‘తెలంగాణ చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ చరిత్ర’ అనే పుస్తకాన్ని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచించారు.
Read more...హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ చరిత్ర’ అనే పుస్తకాన్ని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచించారు.
Read more...
హైదరాబాద్, అక్టోబర్ 27 ():రాష్ట్ర కాంగ్రెస్లో ఆధిపత్య పోరు పునరావృతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీమాంధ్ర నేతల మధ్యనే ఈ పోరు తీవ్రంగా కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఊపందుకుంది. ప్రభుత్వంలో తనకు కీలక బాధ్యత అప్పగిస్తారని, పీసీసీ అధ్యక్షునిగా తాను ఉన్నందున అదే స్థాయిలో ప్రభుత్వంలోనూ తన ప్రాధాన్యం పెరుగుతుందని ఆశించిన బొత్సకు ముఖ్యమంత్రి ఆదిలోనే చెక్ పెట్టటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరించాలని, ఏ ఒక్కరి జోక్యాన్ని లేదా ప్రాధాన్యాన్ని అంగీకరించేది లేదనే విధంగా సీఎం పావులు కదుపుతున్నారని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన బొత్సను దూరం పెడుతున్నారని చెబుతున్నాయి. అధిష్ఠానం ఒత్తిడితో దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయన కోరిన హోం శాఖను ఆయనకు అప్పగించకపోవడానికీ ఇదే కారణమని అంటున్నారు. కొత్తగా కౌన్సిల్కు ఎన్నికైన డీ శ్రీనివాస్ నుంచి కూడా ప్రతిబంధకాలు ఎదురుకాకుండా ముందస్తు షరతులతోనే ఆయన అధిష్ఠానంతో మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. భవిష్యత్తులో సీఎం కుర్చీ ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డి వ్యవహారశైలి నచ్చక ఇప్పటికే అరవై రోజులుగా సచివాలయం ముఖం చూడలేదు. మంత్రిగా తన బాధ్యతలను ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు.
అదే అన్యాయం.. ఏళ్ల తరబడి! అదే దగా.. దశాబ్దాలుగా! తెలంగాణపై నిరాటంకంగా జల వివక్ష! ఎప్పటి సంగతులో సరే.. ఇది వర్తమాన అన్యాయం! నడుస్తున్న కాలపు దుర్మార్గం! ఓట్లు, కోట్లు దండుకుని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను బహిరంగంగా బొందబెడుతున్న అక్రమం! కావాలా సాక్ష్యం.. అదిగో గోస పెడుతోంది ప్రాణహిత-చే కన్నీళ్లు కారుస్తున్నాయి.. సీమాంధ్ర జల యజ్ఞంలో సమిధలవుతున్న తెలంగాణ బీళ్లు! తెలంగాణను ముంచి కడుతున్న పోలవరానికి టెండర్లు, జాతీయ హోదా సాధనపై ఎక్కడ లేని శ్రద్ధ.. ఆరాటం! ఇప్పటికే సమృద్ధి కలిగిన నీటిపారుదల వ్యవస్థతో రెండు పంటలు పండుతున్న నల్ల రేగళ్లపై వల్లమాలిన అభిమానం! తెలంగాణ పంట పొలాలకు ప్రాణం పోసే.. తెలంగాణ ప్రజల దప్పిక తీర్చే ప్రాణహిత-చే మాత్రం కరడుగట్టిన నిర్లక్ష్యం! ఇదీ సీమాంధ్ర పాలకుల కుట్ర సిద్ధాంతం!
ప్రాణహిత-చే ప్రాజెక్టుకు 2012 సంవత్సరం నాటికి అన్ని అనుమతులు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అనుమతుల మంజూరు కోసం చేస్తున్న ప్రయత్నాలు నామమావూతంగానే సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్టుపై వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రా హిత ప్రాజెక్టు విషయంలో మాత్రం సాచివేత ధోరణి అవలంబించడం పట్ల తెలంగాణవాదులు ఆక్షేపణ తెలుపుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రకు చెందిన 1852 ఎకరాల సాగు భూమి, 3395 ఎకరాల నదీ ప్రాంత భూమి ముంపునకు గురవుతుంది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సాంకేతిక అభ్యంతరాలు పెట్టకపోవచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రవూపదేశ్ పరిధిలో 893 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్లు, తదితర నిర్మాణాలకు 7 జిల్లాల పరిధిలో 4644 ఎకరాల అటవీ భూమి సేకరించవలసి ఉంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కూడా కేటాయించవలసి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముందుగా కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళకు కూడా జాతీయ హోదా కావాలని కోరుతోంది. ఒకే రాష్ట్రానికి చెందిన రెండు ప్రాజెక్టులకు ఏక కాలంలో జాతీయ హోదా ఇవ్వడం సాధ్యమా కాదా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.
ఇప్పటికే అన్ని అనుమతులను పొందిన పోలవరం ప్రాజెక్టుతో ప్రాణహితను పోటీ పెట్టడం సమంజసం కాదని తెలంగాణ ప్రాంత ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కాలంటే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి. అయితే ఇప్పటివరకు మహారాష్ట్రతో చర్చల ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రవూపదేశ్ నుంచి ఎదురైన అభ్యంతరాల వల్ల ప్రాణహిత విషయంలో అడ్డుపుల్ల వేయడానికి మహారాష్ట్ర ప్రయత్నించొచ్చన్న వాదన ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మహారాష్ట్రతో చర్చలు జరిపితే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

My blog has been valued at...
$606.24
Blog Valuation Tool from
BlogCalculator.com
Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory
submission service.
Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
http://www.powerhits4u.com/images/125x125.gif
© Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008
Back to TOP