Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, January 30, 2012

నేడు టెట్ ఫలితాలు and డీఎస్సీ నోటిఫికేషన్ నేడే (TET and DSC)

మధ్యాహ్నం 2:30కు వెల్లడించనున్న మంత్రి పార్థసారధి
హైదరాబాద్, జనవరి 29 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే పార్థసారధి సచివాలయంలో మధ్యాహ్నం రెండున్నరకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలను www.aptet.cgg.gov.in లో చూడొచ్చు.


డీఎస్సీ నోటిఫికేషన్ నేడే

- సుమారు 22,622 పోస్టులతో ప్రకటన
హైదరాబాద్, జనవరి 29 (): డీఎస్సీ-2012 నోటిఫికేషన్ సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 22, 622 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఇటీవల రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) 9569 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసింది. ఇన్ సర్వీస్ సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పదోన్నతులు కల్పించింది. ప్రమోషన్లతో భర్తీ చేసిన పోస్టుల వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ పోస్టుల స్థానంలో డీఎస్సీలో నేరుగా ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టుల సంఖ్య, వివరాలపై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నానికల్లా జీవో వస్తే సాయంత్రం లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. లేనిపక్షంలో మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Take By: T News

Read more...

డీఎస్సీకి మరో కొర్రి (DSC)

- బీఈడీ సబ్జెక్టును ఇంటర్‌లోనూ చదివి ఉండాలంటూ కొత్త నిబంధన
- జీవో నెంబర్ 4 జారీ
- వేలాదిమందికి డీఎస్సీ చాన్స్ లేనట్లే!
- రోజుకో నిబంధనతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు
- ఆ నిబంధనను వెంటనే తొలగించాలి
- టీచర్ అభ్యర్థుల మండిపాటు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (): అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధన తెస్తూ అభ్యర్థుల ఆశలను అడియాశలు చేస్తోంది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా చేసిన సర్కారు తాజాగా మరో కొర్రీని తెరపైకి తెచ్చింది. బీఈడీలో చదివిన సబ్జెక్టు కచ్చితంగా ఇంటర్‌లోనూ చదవి ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో వేలాది మంది బీఈడీ అభ్యర్థులు డీఎస్సీకి అనర్హులయ్యే అవకాశం ఉంది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులు డిగ్రీలో బీఏ, బీకాంలకు మారి.. బీఈడీలోనూ అవే సబ్జెక్టులు చదివితే.. డీఎస్సీకి అర్హత కోల్పోతారు. దీంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

విద్యాశాఖ మొదటి నుంచి బీఈడీ అభ్యర్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోంది. కొత్త నిబంధనలు తెస్తూ ఒక్క దెబ్బకు వేల పిట్టలన్న చందంగా టీచర్ పోస్టులకు చాలామందిని దూరం చేస్తోంది. దూరవిద్య విధానంలో డిగ్రీ, బీఈడీ చేసినవారిని టెట్‌కు అనర్హులుగా ప్రకటించింది. దీంతో వారు డీఎస్సీ అవకాశం కోల్పోయారు. తాజాగా ఇంటర్, డిగ్రీ, బీఈడీ ఇలా వరసగా అన్నీ చదివి చివరకు టెట్ నెగ్గినా డీఎస్సీ రాయలేని పరిస్థితి. డీఎస్సీ అభ్యర్థులు బీఈడీలో చదివిన సబ్జెక్టును ఇంటర్‌లోనూ తప్పనిసరిగా చదివి ఉండాలన్న నిబంధన విధిస్తూ 9న విద్యాశాఖ జీవో నెం.4ను జారీ చేసింది. ఇంటర్, బీఈడీల్లో ఒకే సబ్జెక్ట్ చదివినవారే డీఎస్సీకి అర్హులని తేల్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) నిబంధనల కారణంగా బీఈడీ అభ్యర్థులు ఇప్పటికే ఎస్‌జీటీ పోస్టులకు దూరమయ్యారు. ఇక వారికి మిగిలింది స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) పోస్టులే. తాజా నిబంధనతో చాలామందికి ఈ పోస్టులు కూడా ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ నిబంధన ఎడ్‌సెట్‌కు ఎందుకు లేదు?
బీఏ, బీకాం, బీఎస్సీ చదివిన వారు సంబంధిత డిగ్రీ సబ్జెక్టులో బీఈడీ చేసుకునే అవకాశం ఉంది. బీఈడీలో చదవబోయే సబ్జెక్టును ఇంటర్‌లోనూ కచ్చితంగా చదవాలనే నిబంధన ఎడ్‌సెట్‌లో లేదు. తాజా నిబంధనను ఎడ్‌సెట్‌కూ వర్తింపచేస్తే చాలామంది బీఈడీ చేసేవాళ్లే కాదు. టెట్ పేపర్‌పై ఆందోళన చేస్తున్న తమకు మరో షాక్ ఇచ్చేలా రాష్ట్రవూపభుత్వం ఈ నిబంధన తెచ్చిందని అభ్యర్థులు మండిపడుతున్నారు.

టెట్‌తో సంబంధం లేకుండా  డీఎస్సీకి అవకాశమివ్వండి - పీఆర్‌టీయూ డిమాండ్
హైదరాబాద్, జనవరి 29 (టీ న్యూస్): డీఈడీ పాసైన అభ్యర్థులందరికీ టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని పీఆర్‌టీయూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే టెట్ నిర్వహించి డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని సంఘం అధ్యక్షుడు పీ వెంకట్‌డ్డి, కార్యదర్శి పూల రవీందర్ విమర్శించారు.

మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు..
బీఈడీ అభ్యర్థుల పరిస్థితి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్లకే సరిపుచ్చుతామంటున్న ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనతో బీఈడీ అభ్యర్థులను వేధిస్తోంది.
డీ రవీందర్, బీఈడీ అభ్యర్థి


ప్రభుత్వ చెలగాటం
ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులతో చెలగాటమాడుతోంది. జీవో నెం.3ను రద్దు చేసి మా ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపింది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిన వారు అనివార్య కారణాలతో డిగ్రీలో బీఏ, బీకాం చేసి టెట్ నెగ్గినా కూడా వారికి డీఎస్సీలో అవకాశం కల్పించలేమని ప్రభుత్వం చెప్పడం దారుణం.
- సీత, ఉస్మానియా యూనివర్సిటీ


ఈ నిబంధన అర్థం లేనిది
బీఈడీలో చదివిన సబ్జెక్ట్‌ను ఇంటర్‌లో చదవాలనడం అర్థం లేని విషయం. ఇంటర్ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా బీఈడీ చదివే అవకాశం ఎందుకు కల్పించారు. సైన్స్ గ్రూప్‌తో ఇంటర్, డిగ్రీలో ఆర్ట్స్ చదివి బీఈడీ చేసిన వారు మళ్లీ ఆర్ట్స్‌లో ఇంటర్‌లో చదవాలా?
- ఆర్ వెంక బీఈడీ అభ్యర్థి


వెంటనే తొలగించాలి
బీఈడీలో చదివిన సబ్జెక్ట్‌ను ఇంటర్‌లో చదవాలనే నిబంధనను ప్రభుత్వం వెంటనే తొలగించాలి.
- గణేష్, బీఈడీ అభ్యర్థి

Read more...

అధికారానికి బడుగులే!

సామాజిక న్యాయం చట్టుబండలుబీసీలకు రిజర్వేషన్లు ఏవి?
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమూ అంతంతేఎక్కడా దక్కనిదామాషా వాటా

- పార్టీల్లోనూ టికెట్లు కరువే
- మభ్యపెడుతున్న ప్రధాన పార్టీలు
- సంక్షేమ పథకాల కుప్పల్లో కూరుకుపోయిన బలహీన వర్గాలు
- అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే
- పార్టీ జెండా మోయడానికే పరిమితం!


kulammain talangana patrika telangana culture telangana politics telangana cinema(, హైదరాబాద్)వారికి జెండా మోయడం తెలుసు! తమ నాయకులను అధికారంలోకి తేవడం తెలుసు! పార్టీ కోసం గొంతుచించుకుని అరవగల సత్తా వారిది! నేతలు ఇబ్బంది పడితే తామే ఇబ్బందిపడినట్లు బాధపడే మనస్తత్వం వారిది! ఏళ్ల తరబడి కొన్ని కొన్ని పార్టీలను నమ్ముకుని ఉన్నారు! అగ్రకుల పార్టీ నేతలకూ ఆ విషయం తెలుసు! అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే అంత ప్రేమ! కానీ ఆ ప్రేమ వారితో జెండా మోయించేంత వరకే! ఓట్ల పండగలో వెంట తిప్పుకోవడం వరకే! మహా అయితే అందులో ముఖ్యమైన వారికి ఐదో పదో పదవులు, కొన్ని ప్రయోజనాలు కల్పించడం! అంతవరకే! కానీ వారిలో ఎవరూ ఆ పార్టీలో కీలక స్థానాలకు ఎదగలేరు! ఇక ముఖ్యమంత్రి పదవంటే మాటలా! ఇది దశాబ్దాలుగా రాజకీయ కుల సమరంలో ఎప్పుడూ ఓడిపోతున్న బడుగు వర్గాల కార్యకర్త పరిస్థితి! ఓట్ల పరంగా అధిక సంఖ్యాకులైనప్పటికీ.. అధికార పంపిణీలో మాత్రం చిన్నచూపే! టికెట్లు కేటాయించే దగ్గర మొదలు.. గెలిస్తే కీలక పదవులు కట్టబె అదే వివక్ష! బడుగులకు రాజ్యాధికారం సహించని తత్వమేనన్నది కడుపుమండినవారి విమర్శ! అది అగ్రకుల తత్వమేనన్నది సమాజాన్ని కాచివడపోసిన వారి మాట! ఏది ఏమైనా.. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరంగానే ఉంటున్నాయి! అగ్రకుల పెత్తనంలో కొనసాగుతున్న పార్టీలు వారిని ఆ స్థాయికి తీసుకురావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి! ఇది నగ్న సత్యం!రాష్ట్ర చరివూతలో అప్పుడు ఇప్పుడూ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అందని పండుగానే ఉంది. ఓట్ల రాజకీయాల కోసం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ఈ పార్టీలే దానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేందుకు చిత్తశుద్ధితో ఎలాంటి ప్రయత్నాలకు పూనుకోకపోవడం గమనార్హం.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే తమ ఆటలు సాగవనేది గమనించిన ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు బీసీలు ఉద్యమాలతో సంఘటితం కాకుండా దృష్టిమళ్ళించే చర్యలకు పాల్పడుతున్నాయన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించినవారిని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నప్పటికీ.. అధిక శాతం ఓట్లున్న బీసీలకు రాజకీయపార్టీలు తగిన రీతిలో టిక్కెట్లు కేటాయించకపోవడం వల్ల ‘పదవుల్లో’ లేకుండా పోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అని రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రకుల పక్షపాత పార్టీలుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్ ‘రాజకీయ అధికార’ సామాజిక నేపథ్యమే ఇందుకు నిదర్శనం. 1955 నుంచి 2004 వరకు జరిగిన శాసనసభ, పార్లమెంటు (లోక్‌సభ, రాజ్యసభ) ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థుల కుల నేపథ్యం కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. వాస్తవానికి భారత రాజ్యాంగం పౌరులందరికీ ‘రాజకీయ సమానత్వం’ ఇచ్చింది. దీన్ని అన్ని స్థాయిల్లో ఆచరణలో నెరవేర్చాల్సిన బాధ్యత పార్టీలు, అవి ఏర్పాటు చేసే ప్రభుత్వాలపైనే ఉంది. కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రధానంగా చట్టసభల్లో బలహీనవర్గాలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు వారి వారి జనాభా దామాషా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లభించకపోవడానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయపార్టీలదే బాధ్యతగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సీఎం, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి స్పీకర్, మంత్రులు, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, పార్టీ అధినాయకులు, కేంద్రంలో, రాష్ట్రంలో నియమితులైన మంత్రుల సామాజిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటే రాజకీయ సమానత్వం చట్టుబండలైన విషయం బట్టబయలు అవుతుంది.

గత అరవై సంవత్సరాల కాలంలో రాజకీయ నిర్ణయాధికారం అందరికీ సమానంగా రాలేదనేది నగ్నసత్యం. రాజకీయాధికారం సాధించిన కొన్ని అగ్రకులాలు జనాభా రీత్యా అల్ప సంఖ్యాకులైనప్పటికీ వారు తమ చేతుల్లోకి అధికారాన్ని వినియోగించుకుని త్వరితగతిన అభివృద్ధి సాధించగలిగారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థ అంతా ఆ కీలక ‘నిర్ణయాధికారం’ చుట్టూ పరివూభమిస్తున్నది. నిర్ణయాధికారం లేని కారణంగా జనాభా పరంగా 0% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, జనాభాలో సగభాగమైన మహిళలు వెనుకబాటుతనానికి, అసమానతలకు, వివక్షకు, దోపిడీకి నిరంతరం గురవుతున్నారు. ఫలితంగా ఈ వర్గాలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడి రాజకీయాధికార వ్యవస్థల్లో భాగస్వామ్యంలేక కేవలం ‘ఓటర్లు’గా మిగిలిపోతున్నారు. రాజకీయ నిర్ణయాధికారం కలిగిన కమ్మ, రెడ్డి కులాలకు ప్రస్తుతం కాపులు కూడా జతకలుస్తున్నారు. దీంతో మెజారిటీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు స్వయం నిర్ణయాధికారం, స్వయం ప్రతిపత్తి, రాజకీయ స్వావలంబన, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి వాటిని కోల్పోతున్నారని బడుగు వర్గాల నేతలు విమర్శిస్తున్నారు.

బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్, టీడీపీలు
ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో ఏర్పడిన కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల(బీసీ) కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించాయి. అయితే ఆచరణలో బీసీలైన బలహీనవర్గాలకు ఆయా సంక్షేమ పథకాల ఫలితాలు అందలేదు. సంక్షేమ పథకాలపై వివరీతంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వాలు ఆయా వర్గాల నుంచి గణనీయమైన ఓట్లను రాబట్టుకున్నాయి. కానీ బలహీనవర్గాల జీవితాల్లో ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో బ్యాంకుల జాతీయకరణ, సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ, ఇరవై సూత్రాల అమలు, ఆర్థిక సరళీకృత విధానాలు తదితర అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ వెనుకబడిన కులాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి జరగలేదన్నది జగద్విదితం. వివిధ సంక్షేమ పథకాలు అన్నీ నిద్రావస్థలో నిమగ్నమయ్యాయి. ఫలితంగా బీసీ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ భ్రమల నుంచి బయటపడి 192లో ఎన్.టి.రామారావు ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు. ఎన్టీర్ తన పార్టీని పటిష్టపరుచుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఓట్ల రాజకీయాల్లో బీసీలు అన్ని పార్టీలకు అవసరమైనప్పటికీ వాస్తవంగా బీసీ జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా లభించలేదు. బీసీల సంక్షేమమే పరమావధిగా ప్రకటించిన టీడీపీ.. అధికార పంపిణీ విషయంలో బీసీలకు మొండిచెయ్యి చూపింది. అందుకే మెజారీటీ బీసీలు టీడీపీకి ప్రత్యామ్నాయంగా మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఓట్ల రాజకీయాలు, అగ్రకులాల ఎత్తుగడల మధ్య బీసీ ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయాలు, అధికారమార్పిడితో సమిధలుగా మారి రాజ్యాధికారానికి దూరమయ్యారు.

టిక్కెట్ల కేటాయింపుల స్థాయిలోనే దగా!
రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎన్నికల్లో కేటాయించే టికెట్లలో అగ్రతాంబూలం అగ్రకులాలకే దక్కుతున్నదన్నది వాస్తవం. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు మినహా దాదాపు 90 శాతం సీట్లు అగ్రకులాలకే ఇస్తున్నాయి. వాటిల్లో కాంగ్రెస్ సహజంగానే తన ఆధిపత్య కులమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే.. టీడీపీ తన ఆధిపత్య కులమైన కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది. పేరుకు బలహీనవర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ మాటలు చెబుతున్న ఈ రెండు పార్టీలూ తమ తమ సామాజిక వర్గాలకే పదవులు పొందే అవకాశం ఇస్తున్నాయి. పార్టీలు టికెట్ ఇస్తే తప్ప ఎన్నికల్లో పోటీచ చేయలేని ఆర్థిక పరిస్థితులు బీసీలకు మరో ఆటంకం. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశమున్నా బీసీల వద్ద తగినన్ని ఆర్థిక వనరులు, నియోజకవర్గమంతా ఒంటరిగా తిరిగి వ్యక్తిగతంగా ప్రచారం, బలసమీకరణ, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విధాన ప్రకటనలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశాలు కలుగుతున్నాయి.

నైజాం స్టేట్ విలీనం తర్వాత
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1955 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు 1956లో అంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1962 ఎన్నికల వరకు పదవుల్లో కొనసాగారు. హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైంది. 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు, ఆంధ్రవూపాంత ప్రజా ప్రతినిధులతో కలిసి ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ ఏర్పాటైంది. మళ్ళీ ఆతర్వాత 1962లో ఆంధ్రవూపదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు ఒకేసారి సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. 1955లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ద్విసభ్య నియోజకవర్గాలున్నాయి. ఆయా స్థానాల్లో జనరల్ అభ్యర్థితో పాటు అదే నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కూడా ఎన్నుకునే అవకాశం ఉండేది. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ద్విసభ్య 23 అభ్యర్థులు, తెలంగాణ ప్రాంతంలో ద్విసభ్య 21 మంది అభ్యర్థులు కలిపి మొత్తంగా 44 ద్విసభ్య నియోజకవర్గాల నుంచి ఒక సాధారణ అభ్యర్థితో పాటు ఒక ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్ధి గెలిచే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా రూపొందించి 54 శాసనసభ స్థానాలను షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ)లకు రిజర్వు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఎస్సీ ఎస్టీలకు 10 స్థానాలు అదనంగా పెరిగినప్పటికీ వారికి కొన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంతకు ముందు వరకు ఎస్సీ, ఎస్టీల్లో జిల్లాకు కనీసం ఒక్కరిద్దరికైనా ప్రాతినిధ్యం దక్కేది. కానీ నియోజకవర్గాల పునర్విభజనతో దీనికి గండిపడినట్లయ్యింది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల ఏర్పాటులో స్థానాల గుర్తింపు వల్ల శాసనసభ స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగి జిల్లా స్థాయిలో సంఖ్యాపరంగా భిన్నత్వం గోచరిస్తున్నది. మరోసారి నియోజకవర్గాల పునర్విభజన తదుపరి 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాలో న్యాయం జరగలేదనే అభివూపాయం ఇప్పటికీ వ్యక్తం అవుతున్నది. దీంతో అధికార వ్యవస్థలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర పరిమితంగానే ఉంటోంది.




kulam talangana patrika telangana culture telangana politics telangana cinema


Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP