Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, July 2, 2012

French Airports Forcing Muslim Women to Remove Veil


The growing injustices of French Government against its Muslim citizens are on high. The airports in France are forcing Muslim women to take off their hijab.

The incidents have triggered outrage in France's Muslim community for ignoring the religious minority’s personal freedoms as reported in Today’s Zaman.


In the report Narin Yuksel told Zaman that “I am 65. What could there be under the headscarf of a 65-year-old woman?” Narin is one of the women who were asked to remove their headscarves at Nantes Atlantique Airport.

She further said “they told me that I would not be able to board my plane if I don't take off my headscarf.”

The report further says that Muslim women problem started two weeks ago when the Collective Against Islamophobia in France (CCIF) announced that Nantes Atlantique Airport has made it obligatory for veiled women to take off their hijab and place it in the X-ray machine along with their other belongings.

The practice was applied by the SGA, the company responsible for Nantes Atlantique Airport's security.

Airport officers asked women to remove their hijab at the conveyor with other belongings.

When women asked to be allowed to take hijab off in a special room for women only, their request was rejected.

The women were told that they must place their headscarves on the conveyor going through the X-ray machine if they wanted to avoid missing their plane.

“When we asked them to do the security check in a special room, they threatened to call the police if my mom didn't take off her headscarf,” Yüksel's daughter Hatice said.

The SGA defended their actions, claiming that dangerous materials could be hidden under the headscarves, which has triggered outrage in France's Muslim community.

According to EU airport security regulations, security staff do not have the authority to ask women to take their headscarves off.

Take By: Siasat News

Read more...

సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు


సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు

- సగానికి పైగా శిథిలావస్థలో
- కానరాని కనీస సౌకర్యాలు
- పలుచోట్ల కనిపించని మరుగుదొడ్లు
- 29 కాలేజీల్లో ప్రయోగశాలలు కరువు
- 20 చోట్ల ప్రహరీలూ లేవు
- 300కు పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీ
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఆందోళనలో విద్యార్థులు

దాహమేస్తే ఓర్చుకోవాలి..
మంచినీళ్లు దొరకవు గనుక..!
మూత్రమొస్తే ఆపుకోవాలి..
మరుగుదొడ్లు లేవుగనుక..!
వర్షమొస్తే బయటకు పరిగెత్తాలి..!
పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు గనుక..!
పందులు, పశువులకూ ప్రవేశముంది..
ప్రహరీలు లేవుగనుక..!
కాలేజీకి రాకపోయినా ఫర్వాలేదు..
లెక్చరర్లే లేరుగనుక..!


సర్కారీ ఇంటర్ కళాశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి..! సగానికిపైగా శిథిలావస్థకు చేరుకొని బంజరుదొడ్లను తలపిస్తున్నాయి..! పాఠాలు చెప్పే అధ్యాపకులే కాదు.. కాగడా వేసి వెతికినా కనీస సౌకర్యాలు కానరావడం లేదు..! వర్షమొస్తే ఎప్పుడు కూలుతాయో తెలియని పైకప్పుల కింద చదువులు కొనసాగించే పరిస్థితి లేదు..! దీంతో పదోతరగతి పాసై, ఎన్నో ఆశలతో కాలేజీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు వాస్తవ పరిస్థితిని జీర్ణించుకోలేక లబోదిబోమంటున్నారు..!

జిల్లావ్యాప్తంగా 71 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు(50- బాలురు, -బాలికలు),11 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు (బాలురు-, బాలికలు-3), రెండు గిరిజన సంక్షేమ గురుకుల కళాలలు(బాలురు-1, బాలికలు-1) ఎనిమిది ప్రైవేటు కో-ఆపరేటివ్ కళాశాలలున్నాయి. మారుమూల మండలాలు మినహా దాదాపు మండలానికో జూనియర్ కళాశాల ఉంది. వీటిలో సగానికి పైగా కళాశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీ వర్షమొస్తే గదుల పైకప్పులు, గోడలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 21 కళాశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

 చాలా చోట్ల బెంచీలు, బల్లలు లేవు. విరిగిపోయి మూలపడ్డవాటికి మరమ్మతులు చేయించేవారు లేరు. 300కు పైగా జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకువస్తున్నారు. పది కళాశాలలకు ప్రిన్సిపాళ్లు కూడా లేరు. 25 మందికన్నా తక్కువ విద్యార్థులుంటే సెక్షన్ ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించడంతో దాదాపు 10 కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 20 కళాశాలకు ప్రహరీలు లేకపోవడంతో పశువులు, పందులు లోపలికి వస్తున్నాయి.

దీంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. పదింట్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మూత్రం వస్తే బయటకు పరిగెత్తాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచినీటికీ ఇక్కట్లు పడాల్సి వస్తోంది. 29కి పైగా కళాశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు లేవు. లైబ్రరీయన్లు లేకపోవడంతో గ్రంథాలయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 50 దాకా పీడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో క్రీడల అడ్రస్ లేకుండా పోయింది.

Take by: T news

Read more...

మెడికల్ సీట్ల కుట్ర


- index talangana patrika telangana culture telangana politics telangana cinema సీమాంవూధకు అదనంగా 150 సీట్లు.. తెలంగాణకు సున్నాయే
- 250 సీట్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కటీ తేలేదు
- అధికారుల నిర్లక్ష్యంతో రాని వరంగల్, గాంధీ సీట్లు
- కనీస సౌకర్యాలు లేవని ఉస్మానియా సీట్లు కట్
- అవిలేకున్నా సీమాంధ్ర కాలేజీలకు సీట్లు
- మెడికల్ సీట్ల విషయంలో కొనసాగుతున్న వివక్ష

హైదరాబాద్, జూలై 1 (): ఇది మరో దగా.. తెలంగాణ పట్ల సీమాంధ్ర అధికారులు, వారితో కలిసిపోయే ప్రభుత్వాల తీరును బట్టబయలు చేసే మరో సందర్భం. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఈ సంవత్సరం మెడికల్ సీట్ల విషయంలో కూడా తెలంగాణకు వివక్షే ఎదురైంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్ల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తులు పంపిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీమాంవూధకే సీట్లు తెప్పించే బాధ్యతను తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గుంటూరు, అనంతపురం కాలేజీల నివేదికలను ఎంసీఐకి పంపలేదు. ఎనిమిది కాలేజీల నివేదికలనే పంపారు. వాటిల్లో తెలంగాణ నుంచి గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీల నివేదికలు కూడా ఉన్నాయి. ఎంసీఐ పరిశీలన బృందం ఇన్‌స్పెక్షన్‌కు వచ్చినప్పుడు దాదాపు ఏ కాలేజీలోనూ కనీస మౌలిక సదుపాయాలు లేవని, భవనాలు, ల్యాబ్‌లు, రేడియాలజీ యూనిట్లు, తాగునీరు, బాత్‌రూంలు సరిగ్గా లేవని రాష్ట్రానికి లేఖ రాసింది.

ఆ లేఖలో విశాఖపట్నం కాలేజీకి సీట్లు ఇచ్చేందుకు ఓకే కానీ, ఈ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను మెడికల్ అండ్ హెల్త్ సెక్రెటరీ బాధ్యత తీసుకుంటే ఇస్తామని మెలి క పెట్టింది. ఇందుకు ప్రతి లేఖ ఇవ్వడంతో విశాఖపట్నం కాలేజీకి సీట్లు దక్కాయి. ఇక విజయవాడ, కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలకు కూడా 50సీట్ల చొప్పున దక్కాయి. మొత్తంగా సీమాంవూధలోని మూడు కాలేజీలకు అదనంగా 150 సీట్లుదక్కాయి. అదే తెలంగాణ విషయానికొస్తే ఉస్మానియా కాలేజీలో తాగునీరు, కరెంటువైర్లు బయటకు కనిపిస్తున్నాయనే సాకును చూపి సీట్లు ఇవ్వలేదు. ఇక గాంధీలో ఓపీ తక్కువ ఉందనే కారణంతో అసలు ఇన్‌స్పెక్షనే చేయలేదు. ఇక వరంగల్ కాలేజీ విషయానికొస్తే ఇక్కడ పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ కాలేజీ రిపోర్టునే సరైన సమయానికి డీఎంఈకి ఇవ్వలేకపోయారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ కాలేజీకి కూడా ఎంసీఐ బృందం పరిశీలనకు వెళ్లలేదు. అంటే తెలంగాణలోని మూడు కాలేజీలకు సీట్లు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం, సీమాంధ్ర అధికారుల కుట్ర ఉందని తెలుస్తోంది.

నిజామాబాద్ కాలేజీకి స్టాఫ్‌ను కేటాయించి, భవనాలు త్వరగా పూర్తిచేసి ఉంటే ఈ ఏడాది వంద సీట్లతో కాలేజీ ప్రారంభమయ్యేది. కానీ అధికారులు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఈ కాలేజీ 2010లో ప్రారంభమైన ఇప్పటికీ సీట్లు తెచ్చుకోలేకపోతోంది. ఇలా తెలంగాణకు రావాల్సిన 250సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి వైద్య రంగంలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలొస్తున్నాయి.

సౌకర్యాలు లేకున్నా సీమాంవూధకు సీట్లు
తెలంగాణలో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో తాగునీరు, బాత్‌రూం, ల్యాబ్‌లలో రిపేర్లు సాకుగా చూపి 50సీట్లు రాకుండా పోయాయి. అదే సీమాంవూధలోని విజయవాడ మెడికల్ కాలేజీలో రేడియాలజీ, రూరల్ హెల్త్ సెంటర్ భవనం, మరికొన్ని సౌకర్యాలు లేకపోయానా ఎంసీఐ సీట్లు మంజూరు చేసింది. దీని వెనుక సీమాంధ్ర అధికారులు కుట్ర ఉందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియాలో చిన్నచిన్న సమస్యలుంటే సీట్లు ఇవ్వరుగానీ, సీమాంవూధలో మాత్రం భవనాలు, డిపార్ట్‌మెంట్లు లేకపోయినా సీట్లు ఎలా ఇస్తారనే మౌలిక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ఇది స్టేట్‌వైడ్ కాలేజీ కనుక సీట్లు మూడు ప్రాంతాలకు సమానంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ కాలేజీలో లేని సౌకర్యాలు బయటకు చెబితే ఉన్న సీట్లు పోతాయని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రాంతానికి నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన సీట్లను పక్కన పెట్టి 30సీట్లు మాత్రమే ఇందులో ఇస్తున్నారు.

Take By: T News

Read more...

రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా -ప్రణబ్‌


నేనిప్పుడు కాంగ్రెస్ వ్యక్తిని కాదు.. అందరివాడిని
- రాష్ట్రపతి ఎన్నికలో ‘అద్భుతం’పై విశ్వాసం లేదు
- మజ్లిస్ నేతలు మా మిత్రులు.. వారిని సంప్రతిస్తా
- పదవికే వన్నె తెచ్చిన దక్షిణాది రాష్ట్రపతులు
- వారి అడుగు జాడల్లోనే నడుస్తా
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- అనంతరం విలేకరులతో భేటీ
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం
- ఆయన దృష్టిలో పడేందుకు నేతల తంటాలు
- దానం, బండ చంద్రాడ్డి మధ్య వాగ్వాదం
ప్రణబ్‌కు తప్పని తెలంగాణ సెగ ఓయూలో దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్, జూలై 1( రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు ఎవరికీ మద్దతునివ్వని పార్టీలు తనకు మద్దతు ప్రకటించి, గెలిపించాలని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు మిగతా పార్టీలు కూడా తనకు మద్దతు తెలియజేస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఎన్‌డీయే అభ్యర్థి పీఏ సంగ్మా చేసిన వ్యాఖ్యలపై ప్రణబ్ స్పందిస్తూ అలాంటి అద్భుతాలు జరుగుతాయని తాను విశ్వసించడం లేదని అన్నారు. ఆదివారం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశం అనంతరం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా గతంలో తాను చాలాసార్లు హైదరాబాద్‌కు వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడానని, తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని ప్రణబ్ చెప్పారు. ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించేందుకు గతంలో తాను ఇక్కడికి వచ్చానని, ఇప్పుడు ఆ పాలసీల గురించి చెప్పలేనని అన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాడని, పార్టీ, ప్రభుత్వ విధానాల గురించి తాను ఇప్పుడు మాట్లాడలేనని ఆయన స్పష్టంచేశారు. అయితే కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏవైనా తన వద్దకు వస్తే వాటిపై మాత్రం మాట్లాడగలనని ఆయన చెప్పారు.

ఈ నెల 15 వరకు ప్రచారం
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజ్ జాబితాలోని సభ్యులను కలిసేందుకు తాను శనివారం చెన్నై నుంచి తన ప్రచారం ప్రారంభించానని ప్రణబ్ తెలిపారు. అయితే దీన్ని తాను ప్రచారం అనుకోవడం లేదని అన్నారు. ఆంధ్రవూపదేశ్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు. తన ప్రచారం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తనకు మద్దతు ఇస్తున్న ఎలక్షిక్టోరల్ జాబితా సభ్యులను కలువనున్నట్లు ఆయన తెలిపారు. మజ్లిస్ నేతలను కలుస్తారా? అన్న ప్రశ్నకు వాళ్లు మా మిత్రులు, వాళ్ళతో కూడా సంప్రతింపులు జరుపుతానని ప్రణబ్ స్పష్టంచేశారు. మద్దతు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రంలోని టీఆర్‌స్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ అధ్యక్షులను కూడా కలుస్తారా? అని అడిగితే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయమై పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదని, పైగా తాను ఎలక్షిక్టోరల్ జాబితాలోని సభ్యులతో మాత్రమే మాట్లాడుతానని ఆయన చెప్పారు.


రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఆయా పార్టీలే నిర్ణయం తీసుకుంటాయని, ఈ సంప్రదాయం 1952 నుంచి వస్తున్నదని ఆయన తెలియజేస్తూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇంకా తనకు మద్దతు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోలేదని అన్నారు. యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు యూపీయేతర పార్టీలు, అధికార కూటమికి వ్యతిరేక పార్టీలు ఇంకా మద్దతు విషయంలో తమ తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు.

సమన్వయపర్చేందుకు వచ్చా: ఆజాద్
అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలకు తాను పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నందునే పార్టీ సభ్యులను సమన్వయపర్చేందుకు ప్రణబ్‌తోకలిసి వచ్చినటు తెలిపారు.

కాంగ్రెస్‌లో ప్రతిభకు కొదవ లేదు: ప్రణబ్
బెంగళూరు: రాష్ట్రపతి పదవికి పోటీచేస్తూ.. తాను రాజకీయాల నుంచి తప్పుకోనుండటంవల్ల సంక్షోభ పరిష్కార విషయంలో అధికార యూపీఏ సర్కారుకు ఎలాంటి సమస్యా రాబోదని రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మెరుగైన ప్రతిభావంతులకు కొదవ లేదని, తన స్థానాన్ని వారు భర్తీ చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రజావూపతినిధులతో ఆయన ఆదివారమిక్కడ భేటీ అయ్యారు.

రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా: ప్రణబ్
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం

రాష్ట్రపతి ఎన్నికలో తనని గెలిపిస్తే.. ఆ పదవికి వన్నె తెస్తానని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌లో సంక్షోభ పరిష్కర్తగా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 46 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి, గౌరవాన్ని పొందినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యుడిగా కాకుండా రాష్ట్రపతి అభ్యర్థిగా నగరానికి వచ్చినట్లు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చెప్పారు. గతంలో తాను పార్టీ ప్రతినిధిగా ఇక్కడ సమస్యలు పరిష్కరించేందుకు వచ్చేవాడినని, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు కోసం మీ ముందుకు వచ్చానని ప్రణబ్ అన్నారు.

తాను ఇప్పుడు పార్టీ వ్యక్తిని కాదని, అందరి మనిషినని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న ప్రణబ్, గులాం నబీ ఆజాద్‌తో కలిసి ఆదివారం ఉదయం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్షం(సీఎల్పీ) సమావేశంలో పాల్గొన్నారు. తనను గెలిపించాలని ఆయన సీఎల్పీ సభ్యులను కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన సుమారు గంటకుపైగా జూబ్లీహాల్‌లో ఉండి సీఎల్పీ సభ్యులను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా ఆయన కోరారు. ఈ సందర్భంగా సీఎల్పీని ఉద్దేశించి 25 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కువసేపు భారత రాజ్యాంగం, విధానాల గురించే మాట్లాడటం గమనార్హం.

దక్షిణాది నుంచి నీలం సంజీవడ్డి, ఆర్ వెంకవూటామన్, వీవీ గిరి, రాజగోపాలచారి, సర్వేపల్లి రాధకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం.. ఇలా ఎంతోమంది రాష్ట్రపతులుగా పనిచేశారని, వీరంతా ఉన్నత సంప్రదాయాలు, పద్ధతులను పాటిస్తూ ఆ పదవికి, దేశానికి ఎంతో మంచిపేరు తీసుకొచ్చారని వివరించారు. వారి అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని ప్రణబ్ దక్షిణాది సెంటిమెంట్‌తో సభ్యుల మనసు దోచే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎన్నుకున్నందుకు యూపీఏకు, మరీ ముఖ్యంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. యూపీయేతర పార్టీలు కూడా తనకు మద్దతు ఇస్తున్నందుకు ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అలాంటి పార్టీలు కూడా తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని మద్దతు పలకాలని ఆయన తృణముల్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.

దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు ఎంతో కీలకమైనవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం కిరణ్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఓటు వేసి గెలిపించాలని సీఎల్పీ సభ్యులను కోరారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్షికమానికి అధ్యక్షత వహించగా, శాసన సభ వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో యూపీఏ ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP