Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, December 6, 2011

గెలుపు ఖాయమైనా.. తగ్గిన మెజారిటీ


gundu-talangana patrika telangana culture telangana politics telangana cinemaమాస్కో , డిసెంబర్ 5: రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వలోని ‘యునైటెడ్ రష్యా’ పార్టీకి అక్కడి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 50 శాతంపైన ఓట్లు లభించినప్పటికీ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ పార్టీ భారీస్థాయిలో మెజారిటీ కోల్పోయింది. ఇప్పటివరకు 88 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి యునైటెడ్ రష్యా పార్టీకి కేవలం 50.2 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. 2007లో ఆ పార్టీకి దక్కిన 64 శాతం ఓట్లకన్నా ఇది చాలా తక్కువ. ఇక 19.12 శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ (కేపీఆర్‌ఎఫ్) ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరసగా ఏ జస్ట్ రష్యా పార్టీ (13.02 శాతం ఓట్లు), లిబరల్ డెమోక్షికటిక్ పార్టీ ఆఫ్ రష్యా (11.66 శాతం ఓట్లు) ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష పదవికి పోటీపడబోతున్న పుతిన్‌పైగల ప్రజాదరణకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. 

Take By: T News


Tags: Telangana News,  AP News, Political News, Hyderabad News, News,Putin, Russia, Russia Election

Read more...

అసాంజెకు ఊరట

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: లైంగిక ఆరోపణల కేసులో స్వీడన్‌కు అప్పగింత ముప్పును ఎదుర్కొంటున్న వికీలీక్స్ స్థాపకుడు జూలియన్ అసాంజెకు ఊరట లభించింది. స్వీడన్‌కు అప్పగించే విషయంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని బ్రిటన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. లైంగిక ఆరోపణల కేసులో అసాంజేను స్వీడన్‌కు అప్పగించాలని హైకోర్టు గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై సుప్రీంలో సవాలు చేయడానికి వీలు కలగడంతో తనకు న్యాయం జరుగుతుందని అసాంజే విశ్వసిస్తున్నారు.

Read more...

Israel stole uranium from U.S

Washington, December 06: A U.S.-based research institute will soon publish what it says is “indisputable” evidence that Israel stole weapons-grade uranium for its still-undeclared atomic weapons program from a nuclear reprocessing plant in western Pennsylvania.
The Institute for Research: Middle Eastern Policy (IRmep) will release this month a 300-page report detailing the initial findings of a multi-year research project investigating the disappearance of highly enriched uranium from the Nuclear Materials and Equipment Corporation (Numec) in Apollo, Pennsylvania in the 1950s and 1960s.

Grant Smith, the director of IRmep, told The Daily Star that the report would include a broad range of newly declassified and un-redacted government documents from various agencies – including the Department of Energy, Atomic Energy Commission, FBI and CIA – that prove that nuclear material was diverted from Numec to Israel.

“The story at this point is that there is no one smoking gun; there are many smoking pistols lying all over the place that we’ve painstakingly collected,” Smith told The Daily Star.

When contacted by The Daily Star, Zalman Shapiro, the founder and former president of the Numec, strongly denied that any diversion of materials to Israel had ever taken place at the plant.

“The story is fabricated. Absolutely fabricated,” said Shapiro, who is now 91 years old.

Smith said that among the evidence to be included in the report is a DOE document confirming that uranium samples picked up by the CIA outside Israel’s nuclear installation in Dimona bore the same isotopic signature as material produced by the Portsmouth Gaseous Diffusion Plant in the U.S. state of Ohio. The Portsmouth plant was a supplier for Numec.

Victor Gillinsky, who was a commissioner for the Nuclear Regulatory Commission from 1975 to 1984, said that evidence of a link between samples found at Dimona and nuclear material produced at Portsmouth, if reliable, would be “very significant.”

“The [Portsmouth] plant was producing very highly enriched uranium, more highly enriched than the usual stuff produced anywhere in the U.S. or other countries because they were turning it out for Navy fuel. So if you found material of that high enrichment, I believe Portsmouth was the only place in the world that would be making it,” Gillinsky told The Daily Star.

The former NRC official cautioned, however, that such evidence should still be viewed with skepticism, since any samples picked up by CIA agents at the Dimona facility would have been extremely small.
“The question is, did they really pick up things that they could clearly identify as coming from Portsmouth?” said Gillinsky.
“If [IRmep] do have something that does nail it down that would be very significant,” said Gillinsky. “But I would look at [the evidence in the IRmep report] very carefully before concluding that it is nailed down.”
The DOE reported in 2001 that 269 kilograms of highly enriched uranium went missing from the Numec plant during the course of its operations under Shapiro’s management from 1957 to 1968.

Suspicion has long swirled around the possibility that the missing uranium was diverted to Israel. Both the FBI and CIA conducted years-long investigations into the missing uranium, but no charges were ever filed.
Previously declassified documents revealed that some of Israel’s most elite spies visited the Numec facility in 1968.
A request submitted to the AEC to gain approval for the visit identified the Israelis as Rafael Eitan, Avraham Ben-Dor, Ephraim Biegun and Avraham Hermoni.

A former director of operations for Mossad, Eitan headed in 1960 the mission that led to the capture of ex-Nazi official Adolf Eichmann in Argentina.

Eitan later served as director of Israel’s Bureau of Scientific Relations (known by its Hebrew acronym Lekem), an intelligence entity that specialized in acquiring scientific and military secrets from abroad through covert means.

As the head of Lekem, Eitan directly oversaw the activities of Jonathan Pollard, a U.S. Navy intelligence analyst who was in 1987 convicted and sentenced to life in prison on charges of spying for Israel.

Ben-Dor was Eitan’s right-hand man in the operation to capture Eichmann, and also served as a long-time Shin Bet agent before being forced to retire in 1986 for covering up the deaths of two Palestinian prisoners.
Biegun was the head of Mossad’s Technical Department, specializing in electronics and communication.
Hermoni was the technical director of the nuclear bomb project at RAFAEL, Israel’s armament development authority.

Smith said the question of whether highly enriched uranium was diverted from Numec to Israel is all the more relevant now in view of current U.S. efforts to halt Iran’s nuclear program.

“Why are we looking at nuclear weapons? Probably the biggest question that’s being asked in this town [Washington] right now is whether to get even more heavily involved in trying to suppress Iran’s nuclear program. And we think it’s extremely valuable to get the truth out about U.S. collaboration, intentional or not, in Israel’s program,” Smith said.

The U.S. Army Corps of Engineers is currently carrying out a $170 million cleanup of the decommissioned nuclear site in Apollo that is scheduled to be completed in 2015.

Read more...

బాబు X నల్లారి (Chandrababu Vs Kirankumar Reddy (CM))

మీరు జాక్‌పాట్ సీఎం..
సోనియా దయతో వచ్చారు
కిరణ్‌పై చెలరేగిన చంద్రబాబు
మామకు వెన్నుపోటు పొడిచింది
మీరు.. కౌంటరిచ్చిన కిరణ్‌కుమార్
ఏకవచనంతో బాబును
సంబోధించిన సీఎం
అభ్యంతరం తెలిపిన ప్రతిపక్ష నేత
ఉపసంహరించుకున్న ముఖ్యమంత్రి

nnl-talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ డిసెంబర్ 5 (): ఆ ఇద్దరూ సభలో కీలక నేతలు. ఒకరు అధికార పక్షానికి నాయకత్వం వహిస్తుంటే.. మరొకరు ప్రతిపక్షానికి సారథ్యం వహిస్తున్నారు. ప్రతి మాటలోనూ బాధ్యతాయుతంగా ఉండాల్సిన వీరు.. సోమవారం నాడు అసెంబ్లీలో నోరుజారారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. వ్యక్తిగత విమర్శలకూ దిగారు. కుటుంబాల ప్రస్తావనలూ తెచ్చుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని నిశితంగా విమర్శించారు. ఈ సందర్భంలోనే పాలకపక్ష, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలతో గందరగోళం ఏర్పడింది.

రైతులకు కావాల్సిన గిడ్డంగులు కూడా నిర్మించలేనివాళ్లు మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, ప్రతిపక్ష నేత గందరగోళంలోనే తన దాడిని కొనసాగించారు. హైదరాబాద్‌లో చదువుకున్న ముఖ్యమంవూతికి వ్యవసాయం, రైతుల బాధలు తెలియవని, తాను పల్లెటూరులో పుట్టి పెరిగానని, 203 కిలోమీటర్లు పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించానని చెప్పారు. తాను ముఖ్యమంవూతిగా ఉన్న కాలంలో ఇంత అసమర్థంగా ఏనాడూ వ్యవహరించలేదని చెప్పారు. కొద్దిసేపు మౌనంగా ఉన్న సీఎం.. ఆ తర్వాత ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు. సవాళ్లన్నింటికీ ప్రతిసవాళ్లు విసిరారు. ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. వేగంగా అసెంబ్లీలోని తన స్థానానికి చేరుకున్నారు.

చంద్రబాబు మాటలకు కౌంటర్‌లు ఇస్తూ సభను రసవత్తరంగా మార్చేశారు. చివరికి వారి జిల్లా రాజకీయాలపై కూడా చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఒక పెద్ద జోక్‌గా మారిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాము ముఖ్యమంవూతిపైనే కాకుండా మొత్తం మంత్రుల మీద అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీనికి స్పందించిన కిరణ్.. తమకు ప్రజల విశ్వాసం ఉందని, చంద్రబాబు విశ్వాసం అవసరం లేదని తిప్పికొట్టారు. పాలనా యంత్రాంగంపై చంద్రబాబు పలు విమర్శలు చేయగా.. తీవ్ర ఆగ్రహ స్వరంతో స్పందించిన కిరణ్.. లెక్కలు చూసుకుందామా? అంటూ సవాలు విసిరారు. దీనికి చంద్రబాబు కూడ అంతే స్థాయిలో ప్రతిస్పందించారు.

వారి సంవాదం ఇలా నడిచింది.

చంద్రబాబు: వ్యవస్థలు మొత్తం కుప్పకూలాయి. రచ్చబండ కార్యక్షికమం జరిగితే ఈ కార్యక్షికమంలో కిరణ్‌కుమార్‌డ్డి తమ్ముడు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్షికమంలో పాల్గొనడానికి ఆయనకేం హక్కు ఉంది? కిరణ్ రాజ్యాంగేతర శక్తిగా మారారు.

కిరణ్: అధ్యక్షా.. ఆ జిల్లాతో మాకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మా కుటుం బం మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే ఆయన పాల్గొన్నారు. అందులో ఏం తప్పో నాకైతే అర్థం కావడం లేదు.

చంద్రబాబు: ఇంత బాహాటంగా కప్పిపుచ్చుకోవడం దౌర్భాగ్యం అధ్యక్షా. అందరికీ కుటుంబాలు ఉంటాయి. సీఎం మాటలు పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఎవరి కుటుంబమైనా రచ్చబండలో పాల్గొన్నదా? లేదే! డబ్బులు వసూళ్లు చేయడానికి తన తమ్ముడిని ఉపయోగించుకుంటున్నారు అధ్యక్షా.

కిరణ్: నీలా గెలిచి పీఏకు నియోజకవర్గాన్ని అప్పగించి మేం రాం. కుప్పం ప్రజలు మంచివాళ్లు గనుక నిన్ను రెండుసార్లు గెలిపించారు. చావుకైనా, పెళ్లికైనా పీఏనే పోతాడు కనుక ప్రజల సమస్యలు ఆయనకెలా తెలుస్తాయి అధ్యక్షా!

చంద్రబాబు: అధ్యక్షా. ముఖ్యమంవూతికి ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేదు. ఏకవచనంతో పిలుస్తున్నారు. ముఖ్యమంవూతిగారు అసహనంలో ఉన్నారు. ఆయనకు హుందాతనమే లేదు.

కిరణ్: సరే అధ్యక్షా.. ‘నిన్ను’ అనే మాటలను ఉపసంహరించుకుంటున్నా. కానీ చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సరైనవి కావు.

చంద్రబాబు: నాడు వైఎస్8ఆర్ సీఎంగా ఉన్నప్పడు ఆపరేషన్ ఆకర్ష్ పెడితే నేడు కిరణ్ ఆపరేషన్ స్వగృహ పెట్టారు. ప్యాకేజ్‌లు ఇస్తున్నారు. ఈ ప్యాకేజీలు రైతులకు ఇస్తే సమస్యలు ఉండనే ఉండవు. సీఎం ఢిల్లీకి పోయినప్పుడు కూడా తన తమ్ముడిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టుకుంటున్నారు. రాజ్యాంగేతర శక్తులుగా మారారు.

కిరణ్: అధ్యక్షా ఇందాకే హుందాతనం గురించి బాబు మాట్లాడారు. చంద్రబాబులా మాట్లాడాలంటే ముందు ఆయన హైకోర్టులో ఆస్తుల విచారణపై స్టే తెచ్చుకోకుండా ఉండాలి. డబ్బులు వసూలు చేసే సంస్కృతి మీది. నీ గురించి విప్పానంటే ఇక్కడుండడు అధ్యక్షా.

చంద్రబాబు: ఇలాంటి మాటలు చాలానే చూశాను అధ్యక్షా. ఆయనగారి తండ్రిని నేనే చిత్తు కింద ఓడించాను. అయన చూసుకుని మాట్లాడాలి.

కిరణ్ : మీరా చంద్రబాబు నాయుడు మా తండ్రిని ఓడించింది? ఎప్పుడు? ఎక్కడ? నా తండ్రి భిక్షతో ఈ రోజు అసెంబ్లీలో ఉన్నావ్. ఇప్పుడు తాతకు దగ్గులు నేర్పుత్నుట్లు వ్యవహరిస్తున్నారు. పుట్టినిల్లు గుట్టు మేనమామకు తెలియదా అన్నట్లు నీ గురించి మొత్తం తెలుసు మాకు. మీ పార్టీ మాజీ జడ్పీ చైర్మన్ కూడా మా పార్టీలో చేరిపోయారు. మీ పని అయిపోయింది.

చంద్రబాబు: సోనియా దయాభిక్షతో కిరణ్‌కు సీఎం పదవి వచ్చింది. ఎమ్మెల్యేలందరూ ఏకక్షిగీవంగా ఎన్నుకోలేదు. సీల్డుకవరుతో ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చారు. మీరు జాక్‌పాట్ సీఎం. సోనియా కాళ్లు పట్టుకొని పదవిని పొందారు. ఢిల్లీ పెద్దలు అంగీకరించకుంటే మనుగడ సాగించలేరు. ఇది చేతగాని, వెన్నెముకలేని ప్రభుత్వం. చేష్టలుడిగిన పాలకులు. స్వతంవూతంగా వ్యవహరించలేరు. వీరి హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మాత్రం రాష్ట్ర ప్రజలే. సీఎం తాను స్వతంవూతంగా వ్యవహరించగలుగుతున్నానని చెప్పగలరా?

కిరణ్ : నా కుటుంబం (కిరణ్, ఆయన తండ్రి అమరనాథ్‌డ్డి) 1962 నుంచి కాంగ్రెస్8 తరఫున 12 సార్లు ఎన్నికల్లో గెలిచింది. నాకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సోనియా గాంధీ దయ ఉంది. మీరు మీ మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి పద్ధతుల్లోనే నాకు సీఎం పదవి వస్తే దాన్ని ఫుట్‌బాల్‌ల తన్నిపారేసేవాడిని. ఇందిరాగాంధీ దయాభిక్షతో టిక్కెట్టు దక్కించుకొని, కాంగ్రెస్8 పార్టీ టిక్కెట్టుపై గెలిచి కాంగ్రెస్8కు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు రాజకీయ చరివూతంతా వెన్నుపోటు చరిత్రే. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడంతో పాపం మంచి పిల్లవాడనుకొని ఎన్టీ రామారావు పిల్లనిస్తే, 1996 వచ్చేసరికి పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అక్రమపద్దతిలో ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చారు.

చంద్రబాబు: నేను నా స్వంతంగా నాయకుడిగా ఎదిగాను. నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఆనాడున్న రాజకీయ పరిస్థితులలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ కలిసి నన్ను శాసనసభా పక్ష నాయకుడుగా ఎన్నుకున్నారు. ఆ క్రమంలోనే నేను ముఖ్యమంవూతినయ్యాను. 1999 ఎన్నికలలో ప్రజల విశ్వాసంతో గెలిచాను. మీరు సోనియా దయతో నాయకుడయ్యారు. మీ ప్రభుత్వం పెద్ద జోక్‌గా మారింది.

కిరణ్ : మీరు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. మీకు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదు.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Assembly, AP Assembly, Chandrababu, Kirankumar Reddy, CM,  

Read more...

కిరణ్ సర్కారు గెలిచింది


- అసెంబ్లీలో 17 గంటల పాటు సుదీర్ఘ చర్చ
- బొత్స వ్యాఖ్యలతో అర్ధరాత్రి రచ్చ
- డివిజన్ ఓటింగ్‌తో ఫలితంపై ఉత్కంఠ

004654656-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 5 (): అంతా అనుకున్నట్లే అయింది! ఊహించినట్లే సర్కారు గెలిచింది. ప్రతిపక్షం అనుకున్న సంఖ్యతోనే మిగిలింది! జగన్ వర్గం తన 18 మంది ఎమ్మెల్యేలను నిలుపుకొంది. కిరణ్ సర్కారుపై టీడీపీ ప్రవేశపెట్ట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రాష్ట్ర ప్రజలందరిలో తీవ్ర ఉత్కంఠ కలిగించి.. కొన్ని పార్టీల్లో అలజడులు రేపిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో నల్లారివారి ప్రభుత్వం నల్లేరుపై నడకలా విజయం సాధించింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 122 ఓట్లు, వ్యతిరేకంగా 160 ఓట్లు వచ్చాయి. ఒకరు తటస్థంగా నిలిచారు. ముగ్గురు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జగన్ వర్గానికి మద్దతుగా 18 మంది నిలబడ్డారు.

చర్చ అనంతరం జరిపిన ఓటింగ్ ఫలితాలను అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40గంటల సమయంలో స్పీకర్ మనోహర్ ప్రకటించారు. జగన్‌కు మద్దతు ప్రకటించిన వారిలో కాంగ్రెస్ నుంచి 16 మంది, పీఆర్పీ, టీడీపీల నుంచి చెరొకరు విప్‌లను ఉల్లంఘించిన కారణంగా వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జగన్ వర్గానికి చెందిన పూతలపట్టు రవి ఓటింగ్‌కు ముందే గైర్హాజరయ్యారు. స్వతంత్ర ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. లోక్‌సత్తాకు చెందిన ఏకైక సభ్యుడు జయవూపకాశ్‌నారాయణ్ తటస్తంగా ఉన్నా రు. టీడీపీ తిరుగుబాటు ఎ మ్మెల్యేలు హరీశ్వర్‌డ్డి, వేణుగోపాలచారి కూడా అవిశ్వాసానికి మద్దతు పలికారు.

విదేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే చెన్నమనేని రమేష్ అనారోగ్య కారణాలతోనూ, ఎంఐఎంకు చెందిన ముంతాజ్‌అహ్మద్‌ఖాన్ అమెరికాలో ఉన్నందున సభకురాలేదు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన స్పీకర్ ఓటు వేయాల్సిన అవసరం రాలేదు. ఇరు పక్షాలకూ సమాన సంఖ్యలో ఓట్లువచ్చినప్పుడు మాత్రమే స్పీకర్ తన ఓటును వినియోగించుకుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏకైక సభ్యురాలు వైఎస్ విజయమ్మ తొలిసారిగా సభకు హాజరై అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. పీఆర్పీ నేత చిరంజీవి విప్ జారీ చేసినప్పటికీ ఆ పార్టీకి చెందిన శోభా నాగిడ్డి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాగా కాంగ్రెస్ సభ్యులు 16 మంది కూడా పార్టీ విప్‌ను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ సభ్యురాలు సుమన్ రాథోడ్ కోర్టు కేసు కారణఁగా ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.

విప్ ధిక్కరించిన వారిపై చర్యలు
పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 16 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటుకు సిద్ధమవుతోంది. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు.

ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. దాదాపు 16 గంటలు కొనసాగిన ఐదోరోజు సమావేశం.. అర్థరాత్రి దాటిన తర్వాత ... గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని అన్ని సమస్యలనూ ప్రస్తావనకు తెచ్చిన చర్చ.. తెలంగాణ అంశంపైనా కీలకంగానే సాగింది. టీఆర్‌ఎస్ నేతలు ప్రస్తావించిన అంశాలపై టీడీపీ, కాంగ్రెస్‌లు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఆరోపణలు.. పత్యారోపణలు, వాగ్వాదాలు.. వాగ్యుద్ధాలు, చురకలు.. ఎద్దేవాలతో సకల కళావల్లభంగా సాగిన అసెంబ్లీలో చర్చ.. ఆద్యంతం వాడివేడిగా, రసవత్తరంగా సాగింది. సాయంత్రం తర్వాత సభలో వాతావరణం క్రమంగా వేడెక్కింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి పతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పీఆర్పీ ఎమ్మెల్యే కన్నబాబు- టీడీపీ ఎమ్మెల్యేలు, విజయమ్మ-బొత్స-టీడీపీ ఎమ్మెల్యేలు, హరీష్‌రావు-మంవూతులమధ్య ఉద్వేగభరితంగా, హాట్‌హాట్‌గా జరిగిన సంభాషణలు సభను మరింత వేడెక్కించాయి.

466556-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం సమాధానం చెప్పి, ఓటింగ్‌కు వెళ్లే చివరి దశలో తీవ్ర దుమారం రాజుకుంది. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన పై వచ్చిన ఆరోపణలపై హైకోర్టుకు వెళ్ళడంలో ఔచిత్యం లేదని రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు తనకు అవిశ్వాస తీర్మానం చివర్లో మాట్లాడే హక్కు ఉందని చెబుతూ ప్రసంగిస్తుండగా, మధ్యలో బొత్సకు స్పీకర్ అవకాశం ఇవ్వడాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా పరిగణించారు. పైగా బొత్స పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఈ దశలో బాబుకు తిరిగి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు తమ స్థానాల నుంచి లేచి స్పీకర్‌ను డిమాండ్ చేశారు.

సభలో ప్రశాంత పరిస్థితి లేకుంటే తాను ఓటింగ్ నిర్వహిస్తానని స్పీకర్ చెప్పడంతో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. బొత్స వైఖరిని ఖండిస్తూ, ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని గర్హిస్తూ స్పీకర్‌తో వాదనకు దిగారు. అర్ధరాత్రి 12.30 గంటల నుంచి అధిక సమయమే శాసనసభ ఇతర కార్యక్షికమాలు చేపట్టకుండానే చాలా సేపు స్తంభించి పోయింది. సభ్యులు స్పీకర్ పొడియం వద్దనే ఎక్కువ సమయం నిలబడ్డారు. చివరకు చంద్రబాబుకు అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పడంతో తిరిగి వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. గందరగోళ పరిస్థితుల తరువాత చంద్రబాబు తిరిగి ప్రసంగం ప్రారంభించి తనకు రైట్ టూ ఆన్సర్ కింద ప్రతిపక్ష నేతగా అవిశ్వాస తీర్మానం చివరలో మాట్లాడే హక్కును ప్రస్తావిస్తూ .. తాను మాట్లాడే సమయంలో మరోకరికి అవకాశం ఇవ్వరాదని చెబుతున్నా స్పీకర్ బొత్సకు అవకాశం ఇవ్వడంలో ఔచిత్యం లేదన్నారు.

ఆ తరువాత సభ సద్దుమణగడంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు ప్రసంగించారు. బాబు ప్రసంగం ముగిసిన తరువాత ఓటింగ్ జరగాల్సి ఉండటంతో కచ్చితంగా అర్ధరాత్రి 12 గంటల తరువాత సభ్యులు అందరు వచ్చి సీట్లో కూర్చొనడంతో సభ నిండుగా కనిపించింది. అవిశ్వాస తీర్మానంపై సభ చర్చ ముగిసి ఓటింగ్ జరిగి ఫలితాలు ప్రకటించే వరకు సభ్యులు అందరు తమ స్థానాల్లో హత్తుకు పోయారు. చంద్రబాబు తాము ఎందుకు అవిశ్వాసం పెడుతున్నామో అంశాల వారీగా వివరించిన తర్వాత చివరకు ఒంటిగంట సమయంలో స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై డివిజన్ ఆఫ్ ఓట్ నిర్వహించారు. ఇందులో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 122 మంది లేచి నిలబడ్డారు. తీర్మానానికి వ్యతిరేకంగా 160 మంది నిలిచారు. ఒకరు తటస్తంగా ఉండగా.. ముగ్గురు గైర్హాజరయ్యారు. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. సభను వాయిదా వేసి సమావేశాలను ముగించారు.

ఉత్కంఠ రేపిన జగన్ వర్గం
ఓటింగ్ సమయానికి జగన్ వర్గం ఏ వైఖరి తీసుకుంటుందన్నది చివరి క్షణం వరకూ సస్పెన్స్‌గానే ఉంది. అయితే.. జగన్‌కు మద్దతు పలికిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పీఆర్పీ నుంచి శోభానాగిడ్డి, టీడీపీ నుంచి ఉన్నారు. మొత్తంగా వీరి సంఖ్య 18కి చేరుకుంది. నిజానికి ఉదయం వైఎస్ జగన్ నివాసం నుంచి 19 మంది ఎమ్మెల్యేలు విజయమ్మ నాయకత్వంలో అసెంబ్లీకి వచ్చారు. వీరిలో పూతలపాటి రవి ఒక్కరే గైర్హాజరయ్యారు. దీంతో సోమవారం రాత్రి దాకా కాంగ్రెస్ పెద్దలు కేవీపీ తదితరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అర్థమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి మరింత మంది తమవైపు వస్తారని జగన్ వర్గం చెప్పినా.. ఆ పరిస్థితి కనిపించలేదు. చివరి రోజు కూడా కేవీపీతో పాటు కొందరు నేతలు అసెంబ్లీ లాబీలో మకాం వేసి జగన్ వర్గం ఎమ్మెల్యేలతో చివరి ప్రయత్నాలు చేశారు. ‘ఆలోచించుకోండి. డివిజన్ ఓటింగ్ ఉంటుంది కనుక, విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత వేటు పడుతుంది’ అని కూడా కేవీపీ, ఇతర కాంగ్రెస్ నేతల నుంచి పరోక్షంగా హెచ్చరికలు వెళ్ళాయి.

అయినా కొందరు ఎమ్మెల్యేలు తాము జగన్ వెంటే ఉంటామని కేవీపీకి స్పష్టం చేసి వెళ్లిపోయారు. అయితే.. అప్పటికే తమకు 163 మంది బలం ఉందని, ఎలాంటి ఢోకా ఉండబోదని నిర్ధారణకు వచ్చిన పాలకపక్షం అంతటితో తన ప్రయత్నాలకు పుల్‌స్టాప్‌పెట్టింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆయా పార్టీల సభ్యులు, పాలక పక్షం వ్యవహరించిన తీరుతో శాసన సభ విలువలు మరింత దిగజార్చాయని వినిపించింది. సభ్యులకు ప్యాకేజీలు ఆఫర్ ఇచ్చిన విషయం సభలో చర్చకు వచ్చింది. ఆయా పార్టీలు ఎమ్మెల్యేలతో బేరాసారాలు కొనసాగించాయనే ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో స్పీకర్ సైతం కల్పించుకుని మన సభ్యులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని సభ్యులకు హితవు పలికారు.

జగన్‌కు వెన్నుదన్నుగా 18 మంది
సభకు హాజరైన విజయమ్మ
జగన్ వర్గం ఎమ్మెల్యేలు:
విజయమ్మ, ప్రసాద్‌రాజు, బాలినేని శ్రీనివాస్‌డ్డి, పిల్లి సుభాష్‌చంవూదబోస్, బాలరాజు, శ్రీకాంత్‌డ్డి, రామకృష్ణాడ్డి, బాబురావు, కొండా సురేఖ, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్‌డ్డి, గురునాథ్‌డ్డి, అమర్‌నాథ్‌డ్డి, ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంవూదాడ్డి, శ్రీనివాసులు, చెన్నకేశవడ్డి, బాలనాగిడ్డి(టీడీపీ), శోభానాగిడ్డి(పీఆర్పీ).

అవిశ్వాసానికి ...
అనుకూలం 122
వ్యతిరేకం 160
తటస్థం 1, గైర్హాజరు 3, ఖాళీలు 7, ఓటింగ్‌కు అర్హత లేని టీడీపి సభ్యురాలు 1


Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Assembly, Krirankumar Reddy, CM,   

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP