Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, October 28, 2011

‘తెలంగాణ చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

హైదరాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ చరిత్ర’ అనే పుస్తకాన్ని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి రచించారు.

Read more...

nvite fresh tenders for Polavaram: Naidu

Hyderabad, October 28: Opposition leader N Chandrababu Naidu on Tuesday demanded that the state government invite fresh tenders for the Polavaram irrigation project.

In a letter addressed to chief minister N Kiran Kumar Reddy, Naidu alleged that several irregularities took place in finalising the Polavaram project tenders. Hence, the Congress government should cancel the finalisation of project tenders. It should place all the relevant files before the Assembly Speaker for verification. Stern against should be taken against the officials responsible for irregularities in finalising the tenders, the TDP chief said.

Naidu also demanded that the chief minister convene a meeting of floor leaders of all the parties to discuss the issue. The opposition leader lamented that irrigation projects had become a source of income generation for some ruling Congress leaders.

The state government which promised to complete the Polavaram (Indira Sagar Project) by 2009 with an estimated cost of Rs 7,850 crore, has failed to fulfil its assurance.

The project is way behind schedule, which has resulted in escalation of cost. The government should finalise the Polavaram project tenders in a transparent manner this time, he said.

The TDP president demanded fair compensation to Polavaram project oustees as per the Land Acquisition and Resettlement and Rehabilitation (LARR) Bill, 2011.

The Centre should declare Polavaram and Pranahita- Chevella national projects to ensure their speedy completion.

The state government should take initiative in this regard, he added.



Take By: Sisat


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,


Read more...

కోల్డ్‌వార్!

-కాంగ్రెస్‌లో మళ్లీ ఆధిపత్యపోరు?
- పీసీసీ చీఫ్‌కు ముఖ్యమంత్రి చెక్!
- జిల్లాల నేతలతో బొత్స మంతనాలు
- పలుకుబడి పెంచుకునే యత్నం!
- నెంబర్ టూ లేకుండా కిరణ్ జాగ్రత్త?
- అందుకే రాజనర్సింహకు దక్కని హోం!
- డీఎస్‌కు షరతులతో కూడిన ఎమ్మెల్సీ
- ఒక వ్యక్తికి ఒకే పదవి సూత్రం?
- ఢిల్లీలో సీఎం ప్రతిపాదన


cm-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 27 ():రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు పునరావృతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీమాంధ్ర నేతల మధ్యనే ఈ పోరు తీవ్రంగా కనిపిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఊపందుకుంది. ప్రభుత్వంలో తనకు కీలక బాధ్యత అప్పగిస్తారని, పీసీసీ అధ్యక్షునిగా తాను ఉన్నందున అదే స్థాయిలో ప్రభుత్వంలోనూ తన ప్రాధాన్యం పెరుగుతుందని ఆశించిన బొత్సకు ముఖ్యమంత్రి ఆదిలోనే చెక్ పెట్టటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరించాలని, ఏ ఒక్కరి జోక్యాన్ని లేదా ప్రాధాన్యాన్ని అంగీకరించేది లేదనే విధంగా సీఎం పావులు కదుపుతున్నారని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయన బొత్సను దూరం పెడుతున్నారని చెబుతున్నాయి. అధిష్ఠానం ఒత్తిడితో దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆయన కోరిన హోం శాఖను ఆయనకు అప్పగించకపోవడానికీ ఇదే కారణమని అంటున్నారు. కొత్తగా కౌన్సిల్‌కు ఎన్నికైన డీ శ్రీనివాస్ నుంచి కూడా ప్రతిబంధకాలు ఎదురుకాకుండా ముందస్తు షరతులతోనే ఆయన అధిష్ఠానంతో మాట్లాడుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. భవిష్యత్తులో సీఎం కుర్చీ ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్న బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి వ్యవహారశైలి నచ్చక ఇప్పటికే అరవై రోజులుగా సచివాలయం ముఖం చూడలేదు. మంత్రిగా తన బాధ్యతలను ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు.

అయితే, పీసీసీ అధ్యక్షునిగా ఎక్కువ సమయం గాంధీభవన్‌లో ఉండి అన్ని జిల్లాల నేతలతో మాట్లాడుతూ తన పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పైగా, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించని బొత్సతో తెలంగాణ ప్రాంత నేతలు కూడా సన్నిహితంగా మెలుగుతుంన్నారు. వారి నుంచి తెలంగాణ పర్యటనలకు ఆహ్వానం కూడా పొందుతున్నారు. ఇది తనకు ప్లస్ పాయింట్‌గా అధిష్ఠానం వద్ద బొత్స చెప్పుకొనేందుకు వీలు కలిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జోరులో ఆర్టీసీ సమ్మెను వాయిదా వేయించేందుకు సంఘ నాయకులతో చర్చలు జరిపి ముందస్తు ప్రయత్నం చేసి కేంద్రం వద్ద బొత్స మార్కులు కొట్టేసే యత్నం చేశారు. అయితే, తరువాతి పరిణామాల్లో సీఎం చొరవ తీసుకుని ఇతర శాఖల ఉద్యోగులు, కార్మికుల సమ్మెను విరమింప చేయటంతో అధిష్ఠానం వద్ద ఆయన కూడా క్రెడిట్ కొట్టేశారు. సకల జనుల సమ్మె విషయంలో పోటాపోటీలు ఎలా ఉన్నా ప్రభుత్వ వ్యవహారాల్లో ఇతర నేతల జోక్యాన్ని సీఎం ఏమాత్రం సహించటం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

సీన్ రివర్స్.. :కేంద్రం స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ నిర్వహిస్తున్న పాత్ర లేదా వైఎస్ హయాంలో రాష్ట్రంలో రోశయ్య నిర్వహించిన పాత్ర తనకు లభిస్తుందని బొత్స ఆశించారు. రోశయ్యకు వైఎస్ అధిక గౌరవం ఇచ్చి, అన్నా అని పిలుస్తూ దాదాపు అన్ని కమిటీలకు రోశయ్యనే అధ్యక్షునిగా ఎంపిక చేసేవారు. ప్రభుత్వంలో లేదా మంత్రివర్గంలో ద్వితీయ స్థానం కల్పించారు. దీంతో దాదాపు అందరు మంత్రులు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా రోశయ్య ఆధ్వర్యంలో పని చేసేవారు. తరువాతి దశలో వైఎస్ అకాల మరణం తరువాత రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కటంతో మంత్రులంతా ఆయన వద్ద భయభక్తులతోనే పని చేశారు. ఒకరిద్దరు వ్యతిరేకించినా రోశయ్య వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. కేబినెట్‌లో రెండో స్థానం లభించటం, తరువాతి దశలో అత్యంత కీలకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తాయి. అందుకే బొత్స కూడా అదే స్థాయిని ఆశించి భంగపడ్డారని వాదన ఉంది. అందుకే ఎక్కువ రోజులు సచివాలయానికి గైర్హాజరయ్యారని, ఒక దశలో హైదరాబాద్‌లో ఉండి కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ కిరణాలు కార్యక్షికమ సమీక్షకు బొత్స రాలేదని విమర్ళలున్నాయి. ఇరువురి మధ్య క్రమంగా పెరుగుతున్న అగాథం ఎటు దారి తీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. ఈలోపు మరో అధికార శిబిరం ఏర్పడే అవకాశముందని, అది డీ శ్రీనివాస్ రూపేణా ముందుకు రావచ్చని భావిస్తున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో డీ శ్రీనివాస్‌కు చోటు ఖాయమని, అది కూడా అత్యంత కీలకమైన శాఖ ఆయనకు కేటాయించే అవకాశముందని అప్పుడే ఊహాగానాలు బయల్దేరాయి.

డీఎస్‌కు హోం శాఖ కట్టబెడతారని కొందరు అంచనా వేస్తుండగా, అసలు కేబినెట్‌లోకి ఆయన రాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. ఆ షరతుపైనే డీఎస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన అడ్డు చెప్పలేదని భావిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజనర్సింహ హోం శాఖ ఆశించినా కిరణ్ నెరవేర్చలేదు. దీనికి రాజనర్సింహ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినా కిరణ్ పట్టించుకోలేదు. హోం శాఖ ఇస్తే కేబినెట్‌లో ద్వితీయ స్థానం ఇచ్చినట్టవుతుందని భావించే కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ కూడా రాజనర్సింహ వద్ద ఉంటే అది కచ్చితంగా మరో అధికార శిబిరంగా మారుతుందన్న అంచనాతోనే ముఖ్యమంత్రి ముందు జాగ్రత్త పడ్డారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ 2014 ఎన్నికల వరకూ ఏకఛవూతాధిపత్యం కొనసాగించాలన్న కోరిక నేపథ్యంలోనివేనని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంవూతికి చెక్ పెట్టేందుకే ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షునిగా బొత్సను అధిష్ఠానం నియమించినట్లు వార్తలొచ్చాయి. తెలంగాణకు చెందిన అత్యంత సీనియర్ నేత డీఎస్‌కు తాజాగా ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో కిరణ్ ఏకఛవూతాధిపత్యం ఆయన కోరుకున్నట్లుగా 2014 వరకూ కొనసాగుతుందా? అనేది వేచి చూడాల్సిన అంశమే!

ఒక వ్యక్తికి ఒకటే పదవి...
ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలనే విషయాన్ని మరోసారి ముఖ్యమంత్రి ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో అధిష్ఠానం వద్ద ప్రతిపాదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పీసీసీ అధ్యక్షునిగా మాత్రమే బొత్సను కొనసాగించాలని, మంత్రిగా కూడా బొత్స కొనసాగితే పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో తన సమయాన్ని వెచ్చించలేరని ముఖ్యమంత్రి హస్తిన నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్టుగా సమాచారం. 2014లో వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికల వరకు పార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేయటానికి బొత్సకు అధిక సమయం అవసరమని, కార్యకర్తలకు బొత్స అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే బొత్సను మంత్రివర్గం నుంచి తప్పించటం మంచిదని కూడా కిరణ్ ఢిల్లీలో వివరించారని అంటున్నారు. ఈ విషయం బొత్సకు కూడా తెలిసిందని, దీంతో వారి మధ్య కోల్డ్‌వార్ మరింతగా పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,

 

Read more...

ప్రాణహిత గోస...!

- ముందుకు సాగని నిర్మాణ పనులు
- తెలంగాణ ప్రాజెక్టుపై కరడుగట్టిన నిర్లక్ష్యం
- అనుమతులు సాధించని రాష్ట్ర సర్కారు
- జాతీయ హోదాకు అన్నీ అడ్డంకులే
- మహారాష్ట్రతో పూర్తికాని చర్చల ప్రక్రియ
- నిధుల కొరతతో నిలిచిపోయిన పనులు

Pranahitha2-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅదే అన్యాయం.. ఏళ్ల తరబడి! అదే దగా.. దశాబ్దాలుగా! తెలంగాణపై నిరాటంకంగా జల వివక్ష! ఎప్పటి సంగతులో సరే.. ఇది వర్తమాన అన్యాయం! నడుస్తున్న కాలపు దుర్మార్గం! ఓట్లు, కోట్లు దండుకుని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను బహిరంగంగా బొందబెడుతున్న అక్రమం! కావాలా సాక్ష్యం.. అదిగో గోస పెడుతోంది ప్రాణహిత-చే కన్నీళ్లు కారుస్తున్నాయి.. సీమాంధ్ర జల యజ్ఞంలో సమిధలవుతున్న తెలంగాణ బీళ్లు! తెలంగాణను ముంచి కడుతున్న పోలవరానికి టెండర్లు, జాతీయ హోదా సాధనపై ఎక్కడ లేని శ్రద్ధ.. ఆరాటం! ఇప్పటికే సమృద్ధి కలిగిన నీటిపారుదల వ్యవస్థతో రెండు పంటలు పండుతున్న నల్ల రేగళ్లపై వల్లమాలిన అభిమానం! తెలంగాణ పంట పొలాలకు ప్రాణం పోసే.. తెలంగాణ ప్రజల దప్పిక తీర్చే ప్రాణహిత-చే మాత్రం కరడుగట్టిన నిర్లక్ష్యం! ఇదీ సీమాంధ్ర పాలకుల కుట్ర సిద్ధాంతం!

హైదరాబాద్, అక్టోబర్ 27 (టీ న్యూస్) :తెలంగాణ ప్రాజెక్టులపై సర్కారు వివక్ష కొనసాగుతోందనడానికి ప్రాణహిత-చే ప్రాజెక్టు తాజా ఉదాహరణ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడో, ఎన్నికల ముందో తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే పాలకులు ఆ తర్వాత వీటి గురించి పట్టించుకోక పోవడం విషాదం. తెలంగాణ ప్రజల కలల పంటైన ప్రాణహిత-చే ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం 2010 ఏప్రిల్‌లో సూత్రవూపాయ అనుమతినిచ్చింది. 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి అనుమతులను సంపాదించలేక పోయింది. ప్రధాన మంత్రి ప్రత్యేక కార్యక్షికమం కింద ప్రాణహిత ప్రాజెక్టుకు పూర్తి స్థాయి పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వమే పెట్టే విధంగా ప్రయత్నిస్తామని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలను చేయక పోవడంతో తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు పీడిత తెలంగాణ ప్రాంతానికి తక్షణ అవసరమైన ప్రాణహిత-చే పట్టించుకోని సర్కారు... తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టి.. తెలంగాణ అటవీ ప్రాంతాలను జల సమాధి చేసి, గిరిజన జీవన విధ్వంసాన్ని సృష్టించి, సీమాంవూధకు నీళ్లు పారించే పోలవరానికి జాతీయ హోదా కల్పించేందుకు కిందికి మీదికి అవుతోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

జాప్యంతో పెరుగుతున్న అంచనా వ్యయం
ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం సవరించిన ప్రాజెక్టు నిర్మాణ రిపోర్టును గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కేంద్ర జలవనరుల సంఘానికి చెందిన 16 విభాగాలతో పాటు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన ఎనిమిది రకాల అనుమతులు, కేంద్ర ప్రణాళిక సంఘానికి చెందిన సవరించిన పెట్టుబడుల అనుమతులు పొందవలసి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 17,875 కోట్లు ఖర్చవుతాయని మొదట అంచనా వేసి ప్పటికీ మొదటిసారి సవరించిన అంచనాల ప్రకారం 38,500 కోట్లకు పెరగగా 2007లో సవరించిన అంచనాల ప్రకారం 40,300 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి కూడా ఇచ్చింది. నిర్మాణంలో జరుగుతున్న జాప్యంవల్ల అంచనావ్యయం ఏటా పెరుగుతోంది.

కేంద్ర అనుమతిలో జాప్యం
Pranahitha1-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రాణహిత-చే ప్రాజెక్టుకు 2012 సంవత్సరం నాటికి అన్ని అనుమతులు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అనుమతుల మంజూరు కోసం చేస్తున్న ప్రయత్నాలు నామమావూతంగానే సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్టుపై వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రా హిత ప్రాజెక్టు విషయంలో మాత్రం సాచివేత ధోరణి అవలంబించడం పట్ల తెలంగాణవాదులు ఆక్షేపణ తెలుపుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రకు చెందిన 1852 ఎకరాల సాగు భూమి, 3395 ఎకరాల నదీ ప్రాంత భూమి ముంపునకు గురవుతుంది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సాంకేతిక అభ్యంతరాలు పెట్టకపోవచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రవూపదేశ్ పరిధిలో 893 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్‌లు, తదితర నిర్మాణాలకు 7 జిల్లాల పరిధిలో 4644 ఎకరాల అటవీ భూమి సేకరించవలసి ఉంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కూడా కేటాయించవలసి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముందుగా కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళకు కూడా జాతీయ హోదా కావాలని కోరుతోంది. ఒకే రాష్ట్రానికి చెందిన రెండు ప్రాజెక్టులకు ఏక కాలంలో జాతీయ హోదా ఇవ్వడం సాధ్యమా కాదా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.

pranahita-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇప్పటికే అన్ని అనుమతులను పొందిన పోలవరం ప్రాజెక్టుతో ప్రాణహితను పోటీ పెట్టడం సమంజసం కాదని తెలంగాణ ప్రాంత ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కాలంటే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి. అయితే ఇప్పటివరకు మహారాష్ట్రతో చర్చల ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రవూపదేశ్ నుంచి ఎదురైన అభ్యంతరాల వల్ల ప్రాణహిత విషయంలో అడ్డుపుల్ల వేయడానికి మహారాష్ట్ర ప్రయత్నించొచ్చన్న వాదన ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మహారాష్ట్రతో చర్చలు జరిపితే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జాతీయ హోదాతోనే సత్వరం పూర్తి
ప్రాణహితకు జాతీయ ప్రాజెక్టు హోదా లభిస్తే కేంద్రం 90% వాటాను, రాష్ట్రం 10% వాటాను భరించవలసి ఉంది. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం పోలవరం కన్నా రెట్టింపు ఉండడంతో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటే త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే 4 వేల కోట్లు ఖర్చు పెట్టగా ప్రాణహితపై కేవలం వెయ్యి కోట్లు రాష్ట్రవూపభుత్వం ఖర్చు పెట్టింది. 28 ప్యాకేజీలుగా విభజించిన ప్రాణహిత ప్రాజెక్టును రెండుదశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుంచి మధ్యమానేరు వరకు నిర్ణయించిన తొమ్మిది ప్యాకేజీ పనులను, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నీరందించే ఐదు ప్యాకేజీలను రూ.24,000 కోట్ల వ్యయంతో నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఇటీవల నిర్ణయించింది. మిగిలిన 14 ప్యాకేజీల పనులను మరో ఏడేళ్ళకాలంలో పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇప్పటి వరకు కేవలం 54 కోట్ల రూపాయలు కేటాయించడంతో కాంట్రాక్టర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర జలసంఘం సూత్రవూపాయమైన అనుమతులనిచ్చిన మూడు సంవత్సరాల్లోగా మిగిలిన అనుమతులను పొందకపోతే మొదటఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ప్రాణహిత పనులను కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం ఇది పూర్తి కావడానికి 11ఏళ్ల కాలం పడుతుంది. ఈ వ్యవహారం చూస్తుంటే సర్కారుకు ఈ ప్రాజెక్టుపై చిత్త శుద్ధిలేదని స్పష్టమౌతోందని నిపుణులు విమర్శిస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడినెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. ప్రాజెక్టు ప్రారంభ స్థలం వద్ద 236.5 టీఎంసీల నీరు లభ్యమవుతుందని కేంద్ర జలవనరుల సంఘం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం కాలువల పొడవు 1055 కిలోమీటర్లుగా అంచనా వేశారు. 22 లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించడానికి 3466 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఎల్లంపల్లి ద్వారా మరో 20 టీఎంసీల నీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం పనులను 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టు పనులను అప్పగించారు.

pranahita3-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema





Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi, Urdu shayari, hyderabad urdu Shayari,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP