Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, October 23, 2011

నమస్తే తెలంగాణ జోలికి రాకండి -అల్లం నారాయణ

పోలవరం ప్రాజెక్టును నేను వ్యతిరేకిస్తాను. ఒక్క పోలవరంనే కాదు.. జీవన విధ్వంసం చేసే భారీ ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తాను. ఊళ్లకు ఊళ్లను ముంచి, గిరిజన ప్రాంతాలను విధ్వంసం చేసి, నిర్వాసితులను చేసి, బతుకుదెరువు నాశనం చేసే ఏ ప్రాజెక్టుకైనా నేను వ్యతిరేకం. ఆ మాటకొస్తే కార్పొరేట్లకు, అవి ఈ దేశాన్ని దోస్తున్న విధానాలకు, అభివృద్ధి పేరిట జరుగుతున్న ఛిన్నాభిన్న మానవ వ్యతిరేక చర్యలకు నేను వ్యతిరేకం. అమెరికాలో ఉండి ఉంటే నేనిప్పుడు వాల్‌వూస్టీట్ ముట్టడిలో టైమ్‌స్క్వేర్ దగ్గర లంగరేసేవాణ్నే. ఈజిప్టులోనో, మరో ఎడారి దేశంలోనో ఉంటే జాస్మిన్ రెవల్యూషన్‌లో ఉండేవాణ్ణి. తెలంగాణలో పుట్టినవాణ్ణి. ఈ నేలతల్లి ఆవేశకావేశాలు ఉద్వేగాలు, దుఃఖం, కన్నీళ్లు, నెత్తురు, వారసత్వం, ఆగ్రహం దోపిడీ దాని మూలం. అన్నీ అయిదు దశాబ్దాల జీవితంలో ప్రత్యక్షంగా చూసినవాడిగా నేను ఇప్పుడు పచ్చి తెలంగాణవాదిని. నూటికి నూరుపాళ్లు తెలంగాణ కోరుకుంటున్న వాణ్ని. నావి తెలంగాణ వీధి రాజకీయాలు. నిర్మాణాత్మక పూర్తి రాజకీయవాదిని కాను. నేనొక పాత్రికేయుణ్ని. ఇప్పుడు సంపాదకుణ్ని. రాతలు రాసి బతికేవాణ్ని. నా పేరిట రాసే రాతలకు నూరుశాతం బాధ్యత వహించేవాణ్ని. కానీ పత్రికకు ఒక స్వభావం ఉంటుంది. కేవలం నేను నమ్మే విషయాల వేదిక మాత్రమే కాదు పత్రిక అనే స్పృహ కలిగినవాణ్ని. పెట్టుబడి లేకుండా పత్రిక ఊహించలేము.

కానీ తెలంగాణకు ఒక పత్రిక కావాలి. ఆ పత్రికలో స్వేచ్ఛగా, ఎలాంటి ఆటంక మూ, సంకోచమూ, వెనక నిలబడి శాసించే శక్తులు లేకుండా రాయగలిగిన వాతావరణం కావాలి. అదొక కల. నేనూ నాతో పాటు ఈ పత్రికలోకి వచ్చిన నా సహచరులు, అందరూ పేరుపేరునా నాకు తెలుసు. మా అందరి కలా ఒకటే. తెలంగాణ కోసమే ఒక పత్రిక కావాలి. ఆ కల ‘నమస్తే తెలంగాణ’తో నెరవేరింది. ఇదొక ఉమ్మడి స్వప్నం. ఈ స్వప్నం ఏడాదిగా కంటున్నాం. చివరికి నాలుగున్నర నెలలుగా పత్రిక తెస్తున్నాం. ఇప్పటి వరకు కేసీఆర్ ఈ పత్రికలో ఒక్కనాడూ జోక్యం చేసుకోలేదు. ఆయన పత్రిక స్వభావం పూర్తిగా తెలిసి ప్రజాస్వామికంగా వ్యవహరించారు. నేను ప్రజాస్వామ్య ఛాంపియన్లు అనుకున్నవారు మా వార్తలో, వ్యాసాలో ఎందుకు రాలేదని అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఆశ్చర్యంగా కేసీఆర్ ఎన్నడూ ఒక పల్లెత్తు మాట అనలేదు. జోక్యం చేసుకోలేదు. ఆయనమీద ‘నమస్తే తెలంగాణ’ ఆధారంగా అంత పెద్ద అభాండం ఎందుకు వేశారన్నది అర్థంకాని అంశం కాదు. నేను అబద్ధం ఆడలేదు. ఇది వరకు ఇలాంటి పత్రిక చదవలేదన్నప్పుడు, గౌరవనీయులు ఎస్వీ రామారావు లాంటివారు ఉత్తరం రాసినప్పుడు పొంగిపోయినాం. ఏముంది మీ పత్రికలో అంతా తెలంగాణ తప్ప అన్నప్పుడు కుంగిపోలేదు. కానీ, ఎట్లా..? ఒక సంపూర్ణ పత్రిక తేవాలని సమాలోచన లు చేశాం. ఏం చెయ్యాలి? అని మధనపడ్డాం నేను నా మిత్రులం. ఇదొక నిత్య కార్యాచరణగా పత్రికను ఉన్నతస్థాయికి తీసుకు ప్రయత్నాలు చేశాం. ఇతర వార్తలనూ ప్రముఖంగా ఇవ్వడంలో భాగంగానే, ఒక్క తెలంగాణ వార్తలే కాకుండా ఇతరేతర వార్తలను పెంచడంలో భాగంగానే రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్టు టెండర్లది ఒక వార్త వేశాం. అది పోలవరం వార్త. ఆ వార్త సంచలనం కలిగించింది. కొన్ని పదాలు అటూ ఇటు అయి ఉండవచ్చు. శీర్షికలోనూ, లోపలి పదాలలోనూ కొన్ని తెలంగాణకు కూడని పదాలు దొర్లి ఉండవచ్చు.

కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు... నేను రేవంత్‌డ్డిని పట్టించుకోను కానీ, దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరిలను ఖాతరు చేస్తాను. వాళ్లు పోలవరం టెండర్లు అక్రమం అని యుద్ధం చేస్తే నాకెలాంటి బాధాలేదు. మొత్తం పోలవరం తెలంగాణ వ్యతిరేక ప్రాజెక్టు కనుక రద్దు చేయాల్సిందే. ఎట్లా కడతారు పోలవరం అని అడిగితే విపరీతంగా సంతోషపడతాను. తెలంగాణవాదులకు ఊతం అనుకుంటాను. కానీ, ‘నమస్తే తెలంగాణ’ పత్రికపైన ఎందుకు కక్ష కట్టినట్టు. నమస్తే తెలంగాణ గొంతు నులమాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు? ‘నమస్తే తెలంగాణ’ పత్రిక హఠాత్తుగా ఆంధ్ర గుండెచప్పు డు అనడానికి నోరెలా వచ్చిందో? అంతుపట్టని విషయమేమీ కాదు. చంద్రబాబు.. మీడియా సృష్టించిన ఒక మహా విధ్వంస నాయకుడు. తెలంగాణ విధ్వంసానికి మూలపురుషుడు. ఏ అభివృద్ధి నమూనాకు నేను వ్యతిరేకమో, అభివృద్ధి పేరిట ఆశ్రీత పెట్టుబడిదారీ విధానానికి, ప్రభుత్వ యంత్రాంగము, ఉద్యోగి వర్గపు బడాబాబులు, కార్పొరేట్లు, రాజకీయ నేతల పకడ్బందీ బాజాప్తా దోపిడీ గుంపు సంస్కరణల ప్రవేశంతో ఏర్పడింది. పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు ఈ దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణలను పరాకాష్టకు తీసుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో భూమి బ్యాంకును బదలాయించి, భూ వనరును పెట్టుబడికి కీలకంగా మార్చినవాడు చంద్రబాబు. విజన్ 2020 కానీ, ఆతర్వాత అతను అనుసరించిన రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు కానీ తెలంగాణను తీవ్రంగా ప్రభావితం చేసి ధ్వంసం చేశాయి. మొత్తంగా సీమాంధ్ర పెత్తనం ప్రతిష్ఠాపనకు, ఆ సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను కబ్జా చేయడానికి, సినిమారంగం, రాజకీయం కలెగలిసి తెలంగాణ ఆత్మ మూలుగు కూడా వినిపించకుండా అణగదొక్కడానికి మూలపురుషుడు చంద్రబాబు.

ఆయనను పిచ్చివాడు లేదా, జైలులో పెట్టదగినవాడు అన్న ఏదో ఒక దేశపు ప్రధానితో నేను పూర్తిగా ఏకీభవిస్తూనే, తెలంగాణకు సంబంధించి ఆయన ఒక క్రూరమైన నమూనా అని, దాని కొనసాగింపే వై.ఎస్.రాజశేఖర్‌డ్డి పరమ క్రూరమైన నమూనా అని నా విశ్వాసం. ఇదే చంద్రబాబు వర్తమానంలో తెలంగాణకు అడ్డంపడ్డ ఏకైక రాష్ట్ర నాయకుడు అని నేను నమ్ముతాను. డిసెంబర్ 9 తర్వాతి వాతావరణాన్ని, ద్వేషాన్ని రెచ్చగొట్టి, ఆడిన మాట తప్పి, అబద్ధాలాడి, తెలంగాణ ప్రకటన వెనక్కిపోవడానికి మూల పురుషుడు చంద్రబాబే అని నేను నమ్ముతాను. ఈ విష యం తెలంగాణవాదులందరూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అంశం. కానీ రాజకీయాలు క్రూరమైనవి. చంద్రబాబు లాంటి వాళ్లు చేసే నిలు కుట్ర రాజకీయా లు మరీ క్రూరమైనవి. చంద్రబాబు అనుకూల పత్రికల్లో పనిచేసిన అనుభవం ఉంది నాకు. పత్రికకొక విధానం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో చంద్రబాబు ఎంత అడ్డగోలుగా , దుర్బేధ్యమైన అజ్ఞా నంతో మాట్లాడినా ఆకాశానికెత్తిన విధానాలు గల పత్రికల్లో నేను పని చేశాను. కానీ నా పేరిట నేను ఎన్నడూ ఆయన విధానాలకు అనుకూలం కాదు. రాయలేదు. ఆ తెర ఒకటి పాత్రికేయ వృత్తిలో వేలాడుతూ ఉంటుంది.

చివరికి ‘ఎడిసన్ బల్బు కనిపెట్టలేదు చంద్రబాబే అనే స్థాయిలో’ ఆయన ‘మీడియా మేడ్’ రాజకీయ నాయకుడు. కపటం, కుట్ర తప్ప ఆయనకు ఏ రాజకీయ విలువలూ లేవు. అలాం టి ఒక రాజకీయ నాయకుడి గొంతు దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరిల గొంతులగుండా వినడం తెలంగాణ దురదృష్టం. సీఎం రమేశ్‌కు పోలవరం టెండరు వస్తే తెలుగుదేశం ఈ నాయకులు మాట్లాడేవారా? ఇది సూటి ప్రశ్న. చంబ్రాబు చుట్టూ ఉండే సీమాంధ్ర నయా ఆశ్రీత పెట్టుబడిదారులు వీరికి తెలియదా? ముఖ్యంగా మాలాంటి వాళ్లం తీవ్రంగా మాట్లాడితే బాగుండదు కానీ, చంద్రబాబు కనుసన్నల్లో, ఆయన కుట్రల్లో భాగస్వాములవుతూ తెలంగాణ అని ఎంత మొత్తుకున్నా ఏ ఫలితమూ ఉండదన్న విషయం ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం నాయకులకు అర్థమై ఉంటుంది. దేవేందర్‌గౌడ్, కడియం శ్రీహరిలు వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారో నాకూ కొంచెం తెలుసు. నాకు వాళ్లే కాదు. ఎర్రబెల్లి, నర్సింహులు, జైపాల్ యాదవ్ , దయాకర్‌డ్డిలు కూడా వ్యక్తిగతంగా తెలుసు. కానీ ఇది రాజకీయం. క్రూరమైనది. అది తనను తాను పోల్చుకోదని కాదు. తన ఆత్మను తాను పోల్చుకోదని కాదు. కానీ నోట ఒకటి మాట్లాడిస్తుంటుంది. అంతరంగం అణచివేత కొనసాగుతుంటుంది. ఇదొక శాశ్వత భ్రమ.

తెలంగాణ ప్రజలు ఇప్పటికీ తెలుగుదేశాన్ని అక్కున చేర్చుకోకపోవడానికి వారి ద్వంద్వ ప్రమాణాలు, విలువలు, నిజాయితీ రాహిత్యం వీటన్నిటికి తోడు చంద్రబాబు సాంగత్యం, నాయకత్వం అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగుదేశం తెలంగాణ నాయకుల అంతరంగానికి తెలు సు. నిజమే పోలవరం టెండర్లలో సీఎండీ ఎల్.రాజం ప్రత్యక్షంగానో, పరోక్షం గానో భాగస్వామ్యమున్న కంపెనీ ఉండొచ్చు. కాదనలేం. కానీ, ఆయన పెట్టుబడిపెట్టిన ‘నమస్తే తెలంగాణ’ పత్రికకు పోలవరం టెండర్లకు ఏమిటి సంబంధం? పెట్టుబడులు ఎక్కడినుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? అని నేను ప్రధాన స్రవంతి పత్రికల్లో పనిచేసిన ఏ సందర్భంలోనూ ప్రశ్న రాలేదు. పెట్టుబడుల స్వభావం గురించి కూడా ఎన్నడూ చర్చ రాలేదు. ఎందుకంటే పత్రికలన్నీ పెట్టుబ డి పుత్రికలే. మారిన కాలమాన పరిస్థితుల్లో ఆదర్శంగా, సమాజహితం కోసం, నిక్కచ్చిగా పత్రికలు నడపడం సాధ్యం కాని స్థితి. అడ్వర్టయిజర్లు, క్లయింట్‌లు, కార్పొరేట్‌లు, పెట్టుబడి స్వభావమైన వార్తా సృష్టి, రాజకీయ పాక్షికత, వినోదం అన్నీ పత్రికా విలువలకు అవసరం కాదేమో కానీ, అనివార్యమైనవే. కానీ ఒకటి మాత్రం చెప్పగలను.

ఏ పత్రికైనా తెలంగాణ అంశాలకు సంబంధించి కానీ తెలంగాణకు జరిగిన అన్యాయాలకు సంబంధించి కానీ, ఉద్యమానికి సంబంధించి కానీ ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఇస్తున్నంత స్వేచ్ఛ ఇస్తుందనుకోలేను. ఇది ప్రత్యక్ష అనుభవం. పూర్తి స్వేచ్ఛ ఒక భ్రమ. కానీ ఏ పత్రికలో ఎవరు పెట్టుబడి పెట్టారు? ఎవరు బినామీలు? ఏ ఛానల్‌లో ఎవరి పెట్టుబడులున్నాయి.. అనేది అన్నింటికి సంబంధించిన చర్చ. కానీ ఒక్క ‘నమస్తే తెలంగాణ’ పెట్టుబడులు మాత్రమే ఎందుకు చర్చనీయాంశం అయ్యా యి? ఎందుకంటే ‘నమస్తే తెలంగాణ’ గొంతు నులిమెయ్యాలి. అది తెలంగాణ వైపు నిలబడింది. ఉద్యమంలో ఉంది. అది తెలంగాణ నిఖార్సయిన సంస్కృతిని నిలబెడుతున్నది. తెలంగాణ సిర్ఫ్ హమారా అని చెప్పుకునే అంశాలను ప్రతిబింబిస్తున్నది. సిల్‌సిలాను, ఒక వారసత్వ చరివూతను పునర్‌లిఖిస్తున్నది. ట్యాంక్‌బండ్ మీద లేని విగ్రహాల గురించి రాస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’ శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ కుట్రలను బయటపెట్టింది. హైదరాబాద్‌లో పుట్లుగా నిండిన సీమాంధ్ర ఉద్యోగులు, అధికారుల లెక్కలను బయటపెట్టింది. దాంతో పాటే ఒక సంపూర్ణ పత్రికగా అది ఎడారి విప్లవాలను కలగన్నది. గడాఫీ మృత్యురహస్యంలో అమెరికా అహంకారాన్ని కనుగొన్నది.

మనకు తెలియని మన వీరులను ప్రదర్శిస్తున్నది. అది అచ్చంగా తెలంగాణ సకల జనుల సమ్మె కేతనంగా ఎగిరింది. అదీ అసలు సమస్య. చంద్రబాబునాయుడుకు కంటగింపు, కన్నెర్ర ఉంటే అర్థం ఉన్నది. ఆయన తటస్థుడు కాదు. సీమాంధ్ర పక్షపాతి. సమైక్యాంవూధవాది. తెలంగాణను దోచుకున్నవాడు. కానీ ఆయన అనుచరులైన తెలంగాణ వాళ్లకెందుకీ కుట్ర. ఎందుకీ కక్ష. ‘తెలంగాణ ప్రాంతం నుంచి పెట్టుబడిదారులు ఎదగకపోవడమే ఇప్పటి అరిష్టం’ అని తెలంగాణకు చెందిన ఒక మాజీ డీజీపీ అన్నారు. నేనలా అనలేను. కానీ నిజమే. ఇన్నాళ్లకు ఒక పత్రిక పెట్టే మొనగాడు ఎల్.రాజం అయినందుకు, ఆయన మా ఊరి వాడైనందుకు నేను గర్వపడుతున్నాను. నిజమే, ఆయన పెట్టుబడుల మూలాలతో నాకు సంబంధం లేదు. వాటి గురించి నా అభివూపాయం తద్విరుద్ధమైనదే.

అన్ని పెట్టుబడుల మూలాలు ఒకటే అని నా నమ్మకం. పెట్టుబడి పత్రిక పుట్టుకకు, అది మనగలడానికి, నిలబడడానికి, అది తెలంగాణ ప్రజల జీవనాడి కావడానికి మూలమైనప్పుడు ఆ పెట్టుబడి నమస్తే తెలంగాణకు అవసరమైంది. అంతకుమించి విశేషమేమీలేదు. పెట్టుబడుల పవివూతత గురించి నేను మాట్లాడలేను. అన్ని పెట్టుబడుల సారం ఒక్కటే. వాటి ప్రయోజనాలు వాటికి ఉంటాయి. కానీ ‘నమస్తే తెలంగాణ’ను చిదమకండి. ఎదగనివ్వండి. అది మీకూ, మాకూ, సకల తెలంగాణ ప్రజలకు కావాల్సిన, రావాల్సిన పత్రిక.. ‘నమస్తే తెలంగాణ’ జోలికి రాకండి. టెండర్ల గురించి, పెట్టుబడుల గురించి ఎనై్ననా యుద్ధాలు చేసుకోండి. సెలవు. జై తెలంగాణ.
-అల్లం నారాయణ



Take By: http://www.namasthetelangaana.com/Columnists/Allam-Narayana.asp?ContentId=38584

Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha,
Allam Narayana,

Read more...

Botsa demands Advani’s apology


PCC, chief Botsa Satyanarayana on Thursday sought an apology from senior Bharatiya Janata Party leader LK Advani for ‘lying with the people of Telangana’.

Addressing a press conference at Gandhi Bhavan, Botsa produced a copy of letter dated April 1, 2002, written by LK Advani as Home Minister to the then Lok Sabha MP A Narender sating that the NDA Government “do not propose creation of a separate State of Telangana.” In the letter Advani wrote, “The Government of India is of the view that regional disparities in economic development can be tackled through planning and efficient use of available resources. The Government, therefore, do not propose creation of a separate State of Telangana.”

Seeking an explanation on this letter, Botsa said Advani have no right to speak about Telangana when he himself has objected to its formation. He reminded that the BJP Manifesto for the State in 1998 clearly promised separate Telangana State and contested the polls on the slogan of “One Vote, Two States”. “However, after coming to power at the Centre, the BJP forgot its promise,” he said.

Citing a debate held in the Lok Sabha on Telangana, Botsa said that Advani as a Deputy Prime Minister categorically said that the issue of under development of Telangana is best addressed in integrated Andhra Pradesh and that therefore, there was no need to form separate Telangana. He said that BJP talks about Telangana when it is not in power.

Claiming that the Congress never went back on its words on Telangana, he said that in 2004 Manifesto, the Congress party proposed to constitute second States Reorganisation Commission.

“Since the Congress formed the government at the Centre with many others including TRS, it was decided that as part of Common Minimum Programme, the issue would be resolved by achieving political consensus,” he said. 

However, he said unfortunately consensus could not be achieved as political parties were vertically divided on the issue in both the regions of the State.

“In 2009 Congress Manifesto, while acknowledging that there was an overwhelming sentiment for separate Telangana in that region, it was categorically stated that the interests and sentiments of other stake holders would be taken into account,” he said.

Botsa said that unlike BJP, the Congress party never promised separate Telangana ‘unconditionally’. 

He said that December 9, 2009, statement on Telangana could not be honoured as the political parties who supported separate state on December 7, changed their stand after Home Minister P Chidambaram’s announcement. He said that the Congress party has been making sincere efforts to resolve the issue.


Take By: gr8telangana.com

Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha
, Botsa

Read more...

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తూ చైతన్యం చేస్తున్న కంప్యూటర్‌ ఉపాధ్యాయులకు కనీస వేతనం కరువయిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి అన్నారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో కంప్యూటర్‌ టీచర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2008 నుంచి కంప్యూటర్‌ టీచర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం రూ. 1500నుంచి 2వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారిందన్నారు.

ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా వేతనాల్లో వ్యత్యాసాలున్నాయన్నారు. ఉద్యోగ భద్రత, ఈఎఫ్‌, ఫిఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు లేవన్నారు. జిఓ నెం.3 ప్రకారం రూ.10,300 చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. మెదక్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న కంప్యూటర్‌ టీచర్లందరూ 23న ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించే సమ్మెకు హాజరుకావాలన్నారు.

ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఆశోక్‌, కంప్యూటర్‌ టీచర్లు శాంతికుమార్‌, మధు, వెంకటకృష్ణ, ప్రసున్నలత, గీత తదితరులు పాల్గొన్నారు.

Take By: Prajasakti


Tags: Telangana News, Medak, Sangareddy, Computer Teachers, Teachers, NIIT, APTEC, G.O. No. 3

Read more...

చెప్పుకోండి చూద్దాం!

ఆయన మహామాటకారి
కానీ ఆ మాటలన్నీ చంద్రబాబువి!
ఆయన కత్తిలాంటివాడు
కానీ ఆయన ఎప్పుడూ
చంద్రబాబు చేతిలో ఉంటాడు!
వంచనకొక వంచనకొక వంచకుడాయన!
చెంచాకొక చెంచాకొక చెంచా ఆయన!
అబద్ధానికి ప్రబల మిత్రుడు
నిబద్ధతకు బద్ధ శత్రువు!
మోకాలును బోడిగుండును ముడివేయాలని తాపత్రయం
నమస్తే తెలంగాణను పోలవరంలో కలిపేయాలని కుతంత్రం!
ఆయన ఏడుపు పోలవరం కదిలిందని కాదు
పసుపుచొక్కాలకు ఆ కాంట్రాక్టు దక్కలేదని!
ఆయన అసలు లక్ష్యం పోలవరం కాదు
తెలంగాణ ఉద్యమాన్ని బద్నాం చేయడం!
ఆయన ఆరాటం పోలవరం ఆపాలని కాదు
ఉరుకుతున్న ఉద్యమ శ్రేణులను గందరగోళపర్చాలని!
ఫేసు లేక, డిఫెన్సు లేక అఫెన్సుకు దిగినవారెవరు!
ఉద్యమం ఛీకొడితే ఉక్రోషం వెళ్లగక్కుతున్నదెవరు?
ఎవరా శల్యుడు? ఎవరా సైంధవుడు?
చెప్పుకోండి చూద్దాం!

లేస్తే మనిషి కాదు
లేస్తే మనిషిని కాదని హూంకరిస్తుంటాడు
లేచాడు, బొక్కబోర్లాపడ్డాడు, పాతగూటికి చేరాడు!
‘సీమాంధ్రుల మోచేతి నీళ్లు
ఇంకెన్నాళ్లు తాగాలని’ పులిలా గర్జించాడు!
రెండేళ్లు తిరగకుండానే పిల్లిలా అదే
మోచేతి నీళ్లను వెదుక్కుంటూ వెళ్లాడు!
నవ తెలంగాణ నా హక్కన్నాడు
చివరకు నయ్ తెలంగాణ జట్టులో చేరిపోయాడు!
తెలంగాణను ఇంకెంతకాలం దోచుకుంటారని ప్రశ్నించాడు
వాటాదక్కితే చాలని దోచుకునేవారి సరసన చేరిపోయాడు!
దొరతనంపై గర్జిస్తుంటాడు
పెద్ద దొరలా ప్రవర్తిస్తుంటాడు!
తెలంగాణ సెంటిమెంటుపై
ఊరేగుదామని ఎగురుకుంటూ వచ్చాడు!
జనం ఛీపొమ్మంటే చీదరించుకుంటూ వెళ్ల్లిపోయాడు!
సర్వం కోల్పోయిన చోట వెదుక్కుంటున్నవారెవరు?
తమ్ముళ్లకు ద్వేషం నూరిపోసి దోషం దాచుకుంటున్నదెవరు?
చెప్పుకోండి చూద్దాం!

కంఠశోష ఆవేశం
manmohan-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅపార్థం చేసుకోవద్దని చెబుతూ
ఎవరికీ అర్థం కాకుండా
మాట్లాడేదెవరు?
మహానాయకుడు కావాలనుకుంటాడు
మామూలు నాయకునిగా కూడా స్పందించడు!
వత్తగూడని చోట వత్తివత్తి మాట్లాడతాడు!
వత్తిచెప్పాల్సిన చోట మెత్తబడిపోతాడు!
ఆవేశంగా మాట్లాడాలనుకుంటాడు
కంఠశోష తప్ప కదిలించే మాట ఒక్కటీ ఉండదు!
భాషను అష్టవంకరలూ తిప్పి తిప్పి
అరివీర భయంకరంగా వేధించునదెవరు?
త్యాగాలను గురించి ఎక్కువగా మాట్లాడి
స్వార్థం చుట్టూ పరిభ్రమించునదెవరు?
శ్రేణులు పోరాడుతుంటే
అస్త్ర సన్యాసం గురించి బోధలు చేసినదెవరు?
చెప్పుకోండి చూద్దాం!

ధృతరాష్ట్రుల సంతతి

మాటతప్పినవాడితో
ఏకాభిప్రాయం ఎలాసాధ్యం?
బుకాయించేవాడితో
చర్చల ప్రయోజనం ఏమిటి?
మృత్యుమేఘాలను నిలువరించే
కాలపరిమితి ఎక్కడ?
అన్యాయాన్ని ఎదిరించలేని
పుత్రవాత్సల్యం ఎవరిది?
అధర్మమమని తెలిసీ
కళ్లు మూసుకున్నదెవరు?
నిజం తెలిసీ నిష్క్రియను
ఆశ్రయించినవారెవరు?
చేతనయ్యీ చేష్టలుడిగిన
ఆధునిక ధృతరాష్ట్రులెవరు?
చెప్పుకోండి చూద్దాం!

ఎవరు ఎక్కువ సంతోషపెడతారు?

ఒక మిత్రుడు ఈ కింది మెయిల్ పంపాడు. ఆ మెయిల్ సారాం శం ఏమంటే- ఒక ప్రధాని, ఇద్దరు సీనియర్ కేంద్ర మంత్రులు విమానంలో ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం వెళ్లాక ప్రధా ని వంద రూపాయల నోటు విమానం నుంచి కిందకు వదిలి ‘నేను ఈ రోజు ఒక పేదవాడిని సంతోష పెట్టగలిగాను’ అన్నారు. ఇది చూసి ఒక సీనియర్ మంత్రి రెండు యాభై రూపాయల నోట్లు విమానంలోంచి కిందికి వదిలాడు. ‘నేను ఇద్దరు పేద వాళ్ల ను సంతోష పెట్టగలిగాను’ అని సంతోష పడ్డాడట. చివరి మంత్రి మరో అడుగు ముందుకు వేసి రూపాయి నాణాలు వంద తీసు కుని కిందికి విసిరాడు. ‘నేను ఈ రోజు వంద మందిని సంతోష పెట్టగలిగాను’ అని సంబురపడిపోయాడు. ఇవన్నీ వింటున్న పైల ట్‌కు చిరాకు పుట్టింది. ‘మిమ్మల్ని ముగ్గుర్ని కింది కు వదిలేస్తే నాలుగు కోట్ల మంది సంతోష పడతారు’ అన్నాడట? ఆ మంత్రు లెవరు? ఆ పైలట్ ఎవరు? ఇది జరగాలని, జరుగుతుందని ఎవరూ కోరుకోరు కానీ తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి ప్రతీక ఈ మెయిల్. కేంద్రం నిష్క్రియా పరత్వం, నిశ్చేష్టలపై ఈ ప్రాంతానికి చెందిన యువకుల్లో ఏళ్ల తరబడి మస లుతున్న మానసిక సంక్షోభానికి ప్రతిబింబం ఈ మెయిల్.


Take By: http://www.namasthetelangaana.com/Columnists/Katta-SekharReddy.asp?ContentId=38288


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha

Read more...

జావీద్ ఆలం కుంద్‌మీరి

సంపదనిస్తే....సోమరులవుతారు
విద్యనిస్తే..వివేకులవుతారు
వివేకం బతకడం నేర్పుతుంది. మనిషి పోరాడేది దాని కోసమే కదా!
ఈ తత్వం ఆలం కుంద్‌మీరికి బాగా తెలుసు
అందుకే తన పిల్లలకు చదువునిచ్చాడు. అందుకున్న వాళ్లు విద్యాధనికులయ్యారు
తరతరాలు పంచుకున్నా తరగని ఆస్తిపరులయ్యారు
వాళ్లలో ఒకరే జావీద్ ఆలం.
కుంద్‌మీరి పెద్ద కొడుకు
ఆ రిచెస్ట్ పర్సన్ కొనసాగిస్తున్న పరంపర.....


ఆ ఇంటి తలుపు తట్టేముందు...

javiD-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema‘చమురు కోసం రక్తపాతం వద్దు, నీటి కోసం యుద్ధాలు వద్దు’, ‘చమురు, నీటిని ఆదాచేయండి మీ పిల్లల కోసం’ అన్న రైటప్స్ కనపడతాయి ఆ తలుపు మీద. ఇవి అక్షరాలు కావు ఓ పదేళ్ల పాప అవగాహన, ఆందోళన, అభ్యర్థన. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రశాంత తెమ్మెరలు చల్లగా చెంపల్ని తాకి మనసు చుట్టూ అల్లుకుంటాయి. ఇంటపూక్చువల్స్ ఇళ్లకి ఫర్నీచర్ కన్నా పుస్తకాల అల్మారాలే అందాన్నిస్తాయట. నిజమే ఈ ఇంటికి కూడా అవే ప్రత్యేకమైన అలంకారాన్ని, నిండుదనాన్నిచ్చాయి. ఆ ఇల్లు.. ఆలం కుంద్‌మీరి కొడుకు జావీద్ ఆలంది. మత ఛాయల్లేకుండా మానవత్వ పరిమళాలతో గుబాళిస్తోంది. ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ మేధావుల మధ్య మేధావిగా, సామాన్యుల మధ్య సామాన్యుడిలా కలిసిపోయే ప్రత్యేకమైన మనిషి. ఈ గుణం తండ్రి ఆలం కుంద్‌మీరి ఇచ్చిన వరం అంటాడు. జీవితంలో అడుగడుగునా సింప్లిసిటీ.. ఇదీ తండ్రి వల్ల అబ్బిన భాగ్యమే అని గర్వపడతాడు.

ఆస్తులు, అంతస్తులు సంపాదించిపెట్టకపోతేయే...అద్భుతమైన నైజాన్ని తరతరాలు పంచుకునేలా జీన్స్‌తో రంగరించి రక్తంలో కలిపిస్తే! అందుకే కుంద్‌మీరి గురించి బాగా తెలిసిన వాళ్లకు జావీద్ కొత్తగా అనిపించడు. ఆ తండ్రి పరిఛాయలాగే కనపడతాడు. అవును మరి అతను పుట్టి, పెరిగింది ఆ విలువల మధ్యే కదా!
జావీద్ కూడా ఈ మాటే అంటాడు.. ‘మానవత్వ విలువల మధ్య పెరిగాం. మేము ఆరుగురం పిల్లలం. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు. అందరిలోకి నేనే పెద్ద. చెల్లెళ్లు, నేను... మిగిలాం. ఒక చెల్లెలు కెనడాలో, ఇంకో చెల్లెలు ఢిల్లీలో ఉంటున్నారు. మా కుటుంబంలో మా ఇంట్లో ఆడవాళ్లకు పరదా ఎప్పుడూ లేదు. మా తరందాకా ఎందుకు? మా అమ్మే ఎప్పుడు బురఖాలో లేదు. ఆ మాట కొస్తే... తను 1950ల్లోనే బహిరంగంగా స్మోక్ చేసేది, డ్రింక్ తీసుకునేది. మా తాతయ్య అమ్మను చాలా స్వేచ్ఛగా పెంచాడు. పెళ్లయ్యాకా నాన్న ఆంక్షలు పెట్టలేదు. అమ్మ ఆ రోజుల్లోనే బాడ్మింటన్ ఛాంపియన్. హార్స్ రైడింగ్ చేసేది. షూటర్, స్విమ్మర్ కూడా’ అని చెప్తున్న జావీద్ మాటలు వింటుంటే తండ్రి వారసత్వాన్నే కాదుతల్లి పరంపరనూ కొనసాగించాడేమో అనిపించింది.

యే లౌండా కౌన్ హై
javiD1-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaజావీద్ కూడా తన తల్లి ఖదీజా ఆలంలాగే ఆటల్లో ఫస్ట్. క్రికెట్ అంటే ప్రాణం. హాకీలో కూడా ప్రవేశం ఉంది. పదిహేడేళ్ల వయసు దాకా క్రికెట్‌ను బాగా ఎంజాయ్ చేశాడు. లీగ్ మ్యాచ్‌లు ఆడాడు. తన బౌలింగ్‌తో జయసూర్యలాంటి వాళ్లను వణికించాడు. జింఖానా గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుంటే... తన ఆఫ్ స్పిన్‌తో జయసూర్యకు చెమటలు పట్టించాడు. ఆట అయిపోయాక.. ‘యే లౌండా(ఈ పిల్లగాడు) కౌన్ హైరే...’ అంటూ జావీద్ గురించి ఆరా తీశాడట జయసూర్య. అయితే ఈ విషయంలో ఆలం కుంద్‌మీరికి కొడుకు పూర్తి అపోజిట్. కుంద్‌మీరి ఆటలకు చాలాదూరం. పైగా టైమ్‌వేస్ట్ వ్యవహారంగా భావించేవాడట. వాళ్ల నాన్న నస భరించలేకే ఇష్టమైన క్రికెట్‌ను వదిలేశానని చెప్తాడు జావీద్. ‘క్రికెట్ ఆడినప్పుడల్లా చదువుకోకుండా టైమ్ వేస్ట్ చేస్తున్నావంటూ సణిగేవారు. ఆ ఒక్క విషయంలో తప్ప దేంట్లో ఆయన పోరులేదు. అసలాయన ఓ ఫాదర్ కంటే కూడా ఫ్రెండ్‌గానే ఎక్కువ తెలుసు నాకు. చాలా క్యాజువల్‌గా ఉండేవాడు. ఏ విషయం గురించైనా మాతో చర్చించేవాడు. చాలా ఎఫెక్షనేట్‌గా ఉండేవాడు. మాతోనే కాదు తన స్టూడెంట్స్‌తో కూడా. ఆయన్ని స్టూడెంట్స్ ఎంత ఇష్టపడేవారు, గౌరవించే వారంటే.. కిడ్నీ ఫెయిలయ్యి ఆయనకు డయాలసిస్ చేయాల్సి వచ్చేది. దాని కోసం నాన్నని హాస్పటల్‌కు వాళ్లే తీసుకెళ్లేవాళ్లు, ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేసిన సందర్భాలూ ఉన్నాయి’ అంటూ తండ్రి చివరిరోజులను గుర్తుచేసుకున్నాడు.

రాజకీయ నేతా?
javiD2-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకుంద్‌మీరి ప్రభావమో లేక సహజంగానే వచ్చిన లక్షణమో తెలియదు కాని స్టూడెంట్స్‌తో జావీదూ చాలా క్లోజ్‌గా ఉండేవాడట. ఒకసారి... జావీద్ సిమ్లా నుంచి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతుంటే ఆయన్ని సెండాఫ్ చేయడానికి దాదాపు ఐదువందల మంది స్టూడెంట్స్ రైల్వే స్టేషన్‌కు వచ్చారట. వాళ్లంతా కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతుంటే జావీద్ పక్కనున్న వ్యక్తి...‘సర్ మీరు రాజకీయనేతా? ఇంతమంది వచ్చారు మీకు వీడ్కోలు చెప్పడానికి’ అని అడిగాడట. ‘లేదండీ బాబూ.. నేను ఏ నేతను కాను. యూనివర్శిటీలో పాఠాలు చెప్పుకునే మామూలు టీచర్‌ను, వీళ్లంతా నా పిల్లలు’ అని సమాధానమిచ్చాడట కూల్‌గా.

పెళ్లి రోజూ దెబ్బలు
‘నాన్న సవతి తల్లి దగ్గర పెరిగాడు. ఆయనకు ఎనిమిదేళ్లున్నప్పుడే వాళ్ల అమ్మ చనిపోయింది. నాన్న వాళ్ల తాత నాన్నను ముల్లా చేయడానికి ట్రైనింగ్ ఇప్పించాడు. ఆయన పదిహేడేళ్ల వయసులో కూడా నున్నటి గుండుతో ఉండేవాడట. అప్పటిదాకా మతాచారాలు పాటించినా పద్దెనిమిదో యేట నుంచి ఆయన ఆలోచనా ధోరణి ఛేంజ్ అయింది. మార్క్సిస్ట్‌గా మారారు. కామ్రెడ్స్ అసోసియేషన్‌తో అనుబంధం పెంచుకున్నాడు. స్త్రీ సాధికారత కోసం పోరాడాడు. అందులో భాగంగానే మా అమ్మను మంచి పొలిటీషియన్‌ను చేశాడు. నాన్న అటు నైజాం సర్కారుకు, ఇటు ఇండియన్ గవర్నమెంట్‌కి రెండింటికి వ్యతిరేకంగా పనిచేసి జైలుకు వెళ్లాడు. రెండు మూడు రోజుల్లో ఆయన పెళ్లి ఉందనగా నాన్నను రజాకార్లు కిడ్నాప్ చేశారట. పెళ్లి రోజు దెబ్బలతో బయటకు వచ్చాడు. అలాగే పెళ్లి అయిందట. నాన్న పర్షియన్ భాషలో పండితుడు, అరబిక్ స్కాలర్. అమ్మకూ పర్షియన్ బాగా వచ్చు. పర్షియన్, ఉర్దూ సాహిత్యాన్ని ఇద్దరూ ఇష్టపడేవారు. అమ్మకు కవిత్వం అంటే ప్రాణం.

చాంద్ తారోంకా బన్
javiD4-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకవిత్వం అంటే గుర్తొచ్చింది. మగ్దుం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. మా అమ్మ అంటే ఆయనకు చాలా అభిమానం. ఒక రోజు... రాత్రి ఒంటిగంట.. ఆ సమయంలో.. మగ్దుం మా ఇంటికి వచ్చి ‘ఖదీజా... ఖదీజా..’ అంటూ పిలుస్తున్నాడు.నాన్న లేచి తలుపు తీసి ‘లోపలికి రా’ అన్నాడు.
‘నేనొచ్చింది నీ కోసం కాదు, ఖదీజాను పిలువు’ అన్నాడు ఆయన.నాన్న లోపలికి వెళ్లి ‘ఖదీజా మగ్దుం వచ్చాడు, నీతో ఏదో మాట్లాడాలి కావొచ్చు రా’ అని అమ్మను పిలుచుకొచ్చాడు. అమ్మ రాగానే మగ్దుం చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా లోపలికి వచ్చి కూర్చుంటూ..‘ఖదీజా... నేనో కవిత రాశాను చాంద్ తారోంకా బన్.. అని, దాన్ని ముందు నీకే వినిపిద్దామని వచ్చాను’ అంటూ ఆ కవితను చదివి వినిపించాడు. తర్వాత అది సియాసత్‌లో అచ్చయింది, ఆ కవిత మీద నాన్న రివ్యూ రాశాడు. మగ్దుం రెండే రెండు చోట్ల తాగేవాడు. ఒకటి మా ఇంట్లో, ఇంకోటి ఇందిరా ధన్‌రాజ్ వాళ్లింట్లో. ఇందిరా ధన్‌రాజ్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆమె మీద కవిత్వం కూడా రాశాడు.

తెలంగాణ కావాలి
నాన్న ఎంత సింపుల్‌గా ఉండేవాడంటే... తను వేసుకునే బట్టల పట్ల కూడా పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. నాన్న.. నాకు ఓ ఫ్రెండ్, గైడ్, ఫిలాఫర్. సమ్‌టైమ్స్ ఇప్పటికీ... ఆయన్ని మిస్ అవుతుంటాను’ అని వాళ్ల నాన్న జ్ఞాపకాలను తలచుకున్నాడు. ప్రస్తుతంలోకి వస్తూ.. ‘నాన్న విశాలాంవూధనే సపోర్ట్ చేశాడు. ఈవెన్ 1969 ఉద్యమం అప్పుడు కూడా. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆంధ్ర, తెలంగాణ కలిసుండే వాతావరణం లేదు. తెలంగాణ ఏర్పాటు అనివార్యం అనేది ఇప్పుడు నాఅభివూపాయం’ అన్ని చెప్పాడు జావీద్ ఆలం.

javiD5-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaసీరియస్ ఇంటపూక్చువల్ లైఫ్, ప్రాక్టికల్ యాక్టివ్ లైఫ్ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ బతకడమెలాగో నాన్న నుంచే నేర్చుకున్నానని చెప్తాడు జావీద్. ఆ తత్వాన్ని అక్షరాలా పాటిస్తూ అసలైన వారసుడు అనిపించుకుంటున్నాడు. ఎథీస్ట్ అయిన జావీద్ హిందువును పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పేరు జయంతి. ఆమెది కోల్‌కత్తా. కొడుకు అనిఖేత్ కాశ్మీరి పండిట్‌ను పెళ్లి చేసుకున్నాడు. అనిఖేత్ ఈపిడబ్ల్యూ మ్యాగజైన్‌లో పనిచేస్తున్నాడు. ఆయన కూతురే సారా. రైటప్స్ రాసి తలుపు మీద అతికించిన పదేళ్ల పాప.

ఆలం కుంద్‌మీరి ఫౌండేషన్
ఆలం కుంద్‌మీరి ఉస్మానియా యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తండ్రిలాగే అకడమీషియన్ అయిన జావీద్ హిమాచల్‌వూపదేశ్, కోల్‌కత్తా, ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నాడు. మొన్న మార్చిలో తన టర్మ్ అయిపోవడంతో పుస్తకాలు రాసే పనితో బిజీ అయ్యాడు. జావీద్ ఆలం ఇప్పటి వరకు ఇండిస్పెన్సబులిటీ ఆఫ్ సెక్యులరిజమ్, లివింగ్ విత్ మోడర్నిటీ, హూ వాంట్స్ డెమోక్షికసీ అన్న పుస్తకాలను రాశాడు. హూ వాంట్స్ డెమోక్షికసీని తెలుగులోకీ అనువదించారు. సీపిఐ మెంబర్ అయిన జావీద్ 2004లో ఆలం కుంద్‌మీరి ఫౌండేషన్ స్థాపించాడు. స్త్రీ అసమానత్వం, రాజకీయ, సాంఘిక, విద్య, తాత్విక విషయాలకు సంబంధించిన సమస్యలు, స్త్రీ అసమానత్వం లాంటి అంశాల మీద పనిచేస్తుందీ సంస్థ.


Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, Zindagi,

Read more...

మరింత జోరు సమ్మె

- తెలంగాణపై స్పష్టత వచ్చే దాకా ఆగదు
- అత్యవసర సర్వీసులూ ఆపేస్తామన్న స్వామిగౌడ్
- జేఏసీ పిలుపిస్తే అన్ని సంఘాలూ మళ్లీ సమ్మెలోకి: జేఏసీ చైర్మన్ కోదండరాం
- ఉద్యమాన్ని సమీక్షించుకుంటున్న ఉద్యోగ నేతలు
- రేపు ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ
- కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
- కొత్త రూపాల్లో ముమ్మర ఆందోళనలు!


current talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 22 :తెలంగాణ రాష్ట్రసాధన దిశగా మొదలు పెట్టిన సకల జనుల సమ్మెను కొత్త పుంతలు తొక్కించేందుకు, మరింత ఉధృతం చేసేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ సమాయత్తమవుతున్నది. 40 రోజులుగా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న ఉద్యోగులు ఉద్యమ పథంలో మడమతిప్పేది లేదని స్పష్టం చేస్తున్నారు. ధర్నాలు, మహా ధర్నాలు, గేట్‌మీటింగ్‌లు మొదలుకుని రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధం, రైల్‌రోకో వంటి ఆందోళనలతో తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు సహా సబ్బండ వర్ణాలు ప్రత్యేక రాష్ట్రంపై తమ ఆకాంక్ష చాటినా.. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉద్యమాలు చేపట్టినా, ఆఖరికి ప్రధాన మంత్రికి మొరపెట్టుకున్నా పాలకుల్లో చలనం లేకపోవడంపై ఉద్యోగ సంఘాల కడుపు రగులుతున్నది. ఇంత చేసినా 40 రోజులుగా తెలంగాణపై స్పష్టత రాకపోవడంతో సమ్మెను ఇకపై మరింత ఉధృతంగా నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమైంది.

భవిష్యత్ పోరాట రూపంపై చర్చించేందుకు ఉద్యోగ జేఏసీ స్టీరింగ్ కమిటీ సోమవారం నాడు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే అవసరమైతే అత్యవసర సర్వీసులనూ నిలిపివేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ శనివారం విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేత రఘు చేపట్టిన 72 గంటల దీక్ష కార్యక్షికమంలో ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించకపోతే అత్యవసర సర్వీసులైన పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాతోపాటు, విద్యుత్‌నూ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇదే కార్యక్షికమంలో పాల్గొన్న రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంత వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఇప్పటికే సమ్మె విరమించిన సంఘాలన్నీ జేఏసీ పిలుపునిస్తే మళ్లీ సమ్మెలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులు ఉద్యమంలోకి రానున్నారని ఆయన చెప్పారు.

ఉద్యమంలోని ముఖ్య నేతలు చేసిన ప్రకటనల నేపథ్యంలో సోమవారం జరిగే ఉద్యోగ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తున్నది. అదే విధంగా ఇప్పటి వరకూ జరిగిన ఉద్యమంకంటే ఉధృతం స్థాయిలో కొత్త పోరాట రూపాలు ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకూ జరిగిన సమ్మెను ఉద్యోగ నేతలు సమీక్షిస్తారని తెలుస్తున్నది. తెలంగాణ తొలి దశ పోరాటమైన 1969 నాటి ఉద్యమంలో 37 రోజుల పాటు ఉద్యోగులు చేసిన సమ్మె రికార్డును ప్రస్తుతం 2011లో మలి విడత తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు బ్రేక్ చేశారని, ఉద్యమంలో మరో మైలురాయిని నెలకొల్పారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. నాటి ఉద్యమానికి మించిన స్థాయిలో నేటి ఉద్యమం అనేక విజయాలకు గీటురాయిగా నిలిచిందని చెబుతున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా సబ్బండ వర్ణాలను సమ్మె కట్టించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన నిలిచి పోరాడే సై్థర్యాన్ని ఇవ్వడంలో ఉద్యోగ సంఘాల జేఏసీ విజయాన్ని సాధించిందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

137 సంఘాలతో పాటు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులను, విద్యుత్తు ఉద్యోగులను సమ్మెలోకి దింపి సకల జనుల సమ్మెలో కొత్త ఆధ్యాయాలను సృష్టించిందని నాయకులు చెబుతున్నారు. దీన్ని సహించలేని సర్కారు జేఏసీ నేతలు అనేక మందిపై ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేశారని ఆక్షేపిస్తున్నారు. ఏ సెక్షన్‌లపై, ఏ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారో కూడా తెలియని పరిస్థితి కల్పించారని ఉద్యోగసంఘాల నాయకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చర్చలకు పిలిచి కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, మూడు రోజులు గడుస్తున్నప్పటికీ, ఇంతవరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి అండగా నిలవాల్సిన తెలంగాణ ప్రాంత మంత్రులు గానీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహగానీ కేసుల ఎత్తివేతకు కృషి చేయడం లేదని వారు విమర్శిస్తున్నారు. కనీసం ఉద్యోగుల ఇబ్బందుల పట్ల సానుభూతిని కూడా రాజనర్సింహ వ్యక్తం చేయడం లేదని వారు ఆక్షేపిస్తున్నారు.

ఇప్పటికే రెండు మాసాల వేతనాలను కోల్పోయామని, పండుగలు పబ్బాలకు దూరమయ్యామని, కుటుంబాలతో సహా రోడ్లమీదికి వచ్చి రహదారులను దిగ్బంధనం చేశామని, ప్రపంచ ఉద్యమాల చరివూతలో లేని ఆందోళనా పద్ధతులన్నింటినీ నిర్వహించగలిగామని ఉద్యోగసంఘాల నాయకులు సమీక్షించుకుంటున్నారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ సంఘాల జేఏసీకి కొండంత బలాన్ని ఇచ్చారని, తెలంగాణ ప్రజలందరికీ గొప్ప విశ్వాసాన్ని కల్గించగలిగారని ఉద్యోగ నాయకులు అభినందిస్తున్నారు. ఈ విజయాలన్నింటినీ క్రోడీకరించుకుని తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటామని ఉద్యోగసంఘాల నాయకులు చెబుతున్నారు.

Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha

Read more...

డిప్యూటీ సీఎం ఇల్లు ముట్టడి

- విద్యార్థులపై విరిగిన లాఠీలు
- ఏబీవీపీ సాహసం
- మార్మోగిన తెలంగానం
- ఇంటి వద్ద బైఠాయింపు
- రాజీనామా చేయాలని డిమాండ్
- లాఠీలకు పనిచేప్పిన పోలీసులు
- విచక్షణారహితంగా ఈడ్చిపారేశారు
- ఏబీవీపీ నేతలకు గాయాలు
- బలవంతపు అరెస్టులు


సంగాడ్డి, అక్టోబరు 22  : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా ఇంటిని ఏబీవీపీ నాయకులు శనివారం ముట్టడించారు. డీప్యూటీ సీఎం పదవికి వెంటనే రాజీనామ చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి వద్ద విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగవూపవేశం చేసి విచక్షణారహితంగా ఈడ్చుకుంటూ వెళ్లి బలవంతంగా అరెస్టు చేయబోగా, విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ జులిపించి అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. పోలీసుల చర్యలను తిప్పికొట్టిన ఆందోళనకారులు ఒకదశలో వారికి ఎదురుతిరిగారు. దీంతో ఉప ముఖ్యమం త్రి ఇంటి వద్ద కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిం ది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

తెలంగాణ ప్రజల ఓట్లచే అధికార పీటం ఎక్కిన డీప్యూటీ సీఎం దామోదర్‌రాజనర్సింహా అదే ప్రజల కోసం ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పోతిడ్డిపల్లి విద్యానగర్‌లోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ పెద్దఎత్తున ఈ ముట్టడి జరిగింది. విద్యార్థులు ఒక్కసారిగా ఏబీవీపీ జెండాలు చేతబూని ఉప ముఖ్యమంత్రి ఇంటివైపు పరుగులు తీసి తెలంగాణ నినాదాలిస్తూ ముట్టడించారు. తెలంగాణవాదులు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులు, ఏబీవీపీ నాయకులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మొండికేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులపై పోలీసులు విచక్ష ణా రహితంగా ప్రవర్తిస్తూ చేతికి దొరికినకాడికి కాళ్లు, చే తులు, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. పోలీసుల తీరుపై మండిపడిన ఆందోళనకారులు ఒకదశలో రెచ్చిపోయారు. పోలీసులపై ఎదురుదాడికి దిగి ప్రతిఘటించారు. ఈ క్ర మంలో ఏబీవీపీ నాయకులు జగన్, శ్రీనివాస్8డ్డి, శ్రీ కాంత్, సునీల్ తదితరులకు గాయాలయ్యాయి. మొత్తానికి పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితిని చక్కబెట్టారు.

డీప్యూటీకి పదవిపై మక్కువ

తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా డీప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహాకు పదవిపై మక్కువ ఎక్కువైందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జగన్ వ్యాఖ్యానించారు. పదవులకు ఆశపడి తెలంగాణ ఆంశాన్ని పూర్తిగా మరిచిపోవడం ఆయన తీరును తప్పు పట్టేలా చేస్తున్నదన్నారు. తె లంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముగ్గురు మం త్రులు ఆ పదవులకు రాజీనామాలు చేయాలని, లేనిపక్షం లో వారి నియోజకవర్గాలలో గ్రామ సభలు నిర్వహించి మంత్రులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయిస్తామని ఆయ న హెచ్చరించారు. కార్యక్షికమంలో ఏబీవీపీ జోనల్ ఇన్‌చార్జి యాదగిరి, నాయకులు ఆంజనేయులు, రమేష్, పాం డు, వేణు, శ్రీను, సుధాకర్, శివరామకృష్ణ పాల్గొన్నారు.


Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP