Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, December 4, 2011

మోడల్ స్కూళ్లలో ఖాళీలు-12351 - స్పెషల్ డీఎస్సీ ద్వారా నియామకం (DSC / TET)

మోడల్ స్కూళ్లలో ఖాళీలు-12351 - 7,100 పోస్టులు స్పెషల్ డీఎస్సీ ద్వారా నియామకం
- 5074 పోస్టులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో..
- 176 పోస్టులు డిప్యు భర్తీ
- ఆర్థిక శాఖ అనుమతి


హైదరాబాద్, డిసెంబర్ 3 (): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 355 మోడల్ స్కూళ్ళలో 12,351 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 7,100 ఉపాధ్యాయ పోస్టులు కాగా, మిగిలినవి నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.

టీచింగ్ పోస్టుల భర్తీకి త్వరలో స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది.

మిగిలిన 5, 074 నాన్‌టీచింగ్ కేటగిరీ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిన,

174 పోస్టులు శాఖాపరమైన డిప్యు ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది.

రాష్ట్ర స్థాయిలో మోడల్ స్కూల్స్‌కు అదనపు డైరెక్టర్ నియామకంతో పాటు 39 కొత్త పోస్టులను డిప్యు ద్వారా భర్తీ చేయనున్నారు.

జిల్లా స్థాయిలో 138 కొత్త పోస్టులను డిప్యు ద్వారా నియమించనున్నారు.

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పోస్టుల వివరాలు:
ప్రిన్సిపల్స్ - 355
పీజీ టీచర్స్ -  4260
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్  - 2485 
--------------------------------------------------------------------


ఔట్ సోర్సింగ్ విధానంలో ..రాష్ట్రస్థాయిలో...
కన్సప్టూంట్ - 2
కంప్యూటర్ ప్రోగ్రామర్ - 1
జాయింట్ స్టెనోక్షిగాఫర్ - 1
డాటా ఎంట్రీ ఆపరేటర్ - 4
ఆఫీస్ సబార్డినేట్ - 4



--------------------------------------------------------------------------------
జిల్లా స్థాయిలో...
జూనియర్ అసిస్టెంట్ - 23
కంప్యూటర్ ప్రోగ్రామర్ - 23
డాటా ఎంట్రీ ఆపరేటర్ - 23
ఆఫీస్ సబార్డినేట్ - 23
స్కూల్ లెవల్...
ఫిజికల్ డైరెక్టర్స్ - 355
యోగా టీచర్స్ - 355
ఆర్ట్ టీచర్స్ - 355
ఎస్‌యూపీడబ్ల్యూ టీచర్స్ - 355
కంప్యూటర్ టీచర్స్ - 355
లైబ్రేరియన్స్ - 355
క్లర్క్ కం అకౌంటెంట్ - 355
జూనియర్ అసిస్టెంట్ - 355
ఆఫీస్ సబార్డినేట్స్ - 1420
వాచ్‌మెన్ - 710 

Read more...

Legendary Bollywood actor Dev Anand passes away

Yesteryear Hindi cinema idol Dev Anand during his 88th birthday in Mumbai. File Photo: Vivek Bendre


‘Main zindagi ka saath nibhata chala gaya' went the timeless melody from the movie Hum Dono. Nonchalantly puffing a cigarette and wandering through the woods with gay abandon, Hindi cinema's legendary hero Dev Anand embodied the spirit of this ode to life on screen and in personal life. 


When he passed away on Saturday night in London, he was living it up till the last moment. Dev Anand, 88, breathed his last after a cardiac arrest while on a holiday in London. 


Many accolades
 

Ruling the roost in Hindi cinema for decades, Dev Anand won the Filmfare Best Actor Awards for his role in Kala Pani in 1958 and for the cult film, Guide, in 1966. He also won the Filmfare Lifetime Achievement Award in 1991. 


In 2001, he was bestowed Padma Bhushan, the country's third highest civilian honour. A year later, he won the Dadasaheb Phalke award for cinematic excellence. 


Dev Anand turned to direction later in his career. His movie Chargesheet was recently released under the banner of Navketan International Films, a production company he launched in 1949. 


His inimitable style, active lifestyle and never-say-die spirit earned him the title ‘Evergreen.' 


Condolence in Mumbai
 

“He had left for London two weeks ago with his son. He died in the hotel room at 10 p.m. London time. His son Sunil was with him at that time,” Dev Anand's manager Mohan Churiwala told The Hindu on the phone on Sunday. 


“His wife Kalpana Kartik, daughter Devina and granddaughter Gina are flying to London. His sister Boney lives there.

Since the entire family is going to be there, he will most likely be cremated in London itself. The condolence will be held in Mumbai,” Mr. Churiwala said.


Dev Anand's health was fine and he was not suffering from any particular ailment. 

His body was taken to the morgue, but it is not known if a post-mortem would be conducted. 


“Since it is a Sunday, we will only know by tomorrow [Monday],” Mr. Churiwala said. “He was perfectly fine. He was awake.

He had just had dinner, after which he passed away.” 


Dev Anand recently celebrated his 88th birthday in Mumbai by throwing a party. 
  

Read more...

అవిశ్వాసం అగ్నిపరీక్ష!

- రసకందాయంలో రాజకీయం
- వేగంగా కదులుతున్న పావులు
- జగన్, టీఆర్‌ఎస్ అంచనా ఫలిస్తే కాంగ్రెస్ సర్కారుకు గండమే!
- కలకలం రేపిన చిరు కోపం
- నచ్చజెప్పిన బొత్స, ఆజాద్
- పార్టీల్లో మొదలైన విప్‌ల జారీ
- ఉల్లంఘనకు సిద్ధమన్న జగన్ బ్యాచ్
- నిలబడేది ఎందరో అనుమానమే!
- జగన్ వర్గంపై కాంగ్రెస్ నేతల వల
- ప్లేటు ఫిరాయించిన కుంజా సత్యవతి
- మరికొందరూ అదే బాటలో!
- తిరుగుబాటు ఎమ్మెల్యేలకూ టీడీపీ విప్
- ముగ్గురు వచ్చేస్తున్నారంటూ లీకులు
- కొట్టిపారేసిన వేణుగోపాలచారి
- తెలంగాణవాదంపై టీఆర్‌ఎస్ నమ్మకం


Cong-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema(హైదరాబాద్):ఇంకా స్పష్టత రాని రాజకీయ లెక్కలు కిరణ్ సర్కారును కూల్చేస్తాయా? జగన్ మంతనాలు ఏ మేరకు ఫలిస్తాయి? చిరంజీవి అసంతృప్తి టీ కప్పులో తుఫానేనా? తెలంగాణవాదులందరూ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కేసీఆర్ పిలుపు ప్రభావమేంటి? అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా? ప్రభుత్వాన్ని కాపాడుకునే యత్నంలో కాంగ్రెస్ సఫలీకృతమవుతుందా?
ఏం జరుగుతుందో అర్థంకాని సంక్లిష్ట రాజకీయ పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది! టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ శనివారం పచ్చ జెండా ఊపారు. దీంతో చర్చకు ముందే పార్టీలకు అగ్ని పరీక్ష మొదలైంది! అవిశ్వాసానికి బరి సిద్ధమైనా.. బలగాలు ఇంకా తేలలేదు! దాదాపు అన్ని పార్టీల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులాఉంది. కాంగ్రెస్, టీడీపీ, జగన్ వర్గం తమ వద్ద ఇంత మంది సభ్యులు ఉన్నారని నిర్దిష్టంగా చెప్పుకోలేని పరిస్థితి! పీఆర్పీ ఏ నిర్ణయం తీసుకుంటుందో సస్పెన్సే! దీంతో ఎవరికివారు తమ బలాన్ని కాపాడుకునేందుకు విశ్వవూపయత్నాలు చేస్తున్నారు. విప్‌ల జారీలో తలమునకలై ఉన్నారు!!

అవిశ్వాస తీర్మానంపై చర్చకు టీడీపీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర శాసనసభ స్వీకరించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు 76 మంది సభ్యులు మద్దతు పలకడంతో తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం ప్రకటించారు. అనంతరం శాసనసభ వ్యవహారాల సంఘం సమావేశం ఏర్పాటు చేసి, ఆది, సోమవారాల్లో ఈ తీర్మానంపై చర్చ జరపాలని తీర్మానించారు. అయితే, కరువుపై చర్చ జరగాల్సి ఉన్నందున ఆ చర్చ ముగిసిన తర్వాతనే అవిశ్వాసంపై చర్చ మొదలవుతుంది. అవిశ్వాసంపై చర్చకు ముందే అసెంబ్లీలో, వెలుపల పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ఆయా పార్టీల బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు నాయకత్వాల పట్ల నిరసనగా వైఖరి మార్చుకుంటుంటడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడే కాపాడుతున్నాడని ఒకవైపు జగన్ విమర్శిస్తుంటే కాంగ్రెస్‌తో జగన్ మిలాఖత్ అయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. మరో వైపు, కాంగ్రెస్, టీడీపీలు కలిసి నాటకం ఆడుతున్నాయని టీఆర్‌ఎస్ ధ్వజమెత్తుతోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం అసెంబ్లీ ముందుకు రానుండటంతో పరిస్థితి ఉత్కం రేకెత్తిస్తోంది.

జగన్ వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు శనివారం తమ పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. నిన్నటిదాకా ఫోన్‌లలో వ్యవహారం నడిపిన జగన్.. అది సరిపోక పోవడంతో ఓదార్పు యాత్రను పక్కనపె నేరుగా రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలను పిలిచి ‘నిర్మొహమాటంగా’ మాట్లాడారు. వీరితో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు తమతో కలిసి వస్తారని జగన్ వర్గం ధీమా వ్యక్తం చేస్తున్నది. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. తాము అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయనున్నట్లు ప్రకటించారు. తమ నాయకుడు చెప్పిన మాటను పాటిస్తామని తెలిపారు. ఇప్పుడు తనకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలకు తోడు కాంగ్రెస్ నుంచి మరోఏడుగురు కలిసి వస్తే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుందని జగన్ వర్గం భావిస్తోంది. జగన్ వర్గంలో పెరుగుతున్న సంఖ్య లేదా, తగ్గిన సంఖ్య అధికార పార్టీపై నేరుగా ప్రభావం చూపనున్నది. కాంగ్రెస్ నేతలు ఈ ప్రమాదాన్ని పసిగట్టి పునరాకర్ష పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తూ జగన్ కూటమిని బలహీన పర్చేందుకు పావులు కదుపుతున్నారు. దఫదఫాలుగా వీరిలో కొందరితో మంతనాలు జరిపారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి తాను కాంగ్రెస్ పక్షమేనన్నారు. వైఎస్ కష్టార్జితమే ఈ ప్రభుత్వమన్న ఆమె.. అది కూలిపోవడం తనకు ఇష్టం లేదన్నారు. సత్యవతి బాటలోనే మరికొందరు ఉంటారని తెలుస్తోంది. జగన్ వర్గం నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి రక్షణగా తెచ్చేందుకు సఫలమయ్యామని కాంగ్రెస్ నేతలు కుదుట పడుతున్న తరుణంలో చిరంజీవి రూపంలో కొత్త చిక్కు కాంగ్రెస్‌కు ఎదురైంది. విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికీ నోరు మెదపని నేపథ్యంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమను గడ్డిపోచల్లా చూస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాసంపై పునరాలోచన చేస్తామని బెదిరించారు. తమ నాయకుడు చిరంజీవిని శాసనసభాపక్ష కార్యాలయానికి పిలుచుకొచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కారు. సమావేశం తర్వాత చిరంజీవి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ మద్దతుపైనే మనుగడ సాగిస్తోందన్న చిరంజీవి.. తమ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు చిరంజీవి వ్యాఖ్యలు కలవరం కలిగించాయి. హుటాహుటిన పార్టీ పెద్దలు అందరూ రంగంలోకి దిగారు. చిరంజీవితో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా ఆరా తీశారు.

అందరూ కలిసి విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలపై మరోసారి భరోసా ఇచ్చారని తెలిసింది. దీంతో చిరంజీవి మెత్తబడినట్లు సమాచారం. అయితే.. ఆదివారం జరిగే సమావేశంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు మరోసారి చర్చలు జరపనున్నారు. ఆ సమయంలోనే విప్‌ల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తమ సభ్యులకు విప్ జారీ చేసిన టీడీపీ.. తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కే హరీశ్వర్‌డ్డి, ఎస్ వేణుగోపాలచారి, బాలనాడ్డిలకు కూడా వాటిని పంపింది. వీరు ముగ్గురూ తమ పార్టీలోకి తిరిగి వస్తున్నారంటూ మీడియాకు లీకులు వదిలింది. కానీ, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలూ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడేది తాను ఒక్క చెప్పుకోవడంతో పాటు జగన్ వర్గానికి చెక్ పెట్టాలన్న వ్యూహంతోనే టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ప్రతిపాదించిందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో టీడీపీ పెడుతున్న అవిశ్వాస తీర్మానం అంతిమంగా కాంగ్రెస్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకునేందుకు దోహదం చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఈ వంకతో తిరిగి పార్టీ చెంతకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా.. నికరమైన తెలంగాణవాదులుగా నిరూపించుకునేందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకిఅయిన కిరణ్ సర్కారును కూల్చేయాలని టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌లోని దాదాపు 50 మంది మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎంత మంది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునకు స్పందిస్తారన్నది ప్రశ్నార్థకమే. టీఆర్‌ఎస్ చేస్తున్న యత్నాలు ఫలించినా ప్రభుత్వానికి నూకలు చెల్లిన విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయకపోతే సర్కారును కూలుస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే చాలు కేంద్రం వెంటనే దిగి వస్తుందని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా అవిశ్వాసం తీర్మానంపై పట్టుబట్టడం ద్వారా సభలో తెలంగాణ అంశం చర్చకు రాకుండా చేయాలని, సభను మొత్తం హైజాక్ చేయాలని భావించిన టీడీపీకి టీఆర్‌ఎస్ చెక్ పెట్టింది. తెలంగాణ అంశంపై వరుసగా మూడు రోజులు సభను స్తంభింప జేసింది. మూడవ రోజు సర్కారు వైఖరికి నిరసనగా సభనుంచి బయటకు వచ్చిన తరువాత అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా సీపీఐ, సీపీఎం, బీజేపీ నిలవబోతున్నాయి.

balagalui talangana patrika telangana culture telangana politics telangana cinema




Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News.
Assembly 

Read more...

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సోయి ఉంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలి

- నల్లచట్టాల నల్లారిని దించండి
- నిజమైన తెలంగాణ బిడ్డలుగా నిలవండి
- జై తెలంగాణ అన్నందుకే ‘చెరుకు’పై కేసులు
- నాలుగు కోట్ల మందిని జైల్లో పెడతారా?
- తెలంగాణలోనే ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం
- శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ సభలో కేసీఆర్
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజలు ఒత్తిడి తేవాలి
- అన్ని సంఘాలూ నిరసన తెలపాలి: కోదండరాం




KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaనల్లగొండ, :తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం సోయి ఉన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కిరణ్ సర్కార్‌ను కూల్చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు కాసో జు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘తెలంగాణ ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నిజమైన తెలంగాణ బిడ్డలుగా నిలబడాలి. ఇప్పుడు మనం పులి మీద స్వారీ చేస్తున్నాం, దిగితే పులి మింగివేస్తుంది. ఉద్యమంపై ఏ మాత్రం వెనకడుగు వేసినా సీమాంధ్ర ప్రభుత్వం మనల్ని దోచుకుంటుంది. ప్రజా వైద్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ జై తెలంగాణ అన్నందుకు పీడీ యాక్టు, నాసా కింద కేసులు నమోదు చేశారు. నల్లచట్టాలు అమలుచేస్తున్న నల్లారి కిరణ్‌కుమార్ సర్కార్‌ను కూల్చేయాల్సిందే. ఓ డాక్టర్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిస్తే కాంగ్రెస్ జిల్లా నాయకులు సిగ్గుపడాలి. నాలుగున్నర కోట్ల ప్రజలు జై తెలంగాణ అంటున్నారు, ఎంత మందిని జైల్లో పెడతారో పెట్టండి. 11 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం ఎప్పుడూ హింసా మార్గంలోకి వెళ్లలేదు. ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్న బాధతో కడుపు మండి బస్సులపై రాళ్లు విసిరితే నల్లచట్టాలతో కేసులు పెట్టి సర్కారు వేధిస్తోంది. రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంవూతులు మారినా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఈ సమస్యకు పరిష్కారం. తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరును తెలంగాణలో ఏదో ప్రాజెక్టుకు, రహదారికి పెట్టాలన్న సోయి మన ఎమ్మెల్యేలకు లేదు. సీఎంను చూస్త్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లాగులు తడుస్తున్నాయి. తెలంగాణలో ఏ ప్రాజెక్టుకైనా పేరు పెట్టేందుకు ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి అర్హులు. ప్రజలు సంఘటితమై పోరాడి తెలంగాణ సాధించుకుందాం.’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సువర్ణ అవకాశం: కోదండరాం
srikanthchary-telangana-New talangana patrika telangana culture telangana politics telangana cinemaసోమవారం అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఇది తెగదెంపుల సమరం, చరివూతలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇది సువర్ణావకాశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో, లేక ఆంధ్ర సర్కాకు అండగా నిలుస్తారో తేల్చుకోవాల్సిన సమయమిది. తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని చెప్పుకున్న నేతలంతా అవిశ్వాసంలో తెలంగాణ పక్షాన నిలబడాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఓటు వేసేలా ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలి. జేఏసీ, కులసంఘాలు, తెలంగాణవాదులు ఎవరికి వారే పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలపై ఒత్తిడి తేవాలి. చరివూతలో కీలకమైన సందర్భంలో మనమంతా ఉద్యమించాలి. శ్రీకాంత్‌చారిలా ఆత్మబలిదానాలు అవసరం లేదు, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తేచాలు. జీవితంలో తిరిగి రానిది ఒక్క ప్రాణమే, దాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన శ్రీకాంతాచారి ఈ తరానికి ఆదర్శనీయుడు.

బృహన్నల వేషాలు మాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన ఉండాలని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సూచించారు. అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవూబాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్షికమంలో శ్రీకాంత్‌చారి తల్లిదంవూడులు కాసోజు వెంకటాచారి, శంకరమ్మ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహాడ్డి గుంతకండ్ల జగదీశ్వర్‌డ్డి, కర్నె ప్రభాకర్, నిరంజన్‌డ్డి, రామలక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి చకిలం అనిల్‌కుమార్‌లు కూసుకుంట్ల ప్రభాకర్‌డ్డి, అనురాధ, గురుచరణం, గొంగిడి సునీత, ఎలిమినేటి కృష్ణాడ్డి, వేముల వీరేషం, గాదరి కిషోర్‌కుమార్, పల్లా ప్రవీణ్‌కుమార్‌డ్డి, మాలె శరణ్యాడ్డి, రేకల భద్రాద్రి, ఫరీదుద్దీన్, బక్క పిచ్చయ్య, అభిమన్యు శ్రీనివాస్, పాకాల వెంక గుంటోజు వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.


Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, TRS, KCR,  

Read more...

కాంగ్రెస్‌కు ‘పీఆర్పీ’ ఝలక్

అవిశ్వాస వేళ.. పరీక్ష పెట్టిన ‘చిరు’ కూటమి
- మా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు
- లాబీల్లో చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

- మమ్మల్ని గడ్డిపోచల్లా చూస్తున్నారు
- తొందరపడి విలీనం చేశామేమో
- పీఆర్పీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
- చిరంజీవి ఇంటికి వెళ్లిన బొత్స
- హైకమాండ్ హామీలపై మళ్లీ భరోసా
- చిరుకు ఫోన్ చేసిన ఆజాద్
- మెత్తబడిన చిరంజీవి టీమ్!

CCHIRU-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 3 (): అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న వేళ.. కాంగ్రెస్‌లో విలీనమైన పీఆర్పీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అధికార పార్టీ తమను గడ్డిపోచల్లా చూస్తున్నదని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విషయంలో పునరాలోచన చేస్తామని హెచ్చరించారు. తమ నాయకుడు చిరంజీవికి సైతం ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి గుర్తింపునూ ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసతీర్మానంపై గట్టెక్కేందుకు జగన్ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్‌ను ఉరుములేని పిడుగులా వచ్చిన పడిన ఈ వ్యవహారం కలవరపెట్టింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేసిన సందర్భంగా కనీసం మూడు మంత్రి పదవులతో పాటు చిరంజీవికి రాష్ట్రంలో లేదా కేంద్రంలో ఉత్తమ స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ఇంత వరకూ ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే సరైన సమయమని పీఆర్పీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని సమాచారం.

పీఆర్పీ రేపిన కలకలంతో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఢిల్లీ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ కూడా చిరంజీవికి ఫోన్ చేసి, అభయమిచ్చారని సమాచారం. దీంతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.
శనివారంనాడు శాసనసభ రెండవసారి అరగంట వాయిదా పడగానే ఎమ్మెల్యేలు పీఆర్‌ఎల్‌పీ నేత చిరంజీవిని లాబీలో ఉన్న తమ కార్యాలయానికి బలవంతంగా తీసుకువచ్చారు. తమ పరిస్థితిపై సుుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలపై ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని ఆయన వద్ద వెళ్లగక్కారు. తాము ఎమ్మెల్యేలం కాకముందైనా పనులు చేయించుకోగలిగామని, ఎమ్మెల్యేలం అయ్యాక చిన్న పని కూడా చేయించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యాక గడ్డిపోచలుగా చూస్తున్నారని ఒక ఎమ్మెల్యే అన్నారు.

BCHDHD-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కాంగ్రెస్ నుంచి గెలిచి జగన్ గూటికి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తే వారికి కోట్ల రూపాయల పనులు ఇస్తున్నారని, గౌరవంగా ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎలాంటి షరతు లేకుండా విలీనమైన తమకు కనీస విలువ ఇవ్వడం లేదని చిరంజీవి వద్ద వాపోయారు. తమ నేత అమాయకుడని, చంద్రబాబులాగా ఎత్తుగడలు వేయలేడని, అందుకే తమను ఆడుకుంటున్నారని ఒక నేత అన్నారు. తొందరపడి విలీనం చేసినట్లు వాపోయారు. మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని చిరంజీవి కూడా వారి వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తరువాత పీఆర్‌ఎల్‌పీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన చిరంజీవి తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తమ మద్దతుతోనే ప్రభుత్వం మనగలుగుతోందని అన్నారు. తమ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. చిరంజీవి చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్‌లో కలవరం కలిగించింది.

చిరంజీవి అక్కడి నుంచి వెళ్లిన తరువాత పీఆర్పీ ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధులను కలిసి తాము అవిశ్వాసంపై పునరాలోచిస్తామని ప్రకటించారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సీఎం చిన్న పని కూడా చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్న విలువ తమకు ఇవ్వడం లేదన్నారు. తమ అవసరం వారికి లేనప్పుడు తామెందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని ఒక ఎమ్మెల్యే తమ ఆవేదనను వెళ్లగక్కారు. పీఆర్పీ ఎమ్మెల్యేలు కిరణ్‌కుమార్‌పై అసంతృప్తితో ఉన్నారని తెలియగానే టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, రేవంత్‌డ్డిలు పీఆర్‌ఎల్‌పీ కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు తాము ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ తరువాత అసెంబ్లీ లాబీలోకి వచ్చిన పీఆర్పీ సీనియర్ నేత సీ రామచంవూదయ్య మాట్లాడుతూ ‘‘వాళ్లు బరస్ట్ అయ్యారు.

నేను కాలేదు అంతే’’ అన్నారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నది వాస్తవమేనని తెలిపారు. ఈ పరిస్థితిలో రాబోయే ముప్పును గమనించిన కాంగ్రెస్.. చిరంజీవిని బుజ్జగించే పనిలో పడింది. ఈ మేరకు చిరంజీవిని బొత్స కలిశారు. ఇదే సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి పీఆర్పీ ఎమ్మెల్యే కన్నబాబుతో మాట్లాడారు. అవిశ్వాసం తీర్మానం నోటీస్‌ను అంగీకరించిన నేపథ్యంలో పీఆర్పీ ఎమ్మెల్యేలు దూరమైతే ప్రభుత్వ పతనం ఖాయమని భావించిన ముఖ్యమంత్రి వారిని బుజ్జగించే పనిలో పడినట్లు సమాచారం. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు అవసరమైతే జగన్‌తో వెళ్లినా ఫర్వాలేదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు వారు జగన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Chiru

Read more...

భారత నల్లధనం ఖాతాదారుల గుట్టురట్టు చేస్తా!

- వచ్చే ఏడాది ఎప్పుడైనా అకౌంట్ల వివరాలు విడుదల
-జాతీయ భద్రత పేరిట ఈమెయిళ్లు, ఇంటర్‌నెట్ లావాదేవీలపై ‘నిఘా’
- వాల్‌మార్ట్ వంటి సంస్థలకు చేరవేత
- ఇదేపనిలో భారత నిఘా సంస్థ ‘రా’
- సీబీఐ వివరాలను చైనా లాగేస్తోంది
- ‘సై్ప ఫైల్’ పేరుతో వాటిని బయటపెడతా
- ‘హెచ్‌టీ’ సదస్సులో వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే

julias-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రపంచ దేశాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తున్న వికీలీక్స్ వచ్చే ఏడాది భారత్‌లో సంచలనం సృష్టించనుంది. భారతీయలు స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనం గుట్టురట్టు చేస్తానని వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజే వెల్లడించారు. ప్రస్త్తుతం బ్రిటన్ గృహ నిర్బంధనంలో ఉన్న అసాంజే.. హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో వీడియో కాన్ఫన్స్ ద్వారా మాట్లాడారు. భారత స్విస్ ఖాతాదారుల సమాచారంకు సంబంధించిన సీడీ తన దగ్గర ఉందని, దీనిని వికీలీక్స్‌కు రహస్య సమాచారాన్ని సేకరించి పంపుతున్న రుడాల్ఫ్ ఎల్మర్ తనకు అందించారని తెలిపారు. అయితే ఎల్మర్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారని, ఈ సంకట పరిస్థితిలో నల్లధన ఖాతాదారుల పేరును తాను బయటపట్టలేనని తెలిపారు. తమ మనుషుల్ని కాపాడుకోవడమే ఇప్పుడు ముఖ్యమని వ్యాఖ్యానించార. కానీ వచ్చే ఏడాదిలో ఏదో ఒకరోజు కచ్చితంగా భారత నల్లధన ఖాతాదారుల పేర్లు బయటపెడతానని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. కొన్ని దేశాల నిఘా సంస్థలు కొన్ని కంపెనీలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని ఈ మెయిల్స్, ఇంటర్‌నెట్ లావాదేవీల సేకరిస్తున్నాయని, అనంతరం వాటిని వాల్‌మార్ట్ లాంటి బడా కంపెనీలకు చేరవేస్తున్నాయని వెల్లడించారు. ఈ పద్ధతిలో సమాచారాన్ని సేకరించే అమెరికాకు చెందిన ఎన్‌టీఆర్‌ఓ(అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ) వలే భారత్‌లో కూడా ఓ సంస్థ ఉందని, అది ఇస్లామిక్ ఉగ్రవాదంపై నిఘాపేరిట ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి వ్యవస్థలను వాల్‌మార్ట్, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్‌లాంటి కంపెనీలకు ఆర్థిక సమాచారాన్ని సమకూర్చి పెట్టేందుకే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

జాతీయ, ప్రైవేటు ఏజెన్సీలు సేకరించిన సమాచారాన్ని వాటి ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని తెలిపారు. అయితే ఇలాంటి సమాచారాన్ని పొందినందుకు కంపెనీలు ఏమైనా చెల్లిస్తున్నాయా? లేదా? అనేదానికి తన దగ్గర కచ్చితమైన ఆధారాలు లేవని వెల్లడించారు. ఇలాంటి పనికోసం రెండు ప్రైవేటు కంపెనీలు భారత విదేశీ గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌కు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో రహస్యంగా సాగుతున్న సమాచార దోపిడీ అనేది సర్వీస్ ప్రొవైడర్‌లకు తెలిసిగానీ, తెలియకగానీ జరుగుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. లిబియాలోని ప్రజల కదలికలను తెలిపేందుకు ఆ దేశాన్ని ఎక్కువరోజులు ఏలిన గడాఫీకి ఇలాంటి ఫ్రెంచ్ నిఘా సంస్థే తోడ్పడిందని చెప్పారు. భారత్‌లోని సంస్థకు హిందీ, తమిళ భాషలో ఉన్న సమాచారాన్ని కూడా సేకరించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. గుట్టుగా సాగుతున్న ఇలాంటి సమాచార దోపిడీపై తాను ఆరేళ్ల క్రితం అధ్యయనం చేసానాని తెలిపారు. ఈ సంస్థల ద్వారానే భారత్‌కు చెందిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈమెయిల్‌లను చైనా సేకరించి తన ప్రయోజనాల కోసం వాడుకుంటోందని వెల్లడించారు. ఈ కంపెనీల వల్ల భారత సార్వభౌమాధికారం ప్రత్యక్షంగా ప్రభావితమవుతోందని అన్నారు. భారత్ సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి ప్రజలకు దేశంలో జరిగే ఏ విషయానై్ననా తెలుసుకోగలిగే హక్కు కల్పిస్తూ.. ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా నిరూపించుకొందని అసాంజే కొనియాడారు.

రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించే నిఘా సాధనాలను జర్మనీకి చెందిన ఓ సంస్థ బహిరంగంగానే అమ్ముతోందని వెల్లడించారు. మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్‌ల నుంచి సమాచారాన్ని సేకరించి అమ్ముకున్న నిఘా సంస్థల వివరాలను ‘సై్ప ఫైల్’ పేరిట బయటపెడుతానని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం 287 డాక్యుమెంట్లను విడుదల చేశానని, వచ్చే ఏడాది మిగతా వాటినన్నింటినీ బయటపెడుతానని వెల్లడించారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP