Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, January 18, 2011

రహదారుల దిగ్బంధం

సంగారెడ్డి) పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జరిగిన తెలంగాణ వ్యాప్త రాస్తారోకో జిల్లాలో విజయవంతమయింది. జిల్లాలో ప్రధానమైన తొమ్మిదో నెంబరు, ఏడో నెంబరు జాతీయ రహదారులు, రాజీవ్ రహదారితో పాటు అంతర్గత రహదారులపై కూడా ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు రాస్తారోకోలను నిర్వహించారు. జేఏసీ నాయకులతో పాటు టీఆర్ఎస్, తెలంగాణ ప్రజాఫ్రంట్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణవాదులు రాస్తారోకోలలో పాల్గొని విజయవంతం చేశారు.

జిల్లా వ్యాప్తంగా క్యాడర్‌ను ఏర్పరుచుకున్న టీఆర్ఎస్ అన్ని చోట్ల ముందుండి రాస్తారోకోలను నిర్వహించింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు అన్ని మండల కేంద్రాలలోనూ, ముఖ్యమైన కొన్ని గ్రామాల వద్ద కూడా నిరసనకారులు రాస్తారోకోలను నిర్వహించారు. ఫలితంగా ఆయా రహదారులపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు కూడా కొంత అసౌకర్యానికి గురయ్యారు.

అయితే నాయకులను బట్టి అరగంట నుంచి రెండు, మూడు గంటల వరకు రాస్తారోకోకు సమయమిచ్చిన పోలీసులు అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వేల మందికిపైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు.

రాస్తారోకో సాగిన తీరు..
రాజీవ్ రహదారిపై పొన్నాల వద్ద టీఆర్ఎస్ శాసనసభ పక్షం ఉపనేత టీ.హరీష్‌రావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు. అదే రహదారిపై కొండపాక, కుకునూర్‌పల్లి, తిమ్మారెడ్డిపల్లి, మంగోలు క్రాస్‌రోడ్డు, దుద్దెడ, ప్రజ్ఞాపూర్, ములుగుల వద్ద కూడా రాస్తారోకో జరిగింది. సిద్దిపేట శివారులోని రంగీలా దాబా వద్ద తెలంగాణ ప్రజాఫ్రంట్, విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. అలాగే సిద్దిపేట నుంచి మెదక్ రోడ్డులో భూంపల్లి, ధర్మారం, మోతే, హబ్సీపూర్, తిమ్మాపూర్, పోతారెడ్డిపేటల వద్ద, మండల కేంద్రమైన మిరుదొడ్డిలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు.

ఏడో నెంబరు జాతీయ రహదారిపై కాళ్లకల్, మనోహరాబాద్, తూప్రాన్, మాసాయిపేట, చేగుంట, రామాయంపేటల వద్ద రాస్తారోకో జరిగింది. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రామలింగారెడ్డి, చేగుంటలో, ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేటలో రాస్తారోకోకు నాయకత్వం వహించారు.

తొమ్మిదో నెంబరు జాతీయరహదారిపై బీహెచ్ఇఎల్ క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ ఎం.రఘునందన్‌రావు, పటాన్‌చెరు వద్ద బీజేపీ మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, సంగారెడ్డి క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్ అశోక్‌కుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేందర్‌లు రాస్తారోకోకు నాయకత్వం వహించారు. ఈ రహదారిపై ఇస్నాపూర్, కంది, మల్కాపూర్, పెద్దాపూర్, నందికంది, మద్దికుంట, బుధేరా, కంకోలు, కోహీర్ క్రాస్ రోడ్డు , జహీరాబాద్ తదితర ప్రాంతాలలోనూ రాస్తారోకో నిర్వహించారు.

దిష్టిబొమ్మల దహనం
న్యాల్‌కల్ మండలం రాంతీర్థలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రేగోడ్ మండలం పోచారంలో నిరసనకారులు రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి ఊరేగించి దహనం చేశారు.

టేక్మాలులో రాస్తారోకో నిర్వహించిన ఆందోళనకారులు జస్టిస్ శ్రీ కృష్ణకమిటీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. నిరసనకారులు మిరుదొడ్డిలో దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి దిష్టిబొమ్మను, మంగోలు క్రాస్ రోడ్డులో గజ్వేల్ ఎమ్మెల్యే టీ.నర్సారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

వంటావార్పు- ఆటాపాట
రాస్తారోకో సందర్భంగా నర్సాపూర్, రేగోడ్ మండలం పోచారం, లింగంపల్లి, దేవునూర్‌లలో నిరసనకారులు రోడ్లపైనే వంటలు చేసి, అక్కడే భోజనాలు చేశారు. అంతకు ముందు ఆటలు ఆడారు, పాటలు పాడారు. మెదక్‌లో నిరసనకారులు పోలీసుల బూట్లకు పాలిష్ చేశారు. రోడ్డుపై ఆటలు నిర్వహించారు.

శివ్వంపేటలో లాఠీచార్జి, నేడు బంద్
మండల కేంద్రమైన శివ్వంపేటలో రాస్తారోకో సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. అయితే కార్యకర్తలు మాత్రం రోడ్డుపైనే ఉండిపోయారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. స్వల్ప లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు మంగళవారం శివంపేట బంద్‌కు పిలుపు ఇచ్చారు.

హైలైట్స్
రాస్తారోకో సందర్భంగా చేగుంటలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రొబేషనరీ ఎస్ఐపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. మీలాంటి వారివల్లనే ఈ గొడవలన్నీ అని ఆయన వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్ మండలం ర్యాకల్‌లో యువకుడు సెల్ టవర్ ఎక్కి తన నిరసన తెలిపారు. ఇక రాస్తారోకోలలో బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద టీఆర్ఎస్‌తో పాటు ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పటాన్‌చెరులో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించగా, టేక్మాల్‌లో జరిగిన రాస్తారోకోలో టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

take By: Andrajyothi

Read more...

పదవులు తీసుకుంటే ఓకే కానీ తెలంగాణ బిల్లు పెట్టించండి:హరీష్ రావు

సిద్దిపేట 17 : పదవులు తీసుకుంటే ఓకే, పార్లమెంటులో బిల్లు పెట్టించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు కాంగ్రెస్ ఎంపీలను డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పొన్నాల రాజీవ్ రహదారి పై చేపట్టిన రాస్తారోకోకు ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ కోరుతూ పదవులతో పాటు ప్రాణత్యాగానికి సిద్దమైన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును కాంగ్రెస్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ఎంపీలకు మంత్రి పదవులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకే పదవుల ఆశ చూపుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

take By: Andrajyothi

Read more...

ఆఖరు భేటీ

23 లేదా 24న అఖిలపక్ష సమావేశం..

ఇక తదుపరి చర్చలు ఉండవు
పార్టీల అభిప్రాయాలకు ప్రాధాన్యం..
తెలంగాణపై త్వరలోనే నిర్ణయం
క్యాబినెట్‌కు నోట్ సమర్పిస్తాం..
కేంద్ర హోంశాఖ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ, హైదరాబాద్, జనవరి 17 : "ఇక మళ్లీ మళ్లీ పిలిచేది లేదు. మాట్లాడేది లేదు. విషయాన్ని నాన్చేది లేదు. వచ్చిన వాళ్లు చెప్పింది వింటాం. ఒక నిర్ణయం తీసుకుంటాం! త్వరలోనే ఒక స్పష్టత తీసుకు వస్తాం''.... తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇదేనా? కేంద్ర హోంశాఖ వర్గాలు ఈ ప్రశ్నకు 'ఔను' అనే సమాధానమే చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోపు తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై వచ్చే వారమే రాష్ట్రానికి చెందిన 8 గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఈ నెల 23 లేదా 24 తేదీల్లో సమావేశం జరుగుతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్పాయి. సోమవారం హోంశాఖ ఉన్నతాధికారులు సమావేశమైనప్పటికీ... అఖిలపక్షం తేదీపై మాత్రం ఒక నిర్ణయానికి రాలేదు. సోమవారం నాటి భేటీలో పశ్చిమ బెంగాల్, అసోం, జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలపై దృష్టి సారించాల్సి వచ్చిందని... ఒకటి రెండు రోజుల్లో తేదీ ఖరారు అవుతుందని హోంశాఖ వర్గాలు చెప్పాయి. అదే సమయంలో... తెలంగాణపై త్వరలోనే కేంద్రం అటో ఇటో తేల్చిచెబుతుందని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి.

"23 లేదా 24 తేదీల్లో జరిగే అఖిల పక్ష సమావేశమే చిట్టచివరిది అవుతుంది. ఈ భేటీకి పార్టీలు వచ్చినా, రాకున్నా మా వైఖరిపై ఓ నిర్ణయానికి వస్తాం. అఖిలపక్ష సమావేశ ఫలితంపై కోర్ కమిటీలో చర్చించి, కేంద్ర మంత్రి వర్గానికి ఒక నోట్ సమర్పిస్తాం. దానికి అనుగుణంగా తెలంగాణపై బడ్జెట్ సమావేశాల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం'' అని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ సూచించిన 6వ పరిష్కారానికే కేంద్రం మొగ్గు చూపుతున్నప్పటికీ... రాజకీయ పార్టీలు ఏం చెబుతాయన్న దానికీ ప్రాధాన్యమిస్తామని ఆయన చెప్పారు.

కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈనెల 6న నిర్వహించిన సమావేశానికి టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ గైర్హాజరయ్యాయి. తదుపరి సమావేశానికి కూడా ఇవి డుమ్మా కొడతాయా? లేక... 'ఇదే ఆఖరు' అని చెబుతున్నందున ఢిల్లీకి వెళతాయా? అనే అంశంపై స్పష్టత రావడంలేదు. ఈ అంశంపై నిర్వహించే సమావేశాలకు హాజరు కారాదని టీడీపీ నాయకత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తాము చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పామని, కొత్తగా చెప్పేదేమీ లేదనే వైఖరి ప్రదర్శిస్తోంది.

కేంద్రం తనకు ఇబ్బంది వచ్చినప్పుడు దానిని అందరి మెడలకు చుట్టి బయటపడాలని చూస్తుందని, కాంగ్రెస్ వ్యూహంలో తాము ఇరుక్కోరాదని పార్టీలో మెజారిటీ నేతలు వాదిస్తున్నారు. "ఇప్పటికీ మా పార్టీ వైఖరి అదే. కానీ, ఈసారి పెట్టేది చివరి సమావేశమని చెబుతున్నారు. చిదంబరం నుంచి లేఖ వస్తే... దానిపై చర్చిస్తాం. ఈ భేటీ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువ'' అని టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇక టీఆర్ఎస్ కూడా ఆహ్వాన లేఖ అందిన తర్వాత... అందులోని సారాంశం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

కాంగ్రెస్‌లో పెరిగిన వేడి
కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకోవడం, రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరికి అవకాశం కల్పిస్తారని వార్తలు రావడంతో తెలంగాణ ఎంపీల్లో సందడి మొదలైంది. పదవులు తీసుకోవాలా వద్దా? తీసుకోవడం సమంజసమేనా? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణపై పోరాటానికి పదవులు అడ్డం కాదనే నిర్ణయానికి వచ్చారు. సోమవారం ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీలు సమావేశమయ్యారు. తమ తొలి ప్రాధాన్యం తెలంగాణకే అని, పదవులకు కాదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

అసలు మంత్రివర్గ విస్తరణకు, తెలంగాణకు సంబంధమేలేదన్నారు. అధిష్ఠానం తమను బుజ్జగిస్తోందనే వాదన సరికాదన్నారు. పదవులు, ప్రలోభాలు పని చేయవని... తెలంగాణ తప్ప మరి దేనికీ అంగీకరించేది లేదని మరో ఎంపీ రాజయ్య చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై అధిష్ఠానం నుంచి స్పష్టత పొందాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే ఎంపీలతో అధిష్ఠానం పెద్దలు మరోమారు భేటీ అయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్రంపై స్పష్టత పొందాలని భావిస్తున్నారు.

మంగళవారం వీరంతా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తెలంగాణ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలన్నింటిపై సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్‌ల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వైపు చూస్తున్నారు.

మరోవైపు... వైఎస్ జగన్, తెలంగాణ అంశాలు తమకు కొత్త కాదని, అందరి సహకారంతో ఈ సమస్యలను పరిష్కరించుకుంటామని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక... కొన్నాళ్లుగా తెలుగుదేశంలో కలకలం సృష్టిస్తున్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. తాను టీడీపీని వీడుతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీకి దూరం కావాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.


take by: Andrajyothi

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP