- సమ్మెతో 780 కోట్ల వేతనాలు నష్టపోయాం
- మీరు ఆర్థికంగా నష్టపోయిందెంత?
- ఆకలిదప్పులతో ఉద్యోగులు
- వ్యాపారాల్లో రాజకీయ నేతలు
- ఉద్యమంపై ఎందుకీ ఉదాసీనత?
- ఉద్యోగుల కష్టాలు పట్టవా?
- 650 మంది బిడ్డలను కోల్పోయినకన్నతల్లుల ఆక్రందనలు సోకలేదా?
- రాజకీయ నేతల ద్రోహాన్ని వివరిస్తూ కన్నీరు పెట్టుకున్న ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్
- ఉద్యమంలో వెనకడుగు లేదని స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 14 : ‘‘ఉద్యోగులు సర్వస్వాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. జీతభత్యాలు లేకున్నా, పండుగలు పబ్బాలు చేసుకోకుండా, ఆకలి దప్పులతో అలమటిస్తూ, తీవ్ర ఇబ్బందుల మధ్య తెలంగాణ ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాడుతున్నారు. కానీ.. ఉద్యమంలో ముందు వరుసలో ఉండాల్సిన రాజకీయ నాయకులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు శిఖండి పాత్ర పోషిస్తున్నారు. ఎలాంటి త్యాగాలు చేయకుండా, తెలంగాణ ప్రజల ఘోష పట్టించుకోకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు’’ అని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యమం పట్ల ఉదాసీనంగా ఉంటున్న రాజకీయ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పి తీరుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు చరిత్ర నిండా సాక్ష్యాలున్నాయని గుర్తు చేశారు.
కాసేపు ధర్నాలో పాల్గొని తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నారని, వారి వ్యాపారాలకు, కాంట్రాక్టులకు, ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకుంటున్నారని ఉద్యోగసంఘాల నేత ధ్వజమెత్తారు. ఉద్యోగులు 780 కోట్ల రూపాయలను నష్టపోయారని చెప్పిన స్వామిగౌడ్.. రాజకీయ నాయకత్వం ఆర్థికంగా వారు ఎంత మేరకు నష్టపోయిందని సూటిగా ప్రశ్నించారు. రాజకీయ నాయకుల ద్రోహాన్ని, ఉద్యోగుల ఇక్కట్లను వివరిస్తూ ఓ దశలో కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ ఐక్యవేదిక జూబ్లీహాల్లో శుక్రవారం రౌండ్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్షికమంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ రాజకీయ నాయకత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 17 నుండి మార్చి 4 వరకు జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంలో కూడా రాజకీయ నాయకత్వం శిఖండి పాత్రనే పోషించిందని ఆయన దుయ్యబట్టారు. 8 లక్షల మంది ఉద్యోగులు జీతభత్యాలను త్యాగం చేశారని స్వామిగౌడ్ అన్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉద్యోగ సంఘాల నాయకులపైన అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ఉద్యోగుల కష్టాలను, కన్నీళ్లను కనీస సానుభూతితో అర్థం చేసుకుంటున్న వారే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెను సకల ఉద్యోగుల సమ్మెగా మార్చేందుకు, మొత్తం ఉద్యోగుల మీదనే బండరాయి పెట్టేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ఈ వైఖరిని రాజకీయ నాయకులు మార్చుకోవాలని, సకల జనులతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ కష్టాలకు, నష్టాలకు తమకు దుఃఖం రావడం లేదని, రాజకీయ నాయకత్వం శిఖండులుగా ఉన్నందుననే ఎక్కువ దుఃఖం వస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
అసలే అర్ధాకలితో ఉన్న లక్షన్నర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెబాటపట్టి నెలరోజులుగా ఆకలితో ఘోషపడుతున్నారని చెప్పారు. ఇన్ని నష్టాలు జరుగుతున్నా రాజకీయ నాయకుల మనసులు కరగడం లేదని ఆయన దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన ఎందుకు నిలిచి పోరాడటం లేదని ఆయన నిలదీశారు. 650 మంది బిడ్డలను పోగొట్టుకున్న తల్లుల ఆక్రందనలు రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. రాజకీయ ప్రతినిధులు ఇళ్లలోకి తాము వెళ్లి ఉద్యమంలోకి రావాలని వారిని బతిమిలాడామని చెప్పారు. ఎంతో బతిమిలాడితే కాసేపు ధర్నాలో పాల్గొని తర్వాత ఇంటికి వెళ్లిపోతున్నారని, వారి వ్యాపారాలకు, కాంట్రాక్టులకు, ఎలాంటి నష్టం జరుగకుండా చూసుకుంటున్నారని ఉద్యోగసంఘాల నేత ధ్వజమెత్తారు.ఎన్ని కష్టాలనైనా ఓర్చుకొని చివరివరకు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆయన గద్గద స్వరంతో మాట్లాడుతున్నప్పుడు హాలులో చాలామంది నివ్వెరపోయారు.
Saturday, October 15, 2011
నవ్వే గాయం సింగరేణి
సింగరేణి అంటేనే నవ్వే గాయం. తిరగేసిన చెమ్మసు. ఎగురుతున్న సుత్తి కొడవలి. సింగరేణి కార్మికులు తెలంగాణ ఆకాంక్ష సాకారం కోసం 32 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం రాజ్యం నల్ల నేలను యుద్ధభూమిగా మార్చినా రాజీ పడడం లేదు. రాజ్యం విధానా ల ఫలితంగా ఎన్నో గాయాలు ఇప్పటికే ఉన్నప్పటికి, వాటిని పెద్దగా పట్టించుకోకుండానే ఉద్యమాలే ఊపిరిగా బతికే ఉద్యమ కెరటాలున్న నేల ఇది. నక్సలైట్ల పేరుమీద ఇప్పటి దాకా 69 మంది నేల బిడ్డలు ఎన్కౌంటర్ల పేరిట కాల్చివేతకు గురయ్యారు. 1942 నుంచి ఉద్యమిస్తున్న ఈ గడ్డలో అప్పటి శేషగిరి మొదలు మొన్నటి సికాస నేతలు రమాకాంత్, విశ్వనాథ్, కట్ల మల్లేష్, వరకు ఎన్కౌంటర్లలో మరణించారు. అలాగే గోదావరిఖనిలో జరిగిన రెండు అతి పెద్ద ప్రమాదాలపై కోర్టు ఆఫ్ ఎంకై్వయిరీ వేసి దాని విచారణను జస్టిస్ బిలాల్ నఖ్వీ చేపట్టి రిపోర్ట్ ఇచ్చినా దానిపై చర్యలు లేవు. అయినా ఉద్యమాలలో సింగరేణి కార్మికులు అన్ని దిగమింగుకుంటూనే ముందున్నారు.
123 సంవత్సరాల చరిత్ర గల సంస్థలో కేవలం 65 శాతం మందికే గృహ వసతిని యాజమాన్యం కల్పించింది. మిగతా వారంతా అద్దె ఇండ్లలో, స్వంత ఇండ్లలోనే ఉంటున్నారు. అక్కడ గడప, గడప మానవీయత ఉట్టిపడుతుంది.అసలు సిసలైన మట్టిమనుషులు జీవించే ప్రాంతమది. ఎదనిండ ఎన్నో వెతలు మోస్తూ మదినిండా మమతలు పంచే అమ్మకలక్కలు ఎంతో మంది దసరా పూట ఉద్యమంలో ఉన్నరు. 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం వీధులకు వీధులే కదిలి కదం కదం తొక్కుతున్నాయి. యాజమాన్యం రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసిన లొంగలేదు. గనులన్నీ పోలీసుల మయం చేసినా పట్టించుకోలేదు. మడిమతిప్పే మనస్తత్వం వారికి లేదు. ఓటమి ఎరుగని నల్ల నేల సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక పూజలాగా, ప్రార్థనలాగా ఎలాంటి శషభిషలు లేకుండా దినచర్యగా కొనసాగిస్తున్నా రు. దసర పూట కూడా సమ్మెలోనే ఉన్నారు... దసర నాడు సింగరేణి కార్మికుడికి జీతంతో కూడి న సెలవు దినం ఇస్తా రు.
ఈ సెలవు దినం దసర కన్నా ఒక రోజు ముందు లేదా దసర తరువాత దినం విధులకు హాజరయితేనే ఆ మస్టర్ దొరుకుతుంది... కాని కార్మికులు విధులకు హాజరు కాలేదు... అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు కూడా జీతంతో కూడిన సెలవు దినమే... అయినా ఆ రోజును కూడా త్యాగం చేశారు... ఇదం తా ప్రత్యేక తెలంగాణ కోసం. కులమతాలకు అతీతంగా అలయ్, బలయ్లు తీసుకునే రోజు. అయితే సమ్మె కారణంగా కొత్తబట్టలు లేవు. అయినా డోంట్ కేర్. ఫికర్ నహీ అంటున్నారు కార్మికులు.
తమ నేలలో తమ రాజ్యం ఉండాలని ఆకాంక్షతో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో రక్తసిక్తమయిన నల్ల నేల ఈ రోజు తమ నేల మీద తాము పరాయి మనుషులుగా బ్రతకడం ఇక అంగీకరించే ప్రసక్తే లేదని సమ్మె కట్టారు. బుక్కెడు బువ్వ కోసం భూమి పొరల్లో ఊపిరిసల్పని గర్మి ఫేసుల్లో బొగ్గు పెల్లలకు నెత్తు రు అద్ది లోకానికి వెలుగు పంచే చీకటి బతుకుల్లో రవ్వంత వెలుగు కోసం ఇదం తా ఆరాటం. తప్పదు పోరాటం అంటున్నారు కార్మికులు.
తమ త్యాగం 700 మంది దాకా తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన పిల్లలకన్నా ఏమంతా పెద్దది కాదని చెబుతున్నారు. సింగరేణి అధికారులు సమ్మె చేయకపోతే చేయకపాయే, సమ్మె విచ్ఛిన్నకారులుగా మారిపోయిండ్రు. షార్ట్ ఫైరర్ చేసే పని అండర్ మేనేజర్ చేస్తుండు. ఎలక్షిక్టీషియన్ చేసే పని ఇంజనీర్ చేస్తుండు. సూపర్వైజర్ చేసే పని జీఎం చేస్తుండు. సీమాంధ్ర అధికారుల కన్నా మిన్నగా మన పోలీసుల మాదిరే తెలంగాణ అధికారులే విర్రవీగుతున్నారు. ద్రోహులుగా ఇప్పటికే ముద్ర వేసుకున్నారు. 500 మందికి పైగా కేసుల్లో ఇరికించినప్పటికీ ఉద్యమం మాత్రం ఆగడం లేదు. తెలంగాణ వచ్చేదాకా సింగరేణి బిడ్డలలో ఈ పట్టుదల యథాతథంగా ఉంటుంది.
ఏది ఏమయినా 123 సంవత్సరాల సింగరేణి సుదీర్ఘ చరివూతలో ఇలా దసరా పండుగ ఒక ఉద్యమ వాతావరణంలో కనిపించడం ఇక్కడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నల్లనేల ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది... ఇప్పటికయినా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా తెలంగాణను ప్రకటించాల్సిన అవసరం ఉంది... ఒక జర్నలిస్టుగా పాతిక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల ఆరాట పోరాటాలను చూసిన వాడిగా..., ఇక్కడే పుట్టి పెరిగిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’గా ఈ నల్ల బంగారు నేలతో ఉన్న పేగు బంధంతోనయితేనేమి, ఇలాంటి ఉద్యమ దసరాను నేను చూసి ఎరుగను... ఏది ఏమయినా ఈ రోజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే కేంద్ర బిందువుగా తయారయిన బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలకు పాదాపాదాన పరిపరిదండాలు... బొగ్గు గని కార్మికుల, సంఘా ల ఐక్యత వర్ధిల్లాలి... జల్ జమీన్ జంగల్ వర్ధిల్లాలి... మా బొగ్గు బావులు మాకు కావాలి... మా తెలంగాణ మాకు ఇవ్వాలి... తెలంగాణ వచ్చేదాక కార్మిక సంఘాలన్ని ఐక్యంగా ముందుకు సాగాలి... 60 ఏండ్ల ఆకాంక్ష కోసం ఆమాత్రం సమ్మె పోరాటంలో కలిసి రాకుంటే, కలిసి ఉండకపోతే నవ్వేటోని ముంగట జారిపడ్డట్టు అవుతుంది.
Take By: T News
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
రోకో.. రైల్ రోకో పట్టాలు దిగని పోరు
- నేడు పట్టాలపైకి తెలంగాణం
- మూడు రోజులు నిరవధిక ఆందోళన
- ఉరుకుతున్న ఉద్యమ క్షిశేణులు
- టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమొక్షికసితోపాటు టీ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ టీ ఫోరం నేతలూ రెడీ
- పది జిల్లాల్లో 30 కీలక పాయింట్లు
- ఉత్తర, దక్షిణ భారతం మధ్య తెగనున్న లింక్
- రైల్రోకో విచ్ఛిన్నానికి సర్కారు కుట్ర
- భారీగా మోహరించిన పోలీసులు
- అర్ధరాత్రి నుంచి అక్రమ అరెస్టులు
- కుట్రలు ఛేదిస్తాం: ప్రత్యేకవాదులు
- ముందు జాగ్రత్త చర్యల్లో రైల్వే శాఖ
- భారీగా రైళ్ల రద్దు.. మళ్లింపు
- విజయవంతంగా ఆర్టీసీ సమ్మె
- స్తంభించనున్న ప్రజా రవాణా
- కోటి మంది ప్రయాణికులపై ప్రభావం
- నేడు ఉద్యోగ జేఏసీ-ఉపసంఘం భేటీ
- నేతల మూడు కీలక డిమాండ్లు
- ప్రత్యామ్నాయాల్లో కిరణ్ సర్కార్
- తెలంగాణలో ఆటోల బంద్ వాయిదా
నాలుగు కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఒకవైపు.. తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర సర్కారు బలగాలు మరోవైపు! ఇప్పుడు ఉద్యమం పోరు కూడలిలో ఉంది! సకల జనుల సమ్మెను మరింత ఉధృతం చేసే క్రమంలో రైల్రోకో రూపంలో తెలంగాణ ఉద్యమం తన సత్తా చూపెట్టబోతున్నది. ఇప్పటికే బస్సు హారన్ బందైంది. ఇప్పుడు రైలు కూత మూగబోనుంది. దాని స్థానంలో నాలుగు దశాబ్దాల ఉద్యమం పొలికేకలు వేయనుంది! హస్తిన దాకా తన ఆకాంక్షను వినిపించనుంది. తెలంగాణ కొట్లాట పట్టాపూక్కనుంది! నేటి నుంచి మూడు రోజులు.. 15,16,17 తేదీల్లో నిరవధికంగా ఎక్కడి రైళ్లకు అక్కడే రెడ్సిగ్నల్ పడబోతున్నది! తెలంగాణ కేంద్ర బిందువుగా ఉత్తర దక్షిణ భారతాల మధ్య లింకు తెగిపోనుంది! తెలంగాణలో మరోసారి ప్రజా రవాణా పూర్తి స్థాయిలో స్తంభించనుంది!
మొన్నటి పట్టాలపైకి పల్లె.. నిన్నటి రెండు రోజుల రైల్రోకో.. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకూ జరిగిన ఈ రెండు ఆందోళనలూ విశేష స్థాయిలో విజయవంతమైన నేపథ్యంలో వాటి స్ఫూర్తి తో మూడో ఆందోళననూ దిగ్విజయం చేసేందుకు తెలంగాణ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమయ్యాయి. ఈసారి రైల్రోకో వ్యూహాన్ని మార్చేశారు. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే 30 పాయింట్లను ఎంపిక చేసి ధూంధాం నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజకీయ జేఏసీ మార్గదర్శకత్వంలో టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్షికసీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రైల్రోకోలో పాల్గొననున్నారు. రైల్రోకోలో మంత్రులు సైతం పాల్గొనాలని టీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. సీపీఐ కూడా రైల్రోకోకు సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ కేడర్ కూడా రైల్రోకోలో పాల్గొననుంది.
టీడీపీ టీ ఫోరం తమ శ్రేణులు సైతం రైల్రోకోలో పాల్గొంటాయని ప్రకటించింది. టీకాంక్షిగెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేశవరావు 15న నల్లగొండ, 16న వరంగల్, 17న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైల్రోకోలో పాల్గొంటారు. సకల జనుల సమ్మెలో భాగంగా సెప్టెంబర్ 24, 25వ తేదీల్లో చేపట్టిన మొదటి విడత రైల్రోకో, అంతకు ముందు నిర్వహించిన పట్టాలమీదికి పల్లెపల్లె కార్యక్షికమాలు భారీస్థాయిలో విజయవంతమయ్యాయి. పట్టాలన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. ఉత్తర దక్షిణ భారతాల మధ్య లింకూ పూర్తిగా తెగిపోయింది. పోలీసులు ఎంత అడ్డుకున్నా రెండురోజులు రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత అనుభవాల నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలో తెలంగాణలో తిరిగే 124 ప్రధాన రైళ్లను పూర్తిగా, కొన్నింటిని తెలంగాణలోకి రాకుండా పాక్షికంగా రద్దుచేసింది.
కొన్నింటిని దారి మళ్లించింది. మరికొన్నింటి వేళల్లో మార్పులు చేసింది. రదె్దైన రైళ్లలో ప్రయాణానికిగాను ఇప్పటికే టికెట్లు తీసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. రైల్రోకోల తర్వాత ప్రయాణికుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడుపుతామని తెలిపింది. తెలంగాణ ప్రాంతం ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే రూట్ కావడంతో రైల్రోకోల ప్రభావం దేశవ్యాప్తంగా పడనుంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్ అయిన ఒక్క సికింవూదాబాద్ జంక్షన్ నుంచే 110 రైళ్ల ద్వారా రోజూ లక్షా 50వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తంగా ఈ రైల్రోకోల వల్ల 5లక్షల మంది రవాణాపై ప్రభావం పడనుందని అంచనా. కానీ.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలో భాగంగా సాగుతున్న ఉద్యమంపై పంతానికి పోతున్న రాష్ట్ర ప్రభుత్వం రైల్రోకోను విచ్ఛిన్నం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను దించుతున్నది.
అర్ధరాత్రి నుంచే అక్రమ అరెస్టులను మొదలు పెట్టింది. ఇప్పటికే వివిధ తెలంగాణ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు దిగాయి. ఈ సారి రైల్రోకోను జరగనిచ్చేది లేదని పోలీసులు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను, బెదిరింపులను పట్టించుకోని ఉద్యమకారులు.. దీటుగా రైల్రోకోను విజయవంతం చేసి తీరుతామని సవాలు విసురుతున్నారు. పట్టాలపై తెలంగాణ జెండా ఎగురవేసి తీరుతామని చెబుతున్నారు. ట్రాక్ల ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, 26రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణలోని బస్సులు తిరగడం లేదు. ఎన్ఎంయూ సమ్మె విరమణ ప్రకటన తర్వాత అక్కడక్కడా కొన్ని తిరుగుతున్నప్పటికీ అవి ప్రజల రవాణా అవసరాలను ఏ మాత్రం తీర్చడం లేదు. మొత్తం 8వేల బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో రోజుకు 80లక్షల మంది రవాణా నిలిచిపోతోంది. అంటే రైల్రోకో, ఆర్టీసీ సమ్మె వల్ల 15,16,17తేదీల్లో సుమారుగా రోజుకు కోటి మంది రవాణా పూర్తిగా స్తంభించిపోతుంది.
ఇదిలా ఉండగా.. సకల జనుల సమ్మె 32 రోజులు పూర్తి చేసుకుంది. ఉద్యోగ సంఘాలతో కేబినెట్ ఉపసంఘం చర్చలు జరిపేది లేదని భీష్మించుకున్నా.. చివరకు మెట్టు దిగింది. శనివారం చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు ఆహ్వానం పంపింది! నిజానికి శుక్రవారం చర్చలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆహ్వానం పంపించారు. అయితే తాము ఉపసంఘంతోనే చర్చలకు వస్తామని నేతలు స్పష్టం చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. శనివారం జరిగే చర్చల్లో కూడా తమ మూడు కీలక డిమాండ్లపైనే నేతలు పట్టుబట్టనున్నారు. సమ్మె విచ్ఛిన్నానికి తీసుకొచ్చిన 177, ఎస్మా జీవోలు రద్దు చేయాలని, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్పై పోలీసుల హత్యాయత్నంపై విచారణ జరిపించాలని, తెలంగాణకు అనుకూలంగా రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జరిగే చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆటోల బంద్ వాయిదా
రైల్రోకో మూడు రోజుల సందర్భంగా తలపెట్టిన ఆటోల బంద్ను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ అమానుల్లాఖాన్ ప్రకటించారు. అన్ని ఆటో యూనియన్ల నాయకులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన శుక్రవారం తెలిపారు.
ఎవక్కడ?
మౌలాలి రైల్వేస్టేషన్ : జేఏసీ చైర్మన్ కోదండరాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే కవిత, న్యూడెమొక్షికసీ నేతలు పీ సూర్యం, గోవర్ధన్.
సీతాఫల్మండీ : టీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు, మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి, టీఆర్ఎస్ నేతలు టీ పద్మారావు, బొంతు రామ్మోహన్, పుటం పురుషోత్తం.
జమ్మికుంట రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ఎల్పీ నాయకుడు ఈటెల రాజేందర్.
అక్కన్నపేట్ రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ఎల్పీ ఉప నేత టీ హరీష్రావు, స్థానిక జేఏసీ, పార్టీల నాయకులు.
రామగుండం రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ వివేక్ , టీఆర్ఎస్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కే విద్యాసాగర్రావు.
నిజామాబాద్ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ, బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆలూరు గంగాడ్డి, న్యూడెమొక్షికసీ నేతలు కే యాదగిరి, వీ ప్రభాకర్, బీ దేవరాం.
భువనగిరి రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ కోమటిడ్డి రాజగోపాల్డ్డి.
వరంగల్ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు సిరికొండ మధుసూదనాచారి, అచ్చ విద్యాసాగర్, న్యూడెమొక్షికసీ నాయకులు ఎన్ అప్పారావు.
నల్లగొండ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్డ్డి, టీఆర్ఎస్
పొలిట్బ్యూరో సభ్యులు జీ జగదీష్డ్డి, కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బండ నరేందర్డ్డి, నాయకులు చకిలం అనిల్, న్యూడెమొక్షికసీ నాయకులు జనార్ధన్, డేవిడ్కుమార్.
మహబూబాబాద్ రైల్వేస్టేషన్: కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, టీఆర్ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్డ్డి, టీ రవీందర్రావు, సంగులాల్, న్యూడెమొక్షికసీ నాయకులు ఎం వెంకన్న.
తెల్లాపూర్ రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ మెదక్ ఎంపీ విజయశాంతి, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్డ్డి.
గద్వాల రైల్వేస్టేషన్: కాంగ్రెస్ నాగర్కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు సింగిడ్డి నిరంజన్డ్డి, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, నేతలు గువ్వల బాలరాజ్, విష్ణువర్ధన్, ఠాకూర్ బాలాజీ సింగ్.
ఆదిలాబాద్ రైల్వేస్టేషన్: స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లోక భూమాడ్డి, బాలూరి గోవర్ధన్డ్డి, జేఏసీ జిల్లా చైర్మన్ మహేంవూదనాథ్.
కామాడ్డి రైల్వేస్టేషన్: స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, టీఆర్ఎస్ ఎల్లాడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్డ్డి, నాయకులు ఎం వేణుగోపాల్గౌడ్, తిరుమల్డ్డి, బీజేపీ నాయకులు మురళీధర్గౌడ్, జేఏసీ చైర్మన్ జగన్నాథం.
మంచిర్యాల రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే గడ్డం అరవిందడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, బీజేపీ నాయకులు గోనే శ్యాంసుందర్రావు, న్యూడెమొక్షికసీ నాయకులు పీ శ్రీనివాస్, నైనాల వెంక
సిర్పూర్-కాగజ్నగర్ రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, తూర్పు విభాగం అధ్యక్షుడు పురాణం సతీష్కుమార్.
కాజీపేట రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, మాజీ మంత్రి జీ విజయరామారావు, మాజీ ఎంపీ అజ్మీరా చందులాల్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ టీ రాజేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు.
వికారాబాద్ రైల్వేస్టేషన్: మాజీ మంత్రి చంద్రశేఖర్, రంగాడ్డి పశ్చిమ అధ్యక్షుడు నాగేంవూదగౌడ్, నర్సింలు, షరీఫ్.
మహబూబ్నగర్ రైల్వేస్టేషన్: మాజీ ఎంపీ ఏపీ జితేందర్డ్డి, మాజీ ఎమ్మెల్యే సి లక్ష్మాడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్రావు ఆర్యా, న్యూడెమొక్షికసీ నాయకులు కేజీ రాంచందర్.
డోర్నకల్ రైల్వేస్టేషన్: మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్రావు, టీఆర్ఎస్ నాయకులు భూక్యా కిషన్నాయక్, ఎన్ నరేష్డ్డి.
తాండూర్ రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు పర్యాద కృష్ణమూర్తి, నాయకులు బీ విజయకుమార్, ముజీబ్.
బాసర రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ అధ్యక్షుడు కే శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్, బీజేపీ జిల్లా పశ్చిమ అధ్యక్షుడు రావుల రాంనాథ్.
మిర్యాలగూడ రైల్వేస్టేషన్: టీఆర్ఎస్ నాయకులు అమరేందర్డ్డి, నాగార్జునచారి, బీ శ్రీనివాసరాజు, డీ ప్రవీణాడ్డి, న్యూడెమొక్షికసీ నాయకులు వీ కోటేశ్వర్రావు.
ఖమ్మం రైల్వేస్టేషన్: న్యూడెమొక్షికసీ నాయకులు పీ రంగారావు, రాయల చంద్రశేఖర్.
మధిర రైల్వేస్టేషన్: న్యూడెమొక్షికసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎస్ వెంక టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి.
Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand
SriKrishna Committee Report Leaked !
Overwhelming majority in Telangana seeks a separate state; the current ten districts of Telangana could be carved into a separate state with Hyderabad as its capital;
Pros: Enough indications suggest that this region was neglected and its people discriminated against; a separate state would address many of the concerns ailing this region. For example, a new state of Telangana would definitely get more water and therefore bring prosperity to the region. Could also lead to elimination of Naxal Movement because people will get a political voice in Indian democracy.
Cons: Seemandhra people may get disappointed and may burn some buses in Seemandhra region.
Majority in Coastal Andhra and Rayalaseema would like to keep the state united; the status quo could be maintained with introduction of regional board for each region – Telangana, Coastal Andhra and Rayalaseema, and special packages could be given for neglected and backward districts.
Pros: no change required to current administration setup; will make people of Seemandhra extremely happy; Telangana people will be under superior rulers of Seemandhra region.
Cons: will make people of Telangana extremely unhappy; could lead to massive agitations and uprising in Telangana, but our outstanding Indian Army and Air Force can easily suppressing it with less than 5 lakh people dead; could lead to escalation of Naxal Movement like it happened in the aftermath of 1969.
Some pockets and colonies in Hyderabad seek separate status away from the rogues and villains of Telangana; all the houses and colonies seeking separate Hyderabad could be made into a separate state or union territory. Though disjoint geographically, which will result in collection of conclaves completely surrounded by Telangana as first-of-its-kind experiment in human history, it will satisfy the aspirations of these people.
Pros: The map will like speckle of dust, making it very interesting in class room discussions all around the word.
Cons: Telangana people may want to charge a cess of 200 rupees each time the residents of this region enter Telangana. Even if the kid wants to play coming out of the home and enter Telangana, he has to pay up. All these entry fees into Telangana, with complete dependence for water and power on Telangana, it may result in negative GDP for this region.
There are some people from Seemandhra who do not want to let go of Telangana and would like to hold onto the city, and as a compromise suggest sharing of Hyderabad city as capital for both the regions of Telangana and Seemandhra. A model like Berlin during Cold War is proposed with a wall to separate the two sections of the city.
Pros: Though it is not in their culture, Seemandhras could still have easy access to Hyderabadi Biryani; A Hyderabad Wall (like Berlin Wall) manned by military will be a tourist spot and make interesting stories for movies, like love affairs between couple living on different sides of the wall.
Cons: Like with Berlin, Seemandhra has to airlift all amenities like water and food to its residents since their part of the city is completely surrounded by Telangana.
Few individuals in some small conclaves in Hyderabad still dream of restoring Hyderabad State by annexing Marathwada and Karnatak region and then merge it with Pakistan; though it is not possible to restore the erstwhile Hyderabad State, it is possible to create small conclaves of Pakistan inside India.
Pros: Creation of small Pakistan inside India may lead to some hilarious bonhomie with Pakistan.
Cons: The residents may need a visa to step out of their homes. In case of war, this region can be used by Pakistan to launch nuclear strike against India from within India.
There are some Telanganas who propose that Seemandhras should set an example of remaining in a ‘united state’ by remerging Seemandhra region with Tamil Nadu.
Pros: Tamils will now have someone to kick around the way Andhras had Telanganas all this while.
Cons: Andhras will be kicked around now like their Telangana brothers.
Andhra Pradesh is not a ‘marriage’
We will then demand compensation for the loss of our lands that was sold to the bidders from Seemandhra. We will then sue them for the massive and large scale pogrom of discrimination, suppression and marginalization of Telanganas for nearly three generations. We will then sue them for negative characterization of Telanganas in their movies and history books and seek compensation for the neglect of our culture that resulted in loss of self-identity. Then we will sue them for malicious delay in formation of Telangana after 9th December 2009 announcement resulting in death of nearly 600 people in Telangana.