Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, February 18, 2011

జై తెలంగాణ అన్న విద్యార్ధిపై ఉపాధ్యాయురాలి దాడి

తూప్రాన్, ఫిబ్రవరి17 : తెలంగాణలో జై తెలంగాణ అనే స్వేచ్ఛలేకుండా పోతుంది. సహాయనిరాకరణ ఉద్యమంలో తరగతి గదిలో జై తెలంగాణ అన్నందుకు దెబ్బలు తి నాల్సి వచ్చింది. ఆంధ్ర ఉపాధ్యాయురాలు కొట్టిన దెబ్బకు కన్ను వద్ద గా యం అయ్యింది. ఈ సంఘటనతో రెచ్చిపోయిన తెలంగాణవాదులు పాఠశాలలో నిరసన వ్యక్తం చేశారు. ఆ ఉ పాధ్యాయురాలిని నిలదీసి దాడి చేసినంత పని చేశారు. టీఆర్ఎస్ నాయకు ల రాకతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారిపోయింది. దాంతో విద్యార్థులు రోడ్డెక్కి హైవేపై రాస్తారోకో చేశారు.

ఈ సంఘటన తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని గురుకుల పాఠశాలలో గు రువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జిల్లాలో కొనసాగుతున్న సహాయనిరాకరణలో భాగంగా మండలంలోని అల్లాపూర్ శివారులో ఉన్న బాలుర గురుకుల పాఠశాలలో సైతం సహాయనిరాకరణను ఉపాధ్యాయులు పాటించారు. విద్యార్థులకు పా ఠాలు చెప్పడం మానేసి తెలంగాణ పాటలతోనే కాలక్షేపం చేస్తున్నారు. గు రుకుల పాఠశాలకు సమీపంలో ఉన్న హైవే టోల్‌గేట్ వద్ద పలువురు ఆందోళన చేస్తు తెలంగాణకు జైకొట్టారు. ఆ సంఘటనలను చూసిన విద్యార్థులు తరగతి గదుల్లోనే జై తెలంగాణ అంటు నినాదాలు చేశారు.

8వ తరగతిలో విద్యార్థులు కల్వకుంటకు చెందిన వెంకటేశ్, మరో విద్యా ర్థి భరత్‌లు జై తెలంగాణ అంటూ నినాదా లు చేశారు. ఆ తరగతిలోకి వచ్చిన ఆంధ్ర ఉపాధ్యాయురాలైన సహాయ ప్రిన్సిపాల్ శారద కర్రతో విద్యార్థులను కొట్టింది. దాం తో వెంకటేశ్‌కు ఎడమ కన్ను వద్ద గాయమై, కొంచెంలో ప్రమాదం తప్పింది. అలాగే 9వ తరగతికి చెందిన చరణ్‌సాయిరెడ్డి, కె. సాయికిరణ్‌లను సైతం కొట్టినట్లు చె ప్పారు. మధ్యాహ్న భోజన విరామ స మయంలో బయటకు వచ్చిన విద్యార్థులు టోల్‌గేట్ వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ జేఏసీ నాయకులకు చెప్పడంతో జేఏసీ నాయకులు అక్కడకు వెళ్లి దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలిని నిలదీశారు.

విద్యార్థులు జేఏసీ నాయకులు ఎదుటే ఆందోళన చేస్తూ, జై తెలంగాణ అంటు నినాదాలు చేశా రు. ఆంధ్ర ప్రాంతం వారిక్కడ పనిచేయరాదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు అక్కడకు చేరుకొని గురుకుల పాఠశాలలో ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన ఉపాధ్యాయురాలిని ఎందుకు దాడి చే శారని ప్రశ్నించారు. గొడవ చేస్తే కొట్టినట్లు తెలిపింది. విషయం తెలుసుకు న్న ఎస్ఐ జగదీశ్వర్ అక్కడకు చేరుకుని టీఆర్ఎస్ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. జై తెలంగా ణ నినాదాలు చేస్తు విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి44వ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులతో కలిసి రాస్తారోకో చేపట్టారు.

టీఆర్ఎస్ నాయకుడు దోమల ఆంజనేయులు రోడ్డుపై నృత్యం చేయగా, విద్యార్థులు అతడిని అనుసరించారు. ఎస్ఐ జగదీశ్వర్ ఉపాధ్యాయురాలితో క్షమాపన చెప్పిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఎస్ఐ జగదీశ్వర్ ఉపాధ్యాయురాలు శారదను తీసుకువచ్చి తెలంగాణ విషయంలో కొట్టలేదని చెప్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, హరికిషన్‌రెడ్డి, పాండురంగారావు, మధుసూదన్‌రావు, బాలనర్సింహారెడ్డి, శంకర్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, మానిక్‌రావు, చంద్రారెడ్డి, శ్రీశైలంగౌడ్, నాగరాజు, నాయక్‌లు పాల్గొన్నారు. 

Take By: Andrajyohti

Read more...

కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

సిద్దిపేట,మేజర్‌న్యూస్‌:టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 57వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు స్థానిక సాయిబాబా దేవాలయంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు మాట్లాడుతూ తెలంగాణ రా ష్ర్ట ఏర్పాటుకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడుతున్న కేసీఆర్‌కు భగవంతుడు ఆయు రారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు.తెలంగాణ ఉద్యమం నేడు చివరి దశకు చేరు కుందని,పుట్టిన పసిపాప నుంచి వృద్ధుడి వరకు తెలంగాణ అని నినదిస్తున్నారంటే అది కేసీఆర్‌ పోరాటమేనన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లి కార్జున్‌,కూర బాల్‌రెడ్డి,కరాటే కృష్ణ,సాకి గాంధీ,శివాజీ,ఆంజనేయులు,బుస్స రమణ,మల్లికా ర్జున్‌, గుండ్ల యోగీ, కిషన్‌రావు, చిప్ప ప్రభాకర్‌, టైగర్‌ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read more...

Telangana Thadaka : JP gets a beating. Governor faces T – Ire.

A frustated common man today attacked an MLA for testing his patience. Lok Satta Party founder, Kukatpally MLA and self acclaimed intellectual Dr. Jayaprakash Narayan was attacked  in the Assembly premises today. The incident has left him bewildered, and in tears.
The incident occurred when JP was making his way out of a jostling crowd outside the Assembly, at the Media Point. Dr. Narayan has not made any official statement yet, and is said to be contemplating resigning from the Assembly.
Earlier, pro-Telangana MLAs obstructed assembly proceedings on the opening day of the Budget Session, and disrupted the speech of the Governor. Shockingly, he completed his speech in 6 minutes flat !
Reacting to the incident, Rakesh, an RTI activist posted the following on his FB wall.

The holy cow has(read JP) delivered his sermon again. He says telangana employees are forgetting that people are supreme. Well Mr Holy cow, you forgot that long back.
He goes onto talk about the Non-cooperation slated from today. He says, people are supreme and they are the masters and non-cooperation does not serve the purpose. Well Mr Holy cow, this is what Gandhi used against an insensitive Govt, this is what people of egypt did when wanted their leader to bow down. All those qualify to be revolutions. But somehow issues related to telangana however historic they might be, remind this holy cow of his long forgotten adage, ” People are supreme”. Had he followed this, his party’s stand on Telangana would have been crystal clear. Hypocrisy at its best. His party should be renamed HSP (Hypocrites satta party) from LSP.
A historic Non-coperation movement is going to start from today where in people will not cooperate with a govt they dont believe in.
Though we should all condemn the physical attack on a few legislators outside assembly today, comments of JP were totally uncalled for and choosy. He felt that he could not save the constitution only today. But, he never felt this when so many students died for Telangana. He never felt the same when Telangana was looted up side down. Being in Telangana and choosen by Telanganites, one would not expect this from him. When 4 crore people of Telangana have been saying their rights were violated & they need self rule, he thinks only he is right!
On the other side, NBA rules went on a holiday today. All the Seemandhra media were very agile in telecasting this incident more than 200 times. Kudos to them.

take BY: Simply Telangana

Read more...

Non-Cooperation starts today. Are you contributing?




More than two lakh government employees of Telangana will be boycotting work from today as part of the non-cooperation movement launched to mount pressure on the state and Central governments to grant statehood to Telangana.
The agenda is not to cooperate with the rest of Andhra Pradesh from today and ensure no work takes place in the region.

“They would go to the office, sign in the register but they would not work. They would absolutely declare non-cooperation. They will not work for this government which is against the interest of the people of Telangana,” said Telangana Rashtra Samiti (TRS) leader, KT Rama Rao.

Pro-Telanganites will also be not paying electricity bills, water bills, property tax and will be travelling in buses without buying a ticket. Advocates will not argue their cases before judges from the other two regions.
Sanitary workers from GHMC would join the stir at a later stage.

So, what are you doing as part of the non-cooperation? Share your ideas.

Read more...

చంద్రబాబు వల్లే ఇవ్వలేకపోయాం

bharths
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడు రాష్ట్రాలతో పాటు తెలం గాణను సైతం ఇవ్వాలని ఉన్నప్పటికీ అప్పట్లో తమ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు అభ్యంతరం వల్లనే సాధ్యం కాలేదని బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ తేల్చి చెప్పారు. అప్పట్లో టీడీపీ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని బలపరచటం, ఆ పార్టీ సీనియర్‌ నేత లోక్‌సభ స్పీకర్‌గా ఉండటం, చంద్రబాబు తో తమకు సత్సంబంధాలు ఉండటం వంటి కారణాల రీత్యా తెలంగాణ సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. నిజామ్‌ కాలేజీ మైదానంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గురు వారం జరిగిన ఎన్డీయే కూటమి మహా పోరాటం సభను ఉద్దేశించి అద్వానీ ప్రసంగించారు. చంద్రబాబు విషయం లో తాము సంకీర్ణ ధర్మాన్ని పాటించామని, అందుకే ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను మాత్రమే ఇవ్వాల్సి వచ్చిందన్నారు.

మన్మోహన్‌దే ఆ ఘనత...
దేశంలో ఇంత అవినీతి తాండవించేందుకు కారణమైన ఘనత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కే దక్కుతుందన్నారు. స్వా తంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అవినీతి ఏ పాలనలోనూ జరగలేదన్నారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో ప్రధాని అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించటం దేశ చరిత్రలో ప్రథమం అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు గతంలోనూ ఉన్నాయని, మొరార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాలూ సంకీర్ణాలే అని, ఏనాడూ అవినీతికి పాల్పడ లేదన్నారు. ఆదర్శ్‌, 2జీ, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేసేందుకు కేంద్రం అంగీకరించనున్నట్టు తెలిసిందని, అయితే అంత మాత్రా న అవినీతిపై తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు.

దేశం లో అన్ని అనర్థాలకూ కాంగ్రెస్‌ పార్టీయే కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అమె రికా, జర్మనీ లాంటి దేశాలు విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న తమ దేశస్థుల పేర్లను తెప్పించుకుని చర్య తీసుకున్నాయని, మన సర్కార్‌ మాత్రం అందుకు వీల్లేదని చెబుతున్నదన్నారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బుధవారం ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ చూస్తే జాలి వేస్తుంది తప్ప కోపం రాదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ ఇస్తామని అద్వానీ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ విశ్వాస ఘాతుకం...గడ్కరీ
తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ ఆరో పించారు. శ్రీకృష్ణ కమిటీ పేరిట కాలయాపన చేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరాన్ని కుంభకోణాల సంవ త్సరంగా ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా ఢిల్లీలో ఒక్క స్టేడియం నిర్మాణానికి కేవలం రూ.100 కోట్లు అవసరమైతే రూ.950 కోట్లు ఖర్చు చేయటమే ఈ అవినీతికి ఉదాహరణ అన్నారు. 2జీ స్పెక్ట్రమ్‌ విషయంలో రాజాను చాలాకాలం పాటు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తన కింది మంత్రులు ఏమి చేస్తున్నారో తెలియని ప్రధాని ఆ కుర్చీలో ఎందుకు కూర్చు న్నారని ప్రశ్నించారు. బీజేపీ దేశ భవిష్యత్తును మారుస్తుం దని, దోపిడీ నుంచి దేశాన్ని రక్షిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అతివృష్టి కారణంగా అతలా కుతలం అయితే పరామర్శించటానికి ప్రధాని, సోనియా, ఢిల్లీలోని ఆంధ్ర మంత్రులకు తీరిక లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ దొంగల పార్టీ...శరద్‌ యాదవ్‌
కాంగ్రెస్‌ పార్టీ దొంగలపార్టీ అని ఎన్డీయే కన్వీనర్‌ శరద్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అక్రమ సంపాదనను వెలికి తీయాలని డిమాండ్‌ చేశారు. తన ప్రభుత్వంలో తప్పులు చేసిన వారి విషయం తనకు తెలి యదని చెప్పే రాజును గద్దె దించాలని చాణక్యుడి సిద్ధాం తం చెబుతున్నదని, ప్రధాని విషయంలో ఇది వర్తిస్తుంద న్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ దొంగాట ఆడుతు న్నదని ధ్వజమెత్తారు. చిదంబరం తెలంగాణ అంటే ప్రధా ని శ్రీకృష్ణ కమిటీ అంటున్నారని, ఆ పార్టీ ఇలాగే వ్యవహ రిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటీవల బీహార్‌లో వచ్చిన ఫలి తాలే వస్తాయని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే అధి కారంలోకి రాగానే అవినీతిని అంతం చేస్తామని, దోషు లను జైలుకు పంపి తీరుతామని యాదవ్‌ స్పష్టం చేశారు.

సీఎంల మార్పుతో సమస్య తీరదు...వెంకయ్య
crwosరాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్పులతో సమస్యలు తీర వని జాతీయ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రస్తుతం అవినీతి, అస్తవ్యస్త, అరాచక, అధిక ధరలను అదుపు చేయలేని ప్రభుత్వ పాలన సాగుతున్న దని ఎద్దేవా చేశారు. యూపీఏకు దశా దిశా లేవన్నారు. ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నా ప్రధాని మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నల్లధనం దాచుకున్న వారి పేర్లు చెప్పాలని అడిగితే ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ పెళ్ళికూతుళ్ళలా సిగ్గు పడుతున్నారని చమత్క రించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ కపట నాటకం ఆడుతున్నదని, 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని లబ్ధి పొంది తర్వాత గాలికి వదిలేసిందన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం అని వెంకయ్య స్పష్టం చేశారు.

మేమే ప్రత్యామ్నాయం...కిషన్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారటం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము కేంద్రంలో అధికారంలో ఉండగా మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, అక్కడ ఇప్పుడు బీజేపీయే అధికారంలో ఉంద న్నారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి రావటం ఖాయం, తెలంగాణ ఇవ్వటం ఖాయమన్నారు. అప్పుడు తెలంగాణలో బీజేపీయే బలపడుతుందని, మజ్లిస్‌ భయానికి అదే కారణమన్నారు. సీనియర్‌ నేతలు బండా రు దత్తాత్రేయ, సీహెచ్‌.విద్యాసాగరరావు, ఎన్‌.ఇంద్రసేనా రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.లక్ష్మణ్‌, సినీ నటుడు కోట శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

భారీగా జనం...
బీజేపీ అనేక రోజుల నుంచి కష్టపడి భారీగా జన సమీకరణ చేయటంతో నిజామ్‌ మైదానం కిటకిట లాడింది. మహిళలు సైతం అధిక సంఖ్యలో రావటం విశేషం. సభ సందర్భంగా తెలంగాణ కళాకారులు పాడిన పాటలు, నృత్యాలు అందరినీ అలరించాయి.

take BY: Suryaa.com

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP