Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, June 23, 2012

ముందున్నది...ఉపద్రవం

నోరుతెరిచి నడిరోడ్డుపైకి పొంగిన నాలా పాదచారికి ప్రాణగండమవుతుంది.. జలదిగ్బంధనంలో నీటమునిగిన పల్లె పగలూరాత్రి తెలియక విలవిల్లాడుతుంది.. ఏటా కట్ట తెంచుకునే చెరువు ఊరిమీదికి ఉరిమి దూకుతుంది.. లోలెవల్ వంతెనలపై నుంచి వాగులు సాగిపోతుంటే, రాకపోకలు రోజులు లెక్కిస్తూ నిలిచిపోతాయి.

చినుకు పడ్డప్పుడల్లా అక్కడ ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. భారీ వర్షం పడితే ఇక పరిస్థితి భయానకమే. ఏజెన్సీ ఏరియానేకాదు దాదాపు అన్ని డివిజన్లలోనూ అదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో పదే పదే ఉపద్రవాలు ముంచు కొస్తున్నాయి. ఏటా వర్షాకాలం వచ్చిందంటే తలెత్తే ప్రమాదకర పరిస్థితికి సర్కారు తాత్కాలిక మరమ్మతులతోనే పరిష్కారాన్ని ముగిస్తోంది. అందుకే జిల్లాయంత్రాంగం ముందు సవాళ్లుగా నిలుస్తున్న ఈ సీజన్‌లోని ప్రమాదకర ప్రాంతాలపై టీ-

మీడియా ఫోకస్.......మాటేసిన దస్రూమాటు..
ములుగు, దేవగిరిపట్నం ప్రధాన రహదారిపై గల దస్రూమాటు పొంగితే దేవగిరిప ట్నం అవతలి గ్రామాలైన 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. ఇక్కడ హైలెవల్ వంతెన నిర్మించాలని కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లక్నవరం ముందు భాగంలోని పెద్ద వాగు పొంగితే అంకన్నగూడెం, జగ్గన్నగూడెం గ్రామాల జలదిగ్బంధం అవుతాయి. ఇక్కడ ఐటీడీఏ అధికారులు రూ. 35 లక్ష లు ఖర్చు పెట్టి లోలెవల్ బ్రిడ్జి నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జి వర్షాకాలంలో ఎప్పుడూ నీళ్లల్లో మునిగిపోయే ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకల కోసం నాటు పడవలను వాడకతప్పని పరిస్థితి.

కొమ్ములవంచ రిజర్వాయర్‌కూ ఏటా గండ్లే..
నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారులో ఆకేరు వాగుపై 1964లో అప్ప టి రెవెన్యూ శాఖా మంవూతిగా పని చేసిన నూకల రాంచంవూదాడ్డి, పబ్లిక్ వర్క్ శాఖామంత్రి ఏసీ.సుబ్బాడ్డిలు ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు కుడికాల్వ కింద నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయపురం, రామన్నగూడెం, ముంగిమడుగు శివారులో 1100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఎడమ కాల్వ ద్వారా నెల్లికుదురు మండలం మదనతుర్తి, మునిగలవీడు, నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట గ్రామాల్లో 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆకేరు వాగును ని ర్మించారు. 2006లో అప్పటి భారీ నీటి పారుదల శాఖా మంత్రి కడియం శ్రీహరి రూ.1.0కోట్లు కేటాయించి కుడికాల్వ పనులు చేపట్టారు. సిమెంట్ కాల్వకు బుంగ, ఆనకట్టకు ఉన్న షటర్(తూము)లు తుప్పు పట్టి వచ్చిన నీరంతా నిల్వ ఉండకుండా వృథాగా పోతున్నప్పటికీ ప్రతీ ఏటా ఐబీ అధికారులు నామమావూతపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోయే పరిస్థితులు ఉన్నాయి.

మారేడు పొంగితే అంతే..
వెంకటాపురం మండలంలోని లక్ష్మీదేవిపేట, బూర్గుపేట గ్రామాల మధ్య గల మా రేడుగూడెం చెరువు మత్తడి పొంగిపొర్లితే పెద్దాపురం వైపు గల సుమారు 12 గ్రామా లకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ ఏళ్ల తరబడి లోలెవల్ వంతెన దర్శనమిస్తోంది. ఇటీవల వెంకటాపురం చెల్పూర్ ప్రధాన రహదారికి సుమారు రూ. మూడు కోట్లతో నూతన తారు రోడ్డును వేశారు. కానీ ఆర్‌అండ్‌బీ అధికారులు కాజ్‌వేను నిర్మించడం మరిచారు.

గుండ్లవాగుతో కడగండ్లే..
గోవిందరావుపేట మండలంలో గుండ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తే అమృతండా, చం ద్రూతండాల గిరిజనులకు భాహ్య ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అలాగే పస్రా సమీ పంలోని దయ్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తే నార్లాపురం, మేడారం పరిధిలోని 1 గ్రామాలకు ప్రధాన రహదారి బంద్ అయినట్లే. ప్రతీసారి మేడారం జాతరకు అధికారులందరూ ఇదే లోలెవల్ కాజ్‌వే మీది నుంచి పోతారు... వస్తారు. కానీ ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలనే ఆలోచనే వారికి తట్టదు. జంపన్నవాగు పొంగితే ముత్తాపురం మూలకు పడుతది.

రేగొండ మండలంలోని భాగిర్థిపేట క్రాస్‌రోడ్డు సమీపంలో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్‌వేతో ప్రతీయేటా సమస్యలు ఎదురవుతున్నాయి. కాజ్‌వేకు దగ్గర్లోనే చెరువు ఉండడంతో వర్షాకాలంలో చెరువు నిండడం మూలంగా నీరుబయటకు వచ్చి కాజ్‌వే మీదుగా వెళ్తుంటుంది. కాజ్‌వేపై నీరు ఉధృతంగా వెళ్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిత్యం వందలాది లారీలలో బొగ్గు తరలిపోతుండడంతో వర్షాకాలంలో లారీలు వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయితే విధిలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారికి ఎంతో కొంత చెల్లించి ద్విచక్ర వాహనాలను మాత్రం కాజ్‌వే నుంచి దాటించుకుంటారు.

భయంభయంగా లోతట్టు ప్రాంతాలు
వరంగల్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు, 20 లోతట్టు కాలనీలు వణికిపోతుంటాయి. శాశ్వత చర్యలు చేపట్టకపోవడంతో ప్రతీ వర్షాకాలంలో ఈ కాలనీలు ముంపునకు గురికావాల్సి వస్తోంది. కచ్చా డ్రైనేజీలు నిర్మించి తాత్కాలిక పనులు మాత్రమే బల్దియా చేపడుతోంది.నిధుల కొరత, సాంకేతిక సమస్యలు సాకుగూ చూపుతూ అధికారులు శాశ్వత పరిష్కారాన్ని పక్కనబెడుతున్నారనేది ప్రధాన విమర్శ.

ఆకేరు పొంగితే రాకపోకలు ఆగుడే..
లోలెవల్ బ్రిడ్జి మూలాన వర్షాకాలంలో వాగు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు కొన్ని రోజుల పాటు రాకపోకలు స్తంభిస్తాయి. తొర్రూరు కేంద్రం నుండి నెల్లికుదురు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ ప్రాంతాలకు ఈ రహదారి మీదుగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. దశాబ్దాలకాలంగా ఈ సమస్య ప్రతీ వర్షాకాలంలో తలెత్తుతున్నా హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అలాగే నెల్లికుదురు మండలం మదనతుర్తి శివారులోని మొండివాగు సైతం రోడ్డుపైనే ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. దీని కారణంగా నెల్లికు దురు నుండి మహబూబాబాద్ వైపు ఎవరు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల నూతనంగా బీటి రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పటికీ హైలెవల్ బ్రిడ్జిని మాత్రం నిర్మించలేదు. దీంతో ఈ రెండు రహదారులపై నెలకొన్న సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

Take By: T News

Read more...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమే

-ఈ విషయం పార్టీ పెద్దలే అనుకుంటున్నారు
- శ్రేణుల్లో సమన్వయం లోపించింది
- కొందరు నేతల వల్లే తిరుపతిలో ఓటమి
- కాంగ్రెస్‌లో పీఆర్పీ శ్రేణులకు గుర్తింపేది?
- ఎంపీ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు


హైదరాబాద్, జూన్ 22 ():వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టకాలమేనని, అధికారంలోకి రావడం కష్టమేనని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లు ఎంపీ, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయకపోవడం, కొందరు నేతలు సహకరించకపోవడం.. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ ఓటమికి కారణమన్నారు. తిరుపతితో పాటు మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో పూర్వపు పీఆర్పీ నాయకుల్ని, శ్రేణుల్ని కలుపుకొని పనిచేయలేకపోయాయని చెప్పారు. అందుకే ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదని, వివక్షకు గురవుతున్నారన్నారు. అయినప్పటికీ పీఆర్పీ మాజీ నేతలందరూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారని తెలిపారు. సమన్వయంతో, ఐకమత్యంగా కృషి చేస్తే 2014లో కాంగ్రెస్ తిరిగి అధికారంలో రావడానికి ఎదురే ఉండదన్నారు. ఉప ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంవూదాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన తోట త్రిమూర్తులు శుక్రవారం స్పీకర్ వద్ద ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలతో చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సమన్వయ లోపం ఉన్నా తన అభిమానులు, ఆత్మబంధువులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలిందన్నారు. కానీ కొందరు కావాలని పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం తర్వాత ఆ ప్రయోజనాలు పొందడానికి కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పూర్వపు పీఆర్పీ శ్రేణులకు పార్టీలో సముచిత భాగస్వామ్యం కల్పించడం, అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా పార్టీ శక్తిమంతమవుతుందని అభివూపాయపడ్డారు. పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించినట్లయితే పార్టీకి నూతన శక్తి లభిస్తుందని, తేజోవంతం అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని సూచించారు. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపడుతున్న అనేక మంచి కార్యక్షికమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగే పార్టీ యంత్రాంగాన్ని అందరూ భాగస్వామ్యంతో పటిష్టంగా రూపొందించుకోవాలని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ అంశాలపై దృష్టి పెట్టిందని, ఒకవూటెండు నెలల్లోనే పార్టీ బలోపేతం కావడానికి క్షేత్రస్థాయి నుంచి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

chiruజగన్ సెంటిమెంట్ పనిచేయలేదు
జగన్ అరెస్టు, విజయమ్మ కన్నీళ్లతో ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పెల్లుబుకిందని చాలా మంది విశ్లేషణలు చేసినా రామచంవూదాపురం, నర్సాపురంలో అవేమీ పనిచేయలేదని చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇక్కడ సమన్వయంతో పనిచేయడమే కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణమని చెప్పారు. పూర్వపు పీఆర్పీ అభ్యర్థులైన ఇక్కడి అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో చక్కటి సమన్వయం సాధించి పనిచేయడం వల్లే అనుకూల ఫలితాలు వచ్చాయన్నారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున రామచంవూదాపురం నుంచి పోటీ చేసిన తోట త్రిమూర్తులు స్వల్ప తేడాతో ఓడిపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. అయితే మూడేళ్లు తిరిగేసరికి అతని గెలుపునకే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా వచ్చాయని, మంచి మెజారిటీతో త్రిమూర్తులు గెలువడం సంతోషదాయకమన్నారు.

సమావేశం తర్వాత మీడియాతో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతల అనైక్యతే కారణమా? అని అడిగిన ప్రశ్నకు... కాంగ్రెస్ తన పూర్తి బలాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే ఫలితాలు మెరుగ్గా వచ్చేవని అభివూపాయపడ్డారు. తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్ధి ఎం వెంకటరమణ బహిరంగంగానే తనకు కొందరు నాయకులు సహకరించలేదంటూ కన్నీళ్ల పర్యంతమైన ఘటనను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారా? అని అడిగిన ప్రశ్నకు.. పార్టీని బలోపేతం చేయడానికి సమన్వయ కమిటీ సభ్యుడిగా తన సూచనలు, సలహాలు ఇవ్వడం తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. కాగా, రామంచవూదాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జరిగిన విధానానికి భిన్నంగా ఈ సారి తన విజయానికి కుల, మత, వర్గాలకు, చివరకు పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేశారని పేర్కొన్నారు. తనపై నియోజకవర్గ ప్రజలు చూపించిన నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

Take By: T News

Read more...

ఇప్పుడు వీస్తున్నది.. తెలంగాణ గాలి



- విడిపోవడంపై అంచనాకొచ్చిన సీమాంధ్ర నేతలు
- అక్కడా ఇక్కడా బతకాలంటే.. తెలంగాణే మార్గం!
- జగన్ జోరును అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం
- రాష్ట్ర ప్రకటనతో తెలంగాణలో నెట్టుకురావచ్చు
- ఉప ఫలితాలతో మెట్టు దిగుతున్న సీమ నేతలు
- జూలైలో ఉద్యమానికి రెడీ అవుతున్న తెలంగాణ
అవును.. 

ఇప్పుడు తెలంగాణ గాలి వీస్తున్నది! ఉద్యమక్షిశేణుల్లోనే కాదు.. సాక్షాత్తూ తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దల్లోనూ..! ఒక టీజీ వెంక ఒక ఏరాసు ప్రతాప్‌డ్డి.. ఒక బొత్స సత్యనారాయణ.. ఇవి ఇంకా తొలి స్వరాలే! రాష్ట్ర విభజనకు వ్యతిరేకత నుంచి.. మా హక్కులు దక్కితే చాలు అన్నంత స్థితికి.. అక్కడి నుంచి.. 

తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరనే ఆందోళనను వ్యక్తం చేసే స్థాయికి పడిపోయిన నేతల మాటల తీవ్రత! రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుని.. 2014 ఎన్నికల్లో అందివస్తే అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన! ఉప ఎన్నికల్లో సమైక్యవాదం విలువలేకుండా పోయిన వేళ.. సీమాంవూధలో భవిష్యత్ కళ్లకు కడుతుండగా.. కనీసం తెలంగాణలోనైనా పార్టీని బతికించుకునేందుకు ఆఖరి అస్త్రం! తెలంగాణలో బట్టకడితే.. సీమాంవూధలోనూ ఏదో విధంగా బతికేద్దామని ఆశ! అందుకు ఉన్న ఏకైక ఆస్కారం.. తెలంగాణపై ‘నిర్ణయం’! అందుకే మారుతున్న స్వరం!!

హైదరాబాద్ జూన్ 19 () : ఇక తెలంగాణ నిర్ణయాత్మక దశకు చేరుకుందా? రాష్ట్రపతి ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ తీసుకోబోయే ప్రధాన విధానపరమైన నిర్ణయాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉండబోతున్నదా? తెలంగాణ వ్యతిరేకులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాటలను కేంద్రం పక్కనపెట్టబోతున్నదా? అవుననే అంటున్నారు.. సాక్షాత్తూ సీమాంధ్ర నేతలు! పరకాల ఉప ఎన్నిక ఫలితం ఆసరాగా మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఆశించిన కేసీఆర్ మాటలు.. నిజమవుతాయని భావించే విధంగా ప్రస్తుత సీమాంధ్ర నేతల మాటలు వినిపిస్తున్నాయి! ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమైక్యవాదం ఆత్మరక్షణలో పడిపోయింది! సీమాంధ్ర నియోజకవర్గాల్లో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ముక్కలవడం ఖాయమన్న నేతలు.. జనం తమ వాదనను వినిపించుకోకపోవడాన్ని గుర్తించినట్లున్నారు.

ఉప ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిళ్లు తెచ్చారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఇక్కడ సీమాంవూధలో కాంగ్రెస్ ఖతం అవుతుందని హెచ్చరించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేతల తీరూ మారింది. తెలంగాణ ఇస్తారేమోనన్న భయం వేస్తోందనే స్థాయిలో సీమాంధ్ర నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఇస్తే ఇచ్చారు.. కనీసం మా హక్కులనైనా కాపాడండి అని అదే నేతలు వేడుకుంటున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం సీమాంవూధలో పోటీ చేసిన 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 2చోట్ల గెలిచి 7చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణలో పోటీ చేసిన ఒక్క స్థానంలో డిపాజిట్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచింది. ‘2014లో ప్రధాని రేసులో రాహుల్‌గాంధీ ఉంటారని తేలిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ గత రెండు సాధారణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీలనిచ్చిన ఏపీపై ఆశ పెట్టుకుంది. కానీ.. సీమాంవూధలో నష్టం జరిగిపోయింది. ఇక మిగిలింది తెలంగాణే. ఇక్కడ ఆశలు ఇంకా సజీవం.

ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణపైనే. సీమాంవూధలో పార్టీకి భవిష్యత్తు లేదని, చిరంజీవి వచ్చినా చిరు ప్రయోజనం కూడా లేదని తెలిపోవడంతో అధిష్ఠానం తెలంగాణపై నాన్చడం ఆపేసి, తేల్చడం ఎంచుకుంది’ అని సీమాంధ్ర ప్రాంత ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే తేల్చే మొట్టమొదటి అంశం తెలంగాణేనని అక్కడినుంచి తెలంగాణ నేతలకు సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలు తెలంగాణపై ఒకవేళ తేల్చితే తమతో మాట్లాడిన తరువాతే తేల్చాలని, తమ డిమాండ్లు, వాటాలు తేల్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కాళ్లబేరానికి వస్తున్నారు. రాయలసీమ మంత్రులు టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌డ్డి ఢిల్లీ పెద్దలను కలిసి సందర్భంలో వారికి అధిష్ఠానం నుంచి పలు ప్రశ్నలు ఎదురైనట్లు సమాచారం. ‘మీ మాటలు నమ్మి నష్టపోయింది చాలు’ అంటూ తలంటుపోసినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో ఎందుకు ఓడిపోయామనే దానిపై సమాధానం చెప్పుకోలేకపోయారని తెలిసింది.

తెలంగాణ ఏర్పాటు ఖాయమంటూ టీజీ, ఏరాసు వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనివేనని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పరకాల విజయం నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సైతం తమ గొంతు వినిపిస్తూ.. సీమాంధ్ర నేతల వాదనలు వారి ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డీలాపడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే చేపట్టే అంశాలేవీ లేవని, చాలా కాలంగా పెడింగ్‌లోఉన్న తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని తెలంగాణ నేతలకు సర్దిచెబుతున్నారు. ‘ఢిల్లీ నుండి వస్తున్న సంకేతాలు చూస్తుంటే మరో మూడు నెలలు ఆగాలనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్రం ఇస్తామన్నట్లుగా మా ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణ తేల్చకుంటే జరిగే నష్టాన్ని అధిష్ఠానం అంచనా వేసింది. అందుకే రాష్ట్రం ఇచ్చే విషయంలో మాకు సంకేతాలు పంపుతోంది’ అని తెలంగాణనేత ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. జైల్లో ఉన్న జగన్‌ను వెళ్లి కలిశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్దతివ్వాలని హైకమాండ్ అభ్యర్థన మేరకే ఆయన జగన్‌ను కలిసినట్లు సమాచారం.

ఈ పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతోంది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీజేఏసీ సిద్ధమవుతున్న తరుణంలో నెలాఖరు తరువాత తెలంగాణ వేడి గల్లీ నుండి ఢిల్లీకి తాకుతుందని, అప్పుడు రాష్ట్రం ఇవ్వడం తథ్యమనే సంకేతాలను తెలంగాణ నేతలిస్తున్నారు.

సీమాంధ్ర నేతల్లో జగన్ గుబులు

సీమాంధ్ర నేతల స్వరం మారడం వెనుక జగన్ ఆధ్వర్యంలోని వైస్సార్సీపీ ఇటీవలి ఘన విజయాలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల నాటికి సీమాంవూధలో సైతం అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి దాపురించే ప్రమాదం కనిపిస్తుండడంతో పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది. దీంతో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలకడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో పార్టీకి పునరుజీవ్జవం తథ్యమని ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చాక సీమాంవూధలో ఏదో ఒకటి చేసి నెట్టుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణకు బదులు రాయల తెలంగాణను ముందుకు తెస్తున్నారు.

ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆఖరి ప్రయత్నంగా లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాయల తెలంగాణ ఏర్పాటుతో రాయలసీమలో జగన్ జోరును కడప, చిత్తూరు జిల్లాలకే పరిమితం చేయడం ద్వారా సంఖ్యాబలం విషయంలో ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేని పరిస్థితి తలెత్తకుండా నిరోధించగలమనే అభివూపాయం వారి మాటల్లో వినిపిస్తున్నది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, మరో మాజీ మంత్రి, కొందరు సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యమైన పక్షంలో అనంతపురం, కర్నూలు.. ఈ రెండు జిల్లాలు కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కోస్తాంధ్ర నేతల్లో సైతం అత్యధికులు రాష్ట్ర విభజనకే తలూపే పరిస్థితి కనిపిస్తోంది.

ఉత్తరాంవూధతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంత వరకు కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. కనుక తెలంగాణ ఏర్పాటు చేసినా, రాయల తెలంగాణ ఇచ్చినా ఆంధ్రాలో కొంత వరకు పార్టీని బతికించుకోవచ్చని వారు అభివూపాయపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజావూపతినిధులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రకటిస్తే అక్కడ, ఇక్కడ పార్టీ ఉంటుందన్న నమ్మకం, ధీమా వారిలో కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ఇదే వాదన వినిపించేందుకు వారు సమయాత్తమవుతున్నట్లు సమాచారం.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP