Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, February 19, 2011

ఈసారికి తెలంగాణ బిల్లు లేదు


Bansalన్యూఢిల్లీ, సూర్య ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశం లేనేలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఢిల్లీలో తనకు కలిసిన తెలంగాణ నేతలను ఆయన తీవ్రంగా మందలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అతి సున్నితమైన తెలంగాణ అంశంపై సంచలన ప్రకటనలు గుప్పించడం, ప్రధా నిని తప్పుపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయానికి ప్రయత్నిస్తున్నామని ప్రక టించినప్పటికీ రాత్రికి రాత్రి హామీ కావాలని పట్టుబట్టడం అధిష్ఠా నాన్ని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించమే అవుతుం దని బన్సాల్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.

పార్లమెంటులో బిల్లు పెట్టా లంటే అందుకు 15 రోజులు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి వుంటుందని, అదీకాక సభ కార్యకలాపాల జాబితా ఇప్పటికే ఖరారైందని, ఈ సాంకేతికాంశాలు తెలిసి కూడా హడావుడి చేస్తే సహించేది లేదని బన్సాల్‌ హెచ్చరించారు. ఢిల్లీలో మకాం చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలపై అధిష్ఠానం కూడా అగ్గిమీద గుగ్గిలం అయింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు, పార్టీ వ్యవ హారాలలో మేడం తలమునకలై వున్నారని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీకి రావడమే కాకుండా.. తెలంగాణ ఏర్పాటు హామీ లభించే వరకు ఇక్కడనుంచి కదిలేది లేదని ప్రకటిం చడమేమిటని మందలించినట్లు తెలిసింది.


politicas
రాష్ట్రంలో ప్రజాసమస్య లు చర్చించకుండా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఢిల్లీలో మకాం వేయడం మంచిది కాదని పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ద్వారాహెచ్చరించినట్లు తెలిసింది. హుటాహుటిన హైదరాబాదు రావాలని శుక్రవారం ఉదయం ఆయన పార్టీ నేతలకు ఫోన్‌ చేసి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తెలంగాణకు చెందిన 24 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు నిరాశతో హైదరాబాద్‌ వెనుదిరిగారు. అటు మేడం దర్శనం లభించక, ఇటు తెలంగాణపై ఎలాంటి హామీ సాధించలేక భిక్కమొఖంవేసి వారు తిరుగుముఖం పట్టారు.

5 రోజులు ఏం చేశారు...?
సోమవారం ఢిల్లీ వచ్చిన వీరంతా రోజుకు ఒకరిద్దరు మంత్రులను కలిసేందుకు ప్రయత్నించడం, సాయంత్రానికి మీడియా ముందు తాము తెలంగాణకోసం కృషి చేస్తున్నామని, మేడం రేపో మాపో అపాయింట్‌మెంటు ఇస్తారని కబుర్లు చెప్పడం మినహా చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు అధిష్ఠానంలోని ప్రధాన నాయకుల నుంచి ఏ హామీ లభించిందని విలేకరులు ప్రశ్నించగా... మేము కోరాం అందుకు సానుకూలంగా స్పందించారనే దాటవేత దోరణిని అవలంభించారు. కొందరు నాయకులు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహం చాటేశారు.

కొందరైతే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇచ్చే విందులకు హాజరై సుష్టుగా అన్ని ప్రాంతాల వంటకాలను రుచి చూశారు. ఈ పర్యటన మూడు విందులు, రెండు భేటీలతో పరిసమాప్తం అయ్యింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నాయకులు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, రక్షణ మంత్రి ఎకె. ఆంటోని, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్పమెయిలీ, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, హోంశాఖ మంత్రి చిదంబరం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కుమార్‌ బన్సాల్‌లతో భేటీ అయ్యారు.

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP