Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, February 19, 2011

దెబ్బ పడింది-గుండె మండింది

ఎముకలు కుళ్ళిన
వయస్సు మళ్ళిన
సోమరులార ! చావండి!
నెత్తురు మండే ,
శక్తులు నిండే
సైనికులారా రారండి !…

ఏడనో చదివిన ‘రగలని జీవితం లో మిగిలేదేముంది’, రగులుతుంది తెలంగాణా, మీ మేక వన్నె పులి ఏసం చూసి, కుతంత్రాలు చూసి .. భాష ప్రావీణ్యం అంతా ఇవాళ పేపర్లలో కనబరచిన్రు మావోల్లు, అన్నల్లార మీ తెలివికి జోహార్లు! ఎంత తెలివి, ఎంత మేధా సంపద, అన్త్ర్హ మామిదనే, ఎక్కడి దృతరాష్ట్ర కౌగిలి ఒకడు ‘దౌర్జన్యం’ అంటడు, ఇంకొకకడు ‘చీకటి రోజు’, ‘సిగ్గు సిగ్గు’, ‘రౌడి అసెంబ్లీ’,

ఇంక టివి చానళ్లల్ల పండగ, చూపిచ్చిందే చూపించి, ఎసిందే ఎసి, ఎం దెబ్బ తమ్మి! బాసా ఒకటి కొడితే వంద కొట్టినట్టు – మా మల్లేష్ అన్న , డ్రైవర్ కావొచ్చు, కాదు కాదు, జార్జ్ బుష్ మీద బూటు విసిరిన ‘జెడి’ ఇప్పటినుంచి! నీకు తెలంగాణాల ఉద్యమంల ఒక పేజి ఉన్నది మల్లెషన్న! మల్లోకసారి మా కళ్ళకు మరొక వికృత రూపం చూపించి నందుకు.. తెగించి కొట్లాడుడే అని రక్తంల ఉన్నది, పదవులు, చచ్చు పరువు గురించి ఆలోచించలేదు! నీ యబ్బ! ఎం జిందగీ రా భై, జీవితాంతం కండ్లు తెరుచుకుంటూనే ఉంటాయ్, ఇంత దౌర్బాగ్యం ఏడ లేదనుకుంటా! పొద్దునే ఒక మిత్రుడు ఫోన్ చేసి ‘చీకటి రోజు’ అని టైటిల్ పెట్టినందుకు, ఇవాల్టినుంచి ఈనాడు పేపర్ బందు పెడ్తున్న అన్నడు! అది విజయం, గుండె రగిలింది అన్నకు..అదే ఇప్పుడు కావాల్సింది . ఒక తుగ్లక్ గాడు గవర్నర్ ఉంటాడు, వాడు మాట్లేది మనం వినాలే అంటడు, ఇంకొక దగుల్బాజీ గాడు ‘సత్తా’ లేని దద్దమ్మ,

అవినీతి కి వ్యతిరేకంగా అని, పూర్తిగా అవినీతిలో మునిగే మేక వన్నె పులి గాడికి మీడియా వత్తాసు. హరిషన్న, రాజెందరన్న అందరికి ఇవాళ దెబ్బ పడింది, గౌరవ మర్యాదలు, విలువలు అంటు చిలువలు పలవలుగా పేలుతున్న సీమంద్రా నాయకులను చూస్తుంటే ఇన్ని రోజులు దాచుకున్న , అణచి వేసుకున్న పౌరుషం బయట పడ్డది, ఒక దెబ్బ పండింది. ఇపుడైనా శాంతి మంత్రాలూ పలికే , న్యాయ అన్యాలు పలికే మావోల్లకి తెలవాలే, కడుపు మండితే ఏమైతదో..దమ్మున్నోడు కొడుతాడు, తిడతాడు, చేతకానోడు, బడ బరిన్చాలేనోడు చస్తాడు..గంతే అన్న!
ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు..ఎంత సహనం ఇంకెంత సహనం,

ఏది హింస, ఏది ప్రజాస్వామ్యం? అర్థాలు మార్చిన ఆంధ్రోల్ల దౌర్జన్యం ఎన్నడు కనపడని మేధావులు ఎన్ని రోజులు మామీద మీ జులుం, అన్న! ఎంత మంచి మనసు నీకుందని తెలవక ఎంత సోచయిన్చినం? నీకు ఒక్క దెబ్బ ఇంత దిమ్మ తిరుగుతదని, ఇంత స్పందించే హృదయం నీకుందని తెల్వక పాయె గదనే! ఒక్క దెబ్బనే నీకు ఇంత మండితే, మాకు ఎన్ని దెబ్బలు, ఎన్ని చావులు, ఎన్ని నష్టాలు, కష్టాలు, నవ్వులపాలు అయిన బతుకులు..ఇవన్ని నీకు ఎన్నడు ఎందుకు కాన రాలే? నిన్నటికి నిన్న , మా కరీంనగర్ మడంపల్లి ల, మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూన్న ఆడోల్ల మీద , హత్య , అత్యాచారం, కుల దూషణ చేసి, ఆడోళ్ళను భయపెట్టి , ఆస్తి నష్టం చేసిన్రని ఊరంతా అర్రెస్ట్ చేసి , 34 మంది పై నాన్ బైలబుల్ కేసులు 400 వందల మంది పోలిసోల్లు, 14 మంది ఎస్సైలు , 4 సిఐలు , ఒక డిఎస్పి ఊరు మీద పడ్డారు, అంతా పెద్ద పోరాటం , అది కూడ చదువు కొని ఆడోల్లు చేస్తూన్న పోరాటం,

మా నీళ్ళు బోతున్నై, భూమి పోతుందీ అని రోడ్డున పడితే మీకు వార్త కాదు..జిల్లా పేజీల ఒక చిన్న న్యూస్, మా వోల్లు , రైళ్ళ కింద బడి, విషం తిని, కాలి పోయి, అలసి పోయి సొలసి పొతే మీకు మొదటి పేజి వార్త కాదు ..ఎం డిస్క్రిషన్ అన్న, ఒక్క పాలి చేప్తివంటే మా అజ్ఞానాన్ని మేము మల్ల మర్చి పోయి, మీ గొప్పతనానికి సన్మానం చేస్తాం, ఒక సారి మరొక కొత్త పాటం నేర్సుకున్టం. ఆశలు మిమ్మల్ని చూస్తె చాల బాదేస్తది, ఛీ, తూ, నీయవ్వ, అబ్బ , లుచ్చ , లఫన్గే( ఇంక ఎక్కువ తిట్టలేను..సభా మర్యాద..క్షమించున్ద్రి) అన్నంక కూడ దిక్కులేకుండా మా మీద పడి, మా జాలి దయ మీద బతుకుతున్నారు, ఇంత సిగ్గులేని బెకార్గాల్లతోని ఇన్ని ఏండ్లు ఉన్నామంటే మా మీద మాదే అసహ్యం ఎస్తుంది..మీకు వంత పాడే మా వోళ్ళని కూడ ఇవ్వాల్టి నుంచి జాతి బహిష్కరణ చేస్తున్నాం, మీ ఆంధ్రోల్ల కాడికి తీస్క పొండ్రి, మా బిడ్డలైన సరే, దేశ ద్రోహులని భరించే శక్తి, మంచి తనం మాకు లేదు! మమ్మల్ని జర వదిలేయుండ్రి .. మీ కళ్ళళ్ళ భయం చూస్తున్నాం, ఇది మా విజయం! భయ పడి చావండి , క్షణ క్షణం చావండి, మీరు తినే అన్నం మేతుకులలో మా పిల్లల రక్తం నిండి ఉంది, జలగల్లాగా పట్టి పీడిస్తున్న మీకు ..నిన్న బడ్డది ఒక సాంపిల్ మాత్రమె..భయమున్నోడే ఎక్కువ ఆవేశ పడతాడు, ఎక్కువ వేషాల్ ఎస్తాడు, మైండ్ పని చేయక అడ్డగోల్ పని చేస్తడు,

ఏడనో దొరికి పోతాడు ..మీకు దిమాక్ పని చేస్తలేదని చెప్పనికి ఇంత కంటే వేరే సాక్షం అక్కర్లేదు, మాకు తెలుసు..పొల్లు పొల్లు గొట్టి తన్ని తరిమేసే దాక మీరు పోరని, ఆ పరిస్తితి మీరే మాకు కల్పిస్తున్నందుకు మీకు ధన్య వాదాలు..ఎం చేయాల్రా భై! మీ అంతా నీచులం కాదు,

కమీనే కుత్తేలం గాదు, మా రక్తంల లేదు, ఒకడో అరనో, కల్తి గాడు ఎడైనా ఉంటాడు అనుకో, ఇగ బోతరు , ఆగ బోతరు అని చూస్తుంటే, ఒక్క అడుగు కూడ కదుల్తలేర్ర బై, నీ జాతి! సిగ్గు సిగ్గు! ఇంక ఎం మిగిలుందిరా వెధవల్లారా! దోసుకున్నంత దోసుకున్నారు! మా బొక్కలు, ఆస్థి పంజరాలు ఉన్నాయి, వాటితోటి కూడ ఏమైనా కొత్త వ్యాపారం చేస్తున్ర? ఎంత కైనా సమర్థులు తమ్మి! ప్రేమలు అమ్మగలరు, అమ్మలను తాకట్టు పెట్ట గలరు, నమ్మకాలను వేలం వెయ గలరు..కానియ్ , మాకు ఇపుడిపుడే సమజ్ అయితుంది..కండ్లు తెరుసుకున్తున్నాయి..మర్యాద మీతో మాత్రం చెల్లది! అయిన మనుషులైతే మర్యాద కదా! జంతువులు అనటానికి కూడ మనసోప్పుతలేదు..ఎం బతుకులురా మీయి, తిడతానికి కూడ తిట్లు లేవు, పోలుస్తానికి జంతువులు కూడ సిగ్గు పడుతున్నాయి.. ఇన్ని రోజులు మీతో కలిసున్నందుకు ఎన్ని పాపాలు చుట్టూ కున్నాయో ఏమో..తెలంగాణాల ఉన్న చెరువుల, నదుల్ల అన్నిట్లల్ల మునిగి పాపాలు కడుక్కోవాలే..

అయిన ఈ పని ఎపుడో చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది కదా! ఇపుడిపుడే రక్తం సాల సాల కాగుతుంది కదా..
ఇపుడు శ్రీ శ్రీ లు కావాలి, ఉదం సింగ్ లు , భగత్ సింగ్ లు రావాలి, కావాలి కొదమ సింహాలు కొమరం భీమ్లు, ఐలవ్వలు, యాదగిరిలు, బందగీలు..అపుడే అపుడే తెలంగాణా సాద్యం..కమిటీలు కథలు చూసినం, రాజకీయ చతురతలు చూసినం, ఇంక మిగిలింది ఒకటే పోరాటం, ప్రత్యక్ష పోరాటం..ఎవడికి చేతనైంది వాడు చేయాలే ..శ్రీ శ్రీ లు కావాలె, సింహాలు కావాలె ..
ఏవో
ఏవేవో ఏవేవో
ఘోషలు వినబడ్తున్నై
గుండెలు విడి పోతున్నాయ్
ఎవరో
ఎవరివో ఎవరెవరో
తల విరబోసుకు
నగ్నంగా నర్తిస్తున్నారు – భయో
ద్విగ్నంగా నర్తిస్తున్నారు
అవిగో
అవిగవిగో అవిగవిగో
ఇంకిన – తెగిపోయిన-మరణించిన
క్రొన్నెత్తురు -విపంచికలు-యువయోధులు
నేడే
ఈనాడే ఈనాడే
జగమంత బలివితర్ది
నరజాతికి పరివర్తన
నవజీవన శుభసమయం, అభ్యుదయం ..
తెలంగాణా విముక్తి..తెగిమ్పుతోనే సాధ్యం..
Thanks సుజాత సూరేపల్లి for sharing


take BY: Simplytelangana

Read more...

5 MLAs suspended. Mallesh sent to Jail.

Mallesh, driver of TRS leader E. Rajender, was sent to jail until March 29 for allegedly hitting Lok Satta president Jaiprakash in the Andhra Pradesh assembly premises the day before. He was produced before Deputy Speaker Nadendla Manohar, who ordered that he be lodged in jail till the end of the budget session March 29.
Manohar informed the house that an outsider was involved in the attack and it was breach of privilege of the member. He also sought a detailed report on the incident from Hyderabad Police Commissioner A.K. Khan.
A first information report (FIR) was registered on a complaint by legislature secretary Raja Sadaram. Mallesh has been booked under Section 353 of the Indian Penal Code, which relates to assault or criminal force to deter public servant from discharge of his duty.
Many wondered if terming TRS MLAs as anti-social and making sarcastic comments was the duty that he was discharging.
Earlier, five Telangana MLAs including Harish Rao were suspended for seven days for allegedly heckling governor ESL Narasimhan during his address to the House on Thursday.
Interesting part was that educational institutions in Andhra and Raylaseema regions were closed to protest the attack. Students at universities in the Andhra and Rayalseema regions took out “rallies” condemning the incident !

Read more...

రోడ్డుపైనే విద్యార్థులకు తెలంగాణ పాఠాలు

సిద్దిపేట,మేజర్‌న్యూస్‌: నలుగురు నడిచే రోడ్డే తరగతి గదిగా మారింది.ఉపాధ్యాయులు అక్కడే విధులను నిర్వహించి విద్యార్థులకు తెలంగాణ పాఠాలను బోధించారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ నెల 17 నుంచి టీటీ జాక్‌ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సహా య నిరాకరణలో భాగంగా శుక్రవారం నాడు లింగారెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సహాయ నిరాకరణలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రోడ్డుకు అడ్డంగా బో ర్డును,తెలంగాణ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలం గాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం,త్యాగాలు,ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు వివరిం చారు.

గ్రామ ఎంపీటీసీ బండి రంగయ్య తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకేనని చెప్పారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ వర్కింట్‌ కమిటీ సభ్యులు మేర్గు మహేష్‌ మాట్లాడుతూ ఇక నుంచి అన్ని రకాల పలకరింపులు జై తెలంగాణ అనే సాగుతాయన్నారు. రోడ్డు పైనే విద్యార్థులకు తెలంగాణ పాఠాలను బోధించటంతో సిద్దిపేట-చిన్నకోడూరు రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి.ఈ సందర్భంగా విద్యార్థుల తెలంగాణ నినాదాలు,తెలంగాణ గేయాలతో ఆ ప్రాంత మంతా దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి.అశోక్‌, మురళీ, యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు.

Read more...

ఈసారికి తెలంగాణ బిల్లు లేదు


Bansalన్యూఢిల్లీ, సూర్య ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశం లేనేలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఢిల్లీలో తనకు కలిసిన తెలంగాణ నేతలను ఆయన తీవ్రంగా మందలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అతి సున్నితమైన తెలంగాణ అంశంపై సంచలన ప్రకటనలు గుప్పించడం, ప్రధా నిని తప్పుపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నామని ప్రక టించినప్పటికీ రాత్రికి రాత్రి హామీ కావాలని పట్టుబట్టడం అధిష్ఠా నాన్ని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించమే అవుతుం దని బన్సాల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

పార్లమెంటులో బిల్లు పెట్టా లంటే అందుకు 15 రోజులు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి వుంటుందని, అదీకాక సభ కార్యకలాపాల జాబితా ఇప్పటికే ఖరారైందని, ఈ సాంకేతికాంశాలు తెలిసి కూడా హడావుడి చేస్తే సహించేది లేదని బన్సాల్‌ హెచ్చరించారు. ఢిల్లీలో మకాం చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలపై అధిష్ఠానం కూడా అగ్గిమీద గుగ్గిలం అయింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు, పార్టీ వ్యవ హారాలలో మేడం తలమునకలై వున్నారని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీకి రావడమే కాకుండా.. తెలంగాణ ఏర్పాటు హామీ లభించే వరకు ఇక్కడనుంచి కదిలేది లేదని ప్రకటిం చడమేమిటని మందలించినట్లు తెలిసింది.


politicas
రాష్ట్రంలో ప్రజాసమస్య లు చర్చించకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఢిల్లీలో మకాం వేయడం మంచిది కాదని పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ద్వారాహెచ్చరించినట్లు తెలిసింది. హుటాహుటిన హైదరాబాదు రావాలని శుక్రవారం ఉదయం ఆయన పార్టీ నేతలకు ఫోన్‌ చేసి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తెలంగాణకు చెందిన 24 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు నిరాశతో హైదరాబాద్‌ వెనుదిరిగారు. అటు మేడం దర్శనం లభించక, ఇటు తెలంగాణపై ఎలాంటి హామీ సాధించలేక భిక్కమొఖంవేసి వారు తిరుగుముఖం పట్టారు.

5 రోజులు ఏం చేశారు...?
సోమవారం ఢిల్లీ వచ్చిన వీరంతా రోజుకు ఒకరిద్దరు మంత్రులను కలిసేందుకు ప్రయత్నించడం, సాయంత్రానికి మీడియా ముందు తాము తెలంగాణకోసం కృషి చేస్తున్నామని, మేడం రేపో మాపో అపాయింట్‌మెంటు ఇస్తారని కబుర్లు చెప్పడం మినహా చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు అధిష్ఠానంలోని ప్రధాన నాయకుల నుంచి ఏ హామీ లభించిందని విలేకరులు ప్రశ్నించగా... మేము కోరాం అందుకు సానుకూలంగా స్పందించారనే దాటవేత దోరణిని అవలంభించారు. కొందరు నాయకులు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహం చాటేశారు.

కొందరైతే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇచ్చే విందులకు హాజరై సుష్టుగా అన్ని ప్రాంతాల వంటకాలను రుచి చూశారు. ఈ పర్యటన మూడు విందులు, రెండు భేటీలతో పరిసమాప్తం అయ్యింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నాయకులు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, రక్షణ మంత్రి ఎకె. ఆంటోని, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్పమెయిలీ, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, హోంశాఖ మంత్రి చిదంబరం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌లతో భేటీ అయ్యారు.

Read more...

Why Harish Rao reacted so much?

Ever since the assembly episode, leaving others, everyone wondered why Harish Rao, known to be very patient reacted that way. Harish has been silent on the episode and did not disclose the reasons for his reaction but, when the government pushed away all norms and made selective clippings of the assembly proceedings public, he chose to break his silence.
Speaking to the media, Harish said that the Governor Mr. E.S.L. Narsimhan, had called the agitating TRS and TDP leaders as “bastards” during his joint address on Thursday. He demanded an apology from the Governor and asked why no case had been booked by the Deputy Speaker against the Governor for insulting the MLAs.
With this, one can understand why the TRS and TDP MLAs were so agitated.
Its high time to recall the Governor.


Note : This site has never encouraged abusive language even in comments but chose to publish this news bit only to reveal the kind of language honourable Governor has used against our MLAs.


Take By : Simply Telangana

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP