ సమయంలో వారు నాటకంపై ప్రముఖుల అభివూపాయాలను సేకరిస్తుండగా.. ‘మీకు బుద్ధి, జ్ఞానం ఉందా.. మీపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ మీడియాపై దర్శకురాలి భర్త సౌదా విరుచుకుపడ్డారు. దీంతో మీడియా ప్రతినిధులు నాటక ప్రదర్శనను బహిష్కరించారు.

Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News 

Read more...

ముగిసిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈరోజు వరకు జరిగిన 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ముగిసాయి. కార్యక్రమానికి ముఖ్య అథితిగా గవర్నర్ నరసిహన్ వచ్చారు. బంగారు ఏనుగులను
బెస్ట్ ఇండియా స్క్రీన్‌ప్లే -( సంజయ్ చౌహన్) అయామ్ కలాం,
ఉత్తమ బాలల దర్శకుడు - (బంట్యానాయక్) హమారీ దునియా,
ఉత్తమ లఘు చిత్రం- నైన్‌అండ్‌హఫ్ ఇయర్ గుడ్‌బాయ్,
ఉత్తమ ఫీచర్ ఫిలీంగా - ద క్రొకోడైల్స్ స్ట్రయిట్ బ్యాక్,
ద్వితయ ఉత్తమ ఫీచర్ ఫిలీం - జాతీయ విభాగంలో- దేక్ ఇండియన్ సర్కస్,
ఉత్తమ స్క్రీన్‌ప్లే అంతర్జాతీయ స్థాయి - ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ హఫ్ హాలాండ్,
ఉత్తమ ఫీచర్ ఫిలీం అంతర్జాతీయ స్థాయి - మెడో,
ద్వితియ ఉత్తమ చలన చిత్రం అంతర్జాతీయ స్థాయి - అ అగ్లీ డిక్లీస్,
ఉత్తమ ద్వితియ లఘు చిత్రం - దుబాల్,
బెస్ట్ డైరక్టర్ -ఉమేష్ వినాయక్ కులకర్ణీ- వీర్ చిత్రానికి బంగారు ఏనుగులు గెలుచుకున్నారు.

Read more...

నేడు ఢిల్లీకి కేసీఆర్

తెలంగాణపై జాతీయ, ప్రాంతీయ నేతలతో భేటీ
KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 20 (): టీఆర్‌ఎస్ అధినేత, పార్లమెంట్ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మంగళవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమయంలో తెలంగాణకు అనుకూలంగా ఉన్న జాతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమవనున్నారని సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మద్దతు తెలిపే పార్టీలతో కలిసి పార్లమెంటులో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై ఇందులో చర్చిస్తారని తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం టీ ఉద్యోగులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసినా.. కేంద్రం పూర్తి స్థాయిలో స్పందించలేదు. దీనికి తోడు తెలంగాణ వాదులు, టీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. తెలంగాణకు అనుకూలంగా 30కి పైగా పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇచ్చినా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవల సొంత పార్టీ నేతలతో తెలంగాణ విషయంపై చర్చలు జరిపింది. ప్రస్త్తుతం మరికొన్ని పక్షాలతో కూడా చర్చల ప్రక్రియ కొనసాగిస్తోంది. కాగా, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకుండా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని తెలంగాణవాదులు మండి పడుతున్నారు.

ఇదే సమయంలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటం, బీజేపీ తెలంగాణ విషయంలో సావధాన తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్ పార్లమెంట్‌లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనున్నారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ముందుగా బీజేపీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో తెలంగాణవాదులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తివేయక పోగా.. టీ ఉద్యమకారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్‌లో చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంట్ సమావేశాలు కూడా వాడివేడిగా సాగే అవకాశం ఉంది.


Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News, KCR,

 

Read more...

రేపటి పూట మరో మాట!

- గత కృషి, భవిష్యత్ కార్యక్షికమంపై వివరణ
- పార్లమెంటు సమావేశాలు గట్టెక్కేందుకే.. తెలంగాణపై చర్చ రచ్చ కాకూడదనే..
- విపక్షాలు రాద్ధాంతం చేయకముందే ఒకటి రెండు రోజుల్లో ప్రకటన
- అది కూడా చిదంబరం నోటి నుంచే
- చిన్న రాష్ట్రాల డిమాండ్ల ప్రస్తావన
- విపక్ష, స్వపక్ష దాడిని తప్పించుకునేందుకు వ్యూహ రచనలో కేంద్ర ప్రభుత్వం!


parlament-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 20 ():మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ విషయంలో కేంద్రం నుంచి ఒక ప్రకటన రానున్నదా? రాష్ట్ర విభజనపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతున్న యూపీఏ ప్రభుత్వం.. ఈ సమావేశాలను సజావుగా సాగించుకునేందుకు మధ్యేమార్గాన్ని అనుసరించనున్నదా? పూటకో ప్రకటన చేస్తూ రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణాన్ని కొనసాగిస్తోందని కేంద్రంపై మండిపడుతున్న విపక్షాలను శాంతపర్చేందుకు.. విపక్షాలతో గొంతు కలుపుతున్న అధికార పక్ష సభ్యుల ఆగ్రహాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేందుకు పాచిక వేయనున్నదా? అవుననే అంటున్నాయి ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు! తెలంగాణ అంశంపై రాబోయే పార్లమెంటు సమావేశాల్లో పెద్ద ఎత్తున రగడ జరగనున్న విషయాన్ని గుర్తించిన కేంద్రం.. ఈ అడ్డంకిని అధిగమించేందు కు ఒక ప్రకటన చేయనున్నదని తెలుస్తున్నది. ఇది తెలంగాణపై నిర్ణయాత్మక అడుగు కాకపోయినా.. తక్షణ గండం గట్టెక్కేందుకే ఉద్దేశించారని చెబుతున్నారు. తెలంగాణ విషయం లో ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్న హోం మం త్రి చిదంబరం తాజా ప్రకటన చేయనున్నారని తెలుస్తున్నది.

సెగల నేపథ్యంలోనే..
ఇప్పటికే వివిధ ఆందోళన రూపాలతో తీవ్ర స్థాయికి చేరిన తెలంగాణ ఉద్యమం.. ఇటీవలి సకల జనుల సమ్మెతో జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది! దీంతో కంగాత్తిన కాంగ్రెస్ అధిష్ఠానం ఉద్యమాన్ని శాంతపర్చేందుకు అనేక పాచికలు వేసింది. తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లోపే ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ.. అవన్నీ నీటిమీద రాతలేనని తేలిపోయింది. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షిస్తూ సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ ఇప్పుడప్పుడే తెలంగాణ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఉద్యమక్షిశేణుల్లో మరింత ఆగ్రహం రాజుకుంది! ఈ సెగలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా తాకుతాయన్న ఆందోళనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకే మరో ప్రకటన వెలువడనున్నదని తెలుస్తున్నది. ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ ఎంపీలు, మద్దతిస్తున్న పార్టీలు సంతృప్తి చెందినా.. చెందక పోయినా తెలంగాణ అంశం ఈ సమావేశాల్లో పదే పదే ప్రస్తావనకు రాకుండా చూసుకోవడమే యూపీఏ ఉద్దేశంగా కనిపిస్తోంది. సమావేశాలు ప్రారంభమైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం తనకు తానుగా తెలంగాణపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణ సమస్య పరిష్కారానికి గత సమావేశాల నుంచి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని వివరించడంతో పాటు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అన్న దానిపై కూడా కొంత స్పష్టతనిచ్చి తెలంగాణ అంశాన్ని దాట వేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో యూపీ విభజన నేపథ్యంలో తెరమీదకొచ్చిన చిన్న రాష్ట్రాల డిమాండ్లను, ఎస్సార్సీని ప్రస్తావించి సంక్లిష్ట తెలంగాణ సమస్య పరిష్కారానికి మరింత సమయాన్ని కోరనుంది. మొత్తంగా చూస్తే తెలంగాణపై సభలో గందరగోళం నెలకొనే పక్షంలో ప్రతిపక్షాలతో సహా మిత్ర పక్షాలు కూడా అధికార పార్టీ వైపే వేలెత్తి చూపనున్నాయి. గతంలో కూడా తెలంగాణ సహా వివిధ అంశాల కారణంగా గందరగోళం ఏర్పడి.. ప్రభుత్వం తాను అనుకున్న అజెండాను సభలో చర్చించలేక పోయింది. సమయం లేకపోవడం వల్ల కొన్ని బిల్లులు పార్లమెంటు గడపతొక్కనే లేదు. మరి కొన్ని బిల్లులపై కొంత చర్చ జరిగినా అవి అమోదానికి నోచుకోలేదు. వాటితో పాటు కొత్త బిల్లులకు ఈ సమావేశాల్లో అమోదముద్ర వేయించు కోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. రైతు సమస్యలు, ధరల పెరుగుదల, దెబ్బ తిన్న ఆర్థిక రంగం, నల్ల ధనం తదితర కీలకాంశాలపై సాగనున్న సుదీర్ఘ చర్చను దాటుకొని అనుకున్న సభా కార్యక్షికమాలను ఎలా పూర్తి చేసుకోవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్న కేంద్రానికి తెలంగాణ అంశం మరింత అవరోధాన్ని సృష్టించనుంది. దీంతో ప్రత్యామ్నాయాలతో ఏదో ఒక రకంగా పార్లమెంటు సమావేశాలను సజావుగా పూర్తి చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణపై విధాన నిర్ణయ దిశగా అధికారిక ప్రకటన కానప్పటికీ విసృ్తతాభివూపాయం ద్వారానే తెలంగాణ సాధ్యమని ప్రధాని చెప్పిన రీతిలోనే కేంద్ర హోం మంత్రి చిదంబరంతో మరో ప్రకటన చేయించాలని చూస్తోందని సమాచారం.


Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP