Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, March 26, 2011

వి‘లీనం’... అయ్యేనా ?

న్యూఢిల్లీ, : తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కావడంవల్ల కాంగ్రెస్‌కు వచ్చే లాభనష్టాలేమిటి? లాభం ఉంటే... ఆ లాభం ఏ మేరకు ఉంటుంది? విలీనం వల్ల కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందా? కేసీఆర్‌ బయటినుంచి మద్దతు ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదు. అదే విలీనమై అసందర్భ వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్‌కు ఇబ్బందే కదా? అవి... ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది కదా?... ఇవన్నీ రాష్ర్ట కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌కు కలిగిన సందేహాలు. ఇవే సందేహాలకు ఆయన శుక్రవారం తనను కలిసిన తెలంగాణ ఎంపీల ముందు ప్రస్తావించారు.

టీఆర్‌ఎస్‌ విలీనంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలి సింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆజాద్‌ తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. అనంతరం 11.30 ప్రాంతంలో సీమాంధ్ర ఎంపీలతో విడిగా సమావేశమైనారు. ఇరు ప్రాంతాల ఎంపీలతో ఆయన టీఆర్‌ఎస్‌ విలీనం, కడప మాజీ ఎంపీ జగన్‌పైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో జగన్‌ ప్రభావం ఏ మేరకు ఉందని ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. జగన్‌ కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన బెంబేలు పడాల్సిన పనిలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆయన ఎన్నాళ్లు పార్టీని నడుపుతారో చూద్దాం. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూడకండి అని ఎంపీలకు సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ అభ్యర్థులు మూడు స్థానాలను గెలవడం వెనక కాంగ్రెస్‌ నేత హస్తం ఉన్నదన్న అనుమానాలను వ్యక్తం చేశారని తెలిసింది. అంతకు ముందు నిర్మాణ్‌ భవన్‌లోని తన కార్యా లయంలో తెలంగాణ ఎంపీలతో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఆ తరువాత సీమాంధ్ర ఎంపీలతో గంటసేపు సమావేశమయ్యరు. భేటీ అనంతరం తెలంగాణ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిస్థితులను ఆజాద్‌కు వివరించి లేఖను అందజేశామని తెలియజేశారు.

తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరాం..: టి-ఎంపీలు
రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోక ముందే అధిష్ఠానం చొరవ తీసుకుని తెలంగాణ ప్రక్రియప్రారంభించాలని కోరినట్లు ఎంపీలు వెల్లడించారు. ఎం పీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మందజగన్నాథం, పొన్నం ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడుతూ ఎన్ని అవాంతరా లు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే నని, తెలంగాణ ఏర్పాటు లేదా పదవీ త్యాగం మినహా మరో తమకు మార్గం లేదని స్పష్టం చేశామని ఎంపీలు వెల్లడించారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజలలో బలంగా ఉందని, ఉద్యమాన్ని నిలువరించ డం. కొనసాగించడం తమ చేతుల్లో లేదని, ఉద్యమాన్ని ప్రజలే స్వచ్ఛందంగా నిర్విహ స్తున్నారని తేల్చిచెప్పినట్లు ఎంపీ జగన్నాథం పేర్కొన్నారు.

ఈ వెనుకబాటు తనాన్ని భరించే శక్తి తమ కు లేదని, సీమాంధ్రులతో కలిసి ఉండే ప్రసక్తే లేద న్నారు. ఇప్పటికే సుమారు 6 వందల మంది విద్యా ర్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలు బలిదానం చేశా రని ఆవేదన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం మరే మడతపేచీ లేకుండా బేషరుతుగా డిసెంబర్‌ 9, 2009 చేసిన ప్రకటనకు కట్టుబడి వుండా లని గులాంనబీని కోరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్య మం కారణంగా సొంత నియో జకవ ర్గాలలో పర్యటిం చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ విశ్వసనీయత కు మారుపేరని, ప్రజలు కాంగ్రెస్‌ ప్రభు త్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ప్రజలకు విశ్వా సం కల్గించే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

ఎంపీ సర్వే సత్యనారాణయణ మాట్లాడుతూ సోనియా గాంధీ డిసెంబర్‌ 9 తన జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బహుమతిగా తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేసారని, 2011 డిసెంబర్‌ 9 లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు సీమాంధ్రులకు అమ్ముడు పోయి ఏక పక్షంగా నివేదిక సమర్పించారని, ఆ నివేదిక సూచనలను పరిగణలోకి తీసుకోవద్దని ఆజాద్‌ను కోరి నట్లు వెల్లడించారు. తెలంగాణ పై స్పష్టమైన వైఖరిని వెల్లడించని కారణంగా కాంగ్రెస్‌ పార్టీ మండలి ఎన్నికలలో తీవ్రంగా నష్టపోయిందని గుర్తు చేసినట్లు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సురేష్‌ షేట్కార్‌, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మంద జగన్నాథం, అంజన్‌కుమార్‌ యాదవ్‌, బలరాం నాయక్‌, రాజయ్య, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ గౌడ్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి గురించే చర్చించాం...
తెలంగాణ అంశం చర్చకు రాలేదు: సీమాంధ్ర ఎంపీలు
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితర అంశా లపై ఆజాద్‌తో చర్చించామని సీమాంధ్ర ఎంపీలు పేర్కొన్నా రు. గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆయన కు అభినందనలు చెప్పామని మూకుమ్మడిగా మీడియా తో అన్నారు. కేవలం రాష్ట్రంలో సంక్షేమ పథకాలపై చర్చించామని, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంలో జోక్యం చేసుకుని మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని కోరిన ట్లు ఎంపీలు వెల్లడించారు.

మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఎంపీలు
మీడియాతో మాట్లాడేందుకు ఏమీ లేదని, ఏదైనా సమాచారం మా సీనియర్‌నాయకుడు నేదురుమల్లి జనార్ధ న్‌ రెడ్డి అందిస్తారంటూ సీమాంధ్ర ఎంపీలం దరూ అక్కడ నుంచి జారుకున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పురేందేశ్వరి, సాయిప్రతాప్‌, పల్లం రాజులు మీడియాకు దూరంగా వెళ్లిపోయారు. ఎంపీ హర్షకుమార్‌ నేనేమి మాట్లాడానో మీకు తెలుసు, ఇంకా మీతో చెప్పేందుకేమీ లేదంటూ దాటవేశారు. సీమాంధ్ర ఎంపీలలో కావూరి సాంబ శివరావు, కిషోర్‌ చంద్రదేవ్‌, ఎప్‌పివై రెడ్డి, చింతా మోహన్‌, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, సబ్బం హరి హాజరు కాలేదు.

ponnallaరాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోక ముందే అధిష్ఠానం చొరవ తీసుకుని తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలి. తెలంగాణ తప్ప మరి దేనికీ మేం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లింది. దాన్ని ఆపడం, లేదా కొనసాగించడం మా చేతుల్లో లేదు
- పొన్నం ప్రభాకర్‌

Read more...

శ్రీ కృష్ణ కమిటీ ఒక నికృష్ట కమిటీ




జస్టిస్ శ్రీకృష్ణా! ఏందీ ఇట్లా జేసినవ్ ఇంత బతుకు బతికి ఇంటెనక పడి చచ్చినట్లు ఇదేంది ఇంత అడ్డగోలు రిపోర్ట్ ఇచ్చినావ్ మా ఆంధ్రోల్లు మంచిగ అరుసుకున్నట్ల గొడ్తుంది మాకు తెలుసు మా ఆంధ్ర లీడర్లు ఇసొంటి దాంట్ల మంచి మొనగాండ్లు ఆల్ ఇండియా లెవల్ల పోటి పెడితే నంబర్ వొన్ పొజిషన్ల ఉంటరు వీళ్ళు గీ పనిల ఎంత మాహెర్లంటే యమ ధర్మరాజసొంటోన్ని కూడా ఎర్రి బాగులోన్ని చేసి నిండా ముంచుతరు అయినా మా కు తెల్వక అడుగుతున్నం గీ ఇంత మాత్రం దానికి ఒక ఏడాదిపాటు రాష్ట్రమంత ఊర్ల పొంటి బా లసంతపోల్లలెక్క ఏషాలేస్కోని గంట కొట్టుకుంట తెగ తిరిగితిరి బైన్లోల్లలెక్క ఎల్లమ్మ కథలు చెప్తిరి రాష్త్రంల అందర్నీ సంతోష పెడత మని ఉత్తర కుమార కోతలు కోస్తిరి అందర్నీ అంటే ఆంధ్రోల్లనని ఇప్పుడర్థమైందనుకో అదేదో పండుగ సంబరమైనట్లు పెద్ద పెద్దోల్లకు విందులిస్తిరి మీడియా వాళ్ళకు మంచి మంచి ‘తోఫా’ లిస్తిరి ప్రజల సొమ్ము 20 (40 ?) కోట్లు ఖర్చు పెడ్తిరి పైకి చెప్పేది అంత, అసలు ఎంత ఖర్చుపెట్టిండ్రో మీ వాళ్ళకు ఎక్కడెక్కడ ఎంతెంత ముట్టిందో ముందు ముందు అంతా తెలుస్తదనుకో౦డ్రి. అయిన అంతా ఆంధ్ర లీడర్లు, గవర్నర్,సి ఎస్, డిజిపి చెప్పినట్లు రాయడానికి ఇంత పగటేశాలె౦దుకు ఇంకొక సంగతి మాకు సరిగ్గ అర్థమైతలేదు నీవు నీ కమిటీ మెంబర్లు ఎంతో సుద్ద పూసలని ఎక్కడెక్కడెనో ఎతికి ఎతికి పట్టుకొచ్చిండ్రు గదా మల్ల ఇప్పుడు ఇట్ల ఇంత మోసం ఎందుకు జేసిండ్రు.
మీ సెక్రెటరి దుగ్గల్, అంత మందు విందులకు, ఇంకా దేనికో అగలేనోన్ని మెంబర్ సెక్రటరీ గ ఎందుకు ఉరుకులాడి ఏసుకోవాల్సి వచ్చింది కృష్ణ, గోదావరి నదులెక్కడున్నవో తెలువని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఎందుకు వచ్చిండు ఊపుకుంట మద్రాస్ కంటే ముందే హైదరాబాద్ లో పవర్ స్టేషన్ ఉందని తెలువని, ఒక ఏడాది తిరిగినా రాష్ట్రం లో ఏ పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోలేక తప్పుల తడకలు రాసిన పవర్ ఎక్స్పర్ట్, రాష్ట్రం లో ముస్లింలు వేరే రాష్ట్రం కోరడం లేదని, అందరు రాష్ట్రం కాదు అభివృద్ధి కోరుకుంటున్న రని అడ్డగోలు అబద్ధాలు రాసిన సామా జిక వేత్తలు, ప్రభుత్వపు తారు మారు తప్పుడు లెక్కలే రైటని ప్రజలిచ్చిన నిజమైన లెక్కల్ని తుంగలో తొక్కి ఫాల్తూ రిపోర్ట్ లిచ్చిన ఎకనామిస్ట్ లను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?
మీ పవర్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ లో ఒక్కటైనా నిజముందని నిరూపిస్తే పది లక్షలు ఇస్తమని ఛాలె౦జ్ చేసినా మీ మెంబర్ల కు ఎవరెవరికి, ఎక్కడెక్కడ, ఎంతెంత ముడుపులు ముట్టినయో, తెర వెనుక ఏ౦ భాగోత౦ జరిగిందో బయట పెడతామని కొందరు చెప్పినా దొంగకు తేలు కుట్టినట్లు కిక్కురుమనకుండా ఉన్నారు ఎందు కు? అవన్నీ నిజమైతేనే గదా? నిప్పు లేనిదే పొగ రాదు అనేది నివొద్దె గదా ?
అయ్యా శ్రీకృష్ణ! నీవు సుప్రీం కోర్ట్ జడ్జివి గదా అని ఎంతోమర్యాదగున్న౦,కాని చూసే కొద్ది చూసే కొద్ది ఇదేంది నీ పనులు ఇంత అధ్వాన్నంగ ఉన్నయి జనం సూడడానికేమో రాష్ట్రమంత పది నెలలు తిరిగి పది గాడిదలు మోసే టంత సమాచారం తెప్పించుకొని అంత బుట్ట దాఖలు చేసి, ఆ పేపర్లు అమ్మితే సుమారైన పైసలొచ్చిఉండొచ్చుఎవరు తిన్నారో ఏమోగాని,మల్ల రిపోర్ట్ రాసే పని లగడపాటి,రాయపాటి,కావూరి,సుబ్బిరామి ల కిరాయి రాతగా౦డ్లకు అవుట్ సోర్సింగ్ చేసినట్టున్నావు అవునుమల్ల, మంచిగ మందు,విందు అన్నీ అరుసుకున్నంక రెట్టకు దెబ్బ తగలకుండ రాసిపెట్టేతోడుంటే ఇంకేం గావాలె
ఆ కిరాయిరాత గాళ్ళు ఆరు అడ్డగోలుసిఫారస్లు చేసిండ్రు దాంట్లో మీరు నాలుగు కొట్టేసినట్టు నాటకం చేసి అయిదోది ఏదో ఇచ్చినట్లు ఇచ్చి ఎన్నోరైడర్లు పెట్టి కుటిల కువాడపు రాజకీయం చేసిండ్రు ఇక ఆరోది పుచ్చిపోయిన పాత చింతకాయ తొక్కు. ఆయనుంటే మంగలోని తో పనేముంది అన్నట్లు
ఇంతకు ముందు ఒప్పుకున్న రక్షణలు ఆంధ్రులు సక్కగ ఏడ్సిఉంటె ఇన్నేండ్ల సంది ఈ గొడవ, లొల్లి ఎందుకుంటది ఎనకటికి నీ అసంటోడే కొ౦డను తొవ్వి ఎలుకను పట్టిండ౦ట వాడేమో తెల్వక తొవ్విండు, మీరేమో ఈ దోపిడీ దొంగల ‘హరామి’ తిని నీతిని, నిజాయితిని ‘ఖులే ఆ౦’ ఖూని చేసి నాటకమాడిండ్రు.
ఇ౦క మీ రిపోర్ట్ ఎనిమిదవ అధ్యాయ మైతే దేశ ప్రజాస్వామ్యానికే పెద్ద షాకు నిచ్చింది ఇదేమి సీక్రెట్ రిపోర్ట్ ?నీలాంటి సుప్రీం కోర్ట్ జడ్జి కమిటీ ఇవ్వవలసిన రిపోర్టా ఇది? నీవెక్కడున్నావు? భారతదేశం లోనా లేక ఎక్కడైనా ‘బనానా రిపబ్లిక్’ లోనా? హైకోర్ట్ జడ్జి గారు కేసు మొదట్లో చేసిన కామెంట్స్ చూసి పరేషాన్ అయినం కాని ఇప్పుడు చూస్తే అయన అన్నది చాల తక్కువ అనిపిస్తున్నది నాలుగున్నర కోట్ల అభాగ్య తెలంగాణ ప్రజలు యాబై నాలుగేండ్ల సంది ఆంధ్ర రాజకీయ నాయకుల చేతుల్లో అరిగోసలు పడి ఒక వెయ్యి మంది ప్రాణ త్యాగం చేసి ఒక పక్క గోడాడుతుంటే నీవు ఆంధ్రోల్లతో కుమ్మక్కై ఈ ఉద్యమం ఎట్లా అణచాలే, రాజకీయంగా ఎవరి గాలి ఎ ట్ల తియ్యాలే న్యూస్ పేపర్లు ఎట్లా మేనేజ్ చెయ్యాలే, స్టూడెన్ట్లని ఎట్లా కొట్టి హిమ్సించాలే ఏం లాఠీలు,తూటాలు వాడాలె , నక్సలైట్లు ,టెర్రరిస్టులు ఎట్ల ఉరికి వస్తరు తెలంగాణ నిండా అని చెప్పిప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చినావు బుధ్ధిఉన్న ఎవడైనా నీ రిపోర్ట్ చూసి తల దిన్చుకోక తప్పదు ఇంత మోసంతో దుర్మార్గంతో అవినీతి తో కూడుకొన్న కమిటీ రిపోర్ట్, స్వతంత్ర భారతం లో రాలేదంటే అబద్ధం కాదు సుప్రీం కోర్ట్ జడ్జి ఇజ్జత్ మూడు కాసులకు తీసేసినవు ఇది ఆంధ్ర రాజకీయ నాయకుల గలీజు రాజకీయ సంస్కృతికి
మీ అవినీతి, ఆత్మవంచనకు అక్షరాల అద్దం పడుతుంది మీరు ఆ ‘థగ్గులు పిండారీ’లతో చేతులు కలిపి చరిత్ర హీనుల య్యిండ్రు
మిస్టర్ శ్రీకృష్ణ! తెలంగాణా ప్రజలు నీ కమిటీ మెంబర్లను నమ్మక పోయి నా నీ బొంబాయి అల్లర్ల రిపోర్ట్ చూసి నీ నిజాయితి మీద ఎంతో నమ్మకం పెట్టుకొని నీకు సహకరించిండ్రు సమాచార మి చ్చిండ్రు వారి ఆవేదన వెల్ల బోసు కున్నరు కానీ మీరు ఆంధ్ర సామ్రాజ్యవాద దుర్మార్గులకు, అవినీతి పరులకు అమ్ముడుపోయి వారికి వెన్ను పోటు పొడిచావు నీ ఖ్యాతికి నీవే గోరి కట్టుకున్నావు. చరిత్ర నిన్ను క్షమించ దు తెలంగాణా ప్రాంత చరిత్రలో నీవు మరిచి పోలేని చరిత్ర హీనుడిగా మిగిలి పోతావు నీ రిపోర్ట్ తో భారత దేశం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా స్వామ్యాన్ని ఎంత మంచిగ ముందుకు తీసుక పోతున్న వో చాలా బాగ అర్థమైతుంది బయటి ప్రపంచానికి. ఇ౦కపోతే ప్రజల యొక్క ,ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు, తెలంగాణ ప్రజలను ఈ రావణ కాష్ష్టంలోకి బలవంతంగా దొబ్బిన కాంగ్రెస్స్ పార్టీ నీవు నీ కమిటీ సభ్యులు కలిసి ఆడిన ఈ దుర్మార్గపు నాటకాన్ని తెలంగాణా చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటది. ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఈ ద్రో హానికి త్వరలోనే మూల్యం చేల్లిస్తయి . మీరు కూడా మీ జీవిత కాలంలోనే ఈ మీ నికృష్ట రిపోర్ట్ కు సరైన ఫలితం అనుభవిస్తరు నీ ఈ పనికి మాలిన రిపోర్ట్ తో మా ఉద్యమం అగుతందనుకోకు
అందరి నీచ నికృష్ట రాజకీయాలు, ఇప్పుడు బాగా అర్థమయినయి మా జనం గుండెల్లో మంటలు సునామీలయి తున్నాయి
మీ రిపోర్ట్ సంవత్సర కాలంలో, మల్ల మీ ఈ రిపోర్ట్ వల్ల తెలంగాణా ప్రజలకు పూర్తిగా తెలిసి పోయింది ఎవరు తమ వాళ్ళో ఎవరు పరాయి మనుషులో వాళ్ళ శత్రు మూక లు ఎక్కడెక్కడ పొంచి ఉన్నాయో, ఇక నాలుగున్నర కోట్ల తెలంగాణా ప్రజల జగన్నాథ రథ చక్రాల కింద ఆ మూకల నలిపేయడమే మా తరువాతి కార్య క్రమం.
Thanks Aditya for sharing

Read more...

SKC is a gang of thieves

Cutting across party lines, leaders from Telangana Thursday demanded prosecution of members of the Srikrishna committee for allegedly hurting the sentiments of people of the region in its report on a separate Telangana state.

Reacting sharply to the ‘secret’ eighth chapter of the report, Telangana Joint Action Committee (TJAC) said it would take legal action against the five-member panel formed by the central government and headed by former Supreme Court judge B.N. Srikrishna.

Leaders of the ruling Congress, opposition Telugu Desam Party (TDP) and Telangana Rashtra Samiti (TRS) called for prosecution of the panel members for allegedly making suggestions to New Delhi to suppress the agitation for a separate state.

A day after the Andhra Pradesh High Court directed the central government to make public the eighth chapter of the report, the Telangana leaders said the panel had lost whatever credibility it had by suggesting that the centre should ‘manage’ the media and ‘counsel’ Congress party’s public representatives supporting the demand for Telangana.

‘The members of the committee should be prosecuted for hurting the sentiments of Telangana people through their false report,’ senior TDP leader N. Janardhan Reddy told reporters.

He said legal proceedings would be launched against the officials who fed false information to the committee.
The former minister alleged that the committee members had sold out to leaders of Andhra and Rayalaseema regions opposing the demand for Telangana.

Congress legislator Yadav Reddy termed the panel as a ‘gang of thieves’.

‘Those suggesting ways to suppress the Telangana movement by managing the media and counselling us are nothing but a gang of thieves,’ he said.

Read more...

Telangana MPs set deadline to quit if demands are not met

Separate meetings of Congress general secretary Ghulam Nabi Azad with Congress members of Parliament from Telangana and Andhra-Rayala Seema regions of Andhra Pradesh in New Delhi yesterday has only accentuated the already clear division between the two groups.

While the purpose of the meeting was not clear, both groups further stressed their known positions in support and opposition to Telangana state.

This was the first meeting with MPs from Andhra Pradesh by Azad after he took charge from Veerappa Moily as the party general secretary in-charge of the state affairs.

What should set the alarm bells ringing in Congress is that during their meeting with Azad, the Telangana members of Parliament have set a deadline of June 1 to announce the Telangana state failing which they will resign both from the Parliament and any position in the party.

They told Azad that they will continue only as ordinary members of the Congress party.

The MPs, both from Lok Sabha and the Rajya Sabha — handed over two letters to Azad detailing the present political situation in the state and the problems they were facing in their own constituencies because of the lack of clarity in Congress stand.

Read more...

Monday, March 21, 2011

30 Telangana students launch fast-unto-death at OU

Demanding the introduction of separate Telangana Bill in the ongoing Parliament session, nearly 30 Telangana students launched a fast-unto-death at the Arts College in the Osmania University campus on Thursday.
Maha Amarana Nirahara Deeksha, was launched by the Telangana Vidyarthi Aikya Vedika.

“We want the introduction of separate Telangana Bill in the ongoing Parliament session. If the Prime Minister can convene a joint parliamentary session to order a JPC probe, why can’t both the Houses be convened and a Bill for separate Telangana be introduced in the present session itself,” the Aikya Vedika spokesperson K Mahesh said.

Several Telangana leaders, including Prof Keshav Rao Jadhav, revolutionary singer Vimalakka, representatives of lawyers, doctors JACs and professors and Muslim leaders visited the camp and extended their support to the fasting students.

The student leaders warned that they would storm the chief minister’s residence and the Director General of Police (DGP) office, if the arrested students were not released within 48 hours.

The OUJACs would also meet the Telangana JAC and the representatives of all political parties to get support from them in their fight. The OUJAC is also planning to approach the State Human Rights Commission (SHRC) for getting the student leaders released.

Read more...

KCR suspends three MLAs for cross-voting

The Telangana Rashtra Samithi (TRS) on Saturday suspended three of its MLAs — Kalvakuntala Vidyasagar Rao (Korutla), Enugu Ravinder Reddy (Yellareddy) and Kaveti Sammaiah (Sirpur Kagaznagar) — for cross-voting in the MLC elections. The trio had allegedly voted for the Congress candidate.

After a marathon politburo meeting at the residence of TRS chief K Chandrasekhar Rao, the party decided to “weed out” the “black sheep” to protect the “sanctity and purity of the Telangana movement.”

“It is my bounden duty as the president of the party to protect the movement and keep its sacredness,” the TRS chief told reporters late in the night. “We have decided not to carry forward these black sheep,” he declared.

Earlier in the day, the three MLAs submitted their resignations to him. However, Ravinder Reddy claimed innocence. “It is up to the party to verify who had violated the party whip. I demand serious action against those who had resorted to cross-voting,” Ravinder Reddy said.But the TRS chief was unconvinced. The politburo, after examining technical details and gathering information, concluded that the three MLAs had indeed voted against the party candidate.

The TRS chief said the party had fielded its own candidate in the MLC elections to prove that they were united. “At a time when the entire Telangana is fighting for a separate State, this sort of behaviour is unacceptable,” he said and asserted that in the future too, the party “will not spare anyone, including my family members, who resort to such acts.”

He said he would forward the resignation letters of the MLAs to the Deputy Speaker. However, he offered an olive branch to them saying they could themselves submit their resignations to the Deputy Speaker and continue to be ordinary party workers. “The suspended MLAs should also tender an apology to the people,” he said.

Rao said that Chief Minister N Kiran Kumar Reddy was directly involved in “tempting the TRS MLAs.” He urged the Election Commission to amend the People’s Representatives Act to prevent horse-trading in Council elections. “The EC should not remain a mute spectator,” he observed and called for a transparent polling process.

Read more...

అసలు ఆంధ్రము, తెలుగు ఒక్కటేనా?

ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసం తర్వాత మళ్ళీ ఆంధ్రులకు జాతి, సంస్కృతి మీద గొంతు చించుకొని బుడి బుడి దీర్ఘాలు తీసే అవకాశం దొరికింది. బహుశా అలాంటి అవకాశం కల్పించడానికే ఈ సంఘటన జరగడానికి కావలసిన పరిస్థితులు కల్పించిందేమో, ప్రభుత్వం.ఈనాడు, వారి తాలూకు మహాత్ముల విగ్రహాలు కూలిపోతే, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు, దండలు వేస్తున్నారు, ఖండనలు చేస్తున్నారు.జాతికి అవమానం జరిగిందని,సంస్కృతికి నష్టం కలిగిందని,గొంతు చించుకొని అరుస్తున్నారు.


కాని తెలంగాణా పదమంటేనే వీరు భరించలేరు. తెలంగాణా చరిత్రను కనుమరుగు చేసే కుతంత్రము చేసారు. అసెంబ్లీలో తెలంగాణా పదాన్ని ఉచ్చరించడమే నిషేదించారు. ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలోనే మహోన్నత ఘట్టమైన తెలంగాణా సాయుధ పోరాటాన్ని, పూర్తిగా చరిత్ర పుటల్లో తొక్కి పెట్టి ఉంచారు. ఆ నాడు స్వాతంత్ర్యం కొరకు ప్రాణత్యాగము చేసిన 4500 మంది తెలంగాణా వీరుల త్యాగం పై ముసుగు వేసి మూలకు ఉంచారు. తెలంగాణా సాహిత్యాన్ని, సంస్కృతిని వెటకారం చేసి వెలి వేసారు.


ఇదీ కాక, తెలంగాణా కిచ్చిన హామీలు ఒక్కొక్కటి అంచెలవారిగా తుంగలో తొక్కి అంతమొందించారు. సుప్రీంకోర్ట్ సమర్థించిన ముల్కిరూల్స్ ని పార్లమెంట్ సాక్ష్యంగా ఖననం చేసారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, ది ‘ ఆంధ్రా బుచ్చర్ ‘, మలబార్ పోలీసులను పెట్టి, 369 మంది ఆణి ముత్యాలవంటి తెలంగాణా విద్యార్థులను కాల్చి చంపి మారణహోమం చేశాడు. ఈ మలిదశ ఉద్యమంలో 600 మంది యువత ఆత్మార్పణం చేసుకుంటే, వాళ్ళేదో టెర్రరిస్త్లైనట్లు ఒక్క ఆంధ్రుడు కూడా కన్నీటి చుక్క విడువలేదు, వారి ఆత్మశాంతికి ప్రార్థించలేదు. నైజాం నే గడగడ లాడించిన ‘కొమురం భీం’ విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన ఒప్పుకోవడానికి, యాభై ఏండ్లకు పైగా పట్టింది. అందుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇప్పటికీ మనసొప్పలేదు. కాని, తెలంగాణా ప్రజలకు , ఏమీకాని, ఏమీ చెయ్యని, అసలు వాళ్ళంటే ఎవరో తెలియని , వారి ‘మహాత్ము’ల విగ్రహాలు పునః ప్రతిష్టించడానికి గంటల వ్యవధిలో 78 లక్షల రూ.లు మంజూరైనవి.


యూనివర్సిటీలను కాంసెంట్రేషన్ క్యాంపులుగా మార్చిండ్రు. ఏ ప్రజాస్వామ్య నిరసనకు పిలుపునిచ్చినా , పోలీసులు యూనివర్సిటీలు ముట్టడించి, విద్యార్థి, విద్యార్థినులను, గొడ్డులను బాదినట్లు బాదుతున్నారు. భాష్పవాయువు బుల్లెట్లు ప్రయోగిస్తున్నారు. హైకోర్ట్ లాయర్లను రోడ్ల మీద క్రిమినల్సులను కొట్టినట్లు
కొడుతున్నారు. ప్రజానీకాన్ని పశువులను బందెల దొడ్లో తోలినట్లు పోలీసు స్టేషన్లలో కుక్కుతున్నారు. యునివర్సిటీ అమ్మాయిలను, ఎమ్మార్వోల చేత బైన్దోవర్ చేయిస్తున్నారు. ఇంతటి మానవహక్కుల ఉల్లంఘన స్వాతంత్ర సమరం రోజుల్లో కూడా జరగలేదేమో అనిపిస్తుంది.

అయినా మన ఆంధ్ర సోదర సోదరీమణులకు, ఇవన్నీ ఏమీ పట్టవు, ఎందుకంటే ఈ బాధలు పడేవాళ్ళు ఆంధ్రావాళ్ళు కాదుగదా ! తెలంగాణా వాళ్ళంటే రెండో శ్రేణి ప్రజలు వారి దృష్టిలో.కాని ఆంధ్ర మహానుభావుల విగ్రహాలు కూలితే వారికి ఏడుపు వస్తది, హృదయం క్షోభిస్తది , వాళ్ళ జాతి గౌరవం, వాళ్ళ సంస్కృతి, నాగరికతలు గుర్తుకొస్తవి.

ఇంతటి ప్రాంతీయ దురభిమానము భారత దేశములో ఎక్కడైనా చూడగలమా? ఆదిలాబాద్ జిల్లాలో,బంగ్లా కాందిశీకులు ప్రాంత ప్రజలతో కలిసి పోయారు. తెలంగాణాలో కన్నడిగులు,మరాఠీలు, రాజస్తానీలు జై తెలంగాణా అంటూ, తెలంగాణా ప్రజలతో మమేకమైపోయారు. కాని ఒక్క జాతి, ఒక్క బాస అని అవసరమొచ్చినప్పుడల్లా ఆశాడభూతి వేషాలు వేసే ఈ ఆంధ్ర వలసవాదులు, తెలంగాణా నేలను అమ్ముకొని బ్రతికే వీళ్ళు ఈ ప్రాంతవాసులతో కలవరు.వారి భాషనూ సంస్కృతిని ఈసడిన్చుకుంటారు. వారిపై రోమన్లు,ఇంగ్లిష్ వాళ్ళు, స్పానిష్ వాళ్ళ వలె దాష్టీకం చేస్తారు. అధికార మదంతో ‘తానాశాహి’ చలాయిస్తారు.


ఎందుకిట్లా జరుగుతుంది ? ఒక్క జాతి , ఒక్క భాష, ఒక్క సంస్కృతి ప్రసాదించే స్నేహార్ద్ర , సౌభ్రాత్రుత్వాలే మయినాయి. ఒక్క జాతి ప్రజల మధ్య, ఎందుకింత అసహనం, వివక్ష, కక్ష. అసలు ఆంధ్రులు, తెలంగానీ యులు ఒక్క జాతియేనా? వీళ్ళది ఒక్కటే భాషయేనా ? వీరిది ఒక్కటే సంస్కృతి యా? ఏమో ! చరిత్ర తిరగ వేచి చూస్తే ,మరియు ఈ సమకాలీన పరిస్థితులు విశ్లేషిస్తే అలా కాదనిపిస్తుంది. అసలు ఆంధ్ర, తెలుగు పదాలు కూడా ఒక్కటేనా అనే అనుమానం కలుగుతుంది. ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలా? ఆంధ్ర అనేది తెలుగుకు కాని, తెలుగు అనేది ఆంధ్రకు కాని ఎలా పర్యాయం చెందింది, అనేది మిలియన్ డాలర్ ప్రశ్న? తెలంగాణా భూమిపుత్రులు, సర్వ సాధారణంగా, ఎంత దరిద్రమున్నా తాత, తండ్రుల ఊరు వదలరు. ఎన్ని ఏండ్లు ఏ దేశ, విదేశాలకెల్లినా, తిరిగి వాళ్ళ ఊరు చేరుకుంటారు. ఎక్కడికెళ్ళినా ఆ జనంతో కలుస్తారు, వారి భాష నేరుస్తారు,వారి సంస్కృతిలో పాలుపంచుకుంటారు,కష్టపడి పనిచేస్తారు, తమ దేదో తాము తీసు
కుంటారు , కుదరక పోతే మాత్రం రామ్ రామ్ అంటారు, తిన్నింటి వాసాలు మాత్రం లెక్క పెట్టరు. వాళ్ళ దగ్గరకు ఎవరు వచ్చినా, కలుపుకుంటారు,ఆదరిస్తారు, అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. మరి మన ఆంధ్ర వలసవాదులకు ఎందుకో గాని, పని వుంటే తప్ప పరుల పొడగిట్టదు. ఎక్కడ పచ్చగుంటే అక్కడికి పరుగెత్తుదమంటారు.పచ్చగున్న పరాయి ప్రాంతమే బాగుందంటారు,రెండు చోట్లా మనదేనంటారు. ఆ ప్రాంత ప్రజల భాష నేర్వరు, వాళ్ళతో నన్నంటుకోకు అన్నట్లు ఉంటారు. కొంచెం సంఖ్య ఎక్కువైతే ‘ఆంధ్ర ఘేట్టోలు’ ఏర్పాటు చేసుకుంటారు.

అక్కడికి ఎవ్వరిని రానీయరు. అందితే జుట్టంటారు, అందకపోతే కాల్లంటారు. కష్టం కంటే మతలబుకు ఎక్కువ పని పెడతారు.అధికారం కొరకు అమిత యావ పడుతుంటారు. అధికారం చేత చిక్కితే ఇతరులను అణగ దొక్కుతరు.
ఆంధ్రులు,తెలంగాణా వాళ్ళు ఒక్కటే జాతైతే ఎందుకింత వైవిధ్యం? ఎందు కింత వైరుధ్య మైన ద్వంద్వ ప్రవృత్తి? దీనికి ఇదమిద్దమైన సమాధానం ఎక్కడా చూడలేదు. అయితే కొన్ని పౌరాణిక, చారిత్రక వ్యాఖ్యానాలు అక్కడక్కడ లభ్యమౌతున్నయి. వాటి ఆధారంగా కొందరు పండితులు తెలుగు భాష మీద చేసిన వ్యాఖ్యానాలను బట్టి చూస్తే,


‘ఆంధ్ర’ అనే ఒక తెగ భారతదేశం లోని ఒక ప్రాంతం నుండి కొన్ని కారణాంతరాలవల్ల వెలివేయబడి దేశమంతా తిరుగుతూ వచ్చి,గోదావరి, కృష్ణ పరీవాహిక ప్రాంతాలైన ‘త్రిలింగ’ దేశం లో వలస నేర్పరుచుకున్నారు . వారి భాష పేరు ‘దేశి’, ప్రాంతీయ తెగల భాష ‘తెలుగు’ .కాలక్రమేనా ప్రాంతీయ తెగల పై ఆధిపత్యం సంపాదించడానికి, ఆనాటి ‘linguafranca’ అయిన సంస్కృతానికి ,ప్రాకృతం, దేశి , తెలుగు భాషలను కలిపి వారి తెగ పేరు మీదుగా ‘ఆంధ్ర’ భాషను నిర్మించుకొన్నారు. ఈ విధంగా సంస్కృత ప్రాబల్యంతో , ప్రాంతీయ తెలుగు భాషను అణచడానికి ,ప్రాంతీయ ప్రజల సంస్కృతి పై అధిపత్యానికి పునాదులు వేశారని చెప్పుకోవచ్చును . అది నిరంతరంగా ఇప్పటివరకు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది . దాని ప్రభావమే నేడు ఆంధ్ర , తెలంగాణా ప్రాంతాల మధ్య సాంస్కృతిక అగాధం. వారసత్వం గా వచ్చిన ఆ వలసతత్వము,సామ్రాజ్యవాధము,భాషా సంస్కృతుల దాష్టీకము, ఆంధ్రులలో ఈనాటికి కొట్టవచ్చినట్లు కనపడుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ,తెలంగాణ ప్రజలలో వారి వారసత్వపు భూమిని అంటిపెట్టుకొని ఉండే తత్వం, పుట్టిన మట్టిలోంచి వెలువడిన సువాసనలతో కూడుకొన్న సాంస్కృతిక అస్తిత్వం, అరమరికలులేని కలుపుగోలుతనము ఇప్పటికి కనిపిస్తూనే ఉన్నాయి.

ఆ విధంగా నిజమైన తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఎవరిదో అంచనా వేసుకోవచ్చు . ఈ సాంస్కృతిక వైరుధ్యానికి కారణం కూడా తెలుసుకోవచ్చు.ఇదేనా ఈ సాంస్కృతిక అగాథానికి కారణం అంటే, తెలిసిన చరిత్రను నేటి పరిణామాలను బేరీజు వేసి చూసుకుంటే ఇదే నిజం కావచ్చని అనిపిస్తుంది.

అది నిజమైనా కాకపోయినా, కారణ మేదైనా ఆంధ్రులకు, తెలంగానీయులకు భాషా, సంస్కృతుల విషయం లో సయోధ్య లేదనేది నిర్వివాదాంశము.ఈ సయోధ్య ఇకముందు వచ్చే అవకాశము కూడా తక్కువ.అది అవసరమో లేదో కూడా తెలియడము లేదు .రెండు వర్గాల ప్రజల మధ్య అగాధం పెరుగుతూ పోతుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము .ఏ సూడాన్, బురుండి, రువాండా లాంటి ఆటవిక దేశాల్లో లేము.మన తెగల మధ్య పోరు నాగరికంగా తేల్చుకోవచ్చు. ఎవరి రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఈ సామ్రాజ్యవాద పోకడలు, సాంస్కృతిక ఆధిపత్యం ఇలాగే కొనసాగితే అక్కడ జరిగిన చరిత్రలు ఇక్కడ కూడా పునరావృత్తం కావచ్చు.
- ఆదిత్య

Read more...

Thursday, March 17, 2011

ధ్వంస’ గౌరవం

ధ్వంస’ గౌరవం

——————–
తెలుగు  భాషాభిమానులార…తెలంగాణా  వీరులారా
విగ్రహాలం  కాదు  మేము.. ..నిగ్రహం  కోలిపోఇన  జాతి  రత్నాలం
దంద్వ నీతి చూడలేక ….’ధ్వంస’ గౌరవం కోరినం
మా  విముక్తి కి  మీకిదే  మా  క్రుతజ్ఞాతాభివందనం ….
‘హుస్సేన్’ గౌరవార్ధం ‘కుతుబ్  షా’ నిర్మించిన వారిది పైన
తెలుగు  జాతి  కి  చిహ్నాల  మైతిమి …తెలంగాణా  పోరు కి  సాక్షాల  మైతిమి …
వీర  చెరిత్ర కి  చెరమగీతం  పాడుతుంటే…
ఎర్ర ప్రగడ , ‘ఎర్రని’  కళ్ళ తో  తెలిపిన  ‘ప్రగాడ ‘ సానుభూతి  ఒకవైపు ….
దాశరథి  ‘తెలంగాణా  దాహార్ది ‘ కి  ఇంకా  నీల్లందకుంటే …
కన్నీటి  సాగరం  ఐన ‘హుస్సేన్  సాగర్’  ఒక  వైపు …
అభాగ్యుల  ‘భాగ్య  రెడ్డి ‘ దౌర్భాగ్యం చూసి ….
బావురు మన్న  బమ్మెర  పోతన  పోరు  ఒక  వైపు …
తోటి  మన్నెం  వీరుడు  కొమరానికి  చోటు  లేదాయే  అని
అల్లూరి  ఆక్రందన  ఒకవైపు ….
అమాయకుల  ఆత్మార్పనల  తో .. ఆత్మక్షోభ  ఒక  వైపు
స్వార్ధ  రాజకీయాల ….రాక్షసత్వం  ఒక  వైపు ..
నిలవలేము  ఇంక గౌతాముని (బుద్దిని) నీడలో …
నిమర్జన  మైతిమి  తెలంగాణా  పోరులో !!

— సుధీంద్ర భార్గవ

Read more...

‘మేధావి ‘ కి దారుణం జరిగింది

మేధావి ‘ కి దారుణం  జరిగింది

————————————–
దారుణం జరిగింది … దారుణం జరిగింది
నేడు మేధావికి మెదడు కరువయ్యింది
దారుణం జరిగింది ….దారుణం జరిగింది
పదవి మొహం  పెరిగి,  తెలివి తేలికయి  గాలికెగిరింది
కులపిచ్చి గజ్జి  హెచ్చి …. ‘మేధావి’ రూపు దాల్చి
తెలంగాణా కు తెగులయ్యి తగులుకుంది .
తిరగ బడ్డ బిడ్డ దెబ్బ కొడితే… తల బొప్పి కట్టి బుద్ది  ఆవిరయ్యింది  !! నేడు !!
ఓ మేధావి …
సంస్కరణల స్మరణ ఘోష చేద్దువే …
ప్రజాభిప్రాయం పట్టదా??
తెలంగాణా సంస్కరణ గిట్టదా???
బడుగు జీవి బతుకు చూడు
బతుకే పోరుగ మారిన తీరు చూడు
పొలికేక పెట్టింది పొలిటికల్  JAC
ఉద్యమ బాట పట్టింది ఉద్యోగ JAC
విజ్రుమ్భించేనా ….విద్యార్థి JAC ….
విలవిల్లాడును  చూడు వలస నాయకత్వం
కాసుకొమ్ము ……..ఇది అక్షర సత్యం
ఆవేశం రాక కాదు..
ఆత్మార్పణ మా షోకు గాదు….
గాంధేయం మా మార్గం…. అహింస మా ఆయుధం
ఆత్మ గౌరవం మే  ధ్యేయం…స్వపరి  పాలనే  లక్ష్యం
సంకుచితం వీడి …మెదడుకు సాన పెట్టుకో
పంతం మాని …ప్రజా నాడి  జాడ తెలుసుకో
‘మేధావి’ పేరు …సార్థకం చేసుకో !!!!
—- సుధీంద్ర భార్గవ

Read more...

Telangana wants a state, not statues again : Kavitha

It comes as a shock to us that the government of Andhra Pradesh is planning to release Rs 78 lakh to reinstall the statues on Tank Bund in Hyderabad that were demolished on March 10. This amounts to nothing less than provoking the people of Telangana even more.

What happened last week on Thursday was an expression of people’s anguish. No political leaders or cultural troupes were allowed on Tank Bund by the police. As a result there was no one to guide the emotionally surcharged crowd.

What happened thereafter was unfortunate and we feel for it. But then one also needs to remember that the Tank Bund is in Hyderabad and therefore in the heart of Telangana and when the people of the region find 26 of the 33 statues are of people from the other two regions, it does make them angry.

We want the government to maintain status quo for the next couple of months at least. The government should think from the point of view of the people and this includes the people of Telangana also, not just people from coastal Andhra and Rayalaseema. Do not make the issue bigger. When there has been a status quo maintained over the issue of Telangana for more than a year now, what is the big hurry in rushing to reinstall the statues on Tank Bund? It will only breed more negativity particularly if the same statues are reinstalled. I will myself oppose it as an individual.

If at all the government wants to install statues, then it needs to include those of Telangana heroes as well. Like freedom fighter and poet Kaloji Narayana Rao. Like Komaram Bheem.

Incidentally, the government order to install a statue of Komaram Bheem was issued when K Rosaiah was chief minister. I am given to understand that the government decreed that the funds should come from the kitty of the tribal welfare department. As if Komaram Bheem was only a tribal leader.

Then how did the government now release Rs 78 lakh? Incidentally, when this decision to reinstall the statues was taken in the state assembly, no MLA from Telangana was present in the House.

We believe that it was a well-thought out strategy to allow Telangana activists on to Tank Bund, let the law and order situation to slip out of hand to show that the Telangana movement is not a peaceful movement. People’s emotions were running high and the government took advantage of it.

Read more...

తెలంగాణ కోసం ఇద్దరి ఆత్మత్యాగం

మెదక్‌, ‌:ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తు ఇద్దరు వ్యక్తులు ఆత్మత్యాగానికి పాల్పడిన సంఘటన మెదక్‌ డివిజన్‌ లో మంగళవారం వెలుగుచూశాయి. మెదక్‌ మండలం వాడి గ్రామానికి చెందిన ఈర్ల జైపాల్‌రెడ్డి(50) మెదక్‌ పట్టణంలోని పిల్లల పార్కులో ఉరివే సుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ కోసం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి జేబులో దాచుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. కాంగ్రెస్‌ ఎంపి, ఎమ్మెల్యేలు చిత్తశుద్దితో వ్యవహరించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు పోరాడాలని డిమాండ్‌ చేశాడు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ కోసం పోరాడి పదవులకు అమ్ముడుపోయి ఉద్యమాన్ని తాకట్టుపెట్టారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత నాయకులు పదవులకు అమ్ముడుపోకుండా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఉద్యమించాలని సూచించారు. తన ఆత్మహత్యతో ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశాడు.

యువకుడి ఆత్మహత్య
ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం కొనసాగుతున్న ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్ని రాష్ర్ట ఏర్పాటులో కొనసాగుతున్న జాప్యానికి ఆవేదన చెందిన డిగ్రీ విద్యార్థి ప్రవీణ్‌గౌడ్‌(20) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. ప్రవీణ్‌గౌడ్‌ గతంలో చేపట్టిన తెలంగాణ ఆందోళన కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొన్ని సెల్‌టవరెక్కి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌లో మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎంపి సంతాపం.
మెదక్‌ నియోజకవర్గంలో తెలంగాణ కోసం ఆత్మర్పణాలు చేసుకున్న వారికి మెదక్‌ ఎంపి విజయశాంతి ఫ్రగాఢ సంతాపం తెలిపారు. కాంగ్రేస్‌ పార్టీకి చిత్తశుద్ది లేకపోవడంతోనే తెలంగాణ ప్రాంతంలో బలిదానాల పరంపర కొనసాగుతుందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వెంటనే స్పందించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు పోరాడాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. గత వారం రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్నందునే తాను పర్యటించలేకపోతున్నానన్నారు.

Read more...

Saturday, March 12, 2011

Cases filed against KCR, KTR, Harish Rao, Kodandaram and others

The Hyderabad Police have registered 16 cases against pro-Telangana activists, including TRS leaders K Chandrasekhar Rao, Harish Rao, KTR and others in connection with the violence during the ‘Million March’ yesterday. KCR, Harish Rao and Kodandaram were booked under section 120-B (criminal conspiracy) of IPC.

Cases for attempt to murder have been filed against unnamed persons.

The charges include desecration and demolition of statues of eminent Telugu personalities, attack on the police and media personnel, among other things, he said.

Commenting on the registration of cases, TRS MLA T Harish Rao said that it was done to please the Chief Minister, who hails from non-Telangana region. He added that police had taken into custody scores of people who had nothing to with the ‘million march’.

TRS leaders today met police officials and demanded that the Telangana supporters, who were arrested, be produced in court.

Read more...

We don’t need statues on Tank Bund : Owaisi

Blasting at the ruling congress party in assembly over deferring the decision on Telangana, Akbaruddin Owaisi said “If we are discussing this (tank bund statues) issue, we should also discuss the unjust caused to Telangana and the suicides in Telangana.”
“Why are Telangana legislators not in house? If they are out Telangana people are out.” he added. He also said that there is no need to erect the statues again on the Tank Bund and that the Hussain Sagar is beautiful as is.

Read more...

Friday, March 11, 2011

దండు క దిలింది...

(సంగారెడ్డి) పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో గురువారం హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహణకు జేఏసీ పిలుపు ఇచ్చింది. పోలీసు అనుమతి లేని కారణంగా జిల్లా నుంచి ఉద్యమకారులెవరూ హైదరాబాద్ వెళ్లకుండా అన్ని రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాజీవ్ రహదారి, రామాయంపేట-హైదరాబాద్, మెదక్-నర్సాపూర్ - హైదరాబాద్, నిజాంపేట-జోగిపేట-హైదరాబాద్, జహీరాబాద్-హైదరాబాద్ రహదారులన్నిటిపై 23 ప్రాంతాలలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు పారా మిలటరీ, ఏపీఎస్‌పీ తదితర పోలీసు బలగాలన్నీ ఆయా చెక్‌పోస్టులలో ఉండి, ఉద్యమకారులెవరూ హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మూడు రోజులుగా ఆయా రహదారులపై పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నా వందలసంఖ్యలో ఉద్యమకారులు హైదరాబాద్ వెళ్లి, ట్యాంక్‌బండ్‌పై జరిగిన మిలియన్ మార్చ్‌లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అలావెళ్లిన వారిలో మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.సత్యనారాయణ, టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ ఎం.రఘునందన్‌రావు, జేఏసీ పశ్చిమ కన్వీనర్ వై.అశోక్‌కుమార్, టీఆర్ఎస్ నాయకుడు జీ.బీరయ్యయాదవ్, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, కే.జగన్, జేఏసీ నాయకులు సాబేర్ అలీ, ఆబేద్ అలీ, ఈశ్వర్‌ప్రసాద్, ఎంజీ అన్వర్, పద్మారావు, ఎం.విజయరావు, డీ.గోపాల్ రెడ్డి, ఎన్.శ్రీనివాస్, సోమశేఖర్, జగదీశ్వర్, చంద్రశేఖర్, శ్రీకాంత్, టీఆర్ఎస్ యువజన విభాగం కన్వీనర్ వెంకటేశంగౌడ్ తదితరులున్నారు. కాగా మార్చ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లిన టీఆర్ఎస్ నాయకుడు జీ.ఎలక్షన్‌రెడ్డిని అక్కడే పోలీసులు అరెస్టు చేశారు.

జిల్లావ్యాప్తంగా 1200 మంది అరెస్టు
మార్చ్‌లో పాల్గొంటారన్న ఉద్దేశంతో బుధవారం రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా 157 మందిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం వెయ్యి మందికిపైగా ఉద్యమకారులను అరెస్టు చేశారు. మిలియన్ మార్చ్‌కు అనుచరులతో కలిసి బయల్దేరుతుండగా మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, పార్టీ నాయకుడు విజయేందర్‌రెడ్డిలతో పాటుసుమారు నలభై మందిని సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు పిీ.నరహరిరెడ్డి తదితరులను ఇంద్రకరణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేటలో పార్టీ నాయకుడు ఎన్.రాచిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. జహీరాబాద్‌లో సుమారు ఇరవై మంది న్యాయవాదులను, డెబ్బై మంది టీఆర్ఎస్, జేఏసీ, బీజేపీలకు చెందిన వారిని అరెస్టు చేసి జహీరాబాద్, జహీరాబాద్ రూరల్, చిరాగ్‌పల్లి, పోలీస్‌స్టేషన్‌లలో ఉంచారు. జోగిపేటలో ఇరవై అయిదు మంది ఉద్యమకారులను పెద్దశంకరంపేట నుంచి బయల్దేరిన ఇరవై మందిని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు.

సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కె.రాజనర్సు నాయకత్వంలో సుమారు రెండు వందల మంది మోటారు సైకిళ్లపై బయల్దేరగా పొన్నాల శివారులో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే వారు ముందుకు వెళ్లడంతో నాగులబండ దగ్గర డీఎస్పీ నాయకత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి కూడా తప్పించుకుని వెళ్లిన మాజీ చైర్మన్ రాజనర్సును కొద్దిదూరంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే దుబ్బాకలో 18 మందిని, మిరుదొడ్డిలో 15 మందిని, కొండపాకలో 29 మందిని, గజ్వేల్‌లో సుమారు ఇరవై మందిని, వెల్దుర్తిలో 12 మందితో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎం, డీజీపీ దిష్టిబొమ్మల దహనం మార్చ్‌ను అనుమతించకపోవడంతో ఆగ్రహించిన కొల్చారం మండల జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి, డీజీపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఠాణా ఎదుట ధర్నా
నారాయణఖేడ్‌లో బుధవారం తెలంగాణవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన వారు గంటకుపైగా స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.

వెలవెలపోయిన రైల్వేస్టేషన్ మిలియన్ మార్చ్ కారణంగా అక్కన్నపేట రైల్వేస్టేషన్ వెలవెలపోయింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, బాసర తదితర ప్రాంతాలకు రోజూ పదిరైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. అయితే గురువారం ఉదయం రెండు రైళ్లు మాత్రమే నడిచాయి. ఆ తర్వాత అధికారులు రైళ్లను నిలిపేయడంతో స్టేషన్‌కు వచ్చిన ప్రజలు కూడా కొద్దిసేపు నిరీక్షించి మరలా బస్‌స్టేషన్‌లకు వెళ్లిపోయారు.

Read more...

అణువణువునా అనిచేసినా  ఆగదు నా తెలంగాణ పోరు
ప్రతి అడుగు తుడిచేసినా ఆగదు నా తెలంగాణ పోరు
అధికారం సుట్టుముట్టినా ఆగదు నా తెలంగాణ పోరు
అన్ని పార్టీలు మాట మార్చినా ఆగదు నా తెలంగాణ పోరు
ఆగదు నా తరం కోసం ఆగదు ఏ తరం కోసం
ఆగి ఆగి అంతరాత్మ అవిశిపోయింది
ఇన్నాళ్ళు ఆగిన ఆ గుండె బలం ఇప్పుడు
ఇంకింత జోరు అందుకుంది
ఆపకుండ పోరు సల్పినోడికి నా సలాం...
ఆపగలను అన్నోడికి నా సవాల్...
                                        - కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి

By: Email-

Read more...

Million March in Hyderabad Image 10-3-2001

Million March Image

Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs, Million March,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images

Read more...

Million March : Telanganites create history !

Telanganites have today shown the real spirit and desire for the state. They have gone extremes to make their point loud and clear. Women also took active part in the event and attended in large numbers. Nothing stopped them from reaching Tank bund. Arrests, barricades, barbed wires, nothing could stop them. By 3 p.m., more than 1 lakh people gathered at Tank bund, over a lakh arrested, and a million more were stopped from reaching hyderabad.

Andhra media had a good time portraying the event as failure in the morning but, were stunned at the number of people that came to Tankbund by afternoon. At one point they even aired news that it is not possible for even a single person to reach Tank Bund.

Telanganites have created history. Nothing like this has happened before.

They have shown to the world that Telangana is a people’s desire. The March has been very peaceful. More than the Million March, it was the government that caused inconvenience to the people.

Most of the pro-Telangana leadership has been placed under preventive arrest. About 120 check posts have been set up all around and in the city to stop the vehicles carrying the Telangana activists.

KCR, Harish Rao, KTR, Vinay Bhaskar, Ravinder Reddy and a number of other TRS leaders joined the March. Gaddhar, Kavitha, BJP leaders Bandaru Dattatreya and Kishan Reddy also participated in the event.
Congress MPs Kesava Rao and Madhu Yakshi were the only congress leaders that made it to Tank Bund but were jostled by the protesters asking them to resign.

People were seen singing songs, doing bathukamma dances, and participating in dhoom dham all over Tank bund.

Million March has also made it to headlines on all national channels. It has been more successful than expected.

A million thanks to all.

 

Read more...

Hyderabad Million March Photos

 Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images


8 Trains, all city & district Buses Canceled

Morethan 1 lakh arrested including MLAs, JAC Leaders, students, Lawyers, Doctors, Electricity Board employees, and Engineers.

1000 Checkposts & Barricades erected in Telangana

15,000 BSF deployed & 20,000 Police deployed

Millions of Rs. spent

But, Nothing could stop the spirit of Telangana.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP