Sunday, February 12, 2012
జూనియర్ వైద్యులు(జూడా)లతో చర్చలు విఫలం
-13 అంశాల్లో 11 అంగీకరించాం
-సమ్మె విరమణపై విన
-వారి వెనుక రాజకీయ శక్తులు
-కేబినెట్ ఉపసంఘం ఆరోపణ
-చర్చలు జరుగుతుండగానే బెదిరించారు
-రేపటి నుంచి తలలు పగులుతాయన్నారు
-స్టైపెండ్పై పక్కదోవ పట్టిస్తున్నారు
-అత్యవసర సేవలు మెరుగుపర్చాలి
-సమ్మెపై వెనక్కి తగ్గం: జుడాల స్పష్టీకరణ
-ఉద్యమ కార్యాచరణపై నేడు ప్రజా సంఘాలతో చర్చ
హెదరాబాద్, ఫిబ్రవరి 11 (): జూనియర్ వైద్యులు(జూడా)లతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూడాల డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి జూడాలు అత్యవసర సేవలు నిలిపివేయడంతో ప్రభుత్వ ఆస్పవూతుల్లో పరిస్థితి విషమించింది. మరణాల సంఖ్య పెరుగుతోందనే వార్తల నేపథ్యంలో శనివారం సాయంత్రం చర్చలకు రావాలని జూడాలను ఆహ్వానించింది. సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, గీతాడ్డి, కొండ్రు మురళి, జూడాల తరపున జూడాల సంఘం ప్రతినిధులు ఆదిత్య, ఫణి మహేష్, నరేష్, హనుమాండ్లు, అస్లంబాబా, అశోక్, కిరణ్, కార్తీక్, రేవంత్ పాల్గొన్నారు. అయితే.. చర్చల పట్ల మొదటి నుంచీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిన ప్రభుత్వం ఈసారి కూడా అదే వైఖరి కొనసాగించింది. స్టైపెండ్ పెంపు సహా చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖజానాపై ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నందున, ఈ చర్చల్లో ఆర్థిక మంత్రి ఆనం కీలక పాత్ర పోషించాల్సింది. కానీ ఆయన తన చాంబర్లోనే ఉన్నారు. తొలి విడత చర్చల్లో గీతాడ్డి, కొండ్రు మురళి మాత్రమే పాల్గొన్నారు.
సుమారు రెండున్నర గంటల పాటు చర్చించిన తర్వాత మంత్రులు ఇద్దరు ఆనంను కలిసి పరిస్థితి వివరించారు. ఈసారి ఆనంతో సహా వెళ్లి మళ్లి చర్చలు జరిపారు. ఇలా రెండు పర్యాయాలు విడతలుగా చర్చించినప్పటికీ అంతిమంగా చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం మంత్రులు గీతాడ్డి, కొండ్రు మురళీ మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమవడానికి జూడాల వైఖరే కారణమని దెప్పి పొడిచారు. ‘ జూడాల సమ్మె ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు అనేక పర్యాయాలు మంత్రులు వారితో చర్చలు జరిపారు. ప్రతి సారి ఏవో క్లారిఫికేషన్స్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇన్ని గంటల పాటు చర్చించినా స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నారు. మంత్రిగా కొండ్రు మురళి కొత్తగా వచ్చారు, ఆయనకు కొంత సమయం ఇవ్వాలని చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్పినా వినడం లేదు. స్టైపెండ్ పెంపుపై మంత్రికి కొంత సమయం ఇవ్వాలని కోరినా మొండికేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుని, ప్రభుత్వం నుంచి స్టైపెండ్ తీసుకుంటూ ప్రజలకు సేవలు చేయడం అంటే ఎంత వరకు సబబు? మాకు విధులు కాదు, నిధులే ముఖ్యమన్నట్లు వాళ్లు మాట్లాడుతున్నారు’ అని గీతాడ్డి అన్నారు.
ఇదంతా రాజకీయంగా జరుగుతుంది?: మంత్రి కొండ్రు మురళి
‘ఇదంతా రాజకీయంగా జరుగుతుందని మా వద్ద సమాచారం ఉంది. వారు ఎవరి వలలో ఉన్నారో మాకు తెలుసు. జూడాలు చెప్పిన 13 డిమాండ్లలో 11 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. కేవలం స్టైపెండ్ విషయంలో వాళ్లు పట్టుబడుతున్నారు. చదువుకున్న వైద్య విద్యార్థులు ఇలా ఉంటారా? అని నేను అనుకోలేదు. నేను కొత్తగా వచ్చాను, ఏప్రిల్ మొదటి వారం వరకైనా సమయం ఇవ్వాలని అడిగాను. ఆర్థిక మంత్రి ఆనం కూడా జూడాల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో వివరంగా చెప్పారు. అయినా వాళ్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం మంచిది కాదు. సమ్మెను విరమించి విధుల్లో చేరాలని, ప్రభుత్వం మీకు మద్ధతుగా ఉంటుందని నచ్చజెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు టీసీఎస్ వంటి కంపెనీల్లో రూ.15 వేలు ఇస్తున్నారు. మేం అంతకంటే ఎక్కువగానే ఇస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటుంది. 00 మంది పీజీ విద్యార్థులు సమ్మెలో ఉంటే, 0 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాం. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు.’ అని మంత్రి కొండ్రు మురళి పేర్కొన్నారు.
ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: జూడాలు
మంత్రుల ఆరోపణలను జూడా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తాము స్టైపెండ్ గురించి పెద్దగా డిమాండ్ చేయలేదని, గ్రామీణ ప్రాంతాల్లో మాతో చేయించుకునే పనికి స్పష్టమైన నిబంధనలు చెప్పాలని కోరామని అన్నారు. అత్యవసర సేవా విభాగాలను ఆధునీకరించాలని అడిగితే హామీ ఇవ్వలేదన్నారు. ‘ఎన్నో ఏళ్లుగా ఈడిమాండ్ ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రజలు చచ్చిపోతున్నారని మాపై నిందలు వేస్తున్నారు. అవసరమైన ఇంజెక్షన్ అందుబాటులో లేక మా కళ్ల ముందే రోగులు చనిపోతుంటే మేం ఎన్నోసార్లు ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్రజలు చనిపోకూడదనే అత్యవసర వైద్య సేవలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఆస్పువూతులకు ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పినా ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. లైబ్రరీని ఆధునికరించడం ద్వారా పేద ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించే అవకాశముందని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు. అలాగే ప్రధానంగా ఎంసీఐ నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ సిస్టమ్ను అమలు చేయాలని చేసిన డిమాండ్ను పట్టించుకోకుండా, స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నామని ప్రజలకు తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చర్చలు జరుగుతండగానే మమ్మల్ని బెదిరించారు. ఓ వ్యక్తి వచ్చి నేను మంత్రుల తరఫున చెబుతున్నాను, వెంటనే సమ్మెను విరమించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుంచి తలలు పగులొచ్చని బెదిరించారు. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళదామంటే, వాళ్లు మాకు అవకాశం ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ఏదేమైనా తమ పోరును విరమించబోమని, ఆదివారం సాయంత్రం వివిధ ప్రజా సంఘాలతో చర్చించి భవిష్యతు కార్యచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వ లోపాలు, ఆస్పవూతుల్లో చోటుచేసుకుంటున్న లోపాలను ప్రజలకు తెలియజేస్తామని జూడాలు వెల్లడించారు.
ప్రాణం విలవిల -
-ప్రభుత్వ ఆస్పవూతుల్లో స్తంభించిన అత్యవసరం
-రాష్ట్రంలో13 మంది రోగుల మృతి
-గాంధీలో 10 మంది.. నీలోఫర్లో ఒకరు, కర్నూలులో ఇద్దరు..
-జూడాలతో చర్చలు విఫలం
-స్టైపెండ్ పెంచేది లేదన్న సర్కారు
-డిమాండ్లు తీరేదాకా సమ్మె
-తేల్చిచెప్పిన జూడాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 ():ప్రభుత్వం మొండితనం, నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పవూతుల్లో రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. అత్యవసర సేవలు అందక శుక్రవారం రాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో 13 మంది రోగులు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మరణాలను ప్రభుత్వం సాధారణ చావులుగానే పరిగణించింది. ఆస్పవూతుల్లో వైద్య సేవలు అందక.. ప్రైవేట్ ఆస్పవూతులకు వెళ్లే స్థోమత లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా.. వాటి ఆనవాళ్లు ఆస్పవూతుల్లో మచ్చుకు కూడా కనిపించడంలేదు.
జూడాల 13 డిమాండ్లలో పదకొండింటిని అంగీకరించామని, అయినా వారు స్టైపెండ్ కోసం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. జూడాల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని, అందుకే ఇదంతా జరుగుతోందని పేర్కొంది. చర్చల ప్రక్రియను ప్రభుత్వమే ఉద్దేశపూర్వంగా చిక్కుముడిగా మార్చిందని, ఎమ్జన్సీ సేవల బంద్ విరమించుకోకుంటే సోమవారంనుంచి తలల పగులుతాయని హెచ్చరించిందని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు.
Wednesday, February 8, 2012
Iranian parliament summons Ahmadinejad
2 BJP ministers caught watching porn film in assembly
5వ కేటగిరీ లోనూ.. కేసలు ఎత్తేయండి
-మిగతా కేసులనూ ఎత్తేయండి
-ఉద్యమ కేసులపై సీఎం కిరణ్ కీలక నిర్ణయం
-సీఎస్, డీజీపీలతో ఉన్నతస్థాయి సమీక్షలో ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7 ():తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదు చేసిన కేసుల ఉపసంహరణపై సీఎం కిరణ్కుమార్డ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో కేటగిరీలోతీవూవమైన నేరారోపణ కింద నమోదు చేసిన 140 కేసులను సాధ్యమైనంత త్వరగా ఎత్తివేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మిగతా కేటగిరీల్లో ఇంకా మిగిలి ఉన్న 306 కేసులను కూడా ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
సిండికేట్లకే బందిపోట్లు
-ఎక్సైజ్ అధికారులు మొదలు కామ్రేడ్ల దాకా
-విలేకరులకూ లంచాలిచ్చిన మద్యం వ్యాపారి
-తిలాపాపం తలా కొంత పంపిణీ!
-రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వెల్లడి
-ఇది ఒక్క జిల్లాలోనే.. ఇతర జిల్లాల్లో?
-రాజకీయ పార్టీల్లో పెను సంచలనం
-నష్టనివారణ చర్యల్లో పార్టీలు
-ఎందుకు తీసుకున్నామంటే...
-వివరణలు ఇచ్చేందుకు పోటీలు
హైదరాబాద్, మహబూబాబాద్, ఫిబ్రవరి 7 () :మద్యం మంత్రికి పది లక్షలు.. రాజకీయ నాయకులకు వారి వారి స్థాయి, హోదాలను బట్టి యాభై వేలు మొదలు లక్ష, రెండు లక్షలు ఐదు లక్షలు! పదివేలు, పాతికవేలతో సర్దుకుపోయినవారూ ఉన్నారు! అధికారులు భారీగా గుటుక్కుమనిపించారు. విలేకరులూ తగ్గలేదు! ఇది మద్యం వ్యాపారం, రాజకీయ నాయకత్వం కలిసి మెలిసి సహజీవనం చేస్తున్నాయనడానికి తాజా తార్కాణం. నిలు దర్శనమిచ్చిన నగ్నసత్యం! మద్యం వ్యాపారంలో లొసుగులు బయటపడకుండా ఉండేందుకు.. అక్రమంగా అధిక ధరలకు అమ్మేసుకుంటున్నా.. నోరు మెదపకుండా ఉండేందుకు.. లంచాల రూపంలోనైతేనేమి.. చందాల పేరుతోనైతేనేమి.. తిలాపాపం తలా కొంచెం! ముడుపులు ముట్టాయి! ఇది ఖమ్మం జిల్లా లిక్కర్ కింగ్ నున్నా రమణ బయటపెట్టిన సత్యం! అవినీతి నిరోధక శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో లిక్కర్ డాన్ చదివిన మద్యం పద్దుల చిట్టా! ఉరుములేని పిడుగులా వచ్చి పడిన బాంబుతో భీతిల్లిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. తాము ఆ వ్యాపారి నుంచి ఎందుకు ఆ మొత్తాలు తీసుకున్నామో వివరణలు ఇస్తున్నాయి! మొత్తానికి.. డబ్బులు తీసుకున్నది నిజమేనని అంగీకరించాయి!
మద్యం సిండికేట్ల వెనుక పొలిటికల్ గాడ్ఫాదర్లు ఉన్నట్టు వచ్చిన వార్తలకు బలం చేకూరింది. ఖమ్మంలో మద్యం సిండికేట్లకు, రాజకీయ నాయకులకు మధ్య అక్రమ సంబంధం బట్టబయలైంది. సిండికేట్ల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేందుకు గాను ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తాను స్వయంగా పది లక్షల రూపాయలు లంచంగా ఇచ్చానని లిక్కర్ డాన్ నున్నా రమణ సంచలనం రేపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్లో ఖమ్మంలోని చంద్రవైన్స్ యజమాని బాలాజీ, మంత్రి క్లాస్మేట్ అయిన రాజబాబుతో కలిసి ఈ సొమ్ము అందించినట్లు ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. మంత్రితో పాటు ఖమ్మం జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులకు, ఎక్సయిజ్ అధికారులకు లక్షల్లో ఇచ్చానని, విలేకరులకు కూడా ముడుపులు చెల్లించానని తెలిపాడు. రమణను మంగళవారం కోర్టులో హాజరుపర్చినప్పుడు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో.. రమణ ఎవవరికి ఎంతెంత సొమ్ము ఇచ్చారో ఆ వివరాలన్నింటినీ ఏసీబీ పేర్కొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించిన సమయంలోనే కొందరు మద్యం వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో లిక్కర్ కింగ్ రమణను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈయన వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వ్యక్తి. రమణను ఏసీబీ అధికారులు విచారించగా పలు సంచలనాత్మక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలను పొందుపరుస్తూ ఏసీబీ వరంగల్ జిల్లా డీఎస్పీ టీపీ విఠలేశ్వర్ రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 0/ఏసీబీ-డబ్ల్యూకేహెచ్/2012 ప్రకారం అఫెన్స్ యూ/ఎస్ 7, , 12, 13(1)(ఏ) అండ్ (0) ఆర్/డబ్ల్యూ 13(2) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 19 అండ్ సెక్షన్స్ 120-బీ, 34 అండ్ 109 ఐపీసీ సెక్షన్ల ప్రకారం డీఎస్పీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రమణకు పది మద్యం సిండికేట్లలో 29 మద్యం దుకాణాలు ఉన్నాయని, వీటన్నింటినీ రమణ బినామీ పేర్లతో 2010, జూలైలో తీసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. టెండర్ల సమయంలో ఎక్కువ ధరలకు వేర్వేరు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు.. ఆ తర్వాత గరిష్ఠ చిల్లర ధరకన్నా ఎక్కువ రేట్లకు మద్యాన్ని విక్రయిస్తూ కోట్లుకొల్లగొట్టారు. ఎమ్మార్పీ రేట్లకన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలు జరిపినా కేసులు నమోదు చేయకుండా ఎక్సయిజ్, పోలీస్ అధికారులకు పెద్ద మొత్తాల్లో మామూళ్లు ముట్టజెప్పారు.
లైసెన్సులు దక్కించుకున్న తరువాత సిండికేట్గా ఏర్పడుతూ అక్రమాలకు తెర తీస్తున్నారు. అకౌంట్స్ బాధ్యతలను ఒకటి రెండు మద్యం దుకాణాల యజమానులకు అప్పగిస్తున్నారు. వీళ్లే సిండికేట్లోని ఏయే వైన్షాపులు ఎంతెంత సరుకు కొనుగోలు చేశాయి? ఎంతవిక్రయాలు జరిపాయి? అన్నది రికార్డు చేస్తారు. అనంతరం వచ్చిన స్థూల లాభాలను లెక్క తేలుస్తారు. ఈ లాభాల్లో నుంచి ఆయా షాపుల లైసెన్స్ ఫీజులను ప్రభుత్వానికి చెల్లిస్తారు. రోజువారీ నిర్వహణ ఖర్చులు, మామూళ్లు తీసివేసి నికర లాభాలు తేలుస్తారు. ఏసీబీ రిమాండ్ రిపోర్టు ప్రకారం ఆయా అధికారులకు ప్రతినెలా నిర్ణీత మొత్తంలో మామూళ్లు మద్యం వ్యాపారుల నుంచి వెళుతున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, వైరా, పాల్వంచ, భద్రాచలం, ఏదులాపురం, గార్ల, కారేపల్లి, విశ్వనేతపల్లి, కొత్తలింగాల, బోనకల్లు, కల్లూరు, ముదిగొండ తదితర ప్రాంతాలతోపాటు వరంగల్, ఇతర జిల్లాల్లో అక్రమ మద్యం వ్యాపారం నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు రమణ విక్రయిస్తున్నాడని తెలిపారు. అందుకోసం అధికారులు, ప్రజావూపతినిధులకు మామూళ్ల రూపంలో నెలనెలా నగదును ముట్టచెబుతున్నాడని వెల్లడించారు.
రమణ 29 మద్యం దుకాణాల్లో ప్రత్యక్షంగానూ, 0 దుకాణాల్లో పరోక్షంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. రాజకీయ నాయకుల విషయానికొస్తే.. మహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు రూ.5లక్షలు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్షికసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావుకు రూ.4.5 లక్షలు, సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్కు రూ.3 లక్షలు, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావుకు రూ.3 లక్షలు, సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకటవీరయ్యకు రూ.3 లక్షలు చెల్లించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
మామూళ్లు నిర్ణయించేది నేనే!
ఎవవరికి ఎంతెంత మామూళ్లు ఇవ్వాలన్నది తానే నిర్ణయించినట్టుగా రమణ ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. 2010, జూలై 1వ తేదీ నుంచి 2010, సెప్టెంబరు 31వ తేదీ మధ్య మూడు నెలల కాలానికి ఎక్సయిజ్ ఎస్ఐ మహేంవూదకుమార్కు రూ.1,44,495 ఇచ్చినట్టు తెలిపాడు. ఈ మొత్తాన్ని ఎక్సయిజ్ సీఐ డీఎస్నాథ్, సూపరింటెండెంట్ మధుసూదన్రావులు పంచుకున్నట్టు చెప్పాడు. ఇక, రమణ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో కొత్తగూడెంలోని ఎంజే వైన్స్ యజమాని జనార్ధన్డ్డి తరఫున కొత్తగూడెం డీఎస్పీ దేవదాస్నాగుకు 2011లో రూ.50వేలు మామూళ్ల కింద ఇచ్చినట్టు తేలింది. గోల్డెన్ వైన్స్, సాయి సుధ వైన్స్కు చెందిన సుబ్బారావు, షాజీరావుల తరఫున ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్కు రూ.24వేలు, ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ మహేంవూదకుమార్కు రూ.12వేలు, సబ్ ఇన్స్పెక్టర్కు రూ.12వేలు ముట్టినట్టుగా తెలుస్తోంది. ఇక షాజీరావు తరఫున ఖమ్మం ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు మూడు దఫాలుగా రూ.36వేలు, రూ.1వేలు, రూ.1వేలను ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ ద్వారా పంపించినట్టు రమణ తెలిపాడు. ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్కు ఎనిమిది వైన్షాపుల నుంచి రూ.96వేలు అందినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.
మద్యం వ్యాపారులు సుబ్బారావు, షాజీరావుల నుంచి నాలుగు వైన్షాపుల తరఫున రూ.60వేలను ఎక్సయిజ్ ఎస్ఐ మహీందర్కుమార్ మామూళ్లుగా తీసుకుని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహారావుకు అందచేసినట్టుగా వెల్లడించారు. ఖమ్మంలోని భ్రమరాంబ వైన్స్ కౌంటర్ ఇన్చార్జిగా ఉన్న రాజు నుంచి ఎక్సయిజ్ ఎస్ఐ ప్రతాప్ నెలకు రూ.12వేలను లంచంగా తీసుకుంటూ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ గంగాధర్కు అందచేస్తున్నట్టుగా తేలింది. వైరా ఎక్సయిజ్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఉమ.. శ్రీదుర్గ వైన్స్, భ్రమరాంబ వైన్స్లో కౌంటర్ ఇన్చార్జిలుగా పనిచేస్తున్న రాజు, మురళి నుంచి నెలకు రూ.6వేల చొప్పున వసూలు చేసి ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మధుసూదన్రావుకు చేరుస్తున్నట్టు పేర్కొన్నారు. సిండికేట్లో కీలకపాత్ర పోషిస్తున్న రమణ.. మద్యం వ్యాపారంతోపాటు గంజాయి స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు అతనిపై మూడు కేసులు కూడా నమోదై ఉన్నట్టు తేలింది. రమణ గతంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో కానిస్టేబుల్గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి, తర్వాతి కాలంలో ఈ దందాలోకి దిగాడు. ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఎస్ఐ మహింవూదకుమార్, వైరా ఎక్సయిజ్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఉమలు మద్యం దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేసి పై అధికారులకు అందచేస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు.
నిరాధార ఆరోపణలు...
తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎక్సయిజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ మీడియాతో చెప్పారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తి తనపై ఆరోపణలు చేయటం వెనక కుట్ర ఉందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డితో చర్చించనున్నట్టు తెలిపారు. విచారణ జరిపించాల్సిందిగా ముఖ్యమంవూతిని కోరుతానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని విచారణలో తేలితే మంత్రి పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
ఎవరికెంత?
మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత: రూ.5 లక్షలు
పోటు రంగారావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్షికసీ జిల్లా కార్యదర్శి): రూ.4.5లక్షలు
పోతినేని సుదర్శన్ (సీపీఎం జిల్లా కార్యదర్శి): రూ.3 లక్షలు
పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ నేత): రూ.3 లక్షలు
విజయసారధి (సీపీఐ నేత): రూ.40వేలు
సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి ఎమ్మెల్యే): రూ.3లక్షలు
ఏ సమ్మిడ్డి (సాక్షి బ్యూరో మాజీ): రూ.60 వేలు
శ్రీనివాస్డ్డి (ఈనాడు బ్యూరో మాజీ): రూ.60 వేలు
మధుసూదన్ (ఆంవూధజ్యోతి బ్యూరో) : రూ.0 వేలు
దండి భాస్కర్ (వార్త రిపోర్టర్) : రూ.40 వేలు
దిండిగాల రాజేందర్ (టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్) : రూ.60వేలు
శ్రీనివాస్ (సీపీఎం నేత) : రూ.40వేలు
Friday, February 3, 2012
Google can censor content starts to give Blogspot Country specific domain name
Google starts to give blogspot country specific domain names
Few days back twitter announced that it can block tweets country wise.
Last month that is January 2012 Google also started to make changes to its blogspot platform.
As per new changes Google is now redirecting users to country-specific domains for its Blogger sites
If you are user from India and you are going to visit blogspot.com , the user will be go blogspot.in site.
Now if you are a blogger from India and then your blogger domain name will become
.in
Example is my own blog - http://voice2telangana.blogspot.com
Now you can open it using .in domain also.
http://voice2telangana.blogspot.in/
Currently both .com and .in both are working for my blog.
If you are in Australia it will be .au
.in domain will help Google to censor content and follow the local laws.
Now Google has started to give country specific domain names to blogger that is blogspot platform.
Because of the above move it will become very easy for the Google to follow the court orders , to follow the country wise laws etc.
By- Voice2telangana
Read more...
అందినంత దోచుకో - Lanco refutes allegation of Rs 13k cr scam
అందినంత దోచుకో అదే లగడపాటి ల్యాంకో!
నిబంధనలకు నిలువు పాతర.. జాతీయ సౌరశక్తి పథకానికి టోకరా
9 దొంగ కంపెనీలతో కాంట్రాక్టులు.. అల్లిబిల్లి కంపెనీలన్నీ ల్యాంకోవే!
డైరెక్టర్లుగా ఉద్యోగులు, వారి కుటుంబీకులు
9, 10 ఏళ్ల చిన్నారులూ డైరెక్టర్లే.. కంపెనీల అడ్రస్లన్నీ ఒక్కచోటే!
రూ.13 వేల కోట్ల
‘సౌరశక్తి’
కుంభకోణం!
వెలుగులోకి
తెచ్చిన సీఎస్ఈ
విచారణ
జరుపుతామన్న
కేంద్రం
ఇది లగడపాటి మాయాజాలం! రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టుల పేరుతో, వక్ఫ్భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వెనకేసుకున్న కోట్లు చాలవన్నట్లు.. పాతికేళ్లలో 13వేల కోట్ల రూపాయలు అప్పనంగా బొక్కేందుకు రచించిన వ్యూహం! నిబంధనలకు పాతరేసి.. దొంగ కంపెనీలను సృష్టించి.. సూర్యకాంతినీ చెరప చేస్తున్న పన్నాగం! ఒక కంపెనీకి ఒకటే ప్రాజెక్టు దక్కాల్సి ఉన్నా.. టెండర్లు వేసేందుకు ఎవరూ రాని అవకాశాన్ని అందిపుచ్చుకుని.. అప్పటికప్పుడు కంపెనీలను సృష్టించి.. అన్ని కంపెనీలకూ ఒకే సెల్ నెంబర్ ఇచ్చి, అన్ని కంపెనీలనూ ఒకేచోట నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసి, ల్యాంకో ఉద్యోగులను ఆఖరుకు ఉద్యోగుల పిల్లలను సైతం కంపెనీలకు డైరెక్టర్లును చేసేసి, ఐదు పైసల తేడాతో బిడ్లు దాఖలు చేసి 235 మెగావాట్లకు విద్యుత్ ఉత్పాదనకు అనుమమతులు సాధించి ‘రాజ’ మార్గంలో దోపిడీకి సిద్ధమైన వైనం! ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధనతో సౌర విద్యుత్ రంగంలో కొత్త కంపెనీలు పోటీ పడేందుకు ఉద్దేశించిన స్ఫూర్తికి అక్రమ మేధస్సుతో కొట్టిన గండి! సౌర విద్యుత్ ఉత్పత్తికి స్వర్గధామంగా భాసిల్లుతున్న రాజస్థాన్లో జైసల్మేర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో దీని మూలాలు బయటపడ్డాయి! నెలల తరబడి శ్రమించిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ఈ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది! లగడపాటి మాయా సామ్రాజ్యాన్ని దేశం కళ్లముందు నిలబెట్టింది!
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (): నక్కజిత్తుల వ్యవహారాలతో రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులు, వక్ఫ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కోట్లు దండుకుంటున్న ల్యాంకో... ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్రమాలకు తెరలేపిందా? దేశాన్ని కుదిపివేసిన 2జీ కుంభకోణం రీతిలో సోలార్ మిషన్లో వేల కోట్లు బొక్కేందుకు పన్నాగాలు రచించిందా? అల్లిబిల్లి కంపెనీలను అల్లి.. ఏకంగా 13వేల కోట్ల రూపాయలకు ‘టెండర్’ పెట్టిందా? అవుననే అంటోంది ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ). అనడమే కాదు.. అందుకు పకడ్బందీ ఆధారాలను సైతం బయటపెట్టింది. దీనిపై విచారణకు ఆదేశిస్తామని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకటించింది.
దేశంలో విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు 2022 సంవత్సరం నాటికి 20,000మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయాలని జవహర్లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్(జేఎన్ఎన్ఎస్ఎం) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2013 సంవత్సరాంతానికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలని నిర్దేశించుకుంది.
మొదటి దశలో 150 మెగావాట్ల ఫోటో వోల్టాయిక్(పీవీ)ప్లాంట్స్, 470 మెగావాట్ల సోలార్థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ‘ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధన’తో కేంద్ర న్యూ అండ్ రినెవబుల్ ఎనర్జీ(ఎంఎన్ఆర్ఈ) మంత్రిత్వ శాఖ బిడ్లను ఆహ్వానించింది. ఏ ఒక్క కంపెనీకీ 5 మెగావాట్లకు మించకుండా ఫోటో వోల్టాయిక్(పీవీ)ప్లాంట్, 100 మెగావాట్లకు మించకుండా సోలార్థర్మల్ ప్లాంట్ కేటాయించాలని జాతీయ సౌరశక్తి పథకం నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఒక్కటంటే ఒక్కడి కూడా బిడ్ దాఖలు కాలేదు. నియమ నిబంధనలను అతిక్షికమించడంలో ఆరితేరిన ల్యాంకోకు చెందిన ల్యాంకో ఇన్వూఫాటెక్ సంస్థ తన నక్కజిత్తుల ఆలోచనలకు పదును పెట్టింది. అవకాశం వచ్చిందే తడవుగా దొంగ కంపెనీలను సృష్టించి, 235 మెగావాట్లకు విద్యుత్ ఉత్పాదనకు అనుమమతులు సాధించింది.
నేషనల్ సోలార్ మిషన్ మొదటి దశకు బిడ్ ఆహ్వానించిన 620 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పాదనలో 40 శాతం (235 మెగావాట్లు) మేరకు కైవసం చేసుకుంది. ల్యాంకో సృష్టించిన తొమ్మిది కంపెనీలు దాఖలు చేసిన బిడ్స్లలో ఒక్కొక్క దానికి కేవలం రూ.0.05పైసల చొప్పునతేడాలు ఉండడం గమనార్హం. ల్యాంకో సృష్టించిన దొంగ కంపెనీల్లో ఏడు కంపెనీల ఈక్విటీ షేర్లు కేవలం రూ.10లక్షలు, రూ.11లక్షల వరకే ఉన్నాయి. సదరు కంపెనీలకు ఆస్తులు గానీ, బ్యాంకు ఖాతాల్లో రిజర్వు ఫండ్ గానీ లేకపోవవడం మరో విశేషం. ఈ దొంగ కంపెనీలన్నీ నేషనల్ సోలార్ మిషన్ బిడ్డింగ్ సమయంలోనే పుట్టుకువచ్చాయి. ఇలాంటి అంశాలు నేషనల్ సోలార్ మిషన్ నిబంధనలను పూర్తిగా విరుద్ధం. ల్యాంకో సృష్టించిన దొంగ కంపెనీలన్నింటిలోనూ ల్యాంకో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉండడం గమనార్హం. కళ్ళు తిరిగే నిజమేమిటంటే.. ఒక కంపెనీలో తొమ్మిదేళ్ళ బాలుడు, పదేళ్ళ బాలుడు డైరెక్టర్లుగా నమోదై ఉన్నారు.
వీరిద్దరూ ల్యాంకో గ్రూప్లోని సుబ్రమణ్యం అనే ఉద్యోగి పిల్లలుగా, సదరు సుబ్రమణ్యం ల్యాంకో సంస్థకు అత్యంత విశ్వాసమైన వ్యక్తిగా, నమ్మకస్తుడిగా అభివర్ణింస్తూ ల్యాంకో ఇన్ హౌజ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ ఎన్వీవీఎన్ ఆధ్వర్యంలో జరిగిందని, తాము కేవలం నిబంధనలను మాత్రమే రూపొందించామని నవీన పునర్వినియోగ ఇంధన శాఖ కార్యదర్శి గిరీశ్ ప్రధాన్ చెబుతున్నారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన రీత్యా దీనిపై తాము లోతుగా విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే సీఎస్ఈ ప్రకటనలపై ల్యాంకో అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వద్ద ధ్రువీకరించుకోకుండానే ఆరోపణలు చేశారని పేర్కొంటోంది. కానీ.. సీఎస్ఈ మాత్రం తాము ల్యాంకో అభివూపాయాల కోసం ఎంతగానో ప్రయత్నం చేశామని, కానీ వీలుకాలేదని తెలిపింది.
ల్యాంకో కథా కమామిషు
ల్యాంకో ఇన్వూఫాటెక్ సంస్థ ల్యాంకో గ్రూప్ కంపెనీల్లో ప్రధానమైంది. దీనిని 196లో ప్రస్తుత విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్థాపించారు. ల్యాంకో ఇన్వూఫాటెక్ కంపెనీ చైర్మన్ లగడపాటి రాజగోపాల్ అయితే ఆయన సోదరుడు లగడపాటి మధుసూదనరావు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ల్యాంకో 2006 సంవత్సరంలో గ్లోబెపూక్ అనే సింగపూర్ సంస్థతో కలిసి మధ్యవూపదేశ్లోని ససన్ వద్ద 4,000మెగావాట్ల ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును అత్యంత తక్కువ ధరకు అంటే యూనిట్కు రూ.1.196పైసల చొప్పున కోట్ చేసి దక్కించుకుంది. బిడ్డింగ్ పూర్తికాగానే ల్యాంకో-జిందాల్స్టీల్ కంపెనీలు కలిసి గ్లోబెపూక్ కంపెనీని కొనుగోలు చేశాయి. తొలుత సింగపూర్కు చెందిన గ్లోబెపూక్ ఆర్థిక స్థితుల ఆధారంగానే ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు వచ్చింది.
ల్యాంకో వ్యవహారం దేశంలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేకెత్తించింది. దీంతో ల్యాంకోను అనర్హంగా ప్రకటించారు. అదే విధంగా ల్యాంకో ఆంధ్రవూపదేశ్లో కొండపల్లి వద్ద ఒక పవర్ ప్రాజెక్టు, హర్యానాలో మరొక పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులు సైతం అవినీతి ఊబిలో కూరుకుపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కొండపల్లి పవర్ ప్రాజెక్టును 16 నెలల్లో పూర్తిచేస్తానని బిడ్ను దక్కించుకున్న ల్యాంకో.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 43 నెలల సమయం తీసుకుంది. టెండర్ నిబంధనల ప్రకారం యూనిట్ధర కనీసం రూ.0.30పైసలు తగ్గించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఏటా ఎపీ ట్రాన్స్కో, డిస్కమ్లపై సుమారు రూ.90కోట్ల మేరకు భారం పడుతున్నది. గత పదకొండు సంవత్సరాలుగా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ల్యాంకో దోచుకుంది. అలాగే కొండపల్లి పవర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 351 మెగావాట్ల నుంచి 369 మెగావాట్లకు పెంచి చూపించి, విద్యుత్ కంపెనీలకు సుమారు రూ.వంద కోట్లకు పైగా నష్టాలను కలిగించింది. సెంట్రల్ ఎలక్షిక్టిసిటీ అథారిటీ(సీఈఏ) సైతం కొండపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 351 మెగావా నిర్థారించినప్పటికీ ల్యాంకో సంస్థ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ కాలయాపన చేస్తోంది.
సమాచార చట్టానికి అతీతమట!
ల్యాంకో ఇన్వూఫాటెక్ దక్కించుకున్న సోలార్ పవర్ ప్రాజెక్టు వివరాలు అత్యంత గోప్యంగా ఉంచేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. వీరితో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎన్టీపీపీ విద్యుత్ వ్యాపార నిగమ్లు కొమ్ముకాస్తున్నాయనే విమర్శలున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ సోలార్ మిషన్ బిడ్డింగ్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. చివరకు చట్టబద్ధంగా సమాచార హక్కు చట్టం కింద 2011 సెప్టెంబర్లో కేంద్రంలోని సంబంధిత శాఖను, సెంట్రల్ ఎలక్షిక్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సీఈఆర్సీ)ని, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగంను ఆశ్రయించింది. అయితే కేంద్ర విద్యుత్ నియంవూతణ మండలి(సీఈఆర్సీ), విద్యుత్ మంత్రిత్వ శాఖ సదరు సోలార్ ప్రాజెక్టుల వివరాలు తమ పరిధిలోకి రావని, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగంను సంప్రతించాలని ఉచిత సలహా ఇచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్టీపీసీ సంస్థ ఆ సమాచారం అత్యంత గోప్యమైందని పేర్కొంటూ సదరు కంపెనీలకు సంబంధించిన సమాచారం వెల్లడించినట్లయితే ఆయా కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొనడం గమనార్హం. దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఎన్టీపీసీ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. అయితే ఇప్పటి వరకు సమాచారం ఇంకా బయటకు రాలేదు.
ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధన ఎందుకు?
సోలార్ పవర్ ప్రాజెక్టు మిషన్ కింద 20వేల మెగావాట్ల సామర్థ్యాన్ని 2022 నాటికి సాధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ప్రస్తుతం సోలార్ విద్యుత్ ధర ఆకాశాన్ని అంటుతున్నది. ధరను అందుబాటులోకి తీసుకురావాలంటే సౌర విద్యుత్ రంగంలోకి ఎక్కువ కంపెనీలు వచ్చేందుకు వీలుగా ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు అనే నిబంధనను విధించారు. దీంతో పోటీ పెరగడంతో పాటు భవిష్యత్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి సౌర విద్యుత్ ఉత్పత్తి ధరలు తగ్గుముఖం పడుతాయనే ఆలోచ . ల్యాంకో చేసిన నిర్వాకంతో సోలార్ మిషన్ స్ఫూర్తికే గండికొట్టినట్లయ్యింది.
దొంగ కంపెనీ అర్హత ఎలా?
ఉదాహరణకు డీడీఈ రెన్యూవబుల్ ఎనర్జీ (డీడీఈఆర్ఈ) 5 మెగావాట్ల పీవీ ప్లాంట్ను దక్కించుకుంది. ఈ కంపెనీ కిషన్ లలిత్ బన్సల్, అతని ముగ్గురు పిల్లల పేరు మీద నమోదైంది. ఇదే బన్సల్ పేరుతో డీఈఈ డెవలప్మెంట్ ఇంజనీర్స్(డీఈఈడీఈ) అనే మరొక కంపెనీ నమోదై ఉంది. ఎంఎన్ఆర్ఈ నిబంధనల ప్రకారం బిడ్లో పాల్గొనేందుకు బిడ్డింగ్కు వారం రోజుల ముందు కంపెనీ మూలధనం కనీసం రూ.17కోట్లు ఉండాలి. అయితే బిడ్లలో డీడీఈఆర్ఈ కంపెనీ డీఈఈడీఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లను సమర్పించి బిడ్లో అర్హత సాధించింది. దీని ఆధారంగా ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ డీడీఈఆర్ఈ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీచేసింది.
అడ్రస్లన్నీ ఒక్కటే
విచిత్రం ఏమంటే సోలార్ ప్రాజెక్టు బిడ్లను దక్కించుకునేందుకు పుట్టించిన కంపెనీల అడ్రస్లు అత్యంత గోప్యంగా ఉంచారు. ప్రపంచంలో దేని గురించైనా ఇట్టే క్షణాల్లో గుర్తించేందుకు వీలుగా ఉన్న గుగూల్ సెర్చ్లో కూడా బిడ్లు దక్కించుకున్న కంపెనీల వివరాలు లేవంటే అవి ఎంతటి గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) సంస్థ సోలార్ పవర్కు స్వర్గధామంగా భావిస్తున్న రాజస్థాన్లో దీని మూలాలు ఉండవచ్చనే అనుమానంతో రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ను కూడా సంప్రతించింది. అనుకున్నట్లే సదరు కంపెనీల మూలాలు రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా ఆస్కందార గ్రామంలో ఉన్నట్లు బయటపడ్డాయి. ఈ గ్రామంలో సౌర విద్యుత్తు కోసం వెయ్యి హెక్టార్ల భూమిని ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. అయితే వాటికి సంబంధించి ఎక్కడా ఒక్క బోర్డు కానరాదు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ ల్యాంకో కోసమే పని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారని సీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అన్ని కంపెనీలకూ కలిపి ఒకే సెల్ ఫోన్ నెంబర్ ఉండడం గమనార్హం.
లాభం అంతా
ల్యాంకోదే!
ఖాయా, దివాకర్ సంస్థలు ల్యాంకోకు అనుబంధ సంస్థలు. అలాగే కెవికె ఎనర్జీలో సంస్థకు 49 శాతం వాటా ఉంది. డీడీఈ, ఎలక్షిక్టోమెక్ కంపెనీలలో 26 శాతం ఉంది. ఈ సంస్థ న్నింటి ప్రిఫన్షియల్ షేర్లలో ల్యాంకోకు 100 శాతం వాటా ఉంది. ఈ మొత్తం విలువ నేరుగా సోలార్ మిషన్లో భాగంగా ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందేందుకు ఒక సంస్థకు ఉండాల్సిన నెట్వర్త్ (నికర ఆస్తుల విలువ)తో సమానంగా ఉంది. సోలార్మిషన్లో నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పొందడానికి ఈ కంపెనీలను ఫ్రంట్ కంపెనీలుగా ఉపయోగించుకున్న విషయం ఇక్కడే ే టతెల్లం అవుతోంది. ప్రిఫన్షియల్ షేర్లు మూలధన వాటాలతో సమానంగా భావిస్తారు. అందునా ఈ షేర్లను భవిష్యత్లో ఈక్విటీ వాటాల రూపంలోకి బదలాయించుకునే అవకాశం ఉన్నందున ఈ కంపెనీలన్నింటిలో ల్యాంకోకు 99 శాతం వాటా దక్కే అవకాశం ఉంది.
ఎమ్ఎన్ఆర్ఈ
మార్గదర్శకాల ఉల్లంఘన
సోలార్ పవర్ ప్రాజెక్టు ఎంపికకోసం
జులై 2010లో ఈ మార్గదర్శకాలు
జారీ చేశారు.
1. సోలార్ పవర్ ప్రాజెక్టు బిడ్డింగ్కోసం ఓ కంపెనీ కేవలం ఒకే అప్లికేషన్ దాఖలు చేయాలి. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు డెవలపర్లు భాగస్వామ్య కంపెనీలైనా, వ్యక్తిగత కంపెనీలైనా, గ్రూప్ కంపెనీలైనా 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికోసం ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు లభించనుంది.
2. సోలార్ థర్మల్ ప్రాజెక్టు బిడ్డింగ్కోసం ఏ కంపెనీ అయినా నిర్దేశిత ప్రాంతంలో మాతృసంస్థకానీ, ఏదైనా గ్రూప్ సంస్థకానీ 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మాణానికి మాత్రమే అనుమతిస్తారు. కంపెనీలు బహుళ ప్రాంతాలలో ఎన్ని ప్లాంట్లను నెలకొల్పినా మొత్తం 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మించి అనుమతి లేదు.
3. కంపెనీని నడిపే ప్రమోటర్ కనీస మూలధనం వాటా నిబంధనను పరిమితులకు లోబడి అనుమతిస్తారు. పై నిబంధనలే అన్ని కంపెనీలకు వర్తిస్తాయి. స్టాక్ ఎక్సేంజిలలో లిస్టెడ్ కంపెనీలకు సోలార్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ప్రాజెక్టు డెవలపర్కు ఈ కంపెనీలో కనీసం 27 శాతం వాటాతోపాటు ఓటింగ్ హక్కులు కలిగి ఉండాలి. ఇలాంటి అన్ని హంగులు కలిగిఉన్న కంపెనీలకు ప్రాజెక్టు నిర్వహించబడిన సంవత్సరం కాలం తర్వాత విద్యుత్ పంపిణీకి అనుమతిస్తారు.
డీడీఈ పునరుత్పాదక సంస్థ
1. 17నవంబర్ 2009న డీడీఈ పునరుత్పాదక సంస్థ కే బస్నాల్ ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు డైరెక్టర్లుగా, ఓనర్లుగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ లక్ష రూపాయల ఈక్విటీవిలువ కలిగి ఉంది.
2. 10 సెప్టెంబర్ 2010న నైస్ ఇన్ఫ్రాకాన్
నైస్ ఇన్ఫ్రాకాన్ కార్పొరేట్ సంస్థ టోను కుమార్, క్రిష్ణ కుమార్ డైరెక్టర్లుగా ఏర్పాటు చేశారు. లక్షరూపాయల ఈక్విటీ విలువ కలిగిన ఈ కంపెనీలో వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఉంది.
3. 10-11 సెప్టెంబర్ 2010న ల్యాంకో ఉద్యోగి పిల్లలు ప్రేమ్ చంద్, సాహితి కుర్మోజు నైస్ ఇన్ఫ్రాకాన్ సంస్థలో డైరెక్టర్లుగా చేరారు. కుమార్ ఆ కంపెనీకి రాజీనామా చేశారు.
4. అక్టోబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ 2009-10 సంవత్సరానికి బాలెన్స్షీట్ సమర్పించింది. ఇందులో ఓనర్షిప్లోగాని, ఈక్విటీలోగాని ఎలాంటి మార్పులు లేవు.
5. 16 నవంబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు బిడ్ గెలుచుకుంది.
6. 31 డిసెంబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ 15.2 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాధాన్యతా షేర్లను క్రిష్ణన్ లలిత్ బన్సల్ స్థాపించిన డీడీఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ కంపెనీకి బదలాయించింది.
7. ఫిబ్రవరి 2011న 2009-10 సంవత్సరానికి సవరించిన బాలెన్స్ షీట్ను సమర్పించింది. 23 శాతం క్రిష్ణన్ లలిత్ బన్సల్ పేరిట మరో 77 శాతం పేరు తెలియని వాణిజ్య సంస్థ పేరిట చూపించారు. అదేరోజు బాలెన్స్షీట్లో కంపెనీ కొత్త డైరెక్టర్లుగా ప్రేమ్చంద్, సాహితి కుర్మోజులను పేర్కొంది.
. 30 మార్చి 2011న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ నుంచి క్రిష్ణన్ లలిత్ బన్సల్ మినహా బన్సల్ కుటుంబ సభ్యులంతా కంపెనీ డైరెక్టర్లుగా రాజీనామా చేశారు.
9. 31 మార్చి 2011న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థలోని మెజారిటీ షేర్ 74 శాతం సొంతం చేసుకుని కంపెనీని హస్తగతం చేసుకుంది. అదేసమయంలో ల్యాంకో 26 శాతం వాటాతోపాటు 15.2 కోట్ల ప్రిపన్షల్ షేర్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కంపెనీ 15.2 కోట్ల రూపాయల ప్రిఫన్షల్ షేర్లను విడుదల చేసింది. కంపెనీ పేరుపై 15 కోట్ల రుణాలతోపాటు 5 లక్షల రూపాయల నగదు, బ్యాంక్ బాలెన్స్ ఉన్నట్లు వివరించింది.
10. 14 నవంబర్-16 డిసెంబర్ 2011 తేదీలలో డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ/నైస్ ఇన్ఫ్రాకాన్ సంస్థలలో రవీందర్ సింగ్తో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా వచ్చారు. వీరిలో రవీందర్ సింగ్ ల్యాంకో సోలార్లో పని చేస్తున్నారు.
ఎలక్షిక్టోమెక్ మారిటెక్ సంస్థ
11. 2 జనవరి 200న లక్షరూపాయల ఈక్విటీ కలిగిన ఎలక్షిక్టోమెక్ మారిటెక్ సంస్థలో తుషార్ వినాయక్ మెహెందాలె, అవంతి తుషార్ మెహెందాలె డైరెక్టర్లుగా ఏర్పాటు చేశారు. వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఈ కంపెనీలో ఉంది.
12. 7 సెప్టెంబర్ 2010న గోల్డెన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ టోను కుమార్, క్రిష్ణన్ కుమార్ శర్మ డైరెక్టర్లుగా ఏర్పాటైంది. లక్ష రూపాయల ఈక్విటీ విలువకలిగిన ఈ సంస్థలో వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఉంది.
13. 10-11 సెప్టెంబర్ 2010న సురేశ్, యర్రగుంట్ల నాగరాజు గోల్డెన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో కొత్త డైరెక్టర్లుగా చేరారు. వీరిద్దరూ కుర్మోజు పక్కింటివారు కావడం విశేషం. అదేరోజు కుమార్ రాజీనామా చేశారు.
14. 16 నవంబర్ 2010న ఎలక్ట్రో మారిటెక్ సంస్థ 5 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ బిడ్ గెలుచుకుంది.
15. 31డిసెంబర్ 2010న తుషార్ బీఎమ్ సారథ్యంలోని ఎలక్షిక్టోమెటీరియల్ హాండ్లింగ్ కంపెనీకి 15.2 కోట్ల ప్రిఫన్షల్ షేర్లను ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీ బదలాయించింది.
16. 2 జనవరి 2011న ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీ 2009-10 సంవత్సరానికి సవరించిన బాలెన్స్ షీట్ సమర్పించింది. ఇందులో 0.01 శాతం వాటాలను తుషార్ వీఎమ్ పేరుపై 99 శాతం పేరు తెలియని కంపెనీ పేరుపై చూపించింది. ఇక కంపెనీ ఈక్విటీ విలువ లక్షరూపాయలుగా, లక్షరూపాయలు బ్యాంక్ బాలెన్స్ ఉన్నట్లు బాలెన్స్షీట్ వివరించింది.
17. 29 జనవరి 2011న ఎలక్షిక్టోమెక్ కంపెనీనుంచి అవంతి టీ మెహెందాలె రాజీనామా చేశారు. అదేరోజు సురేశ్తోపాటు నాగరాజ యర్రగుంట్ల అడిషనల్ డైరెక్టర్లుగా కంపెనీలో చేరారు. ్చటఠ్ఛిజిఝ్చజీజూ.ఛిౌఝ ఈ-మెయిల్ అడ్రస్ నుంచి వీరిద్దరికీ నియామకపవూతాలు జారీ అయ్యాయి. ఈ- మెయిల్ అడ్రస్ ల్యాంకో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిది కావడం గమనార్హం.
18. 31 జనవరి 2011న ఎలక్షిక్టోమెక్ కంపెనీ మరోసారి 2009-10 సంవత్సరానికి బాలెన్స్ షీట్ను సవరించింది. తుషార్ పేరుపై 0.01 శాతం వాటా మరో 23 శాతం వాటా వాటాదార్లపేరుపై చూపించారు. 76.99 శాతాన్ని వేరే కంపెనీల పెట్టుబడులుగా చూపించారు.
19. 31 మార్చి 2011
ఎలక్షిక్టోమారిటెక్/గోప్డూన్ ఇన్వూఫావూపాజెక్ట్స్
ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీలో 74 శాతం ఈక్విటీని సొంతం చేసుకుని గోల్డెన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ చేజిక్కించుకుంది. లాంకో కంపెనీ 26శాతం ఈక్విటీతో 15.2 కోట్ల రూపాయల ప్రిఫన్షల్ షేర్లను సొంతం చేసకుంది. ఆ తర్వాత కూడా కంపెనీ 15.2 కోట్ల రూపాయలతో ప్రిఫన్షల్ షేర్లను విడుదల చేసింది. కంపెనీ పేరుపై 15 కోట్ల రుణాలను తీసుకుంది. రెండు లక్షల రూపాయల నగదు బ్యాంక్ బాలెన్స్ కలిగిఉంది.
-24 సెప్టెంబర్ 2010 తేదీన ఎంపిక ప్రక్రియ కోసం అభ్యర్థన మేరకు చివరితేదీని సవరించింది.
-ఈకాలంలో వాటాదారులను మార్చడాన్ని, షేర్ల బదిలీని అనుమతించరు.
-10 జనవరి 2011 తేదీన విద్యుత్ కొనుగోలుకోసం ఎన్వీవీఎన్ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది.
-ప్రాజెక్టు ఏర్పాటు చేసిన తర్వాత ఏడాదివరకు ప్రాజెక్టు సొంతదారు షేర్లపై తన నియంత్రణను మార్చుకోరాదు.
-10 జనవరి 2012 ప్రాజెక్టుల ప్రారంభానికి తుది గడువు.
నిబంధనలు తుంగలో తొక్కి
13 వేల కోట్లకు లగడపాటి టెండర్
- జాతీయ సోలార్ మిషన్కు టోకరా !
- బోగస్ కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలి
- లగడపాటిని అరెస్టు చేయాలి
- టీఆర్ఎస్ పోలిట్ బ్యూరోసభ్యుడు దాసోజు శ్రవణ్ డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (: తెలంగాణ ప్రాంతాన్ని దోపిడి చేసి వేల కోట్ల రుపాయలు దోచుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దృష్టి ప్రస్తుతం జాతీయ సంపదపై పడిందని టీఆర్ఎస్ పోలిట్బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో విలేకర్లతో ఆయన మాట్లాడారు. తెలంగాణ బొగ్గును దోచుకుని ఆంధ్రలో విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పి లగడపాటి డబ్బు చేసుకున్నాడని విమర్శించారు. వక్ఫ్ భూములను కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో హిల్స్ నిర్మించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు జాతీయస్థాయిలో దోపిడీకి లగటపాటి తయారయ్యారని శ్రవణ్ దుమ్మెత్తి పోశారు. ప్రస్తుతం జాతీయ సోలార్ మిషన్ విద్యుత్ ప్రాజెక్టులలో నిబంధనలను అతిక్షికమించి 13 వేల కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో జాతీయ సంపదను కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు. అర్హతలేని వ్యక్తుల పేర్లతో తొమ్మిది బినామి కంపెనీలను సృష్టించాడన్నారు.
దొంగ బాలన్స్ షీట్లతో 13 వేల కోట్ల రుపాయల సబ్సిడీ గల 235 ఎంవిఏ సామర్థం ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టును పొందిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఒక కంపెనీకి 105 మెగావాట్ల ప్రాజెక్టును మాత్రమే అప్పగించాలి. కానీ లగటపాటి జిత్తులమారి ఎత్తులతో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు ప్రదర్శించి 235 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్నారన్నారు. లగడపాటిని తక్షణమే అరెస్టు చేసి, ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే స్వచ్ఛందసంస్థ పూర్తి స్థాయి విచారణ జరిపి లగడపాటి అవినీతి బాగోతాన్ని బయట పెట్టిందని, దీనిని జాతీయ పత్రికలు వెలుగులోకి తెచ్చాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినందుకు కేంద్రవూపభుత్వం లగడపాటికి దీనిని కానుకగా ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోక పోతే తామే సీబీఐని సంప్రదిస్తామని తెలిపారు. ఈ విషయాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చి జాతీయ సోలార్ మిషన్ లగడపాటికి ఇచ్చిన అగ్రిమెంట్ను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ల్యాంకో గ్రూప్పై విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో ఇన్ఫ్రాటెక్ జాతీయ సౌర విద్యుత్ ప్రాజెక్టును పొందిందన్న సెంటర్ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ‘ఈ అంశంపై మేం విచారణకు ఆదేశించాం. వ్యక్తిగతంగాగానీ, ప్యానెల్ ఏర్పాటుద్వారా గానీ విచారణ చేపడతాం’ అని కొత్త శక్తుల పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఉమ్మడి కార్యదర్శి తరుణ్ కపూర్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు తేలినా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Take By: T News
'సర్కారు’ కరెంటు బకాయిలు వెయ్యి కోట్లు!
-కనెక్షన్లు కత్తిరిస్తున్న డిస్కమ్లు
-అంధకారంలో సంక్షేమ హాస్టళ్లు,స్కూళ్లు, పీహెచ్సీలు
-తాగునీటి పథకాల బోర్లకూ కట్
-నీటి కోసం అల్లాడుతున్న పల్లెలు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 ():ఆ స్కూళ్లో బోరుంది! కానీ.. గొంతు తడుపుకుందామంటే విద్యార్థులకు గుక్కెడు నీళ్లు కరువు! కారణం.. కరెంట్ కనెక్షన్ కత్తిరించడమే! అదో సంక్షేమ హాస్టల్! తమ పిల్లలను చదివించే ఆర్థిక స్థోమతలేని పేద తల్లిదంవూడులకు ఇవి ఆశాదీపాలు! కానీ ఇప్పుడవి అంధకారంలో మగ్గుతున్నాయి! ఆ విద్యార్థులకు గ్యాస్8నూనె దీపం వెలుతురులే గతి! కారణం.. కరెంట్ కనెక్షన్ కత్తిరించడమే! అదో ప్రభుత్వ ఆస్పత్రి! పేదల పాలిట సంజీవని! కానీ..సెల్ఫోన్ లైట్ వెలుగులోనే డాక్టర్లు సూదిమందు వేస్తున్నారు! టార్చిలైట్ వెలుతురులోనే రోగులను పరీక్షిస్తున్నారు! దీనికి కారణం కూడా.. కరెంట్ కనెక్షన్ను కత్తిరించడమే! ఇక గవర్నమెంట్ ఆఫీసుల సంగతి చెప్పనక్కర్లేదు! ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో నెలకొన్న దుస్థితి. గత ఆరు నెలలుగా ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ బకాయిలు రాకపోవడంతో డిస్కమ్లు వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాయి. కరెంటు వైర్లను కత్తిరిస్తున్నాయి. ఫలితంగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోతున్నాయి. సంక్షేమ హాస్టళ్ళు, పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అంధకారంలో మగ్గుతున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వ శాఖలకు వందల కోట్ల కేటాయింపులు జరుగుతున్నా చిట్టచివరకు కరెంటు బిల్లులకే నిధులు లేని దుస్థితి నెలకొనడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వెల్లు ఆర్థికభారం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు.. వందకు వంద శాతం విద్యుత్ చార్జీల వసూళ్లు ఉండేలా సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి.
అయితే ప్రభుత్వ శాఖలకు సంబందించిన బకాయిలే ఎక్కువ మొత్తంలో పేరుకుపోయి ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో వాటికి సరఫరా నిలిపివేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.567.63 కోట్ల మేరకు కరెంటు బిల్లుల బకాయిలు ఉండడం గమనార్హం. తదుపరి స్థానంలో రూ.154.13 కోట్లతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిలిచింది. ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటు వినియోగానికి సంబంధించి రూ.122 కోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇలా ఆయా శాఖల నుంచి దాదాపు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోయాయి. వాస్తవానికి రాష్ట్రస్థాయిలో సంబంధిత శాఖలు కరెంటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి నిధుల సర్దుబాటుచేయాల్సి ఉన్నా కొన్ని నెలలుగా ప్రభుత్వానికి పట్టించుకోవ మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధుల మంజూరులో ఆర్థిక శాఖ అనేక కొర్రీలు వేసే అవకాశాలు ఉంటాయి. దాంతో ఆయా శాఖల బకాయిల చెల్లింపులు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఎంతటి వారైనా వాటికి విద్యుత్ సరఫరాను తొలగించాలని డిస్కం యాజమాన్యాలు అధికారులను ఆదేశించాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా వీధి దీపాలు వెలగడం లేదు. తాగునీటి పథకాల బోర్లు పని చేయడం లేదు. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో 21,806 గ్రామ పంచాయతీలుండగా, వాటిలో 1,247 మేజర్ గ్రామపంచాయతీలు, 20,559 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఆదాయవనరులు అంతంతమావూతంగా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలకు నిత్యం కరెంటు వాడకం అవసరం కావడం వల్ల బిల్లుల చెల్లింపుల్లో గతంలో ప్రభుత్వం కొంత వెసలుబాటును కల్పించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పంచాయతీల కరెంటు బిల్లుల విషయంలో ప్రభుత్వం అశ్రద్ధ వల్ల వేలల్లో, లక్షల్లో ఉన్న విద్యుత్ బిల్లులు కాస్తా వందల కోట్లకు చేరాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read more...
Thursday, February 2, 2012
New York Muslims to rally against NYPD
WikiLeak's Assange extradition fight heads to UK Supreme Court
Two women in Sweden accused Assange in August 2010 of sexually assaulting them.
The extradition case is not linked to Assange's work as founder and editor-in-chief of WikiLeaks, which has put him on the wrong side of U.S. authorities.