Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, January 18, 2012

Don't spy on Muslims, says Achuthanandan

Don't spy on Muslims, says Achuthanandan
Thiruvananthapuram, January 17 : Opposition leader V.S. Achuthanandan Tuesday blasted the Kerala government for allegedly spying the email accounts of Muslim leaders.
 
The Marxist leader accused Chief Minister Oommen Chandy of "following in the footsteps of Narendra Modi". 

"We wish to know if P.V. Abdul Wahab and Abdul Samad Samadhani, both belonging to the Indian Union Muslim League, have terrorist connections?" asked Achuthanandan. 

On Monday, news surfaced that the intelligence department here was allegedly spying on the email accounts of 189 Muslim leaders, including journalists and politicians.

Chandy has asked Additional Director General of Police (Intelligence) T.P. Senkumar to probe the allegation.

State IUML general secretary K.P.A. Majeed said: "Let the report come out, and then we will react to it."

The Kerala Union of Working Journalists condemned the tracking of emails and tapping of telephones of journalists.

Take By: Siasat News

Read more...

టెట్టా .. డీఎస్సీనా (TET / DSC)

- రెండింటిలో ఏదో ఒకటే.. అధ్యయనంపై ప్రభుత్వ యోచన
- మంత్రి పార్థసారధి వెల్లడి.. ఈ డీఎస్సీకి వర్తింపు డౌటే !
- టెట్‌పై అభ్యర్థుల్లో వ్యతిరేకత.. శాస్త్రీయత లేదంటూ ఆందోళన


హైదరాబాద్, జనవరి 17 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పై రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జాతీయ విద్యా, ఉపాధ్యాయ శిక్షణా మండలి మార్గదర్శకాల మేరకు టెట్ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అభ్యర్థుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. దేశ వ్యాప్తంగా లేని టెట్ రాష్ట్రంలో ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పరీక్ష నిర్వహణలో ఏమాత్రం శాస్త్రీయత లేకుండా ప్రభుత్వ ఆలోచనలను బలవంతంగా రుద్దుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఎంపికకు అభ్యర్థుల వడపోతకు ప్రభుత్వం ఎలాగూ డీఎస్సీ నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలో టెట్ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అభ్యర్థుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా డీఎస్సీ, టెట్‌లలో ఏదో ఒక పరీక్ష నిర్వహించేలా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పి. పార్థసారధి తెలిపారు. అలా కాకుంటే ఈ రెండు పరీక్షలు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలా? అనేది అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే టెట్ రెండు సార్లు నిర్వహించారు. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌కు కూడా విద్యాశాఖ రంగం సిద్ధమైంది. ఈ డీఎస్సీకి టెట్ వర్తింపజేసేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం యోచన బాగానే ఉన్నప్పటికీ ఈ అధ్యయనం పూర్తి చేయటం ఇప్పట్లో సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించే కొత్త డీఎస్సీకి ఇది వర్తించే అవకాశం కనిపించటం లేదు. డీఎస్సీ రాత పరీక్షకు అర్హతలు ఇప్పటికే విద్యాశాఖా ప్రకటించింది.

సివిల్స్‌స్థాయి ప్రమాణాలా..!
భారత సర్వీసులు, గ్రూప్-1 ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షా ప్రమాణాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఎంపికకు పెట్టడంతో అభ్యర్థులు హడపూత్తి పోతున్నారు. సివిల్స్ ఎంపికకు డిగ్రీ కలిగి ఉండి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు మూడు అంచెలు దాటి వసే ్త అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపిక అవుతారు. ఉపాధ్యాయులకు సైతం ఇదే స్థాయిలో ఎంపిక ప్రక్రియ ఉంది. ప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల డిగ్రీతో పాటు బీఈడీ, టెట్, డీఎస్సీ మూడు అంచెలు దాటి రావాల్సి ఉంది. దీంతో అభ్యర్థులు సివిల్స్ స్థాయిలో ప్రిపేర్ కావల్సిన పరిస్థితి నెలకొంది.

శాస్త్రీయత లేదు..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ కూడా శాస్త్రీయంగా లేదు. ఇందులో ప్రధానంగా భాషా పండితులు తెలుగు, హిందీ విషయాన్ని బోధిస్తారు. కానీ వీరికి టెట్ పరీక్షలో సోషల్ సబ్జెక్టు అంశాలపై ప్రశ్నలడగటం ఏమిటని అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇందులో సోషల్ సబ్జెక్టుకే అధిక మార్కులు ఉండటం గమనార్హం. సాధారణంగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలో సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. కానీ టెట్‌కు మాత్రం 60 శాతం మార్కులు సాధిస్తేనే డీఎస్సీకి అర్హత సాధించినట్లు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు సాధించాలని నిర్ణయించటం శాస్త్రీయంగా లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయుల ఎంపికకు ప్రభుత్వం టెట్ పరీక్ష ఐచ్చికంగా పెట్టుకుంటే బాగుండేది.

లేదా సాధారణ డిగ్రీ, పీజీ మాదిరిగానే 35 శాతం మార్కులు పెట్టి టెట్ పాసైతేనే డీఎస్సీకి అర్హులు అన్నా బాగుండేది. కానీ ప్రభుత్వం ఒక శాస్త్రీయ అధ్యయనం లేకుండా టెట్ నిర్వహిస్తుండటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more...

స్పెషల్ బాంబ్!

- ఇంధన సర్దుబాటు చార్జీల మోత
- డిస్కమ్ ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం
- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసిన కమిషన్
- హైకోర్టు తీర్పుకు లోబడి 2008-09 ఎఫ్‌ఎస్‌ఏ అమలు
- 2009-10 ఎఫ్‌ఎస్‌ఏ ఫిబ్రవరి నుంచి వసూలు
- విద్యుత్ వినియోగదారులపై రూ. 3038 కోట్ల పరోక్ష వడ్డన
- యూనిట్‌కు 35 నుంచి 40 పైసల భారం


bulb1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 17 (: గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) వసూలుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఆమోదం తెలిపింది. వచ్చే ఫిబ్రవరి నెలనుంచి ఎఫ్‌ఎస్‌ఏ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్దేశించింది. మంగళవారం రాత్రి పదిగంటల వరకు కసరత్తు జరిపి అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఈఆర్సీ ఈ ఆదేశాలు జారీచేసింది. గత రెండేళ్లకు సంబంధించి సరాసరిగా ప్రతి యూనిట్‌పై 35 నుంచి 40 పైసల చొప్పున ఇంధన సర్దుబాటు భారం పడనుంది. 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి న ప్రతిపాదనల్లో ఈఆర్సీ రూ.3038 కోట్ల మేరకు ఆమోదం తెలిపింది.

2008-09 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు రూ.3,141.97 కోట్ల ఎఫ్‌ఎస్‌ఏను ప్రతిపాదించగా ఈఆర్సీ రూ. 1,638.82 కోట్లకు ఆమోదం తెలిపింది. 2009-10 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు 1,480కోట్లు ప్రతిపాదించగా ఈఆర్సీ మాత్రం రూ.1,400కోట్లకు సర్దుబాటు చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో వ్యవసాయ వినియోగదారులు మినహా మిగతా వినియోగదారులపై సగటున 2008-09 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్క యూనిట్‌పై 33.88పైసల చొప్పున, 2009-10 ఆర్థిక సంవత్సరంలో 44.05 పైసల చొప్పున అదనపు భారం పడనుంది. రెండు సంవత్సరాలకు సంబంధించి గృహ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ (ఎఫ్‌ఎస్‌ఏ) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.

గత సెప్టెంబర్‌లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ముఖ్యమంవూతికి నివేదిక అందజేసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారుల ఇంధన సర్దుబాటు ఛార్జీల మొత్తం దాదాపు రూ.577కోట్లను సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరడ్డి ప్రకటించడంతో మిగతా వినియోగదారులు (నాన్ డొమెస్టిక్) హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన కేసును గత సెప్టెంబర్‌లో హైకోర్టు బెంచ్ విచారించి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు, ప్రభుత్వానికి చురకలు పెట్టింది. దాంతో 2008-09 ఇంధన సర్దుబాటు చార్జీల అమలు అంశం హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటుందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఏను వినియోదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శి మనోహరరాజు ‘T’కు వెల్లడించారు.

Take By : T News

Read more...

గెలుపు ఎవరిది? (Who is Win)

ఆజాద్‌తో కిరణ్ సుదీర్ఘ భేటీ
మంత్రుల జాబితాపై చర్చ?
శాఖలపైనా మంతనాలు!

సీఎం మాటను మన్నించిన ఆజాద్?
పునర్వ్యవస్థీకరణకు ఓకే
బొత్సను తప్పించే అవకాశం
ముందే బొత్సతో మాట్లాడిన ఆజాద్
నేనుంటేనే పార్టీకి మంచిది
ఆజాద్ ముందు బొత్స వాదన
సమన్వయ కమిటీలో ఉన్నారుగా..
నచ్చజెప్పిన రాష్ట్ర ఇన్‌చార్జ్
సీఆర్‌తో మొదలైన కిరికిరి

ఆయనపై సీఎం విముఖత?


పూర్తి ప్రక్షాళనతో సొంత టీమ్ కోసం కిరణ్
మార్పులకు బ్రేక్ కోసం బొత్స ఫైట్
హస్తినాపురంలో జోడెద్దుల మంతనాలు

కేబినెట్‌లో మాకూ చోటివ్వండి... సీనియర్ ఎమ్మెల్సీల డిమాండ్
తెరపైకి వచ్చిన తెలంగాణ ఖాళీలు
రెండు డిమాండ్ల వెనుక సీఎం?

Kiran205-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ/హైదరాబాద్, జనవరి 17 (): విస్తరణ రాజకీయం హస్తినకు చేరుకుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఎడతెగని చర్చల్లో మునిగిపోయింది. మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి తనకంటూ ఒక జట్టును కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలి... కొందరు సీనియర్లకు ఉద్వాసన పలికి, కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతో పాటు ప్రాంతాల మధ్య సమతుల్యం సాధించాలి.. ఇది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి యోచన! పార్టీని, ప్రభుత్వాన్ని ఆపత్కాలంలో ఆదుకున్న చిరు బ్యాచ్‌కు తక్షణమే మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి.. ఇతర మంత్రుల శాఖలను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చరాదు.. ఇది పీసీసీ చీఫ్ మనోగతం! ఇద్దరు నేతలూ రెండు వాదాలతో ఢిల్లీలో అడుగుపెట్టడంతో కాంగ్రెస్‌లో సమస్యల కొలిమి మరోసారి రాజుకున్నట్లయింది. దీనికి తోడు ఎమ్మెల్సీగా ఉన్న సీ రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉండటంతో మేమే తక్కువా? అంటూ ఎమ్మెల్సీలు సైతం తిరగబడుతుండటంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. పునర్వ్యవస్థీకరణే జరిగితే తెలంగాణ కోటాలో ఏర్పడిన ఖాళీలను తమతో భర్తీ చేయాలని కోరుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాజాగా మంత్రి పదవుల డిమాండ్‌ను లేవనెత్తడం దీనికి నిదర్శనం.

మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. విమానాక్షిశయం నుంచి నేరుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాను పునర్వ్యవస్థీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నదీ ఆయనకు మరోసారి వివరించారు. ప్రధానంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణతోపాటు శాఖల కేటాయింపుపై వారిరువురూ సుదీర్ఘంగా చ ర్చించారని తెలిసింది. సీఎం తెచ్చిన కొత్త మంత్రుల జా బితా, వారి కేటాయించాలనుకుంటున్న శాఖలపై ఈ చర్చ సాగినట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రానున్నందున ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొని, పాలనాపరంగా మరింత దూకుడుగా వ్యవహరించగలిగే కొంతమంది మంత్రులు కావాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. సుమారు గంటన్నరకు పైగా జరిగిన భేటీలో సొంత టీం ఏర్పాటుకు తనకు స్వేచ్ఛనివ్వాలన్న సీఎం విన్నపాన్ని ఆజాద్ అమోదించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో కాలం లేకపోవడంతో పాత టీంను మార్చాలన్న ఆయన ప్రతిపాదనకు ఆజాద్ ఓకే చెప్పినట్లు తెలిసింది. తనకు తలనొప్పిగా మారిన పీసీసీ అధ్యక్షుడు బొత్స, శంకపూరావులను మంత్రి వర్గం నుంచి తప్పించాలని ఎంతో కాలంగా సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఈ దఫా ఫలించేటట్లు కనిపిస్తున్నాయి. పీఆర్‌పీ నుంచి చిరంజీవి ప్రతిపాదిస్తున్న సీ రామచంవూదయ్య, గంటా శ్రీనివాస్‌రావుకు స్థానం కల్పించాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన బొత్సను తప్పించాల్సిందేనని ఆజాద్‌ను కిరణ్ ఒప్పించారని అంటున్నారు. సీఎం ప్రతిపాదనను ముందే గుర్తించిన ఆజాద్.. కిరణ్ తనను కలవడానికి ముందే బొత్సను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. మధ్యాహ్నం ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గం నుంచి ఆయనను తప్పిస్తున్న అంశాన్ని బొత్సకు తెలియపరిచారని సమాచారం.

అయితే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి తాను మంత్రిగా కొనసాగితేనే ఉపయోగకరమని బొత్స వాదించినట్లు తెలిసింది. అయితే దీనికి ఆజాద్ సుముఖత చూపించలేదని తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి ఇప్పటికే తన అధ్యక్షతన సమన్వయ కమిటీ పనిచేస్తున్నదని, దానిలో మీరు కూడా సభ్యులైనందున అక్కడ పార్టీ అభివూపాయాలను సీఎం దృష్టికి తీసుకురావచ్చని ఆజాద్ సూచించారని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వంలో లోపాలను సైతం ఎత్తిచూపొచ్చని, దానికి మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం లేదన్న ధోరణిలో బొత్సను ఆజాద్ ఒప్పించినట్లు సమాచారం. మంత్రి శంకపూరావును కూడా తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం రూపొందించిన జాబితాపై అభివూపాయం తెలపడానికి అందుబాటులో ఉండాలని బొత్సను ఆజాద్ కోరినట్లు తెలిసింది. తాను రూపొందించిన జాబితాపై ఆజాద్‌తో ఆమోద ముద్ర వేయించుకున్న కిరణ్.. సోనియాతో బుధవారం భేటీ అయి.. ఆమె అనుమతి తీసుకుని రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.

ఎవరి ప్రయోజనాలు వారివే!
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), కోమటిడ్డి వెంకట్‌డ్డి (నల్గొండ) తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం కేబినెట్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి రెండు ఖాళీలు ఉన్నాయి. వీటిని ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యతను పాటించాలంటే ఈ రెండు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఖాళీలను తాజా విస్తరణలో భర్తీ చేయాలని వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే, పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణాడ్డి మంగళవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో సీనియర్ ఎమ్మెల్సీలు ఉండగా వారిని కాదని పీఆర్పీ ఎమ్మెల్సీ రామచంవూదయ్యకు మంత్రిపదవి ఎలా ఇస్తారని అధికార పార్టీకి చెందిన తెలంగాణ ఖాళీలు భర్తీ చేయాలనుకుంటే.. ఎమ్మెల్యేలు ఉత్తంకుమార్‌డ్డి, దామోదర్‌డ్డి, గండ్ర వెంకటరమణాడ్డి, మల్లు భట్టి విక్రమార్క్‌లకు దక్కవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంత్రి శంకపూరావును తొలగించాల్సి వస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు మంత్రిపదవి ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీల విషయానికి వస్తే డీ శ్రీనివాస్, పాలడుగు వెంకవూటావు, మహ్మద్ జానీ, రుద్రరాజు పద్మరాజు, ఇంద్రసేన్‌డ్డి, జగదీశ్వర్‌డ్డి, భూపాల్‌డ్డి, భానువూపసాద్ మంత్రిపదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో పాలడుగు, పద్మరాజు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వీరితో పాటు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌డ్డి, టీజీ వెంక మల్లు భట్టివిక్షికమార్క ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ మోహన్ ఢిల్లీ వెళ్ళారు.

తెలంగాణ ఉద్యమ వాతావరణం కొంత చల్లబడటంతో పాటు రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, యువతకు అనేక పథకాలు, కార్యక్షికమాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నందున ఇదంతా తన గొప్పతనంగా కిరణ్ చెప్పుకుంటున్నారు. వీటిని చూపి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్న కిరణ్.. మొత్తంగా ప్రభుత్వంలో తన పట్టుపెంచుకునేందుకు పావులు కదిపారని సమాచారం. తనకు అడ్డంకిగా ఉన్న మంత్రులు బొత్స, శంకపూరావు, డీఎల్ వంటి సీనియర్లను కూడా కేబినెట్ నుంచి తొలగించుకోవాలని కిరణ్ ఆరాట పడుతున్నారని తెలుస్తోంది. అయితే కిరణ్ ఆలోచనలను ముందే పసిగట్టిన బొత్స తదితరులు కిరణ్‌కు వ్యతిరేకంగా అధిష్ఠానానికి సవివరంగా నివేదికలు పంపినట్లు సమాచారం.

పథకాల్లో డొల్లతనాన్ని వారు ఆ నివేదికలో పొందుపర్చారని తెలిసింది.మంత్రివర్గంలోకి రామచంవూదయ్యను తీసుకోవడంపై సీఎం సుముఖంగా లేరని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు వంగా గీత, బండారు సత్యానందరావు తదితరులతో భేటీ కావడం పీఆర్పీ వర్గాల్లో కలకలం రేపింది. పీఆర్పీ నేతల్లో చీలికి తెచ్చేందుకు సీఎం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంత్రుల శాఖల మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతుండడంతో మంత్రులు ఆర్ వెంకట్‌డ్డి, ఏరాసు ప్రతాప్‌డ్డి, సబితా ఇంద్రాడ్డి, పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, పార్ధసారధి, మహిధర్‌డ్డి, రఘువీరాడ్డి, పీ విశ్వరూప్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణాడ్డి పలువురు ఎమ్మెల్సీలు క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పులి ఉప ఎన్నిక సందర్భంగా మంత్రిపదవికి రాజీనామా చేసిన వైఎస్ వివేకానందడ్డి కూడా కిరణ్‌ను కలిశారు.

హస్తినకు ఆశావహుల క్యూ
మంత్రి వర్గంలో భారీ మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్న వార్తలతో రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఆశావహులు హస్తినబాట పట్టారు. మంత్రులు ఏరాసు, శైలాజానాథ్, చీఫ్ విప్ కొండ్రు మురళి, డిప్యూటీ స్పీక్ మల్లు, ఎమ్మెల్యేలు గండ్ర, ముత్యండ్డి, మస్తాన్‌వలీ తదితరులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం జరుగుతుందన్న వార్తలతో అసంతృప్తులు రగులుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అందరూ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఈ నేపథ్యంలోనే మంత్రులు రాష్ట్ర నేతలను కోరుతున్నారు.

మా సంగతేంటి?
ఎమ్మెల్సీ కోటా నుండి రామచంవూదయ్యకు మంత్రి వర్గంలో స్థానం దాదాపు ఖరారు కావడంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అధిష్ఠాన తీరును తప్పుబడుతున్నారు. తాము మంత్రి పదవి అడిగినప్పుడు ఎమ్మెల్సీలకు అవకాశం లేదన్న పార్టీ పెద్దలు ఇప్పుడు ఏ రకంగా రామచంవూదయ్యకు పదవి కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీలకు అవకాశం ఇవ్వదలుచుకుంటే పార్టీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన తనకివ్వాలని పాలడుగు కోరుతున్నారు. ఇదే విషయంపై ఆజాద్‌తోపాటు పార్టీ కోర్‌కమిటీ సభ్యులనూ ఆయన కలవనున్నారు. ఎమ్మెల్సీలు బాషా, పద్మరాజు, రంగాడ్డి తదితరులు కూడా ఇదే వాదనతో ఢిల్లీ పెద్దలను కలువనున్నారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP