Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, November 22, 2011

ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు

  •  పారిక్షిశామికవేత్తల భేటీలో సీఎం కిరణ్
    • వచ్చే నాలుగేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు
    • డిసెంబర్‌లో ప్రధాని చేతుల మీదుగా
    • లక్షమందికి నియామక పవూతాలు


హైదరాబాద్, నవంబర్ 21(): రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలిపారు. రాజీవ్ యువకిరణాల్లో భాగంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో 15లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం అమలుపై సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో సీఎం పలువురు పారిక్షిశామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు సచివాలయంలో రాజీవ్ విద్యా ఉపాధి కల్పనా మండలి (రీక్యాప్) మొదటి సమావేశం జరిగింది. చదువుకునే సమయంలోనే ఉపాధికల్పనకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. డిసెంబర్‌లో లక్ష మందికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేతులమీదుగా నియామకపవూతాలు అందజేస్తామని ప్రకటించారు. జనాభాలో 70 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పారిక్షిశామికవేత్తలను కోరారు.

రాజీవ్ యువకిరణాలు పథకాన్ని స్వాగతించిన పారిక్షిశామికవేత్తలు తమ పూర్తి సహకారాన్ని అందజేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనకు విభాగాల వారీగా ప్రభుత్వానికి, పారిక్షిశామికవేత్తలకు మధ్య సమావేశాలు జరిగితే కచ్చితమైన అవగాహన ఏర్పడుతుందని వారు అభివూపాయపడ్డారు. పరిక్షిశమ అవసరాలకు తగ్గట్లు అభ్యర్థులకు అవసరమైన శిక్షణను ఇచ్చేలా ఐటీఐ, పాలిటెక్నిక్‌లలలో మార్పులు జరగాలన్నారు. ఈ సమావేశంలో జీఎంఆర్, జీవీఆర్, ఇన్ఫోసిస్8లాంటి అగ్రసంస్థలతో పాటు వివిధ రంగాలకు చెందిన 50 కంపెనీల యజమానులు పాల్గొన్నారు. తమకు అత్యవసరంగా 20వేల మంది ఉద్యోగుల అవసరముందని వస్త్రవ్యాపారులు తెలుపగా, రాజీవ్ యువ కిరణాల కింద లక్షకుపైన ఉద్యోగాలిస్తామని ఫార్మా రంగం ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతాడ్డి, రఘువీరాడ్డి, సునీతాలక్ష్మాడ్డి, మహీధర్‌డ్డి, వట్టివసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది, రాజీవ్ యువకిరణాలు సీఈఓ కేసీడ్డిలతో పాటు వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.

Take By: T News


Tags: Telangana News, Telangana agitation, Telangana issue, Azad, T News, hmtv, tv9, Harish Rao, MLA, Sima Andra, AP News, MP, Political News ryk, ryk.cgg.gov.in  

Read more...

టార్గెట్ చిదంబరం

- రాజీనామా చేసేవరకు మాట్లాడనివ్వం
- సభలోనూ బాయ్‌కాట్ చేస్తాం
- వామపక్షాలతో పరస్పర సహకారం
- ఎన్డీయే కూటమి నిర్ణయం
- పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై
- అద్వానీ నివాసంలో మిత్రపక్ష నేతల భేటీ
- సభను అడ్డుకోవడానికే బీజేపీ ఎత్తులు: కాంగ్రెస్
- నేటి నుంచి శీతాకాల సమావేశాలు

chidambram talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, నవంబర్ 21:కేంద్ర హోంమంత్రి చిదంబరంను లక్ష్యంగా చేసుకొని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ముప్పేటదాడి చేయాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నిర్ణయించింది. 2జీ కుంభకోణంలో చిదంబరాన్ని బాధ్యుణ్ని చేస్తూ, ఆయన రాజీనామాకు పట్టుబట్టనుంది. సభలో చిదంబరాన్ని మాట్లాడనివ్వవద్దని, ఆయనను బాయ్‌కాట్ చేయాలని నిశ్చయించింది. 2జీ కుంభకోణం జరిగినప్పుడు ఆర్థికమంవూతిగా ఉన్న చిదంబరం రాజీనామా చేయాల్సిందేనని, ఆయన రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించేవరకు ఆయనను బాయ్‌కాట్ చేస్తామని ఎన్డీయే స్పష్టం చేసింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతల భేటీ జరిగింది. శరద్‌యాదవ్, మనోహర్ జోషి, అనంత్ గీతే, నరేశ్ గుజ్రాల్, శివానంద తీవారి, బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితర నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2జీ కుంభకోణంలో చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పు వాయిదా వేసిన నేపథ్యంలో ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించింది. ‘2జీ కుంభకోణంలో రాజాకు సమానంగా చిదంబరానికి బాధ్యత ఉంది. ప్రధాని రాజా రాజీనామాను ఆమోదించారు. కానీ చిదంబరం రాజీనామాను మాత్రం కోరడం లేదు.

చిదంబరం రాజీనామాను ఆమోదించేవరకు పార్లమెంటులో ఆయనను బాయ్‌కాట్ చేస్తాం. ఆయనను మాట్లాడనీవ్వం’ అని రాజ్యసభ ప్రతిపక్ష ఉప సభా నాయకుడు ఎస్‌ఎస్ అహ్లూవాలియా తెలిపారు. గతంలో జార్జ్ ఫెర్నాండెజ్ విషయంలో కాంగ్రెస్ ఇదే తరహాలో నిరసన తెలిపింది. తెహెల్కా వెలుగులోకి తెచ్చిన నకిలీ ఆయుధ ఒప్పందాలపై ఓ కమిషన్ విచారణ జరుపుతుండగానే, వాజ్‌పేయ్ కేబినెట్‌లోకి ఆయనను తిరిగి రక్షణ శాఖ మంత్రిగా తీసుకోవడాన్ని నిరసిస్తూ.. ఫెర్నాండెజ్ సభలో మాట్లాడటానికి లేచిన ప్రతీసారి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఇప్పుడు అదే నిరసనన ఎన్డీయే పునరావృతం చేయనుంది. చిదంబరం మాట్లాడటప్పుడు వాకౌట్ చేయకుండా, ఆయననుమాట్లాడనివ్వమని అహ్లూవాలియా స్పష్టం చేశారు. నల్లధనం, ధరల పెరుగుదల అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాల విషయంలో వామపక్షాలు, ఎన్డీయే నేతలు పరస్పరం సహకరించుకుంటాయని బీజేపీ నేతలు తెలిపారు. ‘సభలో ప్రవేశపెట్టబోయే తీర్మానాల గురించి ఇరువురం చర్చించకొని, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాం. తీర్మానాలపై విపక్షాలు ఉమ్మడిగా తమ వాదాన్ని వినిపించనున్నాయి’ అని అహ్లూవాలియా స్పష్టం చేశారు. అయితే ఎన్డీయే-వామపక్షాల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం గురించి తమకు తెలియదని సీపీఎం చెబుతోంది. ఈ విషయంలో బీజేపీ నేతలకు సీపీఐ నేత గురుదాస్‌గుప్తా హామీ ఇచ్చారని, వామపక్షాలు పెట్టబోయే ధరల పెరుగుదల తీర్మానానికి బీజేపీ మద్దతివ్వడం సాధారణ విషయంగానే చూస్తున్నామని తెలిపింది. గ్రామీణ భారతానికి సంబంధించిన అంశాలను సభలో లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది.

ఆంధ్రవూపదేశ్, మహారాష్ట్రలలో పత్తి రైతుల ఆత్మహత్య, ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, ధాన్యం సేకరణ సరిగ్గా చేపట్టకపోవడంతో వరి రైతుల దుస్థితి తదితర అంశాలను ఎన్డీయే సభలో లేవనెత్తనుంది. పౌర అణు బాధ్య త చట్టంలో తెచ్చిన కొత్త నిబంధనల అంశాన్ని కూడా ప్రస్తావించనున్నామని, పార్లమెంటు విశ్వాసం తీసుకోకుండానే తెచ్చిన కొత్త నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల అంశాన్ని లేవనెత్తునున్నామని వెల్లడించింది. అంతుకుముందు అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక వర్గం భేటీ అయింది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో అధికార యూపీఏ సర్కారును పలు అంశాలపై ఎండగ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

కాంగ్రెస్ ఎదురుదాడి
చిదంబరాన్ని లక్ష్యంగా చేసుకోవాలన్న ఎన్డీయే నిర్ణయాన్ని అధికార కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్డీయే ఈ ఎత్తులు వేస్తోందని ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ అగ్ర నేతలు సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సభలో ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని, సభ సజావుగా సాగేందుకు, ముఖ్యమైన బిల్లులు ప్రభుత్వం ఆమోదించేలా సహకరించాలని సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్ బన్సల్ విపక్షాలను కోరారు.


Read more...

U.P. House votes for split

Uttar Pradesh Chief Minister Mayawati addressing a press conference regarding a proposal for creation of four states, in Lucknow last week. Photo: PTI
Uttar Pradesh Chief Minister Mayawati addressing a press conference regarding a proposal for creation of four states, in Lucknow last week.


Uttar Pradesh Chief Minister Mayawati on Monday moved a resolution in the Vidhan Sabha for splitting the State into Purvanchal, Bundelkhand, Avadh Pradesh and Pashchim Pradesh and it was passed by voice vote amid pandemonium. The House was adjourned sine die within 20 minutes after the winter session began. 

The resolution went through as members of the Samajwadi Party and the Bharatiya Janata Party stormed the well. The adjournment stunned the two parties, as they had served a no-confidence notice against the government and demanded a discussion. Nor was there any discussion on the resolution, though it was supported by the Rashtriya Lok Dal. 

Before the resolution was moved, a vote-on-account for the first four months of 2012-13 was passed by voice vote. The winter session was to have lasted for two days, and the decision of the Business Advisory Committee was read out by Speaker Sukhdev Rajbhar. However, after the vote-on-account and the 
resolution were passed, he adjourned the House sine die at 12.35 p.m. 

Barring five minutes after the House assembled, the entire question hour was lost. When the House re-assembled at 12.20 p.m. for zero hour, the rest of the proceedings were concluded in 15 minutes, before the curtains were down on the session, possibly the last of the 15th Vidhan Sabha. 

U.P. to send resolution to Centre soon
 
The Central government was being asked to reorganise Uttar Pradesh into Purvanchal, Bundelkhand, Avadh Pradesh and Pashchim Pradesh, Chief Minister Mayawati said while reading out the resolution in the Vidhan Sabha on the issue. She defended her move saying her government had fulfilled its responsibility in people's interest. 

After the resolution was passed, Parliamentary Affairs and Finance Minister Lalji Verma urged the Speaker that the passage of the vote-on-account be taken as a vote of confidence in the government. This, too, was passed by a voice vote 

Ms. Mayawati later told journalists that the resolution would soon be sent to the Centre. She rejected the Opposition charge that the decision was an election stunt. 

She parried a question whether the division would form her Bahujan Samajwadi Party's agenda for the Assembly elections due next year. She said the reorganisation was necessary for development. 

The House got off to a stormy start when it assembled for question hour, with Samajwadi Party members demanding the dismissal of the government and BJP members trooping into the well.
While the BJP said it had no confidence in the government, the Samajwadi Party said the government was in a minority. 

As bedlam prevailed, the Speaker adjourned the House till 12.20 p.m.
The commotion continued when the session resumed after question hour, before the House was adjourned. 

Talking to journalists, Leader of the Opposition Shivpal Singh Yadav accused the government of violating the Constitution as the no-confidence motion was not put up for discussion. 

“In a minority”
 
He said the government was in a minority and the people did not want any division of the State. 

He later led a Samajwadi Party delegation to Governor B.L. Joshi and demanded that a special session of the Assembly be convened, and the proposal be put to vote. 

BJP Legislature Party leader Om Prakash Singh said the decision to table the resolution was ill-intentioned, as it was passed without any discussio



Read more...

తిరుగులేని మాయాస్త్రం విభజనం

-కామ్ ఖతం.. ఖేల్ షురూ
- యూపీ విభజన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
- ప్రతిపక్షాల ‘అవిశ్వాసం’ ముందుకు రాకమునుపే
   పావులు కదిపిన సీఎం మాయావతి
- సభలో గందరగోళం.. స్పీకర్‌పైకి కాగితపు ఉండలు
- మూజువాణితో తీర్మానం ఆమోదం
- ఇది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం: మండిపడ్డ ప్రతిపక్షాలు
- జనం కోసమే.. ఆకాంక్షల మేరకే: తిప్పికొట్టిన సీఎం
- ఎన్నికల్లో ప్రజలు ప్రతిస్పందిస్తారని వ్యాఖ్య



mayavathi talangana patrika telangana culture telangana politics telangana cinemaలక్నో, నవంబర్ 21:ఉత్తరవూపదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం ప్రతిపక్షాలను ఊహించనిరీతిలో దెబ్బకొట్టారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని విపక్షాలు భావించగా, రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడదీయాలన్న తీర్మానాన్ని ఆమె సోమవారం శాసనసభలో మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదావేయడంతో ప్రతిపక్షాలు బిత్తరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ముఖ్యమంత్రి చర్య దారుణమని, రాజ్యాంగ నియమాలను అనుసరించలేదని ములాయం సహా కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ, బీజేపీ నేత ముఖ్తార్ అబ్వాస్ నక్వీ తీవ్రంగా ప్రతిస్పందించారు.

మాయావతి చర్యను ప్రజాస్వామ్య హత్యగా, రాజకీయ డ్రామాగా, పక్కదారిపట్టించే ఎత్తుగడగా అభివర్ణించారు. సభ కార్యకలాపాలను రద్దుపరచి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అందుకు ఒక విధానాన్ని అనుసరించాలని పలు పార్టీలు పేర్కొన్నాయి. విపక్షాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న మాయావతికి అనూహ్యంగా ఎస్పీ మాజీ నేత, ములాయం మాజీ సన్నిహితుడు అమర్‌సింగ్ నుంచి మద్దతు లభించింది. ఆయన మాయావతి పక్షం నిలిచారు. సోషలిస్టు రాంమనోహర్ లోహియా కూడా చిన్న రాష్ట్రాలవైపేనని పేర్కొన్నారు. ములాయం వ్యాఖ్యలతోపాటు ప్రతిపక్షాల విమర్శలను మాయావతి తోసిపుచ్చారు. వీటికి ఎన్నికల్లో ప్రజలు ప్రతిస్పందిస్తారని, సరైన బదులిస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చిన్న రాష్ట్రాల డిమాండ్‌కు అనుకూలంగా మాయావతి ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

ఉత్తరవూపదేశ్‌ను పూర్వాంచల్ (తూర్పు యూపీ), హరిత్ ప్రదేశ్ (పశ్చిమ యూపీ), బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్ (మధ్య యూపీ) అనే నాలుగు రాష్ట్రాలుగా విడదీయాలని ఆమె నిర్ణయించుకున్నారు. తన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోనందునే ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రతిపక్షాల నినాదాలు, కేకల మధ్య ఉద్రిక్త పరిస్థితిలో ప్రారంభమయ్యాయి.

మాయావతి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు బీజేపీ, ఎస్పీ ప్రయత్నించాయి.బీజేపీ సభ్యులు స్పీకర్ ముందుకు దూసుకురాగా, ఎస్పీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి సభలో పూర్తి మెజారిటీ ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి లాల్జీ వర్మ ప్రకటించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. గందరగోళం మధ్య స్పీకర్ సుఖ్‌దేవ్ రాజ్‌భర్ ప్రశ్నోత్తరాల కార్యక్షికమాన్ని మధ్యాహ్నం 12.20 వరకు వాయిదా వేశారు. సభ మళ్ళీ ప్రారంభం కాగానే, ముఖ్యమంత్రి మాయావతి సమక్షంలో ఎస్పీ, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు. సభ మధ్యలోకి దూసుకొచ్చారు. సభ్యులు స్పీకర్‌పైకి కాగితపు ఉండలు విసురుతుంటే మార్షల్స్ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో సభ 2012-13 సంవత్సరానికి సంబంధించిన మొదటి నాలుగు నెలల ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదం పొందింది. ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత ప్రమోద్‌తివారీ ఆరోపించారు.

ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరగాలనే విభజనను కోరుతున్నట్లు ముఖ్యమంత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాన్ని విడదీసే తీర్మానం ఆమోదం పొందింది. ఇది బీఎస్పీ రాజకీయ ప్రతిపాదన కాదు. మా ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యా తీసుకోనందునే మేమిలా చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రయోజనార్థం విడదీసే చర్య చేపట్టి ఉత్తరవూపదేశ్ శాసనసభ తన విధిని నిర్వర్తించింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘సముచిత రీతిలో ఉత్తరవూపదేశ్, ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం అవసరం’’ అని ఆమె స్పష్టం చేశారు. తన ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్న సమాజ్‌వాదీ, బీజేపీల వాదనను ఆమె తోసిపుచ్చారు.

అది ఆధారరహితమని కొట్టిపడేశారు. ‘‘బీఎస్పీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శ రాజకీయ దురుద్దేశపూరితమైనది. బలహీనపరచాలనే ప్రయత్నమది. చీలికను ప్రతిపక్షాలు అంగీకరించవు.. ఎందుకంటే- అవి రాష్ట్ర ప్రగతిని కోరుకోవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అక్కడ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామాలిచ్చారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం కూడా మైనారిటీలో పడిందని అనందుకుని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మాయావతి మండిపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ఎంపీలు అవినీతి ఆరోపణలతో జైలు ఊచల వెనుక ఉన్నారు. కాంగ్రెస్‌గానీ, ఇతర పక్షాలుగానీ కేంద్రంలోని ప్రభుత్వం మైనారిటీలో ఉందని అనడం లేదు’’ అని ఆమె అన్నారు.

రాష్ట్రాన్ని విడదీయాలన్న ప్రతిపాదన రాజకీయపరమైనదన్న ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. శాంతిభవూదతల క్షీణత, అభివృద్ధి మందగమనం నుంచి దృష్టి మళ్ళించేందుకే ఇలా చేశారన్న విమర్శలను ఆమె కొట్టి పడేశారు. ‘‘ఉత్తరవూపదేశ్ ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలకు బదులిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

నియంతృత్వం.. మాయావతి హిట్లర్

ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విడదీయాలన్న తీర్మానాన్ని మాయావతి ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదింపజేయడాన్ని, శాసనసభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆమె నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ ఈ పరిణామంపై ప్రతిస్పందిస్తూ మాయావతిని హిట్లర్‌తో పోల్చారు. మాయావతి నియంతృత్వ పాలనాతీరుకు ఇది మరో దృష్టాంతమని బీజేపీ నేత సిద్ధార్థ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. తీర్మానాన్ని ఆమోదించడం దిగ్భ్రాంతికరమైన చర్య అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయమంత్రి ఆర్‌పీఎన్ సింగ్ పేర్కొన్నారు. మాయావతి ముందుగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సిందని వ్యాఖ్యానించారు.

యూపీ చీలితే.. లాభమెవరికి? నష్టమెవరికి?
ఉత్తరవూపదేశ్ విడిపోతే రాజకీయంగా లబ్ధి పొందేది, నష్టపోయేది ఏయే పార్టీలనేది ఇప్పుడు చర్చనీయమవుతోంది. బీఎస్పీ అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి మాయావతి లబ్ధిపొందుతారనేది స్పష్టం. ఆమెకు బలమైన ఓటు బ్యాంకయిన దళితులు రాష్ట్రమంతా సమంగానే విస్తరించి ఉన్నారు. అందువల్ల ఆమె భారీగా లాభపడే అవకాశముంటుంది.

ములాయంసింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి కీలకమైనవి 8.7శాతం ఉన్న యాదవుల ఓట్లు. అవి అన్ని ప్రాంతాల్లో సమంగా లేవు. తూర్పు యూపీలో, ఎటావాలో ఎక్కువున్నాయి. రాష్ట్రీయ లోక్‌దళ్ పశ్చిమ యూపీలో హరిత్ ప్రదేశ్‌ను కోరుకుంటోంది. జాట్లు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆ పార్టీ ప్రయోజనం పొందవచ్చు. బీఎస్పీలాగే కాంగ్రెస్‌కు కూడా అన్ని ప్రాంతాల్లో ప్రభావమున్నప్పటికీ, అది చాలా స్వల్పం. అందువల్ల లబ్ధి చేకూరకపోవచ్చు. తూర్పు యూపీలో రాజ్‌పుత్, బ్రాహ్మణుల కారణంగా బీజేపీ ప్రభావముంటుంది.

ఏ పార్టీ బలమెంత?ఉత్తరవూపదేశ్‌లోని మొత్తం 404 అసెంబ్లీ స్థానాల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 219 సీట్లున్నాయి. ఎస్పీకి 88, బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 20, ఆర్‌ఎల్‌డీకి 10, ఆర్‌ఎస్‌పీకి 1, ఇండిపెండెంట్లకు 9స్థానాలున్నాయి. మరో 8 ఖాళీగా ఉన్నాయి.







Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP