Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, December 20, 2011

30 of world’s 50 wealthiest Arabs are Saudis

Jeddah, December 20: Saudi Arabia has once again topped the Middle East for its super-rich residents, cornering 60 percent on the Arabian Business Rich List 2011 published Sunday. Thirty of the world’s 50 wealthiest Arabs are Saudis.

Prince Alwaleed Bin Talal Al Saud for the eighth consecutive year topped the List with a fortune of $21.3 billion, as overall wealth of the world’s 50 wealthiest Arabs rose nearly 5 percent to $257 billion, despite global economic gloom and a year of unprecedented popular unrest in parts of the Middle East.

At No.2 is the founder of MBI Group, Mohammed Al Jaber, with $12.6 billion in the bank.
The UAE got only four on the list and Qatar just three.

Kuwait managed to get three on the list while Egypt just one.

Saudi Arabia’s Olayan family, who deals mainly in banking and finance, retained third position with an estimated net worth of $12.4 billion, up from $11.9 billion a year ago.

Issam Alzahid, also from Saudi Arabia, jumped to fourth position this year, ranking 22nd in 2010, after he saw his wealth more than double to $10.7 billion from $4.3 billion. Alzahid is the chairman of Alzahid Group of Companies, which deals in construction and industries.
Saudi energy tycoon Mohammad Al Amoudi fell one place to fifth position but still added 4 percent to his net worth, which now stands at $10.4 billion.

Kuwait’s Al Kharafi family, which trades mainly in real estate and retail, maintained sixth spot at $8.7 billion, up from $8.2 billion a year ago.

The Bukhamseen family, also from Kuwait, shot up to seventh place from rank 25, adding $3.25 billion to its net worth to a total $7.25 billion.

Saudi’s Binladin family, active mainly in construction and industries, fell to eighth position after its wealth dropped about 26 percent to $7.25 in 2011, the biggest decline of any list entry.

Ranked ninth, Saudi Arabia’s Jeddah-based Bugshan family, who deals in businesses including automobiles, real estate and electronics, saw its wealth unchanged at about $7 billion.
At tenth place is Said Khoury from Palistine at $6.52 billion, who is in the construction and industry business.

Just one Bahraini family, the Kanoo family, made it the Arabian Business Rich List 2011 at the 14th place with $6 billion in wealth.

Across the region, which sits on some of the world’s largest oil reserves, there are 4,490 so-called ultra-high-net-worth individuals, compared with 62,960 in North America and 54,325 in Europe, Wealth-X said last November.

Private banks and wealth management firms have been quick to tap into the market, with a number of finance houses shifting their focus to wealth management following the credit crisis.

Take By: Siasat News 

Read more...

Manja' makers look forward to soaring profits


Monokite Manjha(Tangus) made with German Technology beats any other Manjha. Photo: G. Ramakrishna

With kites set to soar in the skies, ‘manja' makers of the old city are hoping for some good times and an increase in their income as well.

The Sankranti festival less than a month away, makers of ‘manja', thread toughened with a series of steps and used to as a key accessory in kite fighting, are busy these days. Along Moti Nala near Dabeerpura Darwaza, a group could be seen engaged with their paraphernalia in ‘manja' production.

“We prepare the traditional ‘manja' but our product is threatened by the invasion of what is called ‘Tangus' or ‘Wire' manja,” laments one. For last couple of years, the ‘Tangus manja' has made big forays into kite flying and comes with a thread that is much more firm and priced higher.

Some describe it as a ‘China market product' but others say it was being prepared in large quantities in Delhi and Punjab and sent across the country. “It is no good compared to us. I challenge anyone for a duel with my ‘manja' and let's see which one fares better,” says Zulfeqar Hussain ‘Manjewale', a senior in the field.

While the local product is available at Rs.5 per ‘gheeti', a measure of around 35 metres, the ‘Tangus' is offered in the range of Rs.20 to Rs.40 per ‘gheeti'. 

There are more than 100 families in the old city spread across Dabeerpura, Purani Haveli, Gulzar Houz, and Dhoolpet engaged in ‘manja' making.

“Earlier, we used to prepare about 2.5 lakh metres of manja but now demand is so badly affected that we are just restricting it to 50,000 metres,” says Zulfeqar. 

Two wooden pillars are erected at a distance of about 40 metres and lengths of thread are tied between them. Then, the ‘masala' is applied to the entire length two to three times and left to dry. The ‘masala' is prepared with glass pieces, rice, ‘dalchini' and glue that are ground together, sieved and mixed with different colours, explains Chotu of Mohammed Iqbal & Sons Manja and Patang. 

Take By: The Hindu News

Read more...

Chomsky, 70 others oppose Assange's extradition

WikiLeaks founder Julian Assange makes a statement to media gathered outside the High Court in London in this file photo.

Leading world figures, including the distinguished American academic Noam Chomsky, British filmmaker Ken Loach and journalist and free speech campaigner John Pilger, have attacked the move to extradite the WikiLeaks founder Julian Assange to Sweden as they fear it could be a prelude to him being handed over to the Americans, who want to prosecute him for publishing classified documents. 

Sweden is seeking Mr. Assange's extradition over allegations of sexual assault brought by two Swedish women but he has challenged the proceedings and Britain's Supreme Court is to hear his appeal next month. 

In a statement on Monday, signed by more than 70 others including the former Australian Prime Minister, Malcolm Fraser, they said: “We are concerned that should Mr. Assange be placed in Swedish custody, he will be subject to the process of ‘temporary surrender' enabling his removal to the United States without the appropriate legal processes that accompany normal extradition cases.” 

Arguing that the chances of Mr. Assange receiving a fair trial in the U.S. appeared “remote”, they said: “A number of prominent [U.S.] political figures have called for him to be assassinated, and Joe Biden, the Vice-President, has called him a ‘high-tech terrorist'. Given this atmosphere of hostility, we hold serious concerns about his safety in American custody.” 

The signatories pointed out that any prosecution of Mr. Assange in the U.S. would be “on the basis of his activities as a journalist and editor — Mr. Assange's status as such has been recently confirmed by the High Court in England”. “Such a prosecution would be a serious assault on freedom of speech and the need for an unfettered, independent media,” said the statement, 

Take By: The Hindu News

Read more...

రోజూ ఒక్క పూట బడే..?

 ఆత్మకూర్.ఎస్)పాఠశాల భవనంలో కళాశాలను నిర్వహించడం వల్ల విద్యార్థులు వలసలు వెలుతున్నా అధ్యాపకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్ కళాశాల భవనం నిర్మించి ఎనిమిది నెలలైనా ఉపాధ్యాయులు, లెక్చరర్లు కుమ్మకై్క కళాశాలను తరలించకుండా ఒక్క పూట చదువు చెప్పి తప్పించు కుంటున్నారు. దాదాపు 550మంది విద్యార్థులున్న నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో నేడు 200ల మంది కూడా మిగలలేదు. ఒక పూట పాఠశాల మరోక పూట కళాశాల కారణంగా బోధన కష్టమవుతుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు, కలెక్టర్‌కు విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నూతన కళాశాలలో వసతులు ఉన్నప్పటికీ ఎదో ఒక్కటి సాకు చెప్పి ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ కళాశాలను తరలించకుండా అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు.

కళాశాల తరలిస్తే లెక్చరర్లు, ఉపాధ్యాయులు రెండు పూటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాపారాలకు అలవాటు పడిన అధ్యాపక బృందం విధులు నిర్వహించడం కష్టమౌ తది. అందుకే కళాశాల తరలింపును వారు అంతర్గతంగా అడ్డుకొంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కళాశాల తరలించకపోవడం వలన ఒక పూట పాఠశాల చదువుతో న్యాయం జరగడం లేదని ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఇతర పాఠశాలలకు వలసలు వెళుతున్నారు. ప్రభుత్వ హాస్టల్‌లో వందకుపైగా ఉన్న విద్యార్థులు వలసల కారణంగా ఇప్పుడు 27 మంది మిగిలారు. కళాశాలలోను ఇదే తంతు జరుగుతోంది. నాణ్యమైన విద్య అందించలేని కళాశాల అధ్యాపక బృందం పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నారు. దాని కారణంగా ప్రతిభ గల విద్యార్థుల భవిష్యత్ అధ్వాన్నంగా మారుతోంది.

కళాశాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నాసిరకం తలుపులు, కిటికీలు, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్‌లు అమర్చడంతో ఇటీవల కళాశాల భవనం పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ జి.మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి పనులు మరోసారి చేశారు. కళాశాలను నూతన భవణంలోకి మార్చాలని రెండు పూటలా పాఠశాల, కళాశాల నడపాలని కొంతమంది జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే కళాశాలను తరలించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

 Take By: T News

Read more...

కన్నీటి పల్లెలు

- ఎండుతున్న గొంతులు
- ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు
- తెల్లారుజామునే బోరుబావుల వద్ద బారులు
- అడుగంటిన భూగర్భజలాలు
- కరెంటు కోతలతో మరింత కష్టం
- తూతూ మంత్రంగా ట్యాంకర్లతో నీటి సరఫరా
- కానరాని బోర్ల మరమ్మతులు
- ప్రత్యేకాధికారుల పాలనలో అరిగోస

nzb-water-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema: వేసవి రాక ముందే తాగునీటి కోసం ప్రజలు అరిగోస పడుతున్నారు. వర్షాభావంతో అడుగంటిన భూగర్భజలాలు, వట్టిపోయిన బోరు బావులు, పనిచేయని రక్షిత నీటి పథకాలు, కరెంటు కోతలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి జనం గొంతుపూండేలా చేస్తున్నాయి. గ్రామాల్లో తెల్లారుజామున మూడు గంటలకే ‘పానిపట్టు’ యుద్ధం మొదలవుతోంది.

తాగునీటి సమస్యతో బతుకులు కడతేరుతున్నాయి. తాగునీటి కోసం వెళ్లిన ఓ తల్లి ఇంటికొచ్చే సరికి ఐదునెలల పసికందు గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి మృతి చెందిన హృదయవిదారకమైన సంఘటన రెండురోజుల క్రితం రంగాడ్డి జిల్లా చేవెళ్లలో చోటుచేసుకుంది. వేసవి రాకముందే ప్రజల గొంతెండుతోంది. ప్రత్యేకాధికారుల పాలన నీటిఎద్దడిని ఏమాత్రం తీర్చలేకపోతోంది. జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరున్నా వాటిని ప్రజలకు అందించడంలో పాలకులు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.భాగ్యనగరం ప్రజల క‘న్నీళ్ల’ కథ అంతులేనిది. 87లక్షల జనాభాకు సరిపడా నీరందించలేని పరిస్థితి. రోజుకు 459 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ)నీరు అవసరం ఉండగా జలమండలి అధికారులు కేవలం 340 ఎంజీడీలు మాత్రమే అందిస్తున్నారు. ఇందులోనూ ప్రాంతాల వారీగా వివక్ష ప్రదర్శిస్తున్నారు. రోజుకు మనిషి 165 లీటర్లు అందించాల్సి ఉండగా ప్రముఖులకు 500 లీటర్లు, మురికివాడలకు 100 లీటర్లతో సరిపెడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌లో విలీనమయిన 12 మున్సిపాలిటీ ప్రాంత ప్రజల గోస వర్ణనాతీతం. అంతర్జాతీయ నగరంగా ఎదిగామని చెప్పుకునే ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు వారానికోకసారి నీరు సరఫరా చేస్తోంది. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నగరానికి గోదావరి, కృష్ణా మూడో దశ పథకాలు చేపడుతున్నామంటూ ప్రతి సమావేశంలోనూ ఊదరగొట్టే నేతలు ఈ పథకాల పనితీరు చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి. గోదావరి ప్రాజెక్టు మూడేళ్లలో 25శాతం పనులు జరగగా కృష్ణా మూడోదశ మాత్రం ఇంక కాగితాలపైనే నలుగుతోంది. ఇవన్నీ వెరసి కాలనీలకు అతీతంగా ఇక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

తాగునీటికి తహ తహ
వరంగల్ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాలేదు. సెప్టెంబర్ నుంచి వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో నీటిమట్టం తగ్గిపోయి గ్రామాల్లోని చేతి పంపులకు నీరు అందక రెండు వేల చేతి పంపులు పూర్తిగా పనిచేయడంలేదు. మరో వెయ్యి చేతి పంపుల్లో డిసెంబర్ రెండోవారం నాటికే నీరు అందక పనిచేయడంలేదు. భూగర్భ జలాల నీటి మట్టం సాధారణ నీటి మట్టంకన్నా నాలుగు మీటర్లకు అడుగంటాయి. గ్రామాల్లో కరెంటు కోత తీవ్రంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్‌లో కూడా మంచినీటి ఎద్దడి ఏర్పడంతో మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. పాఖాల, రామప్ప చెరువుల్లో నీరు అడుగంటడంతో సమక్షిగనీటి పథకాలు మూలకు పడనున్నాయి. ఎస్సాస్పీ నీటిని రెగ్యులర్‌గా విడుదల చేస్తేనే సమగ్ర నీటి పథకాలు పనిచేసే పరిస్థితి ఉంది. ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదలచేసింది.

వారానికి ఒకసారే ఇంటి ఎదుట కల్లాపి
Wgl-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaనల్లగొండ జిల్లాలో మంచినీటి కోసం ప్రజలు అప్పుడే అవస్థలు పడాల్సి వస్తోంది. చండూరు మండలంలోని గుండ్రపల్లిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వారం రోజులకు ఒక సారి మాత్రమే ఇంటిముందు కల్లాపి చల్లుకుంటున్నారు. వంటకు నీరు దొరికితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గంలో స్కీం బోర్లన్నీ ఎండిపోయాయి. కృష్ణా జలాలు అందడం లేదు. మిర్యాలగూడ ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. వేముపల్లిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బేతవోలు చెరువు నుంచి మండలానికి నీరు అందుతున్నా అవి మురికిగా వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొండపాడు ప్రాజెక్టు పూర్తై పైప్‌లైన్ పూర్తి కాలేదు. సూర్యాపేటలో 70 శాతం ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. భువనగిరి, యాదగిరిగుట్టలో కూడా అదే పరిస్థితి.

వేసవి రాకముందే నీటికి కటకట
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి రాకముందే మంచినీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. గాంధారి మండలం బీర్లమార్ తండా, కొత్తబజార్ తండా, జ్జెపల్లి, ఉత్తూనూరు, బుర్గర్, జువ్వాడి, బ్రహ్మణిపల్లి, కర్ణగడ్డతండాలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. బుర్గుల్‌లో బోర్లలో నీరు రాకపోవడంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. బ్రాహ్మణపల్లిలో పూర్తిగా ఫ్లోరైడ్‌నీరు ఉండటంతో మంచినీటి ట్యాంకుకు వెళ్లే పైప్‌లైన్లు చెడిపోయినాపట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండలంలోని కొల్లూర్, దేశాయిపేట్, తిర్మలాపూర్‌లో నీటి పైప్‌లైన్ అస్తవ్యస్తంగా తయారైంది. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం తడిహిప్పర్గా, అంతాపూర్‌లో పైప్‌లైన్ ధ్వంసమై, ఉన్న బోర్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ట్యాంకులు నిర్మించినా కనెక్షన్ ఇవ్వకపోవడంతో వృథాగా పడిఉన్నాయి.


దాహార్తి తీర్చని ట్యాంకర్ల సరఫరా
Wgl1-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaరంగాడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 705 గ్రామ పంచాయతీలున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 1,472 ఉండగా10,532 చేతిపంపులున్నాయి. ఇందులో సగానికి పైగా చేతిపంపులు వర్షాభావంతో వట్టిపోయాయి. త్రీఫేజ్ కరెంటు సపె్లై లేకపోవడంతో చాలా చోట్ల బోర్లున్నా గొంతుతడవటం లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా ఇవీ దాహర్తిని తీర్చలేకపోతున్నాయి. వ్యవసాయ బోర్లు కిరాయికి తీసుకుని మరీ నీటిని అందిస్తున్నా ఎద్దడి తీవ్రతను తగ్గించలేకపోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో సమస్య తీవ్రంగా ఉంది. తెల్లవారుజామున మూడు గంటలకే నీటికోసం క్యూ కడుతున్నారు. రెండురోజుల క్రితం చేవెళ్ల మండలం అల్లవాడలో భీమమ్మ నీళ్లకు వెళ్లగా ఐదు నెలల కుమారుడు భానువూపసాద్ ఏడ్చి ఏడ్చి ప్రాణాలోదిలిన విషయం తెలిసిందే.

గుక్కెడు నీటికోసం కిలోమీటర్ల దూరం
మహబూబ్‌నగర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్ట ప్రాంతాల్లో ఇప్పటికే వారానికి ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడు కావడంతో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు సైతం ఎండిపోవడంతో పశువులకు కూడా నీళ్లు కరువవడంతో రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. జిల్లాలోని 1,545 గ్రామాల్లో 17,132 చేతిపంపులు ఉండగా, అందులో సగం ఇప్పటికే పనిచేయడం లేదు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ప్రభాకర్ తెలిపారు. కరువు నివారణ పథకం కింద రూ. 4 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.

అస్తవ్యస్తంగా మంచినీటి వ్యవస్థ
water-knr-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఆదిలాబాద్ జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ వెయ్యి గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. జిల్లావ్యాప్తంగా 2,463 రక్షిత మంచినీటి పథకాలు, 20,309 బోరుబావులుండగా మూరుమూల ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ లేకపోవడంతో కొన్ని పనిచేయకపోగా మరికొన్ని చెడిపోయాయి. ముథోల్ మండలం బిద్రెల్లిలో మంచినీటి సరఫరా నిలిచివడంతో రెండుకిలోమీటర్ల దూరంనుంచి నీరు తెచ్చుకుంటున్నారు. బాసర నుంచి పైప్‌లైన్‌ద్వారా గ్రామానికి నీరు రావాల్సి ఉండగా గ్రామశివారులోని బోరు మోటర్ చెడిపోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది.

తలాపునే గోదారి.. తీరని దాహం
ఖమ్మం జిల్లాలో మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. ఏళ్ల నాటి బోర్లు మొరాయిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వాటికి కనీస మరమ్మతులు లేక కొన్నిచోట్ల పనికిరాకుండా పోయాయి. జిల్లాలో తాగునీటికి 20కిపైగా మండలా ప్రజలు అల్లాడుతున్నారు. తలాపున గోదావరి ఉన్నా నీటి కష్టాలు మాత్రం తీర్చే నాథుడే కరువయ్యాడు. దాదాపు ప్రతి పంచాయతీలో ఐదు నుంచి 10కిపైగా బోరు మోటార్లు రిపేరులో ఉన్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో వేళాపాళా లేని నీటి సరఫరా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. రాత్రి వేళల్లోనూ నీటిని సరఫరా చేస్తుండటంతో ఇబ్బందిగా మారింది.

తాగునీటి సరఫరా అంతంతే
NLG-WATER-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకరీంనగర్ జిల్లాలో మొత్తం 2,260 హాబి పూర్తిగా తాగునీరు అందుతున్న గ్రామాలు 295 మాత్ర మే. 81 గ్రామా ల్లో తాగునీటి వ్యవస్థేలేదు. మిగ తా గ్రామాల్లో పాక్షికంగా తాగునీరు అందుతోంది. 2,158 రక్షి త మంచినీటి పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. 20,988 బోరు బావుల్లో వెయ్యి పనిచేడంలేదు. జిల్లాలోని మంథని, సిరిసిల్ల డివిజన్‌లతోపాటు హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. వేములవాడ, కొండగట్టులోనూ సమస్య తీవ్రంగా ఉంది.

మెతుకుసీమలో పథకాలు అసంపూర్ణం
ప్రత్యేకాధికారుల పాలనలో మెదక్ జిల్లాలోని గ్రామాలు తాగునీటికి అల్లాడుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ప్రత్యేక మంచినీటి పథకాలున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అవాంతరాలతో ప్రజల గొంతెండుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 212 కోట్లతో నిర్మాణంలో ఉన్న 26 మంచినీటి పథకాలు నత్తనడకన నడుస్తుండటంతో ప్రజల దాహార్తి తీరడంలేదు. సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు మినహా జిల్లాలోని మిగతా గ్రామీణ ప్రాంతాల్లో చేతి పంపులు, బోరుబావుల ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతోంది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాలకు ఉద్దేశించిన సత్యసాయి మంచినీటి సరఫరా పథకం నిర్వహణ లోపంతో కుదేలైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా స్థానికులకు తాగునీటి గోస తప్పడం లేదు.

Take By: T News




Read more...

ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణ పరిశ్రమ -2 (Telangana History - Nizam in Telangana)

ఇదీ ధ్వంస రచన
- సీఎంల తెలంగాణ వ్యతిరేకతకు ఘనమైన పరిక్షిశమలు మాయం
- వేల మంది కార్మికులు రోడ్లపైకి
- కొత్త పరిక్షిశమల్లో ఉద్యోగులు సీమాంధ్ర జిల్లాలవారే
- తోడైన సరళీకరణ విధానాలు
- మాయమైన తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతం
- విధ్వంసానికి గురైన కార్మికవాడ


proklain-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఐడీపీఎల్‌లో ఉన్నతోద్యోగులుగా చేరిన డాక్టర్ అంజిరెడ్డి తదితరులు డగ్స్ తయారీకి కావాల్సిన ఫార్ములాను చౌర్యం చేసి, సొంత ఫార్మాస్యూటికల్ సంస్థలు ఏర్పాటు చేసుకొని క్రమంగా దీనిని దివాలా తీయించారన్న ఆరోపణలున్నాయి. ఐడీపీఎల్‌ను పునరుద్ధరించే అవకాశాలున్నా.. బలవంతంగా ఉరి వేశారు. ఫలితంగా సామాన్య ప్రజల ఆరోగ్య ప్రదాయిని అంతమైంది.

హైదరాబాద్ చుట్టూ ఏర్పాటైన
భారీ పరిశ్రమలకు భూమిని సేకరించేటప్పుడు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు, అనుబంధ కాంట్రాక్టులను కూడా భూములు కోల్పోయిన స్థానికులకు ఇవ్వాలన్న నిబంధన ఉంది. కానీ ఈ నిబంధన ఏ ఒక్క పరిశ్రమలోనూ అమలు కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం 1964, 1989లలో రెండు సార్లు ప్రత్యేకంగా జీవోలు ఇచ్చినా ఫలితం లేకపోయింది.

తెలంగాణకు కొంగు బంగారాల్లా భాసిల్లిన అనేకానేక పరిక్షిశమలు.. ఇప్పుడు అంతర్థానమయ్యాయి! ప్రపంచ బ్యాంకుకు అవల్‌దర్జా జీతగాళ్లుగా మారిన ముఖ్యమంవూతుల చేతిలో దగాపడ్డాయి. పాలకుల కుట్రలకు తోడు ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు తోడై.. తెలంగాణ పరిక్షిశమల గొంతునులిమాయి! వాటి సమాధులే పునాదులుగా సీమాంధ్ర బడాబాబుల పారిక్షిశామిక సామ్రాజ్యాల భువన భవనాలు ఎదిగాయి! ఐడీపీఎల్, ఆల్విన్, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్, డీబీఆర్ మిల్స్, ఆజంజాహీ మిల్స్ ఒక అనేకానేక పరిక్షిశమలు.. అన్నీ లాభాల్లో, ఉత్పత్తుల నాణ్యతలో ప్రఖ్యాతిగాంచినవే! దేశంలో ఆమాట కొస్తే ఆసియాలోనే అతి పెద్ద కర్మాగారాలు కొన్ని! వేల మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించినవి! హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆనాడే నిలబెట్టిన ఘనత వహించినవి! తెలంగాణ పేరును దిగంతాలకు వ్యాప్తి చేసిన అద్భుతాలు! ఏవీ ఇవన్నీ? ఎక్కడకు పోయాయి?

దేశంలోనే మొట్టమొదట సారి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, హైదరాబాద్ నగరాన్ని వెలుగులతో నింపిన హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్.. ఇప్పుడు ఐమాక్స్ జిలుగుల కింద సమాధి అయి ఉంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన నిజాం షుగర్స్.. పాలకుల దుర్నీతికి బలైపోయింది. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్ మిల్స్.. దొంగల బారిన పడి మొండిగోడలతో మిగిలింది! భారీ లాభాల్లో ఉన్న హైదరాబాద్ ఆల్విన్.. అడ్డికిపావుశేరు ధరకే ఓల్టాస్ కంపెనీకి సొంతమై.. తరువాత రియల్టర్లపాలైంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన ఐడీపీఎల్ గుండెలపై ప్రైవేట్ ఫార్మా కాళ్లు నిగడదన్ని ఎదిగింది!

ఆసియాలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లు ఆజంజాహి నేడు చెత్త కంపెనీ రాంకీ ఖాతాలోకి వెళ్లింది! వస్త్రాలు ఉత్పత్తి చేయాల్సిన ఫ్యాక్టరీ స్థలం నేడు రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మారింది! సనత్‌నగర్, ఆజామాబాద్, కాటేదాన్, ఉప్పల్ పారిక్షిశామిక ప్రాంతాలు ఇప్పుడు కళ తప్పాయి! ఇది తెలంగాణ పారిక్షిశామిక సామ్రాజ్యం కుప్పకూలిన తీరు! వలస వచ్చి పాగావేసిన సీమాంధ్ర బడాబాబులు, వారికి వెన్నుదన్నులిచ్చిన పాలకులు తెలంగాణ పరిక్షిశమల ఆయువు తీసిన వైనం! పాత కంపెనీలు బొందపెట్టి..
 
కొత్త కంపెనీలు తెచ్చారు సరే.. నిబంధనల ప్రకారం రావాల్సిన ఉద్యోగాలైనా దక్కాయా? అంటే అవీ సీమాంధ్ర జిల్లాల వాసులకే వశమయ్యాయి! ఉన్న ఉపాధి పోయి.. కొత్త ఉపాధి లేక ఇప్పుడు తెలంగాణ యువత నిరాశా నిస్పృహలతో రగిలిపోతున్నది! పోనీ పారిక్షిశామికరంగంలో తెలంగాణ ఔత్సాహికులు ఎదిగారా అంటే అదీ లేదు! ఇదీ.. కోటి రతనాల వీణ ధ్వంసమైన తీరు! పాలకుల దుర్నీతి తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతంపై వేయి పడగపూత్తి విషం చిమ్మిన విధం! వేల మందికి నీడనిచ్చిన తెలంగాణ పరిక్షిశమల చెట్టు కొమ్మలను ఒక్కొక్కటిగా నరికిపారేసిన దారుణం!


చితికిన ఐడీపీఎల్ బతుకులు

idbl-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema-కొందరి స్వార్థం - వేల మందికి శాపం
-ఐడీపీఎల్ సమాధులపై ప్రైవేట్ ఫార్మా సామ్రాజ్యాలు

కొందరు వ్యక్తుల స్వార్థం.. ఈ సంస్థలో పని చేసే సుమారు 6వేల మంది కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసింది. ఇది హైదరాబాద్ నగరంలో బాలానగర్‌లోని ఐడీపీఎల్ వ్యథ. భారతదేశంలో దీనితో పాటు ప్రారంభమైన మద్రాస్, రిషికేష్, గుర్గావ్ సంస్థలు నేటికీ సవ్యంగా నడుస్తుండగా హైదరాబాద్ సంస్థ మాత్రం ప్రారంభమైన మూడు దశాబ్దాలకు మూతపడింది.

అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1961 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నాలుగుచోట్ల ఐడీపీఎల్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 1967లో బాలానగర్‌లో హైదరాబాద్ యూనిట్ ప్రారంభమైంది. రష్యన్ కొలాబరేషన్‌తో ప్రారంభించిన ఈ సంస్థ ఎన్నో రకాల బల్క్ డ్రగ్స్‌ను దేశవిదేశాలకు సరఫరా చేసింది. జాబ్ ఓరియం ప్రారంభించిన ఈ యూనిట్ అనతికాలంలోనే లాభాల బాటలో పయనించి మిగిలిన యూనిట్లకు మదర్ యూనిట్‌గా మారింది. మందుల తయారీ, టానిక్‌ల తయారీలో పదేళ్లపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఊహించిన దానికంటే అధికస్థాయిలో పేరువూపఖ్యాతులు గడించింది.

ఆ తరువాత ఈ సంస్థలోకి ఆంధ్రా ప్రాంత ఉన్నతోద్యోగులు (జీఎం స్థాయి) రంగ ప్రవేశం చేశారు. అప్పటికే ఈ సంస్థలో సీనియర్ కెమిస్టుగా పనిచేస్తూ అపార పరిజ్ఞానం సంపాదించిన డాక్టర్ అంజిడ్డి తన పలుకుబడిని ఉపయోగించి డిజైన్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ (డీడీపీ) విభాగం హెడ్‌గా మార్పించుకున్నాడని చెబుతారు. నెమ్మదినెమ్మదిగా ఈ సంస్థ టెక్నాలజీని అనుసరించి ఓ సంస్థను నిర్వహించడానికి కావలసినంత టెక్నాలజీని సమకూర్చుకున్నాడు.

ఆ తరువాత ఐడీపీఎల్‌కు 1981-82లో రాంరాం చెప్పి మరో ఉన్నతోద్యోగి చంద్రశేఖర్‌డ్డితో కలిసి ఏకంగా ఎస్‌ఓఎల్ పేరిట ఓ లేబొరేటరీని స్థాపించాడు. 1984లో పూర్తిస్థాయిలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీపేరుతో భారీ పరిక్షిశమను స్థాపించాడు. కాగా ఐడీపీఎల్‌లో ఉన్న ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఆర్డర్లకు తగిన ఉత్పత్తిని అందించలేకపోయారు. ఇదే అదునుగా డాక్టర్ రెడ్డీస్ బాటలోనే రాంప్రసాద్ రెడ్డి అరబిందో లేబొరేటరీస్‌ను ప్రారంభించారు. సీమాంవూధులైన ఉన్నతోద్యోగులు ఈ పరిక్షిశమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వచ్చిన ఆర్డర్లను కొత్తగా ఆవిర్భవించిన పరిక్షిశమలకు గుట్టుచప్పుడు కాకుండా మళ్లించి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పడు అధికారంలో ఉన్న కొందరు మంత్రిస్థాయి నేతలు డాక్టర్ రెడ్డీస్, అరబిందో సంస్థలకు సహకారం అందించి, ఐడీపీఎల్ పతనానికి పరోక్షంగా కారకులైనట్లు మాజీ ఐడీపీఎల్ ఉద్యోగులు చెబుతున్నారు.

ఆంధ్రవూపదేశ్‌కు, ప్రత్యేకించి తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ పరిక్షిశమ దిగజారిపోతున్నా పట్టించుకోలేదని, పైగా ఆయన కూతురుకు చెందిన ఓ డ్రగ్ పరిక్షిశమకు సహకారమందించాల్సిందిగా ఉన్నతోద్యోగులకు పరోక్షంగా సందేశమందినట్లు వారు పేర్కొన్నారు. పరిక్షిశమ మూతపడి ఓ వైపు కార్మికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు కోట్ల రూపాయల విలువచేసే ఐడీపీఎల్ ఖాళీ భూమిని కైవశం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ పరిక్షిశమ స్థాపనకు ప్రభుత్వం కేటాయించిన 891 ఎకరాల్లో కొందరు ముస్లింలకు చెందిన పట్టాస్థలాలు ఉన్నాయని, ప్రస్తుతం పరిక్షిశమ నడవడం లేనందున, నాడు వాటికి నష్టపరిహారం చెల్లించనందున వారికి చెందిన భూమిని తిరిగి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేయించి, వెనుక తానుండి మంత్రివర్యులు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.

తెలంగాణ కలికితురాయి నిజాం షుగర్స్
కొడిగట్టిన పూర్వవైభవం.. వరుసగా దగా చేస్తున్న సీమాంధ్ర సీఎంలు (నిజామాబాద్): తెలంగాణ జాతి కిరీటాన కలికితురాయిగా నిలిచి ఆసియాలోనే అతి పెద్ద చక్కెర కార్మాగారంగా పేరొందిన నిజాం షుగర్స్ గత వైభవం సీమాంధ్ర పాలకుల దగాతో కొడిగట్టింది. సీమాంధ్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు మొదలుకుని నేటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు నిజాం షుగర్స్‌కు దగా చేస్తూనే ఉన్నారు.

నిజాం షుగర్స్‌ను నాటి సీఎం చంద్రబాబు సీమాంధ్ర పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మివేయగా, అధికారంలోకి రాకముందు అది అక్రమమని ఘోషించిన రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ స్వాధీనానికి వీసమెత్తు ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. నిజాం షుగర్స్‌ను తీసుకున్న డెల్టా పేపర్ మిల్స్ యాజమాన్యం జాయింట్ వెంచర్ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లఘిస్తున్నప్పటికీ కిరణ్ సర్కార్ మౌనం వహిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది.


ఇదీ గత వైభవం: 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ దేశంలోనే ప్రభుత్వరంగంలో ఏర్పాటయిన అతిపెద్ద ఫ్యాక్టరీగా నిలిచింది. బోధన్ పరిసరాల్లో చెరుకును సొంతంగా పండించటానికి అప్పటి నైజాం పాలకుల హయాంలో సుమారు 16 వేల ఎకరాల వ్యవసాయక్షేవూతాలను ఈ ఫ్యాక్టరీకి సమకూర్చటం మరో ప్రత్యేకత. ఆంధ్రాలో చక్కెర ఫ్యాక్టరీలంటే తెలియని రోజుల్లోనే తెలంగాణలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మొదట వెయ్యి టన్నుల సామర్థ్యంతో ప్రారంభించారు. 1952లో రెండవ యూనిట్ ఏర్పాటు చేశారు. బోధన్‌లో నిజాం షుగర్స్ మదర్ యూనిట్‌గా పిలిచే శక్కర్‌నగర్ యూనిట్ ఆర్జించిన లాభాలతో రాష్ట్రంలో 7 చక్కెర ఫ్యాక్టరీలు, 3 ఆల్కహాల్ డిస్టిలరీలు, నాగార్జునసాగర్‌లో మెషినరీ డివిజన్ స్థాపించారు.

శక్కర్‌నగర్ యూనిట్ లాభాలతో నిజాం షుగర్స్ ఆధ్వర్యంలో 1970 దశకంలో హిందూపూర్, మిర్యాలగూడ, జహీరాబాద్‌లో కొత్త చక్కెర ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 1980 దశకంలో బొబ్బిలి, సీతానగరంలో ఖాయిలాపడిన చక్కెర ఫ్యాక్టరీలను, పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు డిస్టిలరీని నిజాం షుగర్స్ అధీనంలోకి తీసుకొచ్చారు. అనంతరం మెట్‌పల్లిలో కొత్తగా మరో చక్కెర ఫ్యాక్టరీని నిజాం షుగర్స్ నిర్మించింది. చివరగా 1988లో మెదక్‌లో కొత్తగా నిజాం షుగర్స్ యూనిట్ ఏర్పడింది. ఆనాడు బోధన్ ఫ్యాక్టరీకి 40 కిలోమీటర్ల దూరం మేరకు ఫ్యాక్టరీకి రెండు వైపులా లైట్ రైల్వే లైన్ ఉండేది.

సీమాంధ్ర పెత్తనంలో నష్టాలు ప్రారంభం
ఆంధ్రా పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసిన హిందూపూర్, లచ్చాయిపేట్, సీతానగరం యూనిట్లు నిజాం షుగర్స్‌కు ఎనలేని నష్టాలను తీసుకువచ్చాయి. ఈ నష్టాల భారాన్ని శక్కర్‌నగర్ మదర్ యూనిట్ మోయాల్సివచ్చింది. 1990 దశకంలో మిర్యాలగూడ యూనిట్‌తో పాటు నష్టాల్లో ఉన్న పై యూనిట్లను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేశారు. చంద్రబాబు హయాంలో నిజాంషుగర్స్ పరిస్థితి మరింత క్షీణించింది. లాభాల్లో ఉన్న శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్ యూనిట్లను నష్టాల్లోకి నడిపించే ప్రయత్నం చంద్రబాబు హయాంలో జరిగింది.

ముఖ్యంగా తెలంగాణలోని ప్రభుత్వరంగ కార్మికులు, చెరుకు రైతులకు నిజాం షుగర్స్ ఒక అండగా ఉంటూ ప్రైవేట్ ఫ్యాక్టరీలకు పోటీ సంస్థగా ఉందన్న సత్యాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా 2002లో నిజాం షుగర్స్‌లోని నాలుగు యూనిట్లను డెల్టా పేపర్ మిల్స్ అనే సీమాంధ్ర కంపెనీకి అప్పగించింది. జాయింట్ వెంచర్ పేరిట జరిగిన ఈ ప్రైవేటీకరణ మార్పులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. రూ.600 కోట్లు విలువ చేసే యూనిట్లను కేవలం రూ.68 కోట్లకు డెల్టా పేపర్ మిల్స్‌కు అక్రమంగా నిర్వహించిన స్విచ్ చాలెంజ్ టెండర్ల ద్వారా అప్పగించారని విమర్శలున్నాయి.సభాసంఘం నివేదిక తుంగలోకి: వైఎస్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారంపై సభాసంఘాన్ని నియమించింది. రెండేళ్ళ పాటు విచారణ జరిపిన సభాసంఘం..

స్విచ్ చాలెంజ్ పద్ధతిని తప్పుపట్టింది. జాయింట్ వెంచర్‌ను రద్దుచేసి నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. అధికారంలోకి రాకముందు నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్.. అధికారంలోకి వచ్చాక సిఫారసులను పట్టించుకోకపోవడం శోచనీయం. జాయింట్ వెంచర్‌లో నిబంధనలను కూడా ప్రైవేట్ యాజమాన్యం ఉల్లంఘించిందని సభాసంఘం తేల్చినప్పటికీ ఏ ఒక్క సిఫారసునూ అమలు చేయలేదు. ఫలితంగా ప్రైవేట్ యాజమాన్యంలో కార్మికులు, చెరుకు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

ఆల్విన్ అవస్థలు!
-ప్రథమ సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సుల తయారీ ఘనత
-గడియారాలు, బస్ బాడీలతో ప్రఖ్యాతి
-అధికార దుర్వినియోగంతో పతనం
-పట్టించుకోని పాలకులు

alwayn-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema( జీడిమెట్ల)నైజాం పాలనలో మెటల్ ఇండస్ట్రీస్‌గా మొదలై.. కాలానుగుణంగా వివిధ ఉత్పత్తులను దేశానికి అందిస్తూ ఓ వెలుగు వెలిగిన ఆల్విన్ పరిశ్రమ అధికార దుర్వినియోగానికి కుప్పకూలిపోయింది. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే 12వేల మంది కార్మికులను రోడ్డు పాలు జేసింది. 1942లో అప్పటి నిజాం పాలనలోని నిజాం పారిశ్రామిక అభివృద్ధి ట్రస్ట్.. అల్లావుద్దీన్ అండ్ కంపనీ సహకారంతో ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి దినదినా భివృద్ధి చెందింది.

1952లో భారతదేశ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను తయారు చేసి అందించిన ఘనత ఆల్విన్‌దే. ఆ తర్వాతి కాలంలో బస్ బాడీ యూనిట్‌గా రూపాం తరం చెంది 1963లో ఏపీఎస్‌ఆర్టీసీకి డెబుల్ డెక్కర్ బస్సును తయారు చేసి మరో ఘనతను సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్విన్‌ను ప్రభుత్వ రంగ పరిశ్రమగా ప్రకటించింది. ఆపై 1981లో మూడవ యూనిట్‌గా జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎనలేని ఖ్యాతిని గడిచింది.

అనంతరం 1983లో నిసాన్ సమన్వయంతో రిప్రిజిరేటర్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది. పలురకాల వాహనాలనూ ఉత్పత్తి చేసింది. సుమారు 48ఏళ్లపాటు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్పత్తి రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ 1990లో జీఎంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ అధికార దుర్వినియోగానికి బలవడం మొదలైంది. దీనికి తోడు అప్పటి కార్మిక సంఘ నేతలు సైతం వంతపాడటం కూడా ఆల్విన్‌పాలిట శాపమైందన్న విమర్శలున్నాయి.

పరిశ్రమపక్కనే ప్రస్తుతం ఓ క్లబ్ నిర్వహిస్తున్న వ్యక్తి పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో కాంట్రాక్టర్‌గా రంగప్రవేశం చేసి, సదరు జీఎంతో దోిస్తీ చేస్తూ పనులు చేయకుండానే అక్రమాలకు పాల్పడుతూ ఈ పరిశ్రమ పతనానికి పరోక్షంగా కారకుడయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడేళ్ళ కాలంలోనే మూతపడే స్థాయికి చేరి 1993వ సంవత్సరంలో కార్మికులను రోడ్డున పడేసింది. ఆ తరువాత 1994వ సంవత్సరంలో బీఐఎఫ్‌ఆర్ ద్వారా వివిధ కంపెనీలకు భాగస్వామ్యం పంచి కొందరు కార్మికులకు ఉపాధి కల్పించినప్పటికీ సరైన న్యాయం చేయడంలో సీమాంధ్ర ప్రభుత్వం విఫలమైంది.


దగాపడిన డీబీఆర్
-రూ.600 కోట్ల భూములకు ఎసరు
-అప్రకటితంగా కంపెనీ మూసివేత
-అధికారులతోనూ కుమ్మక్కు
-ఫ్యాక్టరీని నడుపుతున్నామని అబద్ధాలు
-20 ఏళ్లుగా కంపెనీకి కార్మికులే కాపలా
-జీవితాలను కోల్పోయిన అభాగ్యులు

DBR-Mills-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్  (: నిజాం నవాబులు సాగునీటి వ్యవస్థతో పాటు, పారిక్షిశామీకరణపై కూడా దృష్టి సారించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిక్షిశమలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఔత్సాహికులను ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే దివాన్ బహదూర్ రాంగోపాల్ చేత స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయించారు. అలా ఏర్పడిందే హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్‌మిల్స్.

షాపూర్‌షనైకి చెందిన 24.16ఎకరాల ఇనాం భూమిని దివాన్ బహదూర్ రాంగోపాల్ 99 ఏళ్లు లీజుకు తీసుకొని 1922 నాటికి పరిక్షిశమను నిర్మించి ఉత్పత్తిని మొదలు పెట్టారు. 1984 వరకు ఇది బ్రహ్మాండంగా పని చేసింది. ఆ తర్వాత దివాన్ బహదూర్ కంపెనీని నడపటానికి ఇష్టం లేక లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. గోతికాడి నక్కల్లా కాచుక్కూర్చున్న సీమాంధ్ర దోపిడీదారులు వారికి ప్రతినిధిగా ఆనాటి సీఎం ఎన్టీరామారావు, గోదావరిజిల్లాకు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి డీబీఆర్‌మిల్‌ను 1984లో లీజుకు తీసుకున్నారు. తేరగా కంపెనీని చేజిక్కించుకున్న కృష్ణంరాజు ఏనాడూ ఫ్యాక్టరీని పద్ధతిగా నడపలేదు సరికదా ఎలా మూసివేయాలన్న దిశగానే పావులు కదిపాడు.

ఇదే ముడిసరుకుతో 1991 వరకు ఫ్యాక్టరీని నడిపినట్లు చేశారని కార్మికులు చెప్పారు. రకరకాల లిటిగేషన్లు పెడుతూ పని చేయించకుండా చేశాడని, ఇతని ప్రవర్తనతో ఆనాడు చాలా మంది కార్మికులు పనిలోనుంచి వెళ్లి పోయారని తెలిపారు. ఫ్యాక్టరీని నడపని కృష్ణంరాజు 1992 ఫిబ్రవరిలో ఓ అర్ధరావూతిపూట ఫ్యాక్టరీకి తాళం వేశాడు. అడ్రస్ లేకుండా పోయాడు. అంతే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కృష్ణంరాజు నేరుగా ఫ్యాక్టరీ వద్దకు రాలేదు. కానీ ఫ్యాక్టరీలో ఉన్న రూ.100 కోట్ల విలువైన మిషనరీని రాత్రి పూట తరలించుకు పోయాడు. కానీ ఇప్పటికీ పరిక్షిశమ నడుస్తున్నదనే కృష్ణం రాజుఅడ్డంగా వాదిస్తున్నారు.

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ప్రస్తుతం భూమి విలువ గజం రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. అంటే డీబీఆర్ మిల్స్ మొత్తం భూమి విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుంది. మరో వైపు ఈ ఫ్యాక్టరీ తనదంటూ సీమాంవూధకు చెందిన ఆర్‌ఆర్‌అసోసియేట్స్ అధినేతగా చెప్పుకునే రంగాడ్డి ప్రవేశించారు. ఈయనను కృష్ణంరాజే కావాలని కార్మికుల బెడద వదిలించుకోవడానికి తీసుకువచ్చాడా... లేక రాయలసీమ డాబుతో తనే కైవసం చేసుకోవడానికి వచ్చాడా అన్న విషయాలపై సర్వత్రా సందేహాలు వెలువడుతున్నాయి.

ఇది ఇలా ఉండగానే బిగ్‌బజార్‌కు చెందిన యజమాని మాల్‌పాణి డీబీఆర్‌ఫ్యాక్టరీలో ఆరు ఎకరాల భూమి తనదని కె్లైమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిర్మాణ పనులు చేయడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. వీరికి తోడుగా సీపీఐ, ఐఎఫ్‌టీయులు నిలబడడంతో వారు వెనక్కు తగ్గారు. ఆ తరువాత డీబీఆర్ ఫ్యాక్టరీ భూమి ప్రభుత్వానిదని ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడ నోటీస్‌లు అంటించారు. ‘మా నాన్న మిల్లులో పని చేశాడు. అర్ధాంతరంగా ఫ్యాక్టరీ మూసివేయడంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. నాన్న ఫ్యాక్టరీ కోసం కాపలా కాస్తూనే చనిపోయాడు. ఈ మిల్లు కోసం అమ్మ ఎదురు చూస్తూ చనిపోయింది.

ప్రస్తుతం నేను అనాథనయ్యాను’ కార్మికుడిగా తలెత్తుకొని బతికిన. ఇప్పుడు అడ్డమీది బతుకైంది. జీవితం దుర్భరంగా మారింది. నాకు నాలుగు ఆపరేషన్లు అయ్యాయి. ప్రస్తుతం 65 ఏళ్లు. ఇంకా ఎదురు చూసే ఓపిక పోయింది. ఫ్యాక్టరీ మూత పడడంతో పిల్లలను చదివించుకోలేకపోయా. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మంచి భవిష్యత్‌ను ఇవ్వలేని తండ్రిగా మిగిలాను.

Any Comments


 Read 1 Part click this link



Take By: T News  -  http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=54538

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP