Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, December 8, 2011

సచిన్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన సెహ్వాగ్

ఇండోర్ : ఇండోర్ వన్డేలో భారత కెప్టెన్ వీరెంద్ర సెహ్వాగ్ వీర వీహరం చేస్తున్నాడు. హోల్కర్ స్టేడియంలో వెస్టీండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఆటగాడు వీరెంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేశారు. సెహ్వాగ్ 140 బంతుల్లో 201 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సెహ్వాగ్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 23 ఫోర్లు, 6 సిక్స్‌లతో సెహ్వాగ్ చెలరేగాడు. సచిన్ 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్స్‌లతో 200 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 24, 2010లో గ్వాలియర్‌లో సచిన్ డబుల్ సెంచరీ చేశాడు.


Take By: T News


Tags:  Hyderabad, News, Sport News, Virender Sehawag,

Read more...

4th ODI: Virender Sehwag becomes 2nd batsman to slam 200 in ODIs

Indore: Virender Sehwag, captaining India in the absence of the rested MS Dhoni, has become only the second batsman in the world to breach the 200-mark in one-day cricket. The first was the inimitable Sachin Tendulkar, who scored a double ton last year.


Sehwag slammed 219 off 149 balls before falling to Kieron Pollard in the 47th over of the fourth ODI against the West Indies at Indore. He got to the 200 in 140 balls; the first 100 came in only 69 balls. He smashed 25 fours and seven sixes and also crossed 8,000 ODI runs during the knock.

This is Sehwag's 15th ODI century and answers all the critics that have been blaming the top-order's indifferent form and Sehwag's bad captaincy for India's 16-run loss to the Windies in the 3rd ODI at Ahmedabad.

Sachin Tendulkar got his 200 against South Africa at Gwalior in February 2010. Tendulkar had scored 200 not out off 147 balls to take India to 401/3 in that game.

Sehwag's feat, however, would not have been possible without a little help from West Indies skipper Darren Sammy, who dropped the Delhi batsman off a Ravi Rampaul delivery in the 38th over when Sehwag was batting on 170. But then what is a great Sehwag innings without the adventure?

Take By: ndtv

Tags: T News, hmtv, Hyderabad News, Hyderabad, Virender Sehwag India vs west indies Ind vs WI wiinind2011news


Read more...

అసమ్మతి మధ్య.. లోక్‌పాల్ ముసాయిదా ఆమోదం

-స్థాయీ సంఘం నివేదికపై16 మంది సభ్యుల వ్యతిరేకత
-కాంగ్రెస్ ఎంపీల నుంచీ వ్యతిరేకత
-రేపు పార్లమెంటుకు లోక్‌పాల్ బిల్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: సభ్యుల అభ్యంతరాల మధ్య పార్లమెంటరీ స్థాయీ సంఘం లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను బుధవారం ఆమోదించింది. స్థాయీ సంఘం రూపొందించిన లోక్‌పాల్ ముసాయిదాపై సభ్యుల్లో ఏకాభివూపాయం కొరవడింది. 30 మంది సభ్యుల స్థాయీ సంఘంలో 16 మంది సభ్యులు ముసాయిదాపై అసమ్మతి వ్యక్తం చేశారు. బిల్లు నివేదికతో పాటు వారు తమ అసమ్మతి పత్రాలను అందజేశారు. లోక్‌పాల్ ముసాయిదాను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సభ్యుల్లో కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉండటం అధికార పార్టీకి ఝలక్ ఇచింది. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి సన్నిహితుడైన మధ్యవూపదేశ్ ఎంపీ మందసౌర్ మీనాక్షి నటరాజన్ లోక్‌పాల్ పరిధిలోకి గ్రూప్ సీ ఉద్యోగులు, కేంద్ర విజిపూన్స్ కమిషన్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. నటరాజన్ డిమాండ్‌కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పీటీ థామస్, దీపా దాస్‌మున్షి మద్దతు పలికారు. సభ్యుల అభ్యంతరాలపై స్థాయీ సంఘం చైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ ‘సభ్యులు వ్యక్తిగతంగా తమ అభివూపాయాలు వ్యక్తం చేయవచ్చు.

వారి అభివూపాయాలను పరిగణనలోకి తీసుకుంటాం’ అని అన్నారు. కొన్ని అంశాలపై మాత్రమే సభ్యుల్లో అభ్యంతరాలు ఉన్నాయి కానీ, మొత్తం నివేదిక మీద కాదని ఆయన స్పష్టం చేశారు. లోక్‌పాల్ పరిధిలోకి సీబీఐను తీసుకురావాలని అన్నా హజారే బృందం గట్టిగా పట్టుబడుతున్నా, స్థాయీ సంఘం సీబీఐను బిల్లు పరిధికి ఆవల ఉంచినట్లు తెలుస్తోంది. లోక్‌పాల్ అదుపాజ్ఞల్లో పనిచేయడానికి సీబీఐ కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు.

ప్రస్తుత వ్యవస్థను దెబ్బతీసేలా.. సిఫారసులా?: అన్నా బృందం
పార్లమెంటరీ స్థాయీ సంఘం రూపొందించిన లోక్‌పాల్ ముసాయిదాపై సామాజిక ఉద్యమనేత అన్నా హజారే బృందం భగ్గుమంది. స్థాయీ సంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి పార్లమెంటు అంటే గౌరవం లేదని, అందుకే కిందిస్థాయీ పరిపాలన వ్యవస్థ, సిటిజన్ చార్టర్‌లను లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న పార్లమెంటు తీర్మానానికి వ్యతిరేకంగా ముసాయిదా రూపొందించారని మండిపడింది. అన్నా హజారే దీక్ష విరమణ సందర్భంగా పార్లమెంటు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Lokpal, 
 

Read more...

సలామ్.. సెలాక్! - లాటిన్‌లో కొత్త చరిత్ర.. అమెరికా సామ్రాజ్యవాదంపై యుద్ధభేరి


obama talangana patrika telangana culture telangana politics telangana cinema

-అస్తిత్వం, ఆర్థిక ప్రయోజనాల రక్షణకు ఏకమైన 33 లాటిన్ దేశాలు, రాజ్యాలు
-తొలి వేదిక వెనిజులా రాజధాని
-తదుపరి సదస్సు క్యూబాలో
-అమెరికా అధిపత్యం ఇక చాలు
-సమస్యలు మనమే పరిష్కరించుకుందాం
-ప్రపంచానికి మార్గదర్శకులమవుదాం
-సదస్సులో వెనిజులా అధ్యక్షుడు ఛావెజ్

కారకాస్, డిసెంబర్ 7:లాటిన్ దేశాలు కలిసికట్టుగా ఉండాలని లాటి్ అమెరికా విముక్త పోరాట యోధులు కాంక్షించిన 200 ఏళ్ల తర్వాత ఆ కల సాకారం అవుతోంది. ఇప్పటిదాకా అగ్రరాజ్యం అమెరికాకు పెరటిదొడ్డిగా ఉన్న పరిస్థితిని చాలించి.. అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు లాటిన్ సమాయత్తమవుతోంది. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ 33 దేశాలు ఒక కూటమిగా ముందుకు వచ్చాయి. ఈ సంగతి.. భారతీయ మీడియాలో అంతగా ప్రాధాన్యం పొందకపోవడం విశేషం. కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ స్టేట్స్ (సెలాక్) ఏర్పాటుకు ఉద్దేశించిన ఈ సదస్సును మెక్సికో అధ్యక్షుడు ఫెలిప్ కాల్డెరాన్ డిసెంబర్ 2న ప్రారంభించారు. ‘‘మనం మన ప్రాంత ప్రయోజనాల కోసం ఐక్యత కోసం పని చేద్దాం.

బొలివార్ స్వాతంత్య్ర సమర సేనాని) సిద్ధాంతాలు లాటిన్ అమెరికా మొత్తానికీ ఉమ్మడి సిద్ధాంతాలే’’ అని ఆయన అన్నారు. ఈ సదస్సుకు వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ స్వాగతం పలికారు. సైమన్ బొలివార్‌ను తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ లాటిన్ అమెరికా పట్ల అమెరికా అనుసరిస్తూ వచ్చిన విధానాలను దుయ్యబట్టారు. ‘‘మొత్తంగా లాటిన్ అడుగుతున్నది గౌరవం. నిజమైన స్వాత్రంత్య్రం మాత్రమే’’ అన్నారు. ‘‘సంకోచించేవాడు ఓడిపోతాడు’’ అన్న బొలివార్ మాటలను ఛావెజ్ ప్రస్తావించారు. మనం ఇంకా ఎంతకాలం ఇలా పాడుబడిన పెరడులా మిగలాలి? అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఐక్యత, ఐక్యత, ఐక్యత, ఐక్యత మాత్రమే మనల్ని విముక్తి చేస్తుంది. మనల్ని స్వతంవూతంగా మనగలిగేలా చూస్తుంది’’ అని ఛావెజ్ స్పష్టం చేశారు. ‘‘ఇకపై మన మధ్య ఎలాంటి ఘర్షణలూ వద్దు. ఇప్పటిదాకా జరిగింది చాలు. మనం అందరం కలిసి ఒక మహా ‘మాతృభూమి’ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మనకు ఉన్న మాతృభూమి కూడా మిగలదు. 200 ఏళ్లపాటు అమెరికన్లు వాళ్ల చిత్తం వచ్చినట్లు మనల్ని పాలించారు. ఇక చాలు’’ అని అన్నారు. వెనిజులాలో ఛావెజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1045 కంపెనీలను జాతీయం చేశారు.

ఈ ఒక్క ఏడాదే 459 కంపెనీలను జాతీయం చేశారు. చమురు, విద్యుత్, సిమెంట్, ఉక్కు, టెలికమ్యూనికేషన్స్, ఆహార ఉత్పత్తి-పంపిణీ రంగాల్లో ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. బహుళజాతి సంస్థలైన కోల్గేట్-పామోలివ్, పెప్సీ కోలా, నెస్ట్‌లే, కోకాకోలా, యూనిలీవర్ వంటి సంస్థలపై నిరంతర పర్యవేక్షణను ఛావెజ్ ఏర్పాటు చేశారు. ‘‘వెనిజులా ప్రజల జేబులు కొట్టేసేందుకు పెద్ద వ్యాపారులకు, కార్పొరేట్ శక్తులకు మేం స్వాతంత్య్రం ఇవ్వం’’ అని ఛావెజ్ తేల్చి చెప్పారు. ఇదే అక్కడి విపక్షానికి కంటగింపుగా మారింది. ఇప్పటికే బొలీవియా వంటి దేశాల్లో జాతీయకరణలు జరుగుతున్నాయి. ఛావెజ్ నాయకత్వాన సెలాక్ రంగంలోకి దిగితే లాటిన్‌లో పెట్టుబడి రూపురేఖలు మారిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే అమెరికా, దాని తైనాతీలకు సెలాక్ ఆవిర్భావం గుబులు రేపుతోంది.

తదుపరి సదస్సు క్యూబాలో
ఖబడ్దార్.. మీ దేశం మాకు కూతవేటు దూరంలోనే ఉంది.. అని అమెరికా హెచ్చరిస్తే.. అమెరికా కూడా మాకు కూతవేటు దూరంలోనే ఉందని అగ్రరాజ్యాన్ని దీటుగా హెచ్చరించగలిగిన చిన్న దేశం.. క్యూబా సెలాక్‌లో కీలక పాత్ర పోషిస్తుండటమే కాక.. వచ్చే సంవత్సరం జరిగే సెలాక్ సదస్సుకు ఆతిథ్యం కూడా ఇవ్వబోతున్నది. ఆ తదుపరి సదస్సు చిలీలో జరగబోతున్నది.

బలహీనపడుతున్న సామ్రాజ్యవాదం
అమెరికా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు తిరోగమనంలో ఉన్న తరుణంలో, ఐరోపా యూనియన్ దాదాపు కుప్పకూలే దశలో ఉన్న సమయంలో సెలాక్ ఏర్పాటు జరిగింది. యావత్ ప్రపంచం సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో లాటిన్ అమెరికా ఖండం కదులుతోందని గార్షి యా చెప్పారు. ‘‘సిద్ధాంతాలు, పరిణామం, ప్రజలకు, మా నవ జాతికి సేవలు అందించే ప్రతిపాదనలతో మొత్తం ప్రపంచానికి లాటిన్ అమెరికా నాయకత్వం వహిస్తుంది’’ అని గార్షియా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘సెలాక్ ఏర్పాటు అనేది మానవ చరివూతలోనే గొప్ప దశకు శ్రీకారం. ఇలాంటిది మునుపెన్నడూ లేదు’’ అని లాటిన్ అమెరికాలో ప్రజాదరణ కలిగిన అమెరికా-గీగీఐ అనే మ్యాగజైన్ సంపాదకుడు లూయిస్ బిల్‌బావో రాశారు. మిగిలిన ఖండాలన్నీ అపకేంద్ర శక్తుల హింసతో అతలాకుతలమవుతున్న సమయంలో లాటిన్ ఖండం దూసుకుపోయే స్వభావంతో ప్రాంతీయ ఐక్యతకు వేదిక ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ సామ్రాజవాద దేశాల్లో ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండగా.. లాటిన్ అమెరికాలో ఆ ఛాయలు లేవని గుర్తు చేశారు. పెట్టుబడిదారీ సమాజం కు ప్పకూలుతున్న తరుణంలో 21వ శతాబ్దపు సోషలిజం.. అ న్న జండా కింద సమీకృతమవుతున్నదని ఆయన రాశారు.

అడుగడుగునా అడ్డుకున్న అమెరికా
సెలాక్ ఏర్పాటును అడ్డుకునేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. అమెరికా కీలు బొమ్మ, కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వరో యూరిబ్‌ను వాడుకుంది. వెనిజులా వెళ్లిన యూరిబ్.. అక్కడి ప్రభుత్వ వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రాపకంలోని మీడియా సైతం అనేక యత్నాలు చేసింది. వెనిజులా ఈ ప్రాంతంలో వేరుపడిపోయిందన్న దుష్ర్పచారానికీ తెగించింది. ఇటీవల క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొంది పూర్తి స్వస్థతతో ఛావెజ్ తిరిగి పాలనా కార్యక్షికమాల్లో పాల్గొడం కూడా అమెరికాకు కంటగింపుగా మారింది. అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికలకు ఛావెజ్ దూరంగా ఉంటారన్న అమెరికా ఆశలనూ ఆయన అడియాస చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తాజా సర్వేల ప్రకారం ఛావెజ్‌కు 50శాతానికి పైగా ప్రజల మద్దతు ఉంది.

ఇదీ లాటిన్ ప్రాముఖ్యం
సెలాక్ దేశాల మొ త్తం స్థూల జాతీయోత్పత్తి కలిపితే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడవ స్థానంలో ఉంటుంది. ఇదీ లాటిన్ ప్రాము ఖ్యం. అంతేకా దు.. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న ప్రాంతమిది. ఆహారోత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో, ఇంధనం ఉత్పత్తిలో మూడవ స్థానంలోనూ నిలిచింది.

సెలాక్.. ఓ మహా కూటమి
ఇప్పటికే దక్షిణ అమెరికా ఖండంలో యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్ (యూఎన్‌ఏఎస్‌యూఆర్), బ్యాంక్ ఆఫ్ సౌత్ (దీనికి మొక్క ఉరుగ్వే ఆమోదం మాత్రమే రావాల్సి ఉంది. ఆ ఆమోదం వస్తే రెండువేల కోట్ల అమెరికా డాలర్లను అభివృద్ధి పనుల కోసం ఈ బ్యాంక్ వెచ్చించనుంది.) సహా కొన్ని మండళ్లు పని చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన సెలాక్.. వీటిని సైతం కలుపుకొని తన కార్యక్షికమాలను రూపొందించుకోనుంది. అంతేకాకుండా ప్రస్తుతం లాటిన్ దేశాల మధ్య వాణిజ్య వ్యవహారాలకు మధ్యేమార్గంగా వినియోగిస్తున్న డాలర్‌ను కూడా పూడ్చిపెట్టాలని బ్యాంక్ ఆఫ్ సౌత్ భావిస్తోంది. ఇదే కూటమిలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బొలివారియన్ అలయెన్స్ ఆఫ్ ది పీపుల్స్ ఆఫ్ అవర్ అమెరికా(అల్బా) కూడా అంతర్భాగం కానుంది. ఈ కూటమిని క్యూబా, వెనిజులా సహా 9 లాటిన్ సోషలిస్టు దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.

సభ్య దేశాలు
అంటిగ్వా, బార్బుడా, బహమాస్, బార్బడోస్, బెలీజి, బొలీవియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, కోస్టారికా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, గ్రెనడా, గుయానా, హైతీ, హోండురాస్, జమైకా, మెక్సికో, నికరాగువా, పరాగ్వే, పెరు, పనామా, డొమినికా, సెయింట్ కిట్స్-నెవిస్, సెయింట్ విన్సెంట్-క్షిగెనడినెస్, శాంటా లూసియా, సురినేమ్, ట్రినిడాడ్ - టొబాగో, ఉరుగ్వే, వెనిజులా.

ఓఏఎస్‌కు సమాధి!
ఉత్తర అమెరికాలోని శక్తిమంతమైన రాజ్యాలు సంప్రదాయకంగా ఆధిపత్యం వహిస్తున్న ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్‌ను సమాధి చేసే క్రమంలో సెలాక్ తుది ఇటుకను పేర్చుతుందని ఇప్పటికే వాదనలు మొదలయ్యాయి. ఓఏఎస్‌లో అమెరికా గురుత్వాకర్షణ శక్తి స్పష్టంగా కనిపిస్తున్నందున అమెరికన్ దేశాల మధ్య ప్రత్యేకించి లాటిన్ అమెరికన్ వ్యవస్థ ఒకటి ఏర్పడాలని ఇటీవలే ఈక్వెడార్ అధ్యక్షుడు రఫెల్ కొర్రియా చెప్పారు. 

‘‘మనం మన సమస్యలను మన ప్రాంతంలోనే చర్చించుకునేలా మనకు మరొక వ్యవస్థ కావాలి. అంతేకానీ మన సమస్యలపై వాషింగ్టన్(ఓఏఎస్ కేంద్ర కార్యాలయం)లో చర్చించుకోవడం కాదు. మన సంప్రదాయాలు, విలువలు అవసరాలు తొలగింపునకు గురైన చోటకాదు.’’ అని ఆయన చెప్పారు. బొలీవియా వైస్ ప్రెసిడెంట్ గార్షియా లినెరా.. అమెరికా జోక్యంలేకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకునేందుకు, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునేందుకు, ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా మన భవితను తీర్చిదిద్దుకునేందుకు ఈ సదస్సు జరుగుతోంది’’ అన్నారు.

Read more...

ఎఫ్‌డీఐలపై పీఛేముడ్



PRANAB talangana patrika telangana culture telangana politics telangana cinema -మెట్టుదిగిన యూపీఏ ప్రభుత్వం
-అందరి సమ్మతి వచ్చాకే నిర్ణయం
-లోక్‌సభలో ప్రణబ్‌ముఖర్జీ ప్రకటన
-స్వాగతించిన ప్రతిపక్షాలు
-ప్రజాభీష్ఠానికి తలొగ్గడం ఓటమికాదు
-ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ వ్యాఖ్య
-పారిక్షిశామికవర్గాల్లో నిరుత్సాహం
-హర్షం వ్యక్తం చేసిన వ్యాపారులు
-ఇక సజావుగా పార్లమెంటు


ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం తోకముడించింది. పార్లమెంటులో ప్రతిపక్షాల పోరాటానికి ఫలితం దక్కింది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని కేంద్రం బుధవారం నాడు తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది. ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చేంతవరకూ నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు తొలుత అఖిలపక్ష భేటీలో, అనంతరం లోక్‌సభలో ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ రాజ్యసభలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు ముక్తకం స్వాగతించాయి. ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గి ఉండాలన్న ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్.. అలా తలొగ్గడం ఓడిపోయినట్లు కాదని అన్నారు. ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఎఫ్‌డీఐలను తీవ్రంగా వ్యతిరేకించిన యూపీఏ భాగస్వామ్య పక్షాలు తృణమూల్‌కాంక్షిగెస్, డీఎంకే హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంపై పారిక్షిశామికవర్గాలు నిరుత్సాహం ప్రకటించగా.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ , డిసెంబర్ 7:చిల్లర వర్తకంలోకి విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనపై కేంద్రవూపభుత్వం తోకముడిచింది. స్వపక్ష, విపక్షాల వ్యతిరేకతకు తోడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు ప్రభుత్వం వెనక్కితగ్గింది. బుధవారం అఖిలపక్షభేటి అనంతరం...ఎఫ్‌డీఐలపై ఏకాభివూపాయం వచ్చే వరకూ నిలిపివేస్తున్నట్లుగా లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రణబ్‌ముఖర్జీ అధికారికంగా ప్రటించారు. రాజ్యసభలోనూ వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ ఇదే ప్రకటన చేశారు. బుధవారం ఉదయం జరిగిన అఖిలపక్షభేటిలో చిల్లర రంగంలో 51శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నట్టు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనిని ప్రతిపక్షాలు ముక్తకం స్వాగతించాయి. అనంతరం ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ఈ విషయాన్ని లోక్‌సభలో అధికారికంగా ప్రకటించారు. ఎఫ్‌డీఐలను స్వాగతించాలన్న నిర్ణయాన్ని అమలుచేయడానికి ముందు ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంవూతులు, చిల్లరవర్తకులను, రైతులను కూడా సంప్రదించనున్నట్టు ప్రణబ్ వివరించారు.

ఆ విధంగా ఒక ఏకాభివూపాయం వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో ఒక ముఖ్యమైన వివాదానికి తెరపడినటె్టైందని యూపిఏ భాగస్వామ్య పక్షాలైన తృణముల్, డీఎంకేలు హర్షం వ్యక్తం చేశాయి. ఇకనైనా సభ సజావుగా సాగుతుందని ఆశాభావన్ని వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా వాణిజ్యరాజధాని ముంబాయిలో రిటెలర్‌లు ప్రభుత్వ నిర్ణయంతో ఆనోందత్సవాలు జరుపుకున్నారు. పార్లమెంట్‌లో తొమ్మిదిరోజులుగా ఊపిరి సలుపవ్వని ఒత్తిడిని ఎదుర్కొన్న ప్రభుత్వం, ఈ నిర్ణయంతో కొంత ఉపశమనం పొందినటె్టైంది. తదనంతరం ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఎస్పీ ,వామపక్షాలు పలు వాయిదాతీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ, స్పీకర్ మీరాకుమార్ వాటిని తిరస్కరించడంతో బీఎస్పీకి చెందిన సభ్యులు అసంతృప్తితో సభనుండి వాకౌట్ చేశారు. ఈ విధంగా సభ శీతాకాల సమావేశాల్లో తొలిసారి ప్రశ్నోత్తరాల సమయంలోకి ప్రవేశించింది.

స్వాగతిస్తున్నాం: సుష్మ
ప్రభుత్వం తీసుకున్న ఎఫ్‌డీఐల నిలుపుదల నిర్ణయాన్ని పార్లమెంట్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మస్వరాజ్ స్వాగతించారు. ‘‘ప్రజాభీష్టానికి ప్రభుత్వం తలొగ్గి ఉండాలని.. అట్లా తలొగ్గడం ఓడిపోయినట్టు కాదని’’ ఆమె గుర్తుచేశారు. ప్రజాభివూపాయాన్ని విన్నందుకు ప్రభుత్వానికి, ముఖర్జీకి ఈ సందర్భంగా సుష్మా ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ప్రజాస్వామిక శక్తుల విజయంగా ఆమె అభివర్ణించారు. అన్ని పక్షాలను సంప్రదించి ఒక కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

పూర్తిగా వెనక్కి తీసుకోవాలి:సీతారాం ఏచూరి
ఎఫ్‌డీఐల ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సీపిఎం డిమాండ్ చేస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ఎఫ్‌డీఐల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి. వారి అభివూపాయాలను తప్పకుండా పరిగణించాలని అన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం తలొగ్గేలా ఒత్తిడి తీసుకురాగలిగాము. ఈ విషయంలో ఏకాభివూపాయం ఏ విధంగానూ కుదరదని తేల్చిచెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఈ ఘనత సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నదని, కానీ తమ పార్టీ 2004 నుండే ఈ పెట్టుబడులను అడ్డుకుంటున్నామన్నారు. అలాగే వ్యవసాయంలో ఫ్యూచర్ ట్రేడింగ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. పెట్రోలు ధరలను తగ్గించడంతో పాటు గోదాముల్లో నిలువ ఉన్న ఆహారధాన్యాలను విడుదల చేసి, ధరలను అదుపు చేయాలన్నారు.

ఎఫ్‌డీఐలు కావాల్సిందే : కావూరి
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలను స్వాగతించాలని, దేశవూపజలు అదే కోరుకుంటున్నారని ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ పండ్లు కూరగాయల నిల్వకోసం కోల్ట్‌స్టోరేజ్‌లు ఏర్పాటు చేయాలంటే లక్షకోట్లరూపాయలు అవసరమని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏ నిర్ణయమైన తీసుకోవడానికి యూపీఏ ప్రభుత్వం ఒక్క పార్టీకి చెందినది మాత్రమే కాదని, ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తృణముల్, డీఎంకెల అభివూపాయాన్ని కూడా పరిగ స్తుందని అన్నారు.

 Take By: T News

Tags: Telangana News, Hyderabad, Telangana, Lok Sabha, News, FDI in retail, foreign investment, retail sector, Indian economy,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP