Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, November 10, 2012

అజర్‌కు ఊరట - Andhra high court lifts life ban on Azharuddin


మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్‌పై విధించిన జీవిత కాల నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడంతో ఆయనకే కాదు, ఆయన అభిమానులకు కూడా ఊరటనిచ్చింది. పన్నెండేళ్ళపాటు నడిచిన ఈ కేసులో ఎన్ని మలుపులు ఉన్నప్పటికీ, చివరకు తనకు న్యాయం లభించిందనే సంతృప్తి అజరుద్దీన్‌కు మిగిలిం ది. న్యాయస్థానం తీర్పును పరిశీలిస్తున్నామని బీసీసీఐకి చెందిన పెద్ద ఒకరు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఒక అజరుద్దీన్‌కే పరిమితం చేయకుండా ఇంకా విస్తృతంగా పరిశీలించాలె. 

సమకాలీన క్రికెట్ క్రీడలో అజరుద్దీన్ ఉన్నత శిఖరాలకు చేరిన ఆటగాడనడంలో సందే హం ఎవరికీ లేదు. క్రీడాకారుడిగా కానీ, జట్టు కెప్టెన్‌గా కానీ ఆయన సేవలు అత్యుత్తమమైనవి. హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అజరుద్దీన్, తమ కండ్ల ముందే సైకిల్‌కు ప్యాడ్‌లు కట్టుకుని మైదానానికి వెళ్ళే హుషారైన పిల్లగాడు క్రికెట్‌లో సాధించిన విజయాలు స్థానికులను ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.

 అజర్ తొలి సెంచరీలను నాటి బ్లాక్ అండ్ వైట్ టీవీలలో చూసిన జ్ఞాపకం మధ్యతరగతి క్రికెట్ అభిమానుల కు మరిచిపోలేనిది. గవాస్కర్ కాలం తరువాత కొత్త తరానికి కపిల్ దేవ్‌కు, సచిన్‌కు మధ్యకాలంలో ఎదిగిన అజర్ యువతకు అభిమాన క్రీడాకారుడుగా వెలిగిపోయాడు. అజరుద్దీన్ టెస్టు క్రికెట్‌లోకి వచ్చీ రావడంతోనే ప్రభంజనం సృష్టించాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. 

ఆ వెంటనే ఆడిన రెండు టెస్టుల్లోనూ సెంచరీ కొట్టాడు. ఇట్లా వరుసగా మూడుటెస్టుల్లోనూ మూడు సెంచరీలు కొట్టడం ఇప్పటికీ రికార్డే. అజర్ రికార్డుకు మురిసిపోయిన ఒక స్థానిక రాజకీయపక్షం హైదరాబాద్ నగరంలోని బషీరుబాగ్ చౌరస్తాలో ‘అజర్, అజర్, అజర్ కంగ్రాజులేషన్స్’ అంటూ కట్టిన బ్యానర్ ఆనాడు విశేషంగా యువతను ఆకర్షించింది. అజరు క్రికెట్ రంగంలో అడుగుపెట్టడంతోనే వేగంగా నిలదొక్కుకున్నాడు.

ఓ దశలో అజర్ ప్రభంజనం కారణంగానే విశ్వనాథ్ అప్పట్లో రిట్మైంట్ ప్రకటించాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయంటే ఆయన ఆటతీరు ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ‘బ్యాటింగ్‌లో మణికట్టు మాయాజాలంతో ఆకట్టుకోవడంలో అజరుద్దీన్ తర్వాతే సచిన్ కానీ ఎవరైనా..’ అని మాజీ కెప్టెన్, అంతర్జాతీ య అంపైర్ వెంకవూటాఘవన్ అప్పట్లో ప్రశంసలు కురిపించాడు.

 అప్పట్లో ఇంగ్లండ్ జటు పై అజర్ విజృంభణను చూసి సంబురపడ్డ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత జాన్ వుడ్‌కాక్- ‘అజర్ లార్డ్స్ మైదానంలో ఆడితే అతడు కొట్టిన బంతిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ దళాలను మోహరించాలేమో..’ అని ప్రశంసించాడు. బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లోనూ అజరుద్దీన్ విశిష్టత కాదనలేనిది. అన్నిటికీ మించి భారత జట్టు కెప్టెన్‌గా అజరుద్దీన్ చేసిన సేవ దేశం మరిచిపోలేనిది. అప్పటి వరకు భారత జట్టుకు గెలుపుపై ధీమా ఉండకపోయేది. అంతర్జాతీయ పోటీల్లో మనమూ గెలవగలమనే ధీమా అందించిన కెప్టెన్ అజరుద్దీన్. దేశానికి 14 విజయాలతో జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని అందించాడు.


ఇదంతా ఇప్పుడు గుర్తు చేసుకోవలసిన సందర్భం, ఔచిత్యం ఉన్నది. తన క్రీడా జీవితమంతా క్రీడకు, దేశానికి సేవలందించిన ఆటగాళ్ళ పట్ల మనం వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అనే ఆవేదన కలుగుతున్నది. క్రికెట్ క్రీడల్లో ఉత్తమ సేవలందించిన వారంతా దోషులు కారని చెప్పలేము. ఉన్నతస్థాయి క్రీడాకారులలోఎందరో మ్యాచ్ ఫిక్సింగ్‌లకు, బెట్టింగ్‌లకు పాల్పడిన వారు ఉండే ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆటతీరు పరిశీలిస్తే కచ్చితంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు. అటువంటి వారిని గుర్తించి ఏరివేయాల్సిందే. ఇప్పుడు క్రీడారంగాన్ని పీడిస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు.

దానిని ప్రక్షాళన చేయాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. కానీ నూనూగు మీసాల వయసు నుంచి ఆటనే ప్రాణంగా బతికి, జీవిత కాలమం తా సేవలందించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్న క్రీడాకారుల పట్ల ఆరోపణలు వచ్చినప్పుడు తొందరపాటుతో వారి ప్రతిష్టకు భంగం కలగకుండా క్రీడారంగంలోని పెద్దలు వ్యవహరించాలె. ఈ విషయం ఇతరుల కన్నా క్రీడారంగంలోని పెద్దలకు ఎక్కువగా తెలిసి ఉండాలె. ఇంత సున్నితమైన విషయంలో అంత మొరటుగా నిర్ణయాలు తీసుకోకూడదు. పరువు ప్రతిష్టలను కాపాడుకునే హక్కు సాధారణ ప్రజలకైనా, క్రీడాకారులకైనా ఉంటుంది. 


అజరుద్దీన్ మీద బీసీసీఐ ఆనాడు నిషేధం విధించనట్టయితే అప్పటి వరకు 99 టెస్టుల్లో ఆడిన ఆయన మరో టెస్టుతో వంద పూర్తి చేసుకునేవాడు. వందకు చేరి రికార్డు సృష్టించాలనేది ఏ క్రీడాకారుడికైనా ఉండే కల. నిషేధం విధించిన నాటి నుంచి అజర్ కళంకితుడిగా గడపాల్సి వచ్చింది. ఆయన పొందిన నష్టాన్ని గణించడానికి ఏ కొలమానాలు సరిపోవు. తాను 99 టెస్టులు మాత్రమే ఆడాలనేది విధి రాత కావచ్చునని, తనకు ఎవరిపై ఆగ్రహం లేదని, బీసీసీఐపై కూడా న్యాయం కోసం పోరాడబోనని అజర్ నిర్వికారంగా వ్యాఖ్యానించడంలోనే ఆయనలోని ఆవేదన కనిపిస్తున్నది.

అజర్ ఆటలో ఏ ఒత్తిళ్ళకు లొంగినట్టు ఆధారాలు లేవని న్యాయస్థానం అభివూపాయపడింది. ఆయనపై జీవిత కాల నిషేధం విధించడానికి తగిన ఆధారాలను బీసీసీఐ చూపలేక పోయిందని కోర్టు స్పష్టం చేసింది. బీసీసీఐ ఏకపక్షంగా వ్యవహరించిందని కూడా పేర్కొంది. దీనిని బట్టి బీసీసీఐ ఆటగాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు తెలిసిపోతున్నది. మ్యాచ్ ఫిక్సింగ్‌తో పాటు అనేక రూపాల అవినీతి క్రీడా వ్యవస్థను పీడిస్తున్నది.

 ఆరోపణలు వచ్చినప్పుడు ఆటగాళ్ళపై వేటు వేస్తూ, అతిగా స్పందించినట్టు కనిపిస్తున్నదే తప్ప బీసీసీఐ వ్యూహాత్మకంగా మ్యాచ్ ఫిక్సింగ్‌ను కట్టడి చేయడానికి, ఇతర విధాల అవినీతిని నిర్మూలించడానికి పూనుకోవడం లేదు. అజర్‌పై రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా బీసీసీఐ తనను సంస్కరించుకోవాలె. క్రీడావ్యవస్థను ప్రక్షాళన చేసి దోషులను గుర్తించడంలో తగిన విధానాలను రూపొందించుకోవాలె. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తనకు బాధ్యత ఉందని గ్రహించాలె.

Read more...

‘HSBC arranged for opening of accounts abroad and withdrawal from Delhi itself’

India Against Corruption (IAC) released on Friday “the modus operandi” for transfer of undisclosed funds to Swiss banks as disclosed in the statements of three persons who had opened accounts in Dubai, Zurich and Geneva with HSBC Bank. They were named in a list of 700, which was shared by the French government in a compact disc with the Indian government last year. 

The names of the 10 VIPs, including the Ambanis, Congress MP Anu Tandon, Jet Airways chief Naresh Goyal and the Burman brothers of the Dabur Group, were among the 700 whose names were not revealed by the government. The accounts held by them pertained to 2006.

IAC members Arvind Kejriwal and Prashant Bhushan said Parminder Singh Kalra and Praveen Sawhney, who gave their statements, were based in Delhi, while the third person, Vikram Dhirani, was from Ghaziabad.


The persons, who were questioned under Section 132 (4)/133A of the Income Tax Act, 1961, revealed the modus operandi of the “underground banking” system or the ‘hawala’ network (money transferred but not moved).


As per the papers released by IAC at a press conference here, Mr. Dhirani said in his deposition that he had opened an account with HSBC in Dubai in 2005 and closed it in 2006. A bank representative came to him in Delhi to open an account. He did not travel to Dubai for opening or operating it. The formalities was completed in Delhi. He agreed that a person authorised by bank officials would collect the cash from him, which would show up in his HSBC account in Dubai. After the money was deposited, Mr. Dhirani was given a confirmation. However, no document was given.

IAC said the statement revealed that Mr. Dhirani told income tax officials that he had deposited about Rs. 12 crore in alleged unaccounted income in the Dubai account over a period of time. The account was closed in 2006, and the money was withdrawn and given to him in Delhi. Neither did he go to Dubai to collect the cash, nor did he arrange for his representative to take the cash on his behalf. “The bank officials arranged for delivery of cash… in India.”

According to IAC, Mr. Kalra opened an account with HSBC, Zurich, on the advice of a Swiss investment consultant based in Zurich. To make deposits of undisclosed money to the tune of Rs. 8 crore-Rs. 9 crore, he gave the cash in instalments to a person in Delhi. Every time, a different person came to collect the cash for being remitted in the Zurich branch of HSBC. The account was closed in 2008-09 even while he remained in Delhi.

“The statement shows,” Mr. Kejriwal said, “that bank officials are providing illegal channels for transfer of cash from their client account-holder in Delhi to Zurich and vice versa.”

He said Mr. Sawhney, who had opened an account with HSBC, Geneva, told income tax officials that his father had transferred $ 1.8 million to this account. “Regarding the modus operandi for withdrawal of money, Mr. Sawhney said he used to call the bank officials in Geneva who would arrange for delivery of cash in India through their agents in the hawala channel. All discussions with the bank officials were on the phone. Every time he asked for cash, a different person used to come to deliver it and he knew none of them.” 

- The Hindu News

Read more...

హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతీయుల నల్లధనం 6 వేల కోట్లు!

తాజా బాంబు పేల్చిన కేజ్రీవాల్ బృందం
700 మందికి ఆ బ్యాంకులో ఖాతాలున్నాయని ఆరోపణ..
జెనీవా బ్యాంకులో గుప్త సొత్తుల గుట్టురట్టు
అవినీతికి ప్రభుత్వ ప్రోత్సాహం.. మండిపడిన కేజ్రీవాల్
- అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో రూ.100 కోట్లు
- మొటెక్ సాఫ్ట్‌వేర్ సంస్థ (రిలయన్స్ గ్రూప్) ఖాతాలో రూ.2100 కోట్లు
- కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్ టాండన్ ఖాతాల్లో రూ.125 కోట్లు
- డాబర్ కంపెనీకి చెందిన బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 9: కేజ్రీవాల్ మరో బాంబు పేల్చారు! అధికార, ప్రతిపక్ష నేతల బండారాలు బయటపెట్టిన కేజ్రీవాల్... తాజాగా దేశంలోని ప్రముఖ వ్యాపారవర్గాల గుప్త సొత్తుల గుట్టురట్టు చేశారు. స్విట్జర్లాండ్‌లో జెనీవాలోని హెస్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతదేశానికి చెందిన 700 మంది ఆరువేల కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచుకున్నారని సంచలన ఆరోపణ చేశారు! దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన అంబానీ సోదరులు మొదలుకుని జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్ గోయల్, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, డాబర్ ప్రమోటర్లకు ఈ బ్యాంకులో రహస్య ఖాతాలు ఉన్నాయని బయటపెట్టారు. ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించడం వల్లే విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయుల అవినీతి ధనం గుట్టలు పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని బడా వ్యాపారవేత్తలకు తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. హవాలాను ప్రోత్సహిస్తున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎస్‌బీఐలో కన్నా.. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఖాతా తెరవడం చాలా సులభమని అన్నారు. అయితే కేజ్రీవాల్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యాపారవేత్తలు సైతం ఇదే మాట చెప్పారు.

దేశంలోని బడా నేతల అవినీతి భాగోతాలను బయటపెడుతున్న ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ (ఐఏసీ) ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నల్లధన కుభేరులపై విరుచుకుపడ్డారు. దేశంలో నల్ల ధనాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. విదేశీ బ్యాంకుల్లో నల్లధనంపై చర్చ జరుగుతోందికానీ, దాన్ని వెనక్కి రప్పించడంలో ఏ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించలేదని విమర్శించారు. నల్లడబ్బును దాచిన నేతల వివరాలు తెలిసి కూడా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో 700 మంది భారతీయులకు ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఖాతాల్లో మొత్తం రూ.6000 కోట్ల డబ్బు మూలుగుతోందని సంచలనాత్మక ఆరోపణ చేశారు. భారత్‌లో నల్లధనాన్ని హెచ్‌ఎస్‌బీసీ ప్రోత్సహిస్తోందన్నారు.
kejriwal
ఆ బ్యాంకులో ఖాతాలు కలిగిన వారిలో అంబానీ సోదరులు, జెట్ ఎయిర్‌వేస్ అధిపతి నరేశ్‌గోయల్, కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీ కోర్ గ్రూప్ సభ్యురాలు అనూటాండన్‌లు ఉన్నారని చెప్పారు. వారు భారీ ఎత్తున ఆ బ్యాంకులో నల్ల ధనాన్ని దాచారని ఆరోపించారు. ఈ వివరాలను శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో కలిసి కేజ్రీవాల్ విలేకరులకు వెల్లడించారు. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో రహస్య అకౌంట్లు కలిగిన బడా వ్యక్తుల వివరాలు ఇంకా తమ వద్ద ఉన్నాయన్నారు. వందల కోట్లు దాచిన వారిపై ఈగ కూడా వాలనీయకుండా, చిన్నవారిపై దాడులు చేస్తోందని ఆరోపించారు. అంబానీ సోదరుల ఖాతాల్లో చెరో రూ.100 కోట్లు ఉన్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. వారి తల్లి కోకిలా బెన్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. యశోవర్ధన్ బిర్లా ఖాతాలో కూడా జీరో బ్యాలెన్స్ ఉందని, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన మొటెక్ సాఫ్టవేర్ సంస్థ ఖాతాలో రూ.2100 కోట్లు, కాంగ్రెస్ ఎంపీ అనూ టాండన్, ఆమె భర్త దివంగత సందీప్ టాండన్‌కు చెందిన ఖాతాల్లో రూ.125 కోట్లు.. దాబర్ కంపెనీకి చెందిన బర్మన్స్ సోదరుల ఖాతాల్లో రూ.25 కోట్లు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని కేజ్రీవాల్ వివరించారు. ఈ వివరాలన్నీ 2006లో సేకరించినవిగా వెల్లడించారు.

కొత్త ఆరోపణలేంకాదు: ప్రభుత్వ వర్గాలు
నల్లధనంపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను యూపీఏ ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘ఆయన చేసిన ఆరోపణల్లో కొత్తదనం ఏమీ కనిపించడంలేదు. పైగా వాటికి సరైన ఆధారాలను కూడా ఆయన చూపడంలేదు’ అని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం రాత్రి పేర్కొన్నాయి. ‘ఆదారాల్లేని ఆరోపణలపై నేను స్పందించను’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది కేజ్రీవాల్ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించారు. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో తమకు ఎలాంటి అక్రమ ఖాతాలు లేవని.. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను అంబానీ సోదరులు తోసిపుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఐఎల్ నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల వల్ల ఎన్నో బ్యాంకులతో సంబంధాలు ఉన్నాయని.. అందులో హెచ్‌ఎస్‌బీసీ ఒకటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని స్వార్థపూరిత శక్తుల వల్లే కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. హెచ్‌ఎస్‌బీసీలో నల్లధనాన్ని బయటపెట్టాలని బీజేపీ నేత అద్వానీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ అనూటాండన్, జెట్ ఎయిర్‌వేస్ అధినేత నరేశ్‌గోయల్, దాబర్ ప్రమోటర్స్ బర్మన్స్ సోదరులు ఖండించారు. హెచ్‌ఎస్‌బీసీ కూడా ఆరోపణలను ఖండించింది.

ఇంటి నుంచే హెచ్‌ఎస్‌బీసీ ఖాతా ఓపెన్.. నిర్వాహణ
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతా తెరవాలంటే జెనీవా వెళ్లనక్కర్లేదని, ఆ బ్యాంకు ప్రతినిధులే ఇంటికి వస్తారని కేజ్రీవాల్ చెప్పారు. డబ్బులు కూడా వారికే అప్పగించొచ్చునన్నారు. శ్రమ లేకుండా ఆన్‌లైన్ ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చన్నారు. అవసరమైనప్పుడు సంప్రదించడానికి కాంటాక్ట్ నెంబర్ ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో హెచ్‌ఎస్‌బీసీ వల్ల హవాలా వ్యాపారం జోరుగా సాగుతోందన్నారు. వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌బీఐతో పోలిస్తే స్విస్ బ్యాంకులో ఖాతా తెరవడం చాలా సులభమన్నారు. హెచ్‌ఎస్‌బీసీ విధానాల వల్ల ఉగ్రవాదులకు మేలు జరుగుతోందన్నారు. పాకిస్థాన్‌లో ఉండి భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు, నేరస్తులకు ఈ బ్యాంకు ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడం సులభమన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న హెచ్‌ఎస్‌బీసీపై దేశ ద్రోహం, భారత్‌పై యుద్ధం ప్రకటన వంటి కేసులను నమోదు చేసి, ఆ బ్యాంకు అధికారులను అరెస్టు చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆ బ్యాంక్ హవాలా దందా చేస్తుందనడానికి ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలన్నారు.హెచ్‌ఎస్‌బీసీలో 700 మందికి ఖాతాలు ఉంటే 125 మందిపైనే దాడులు నిర్వహించడానికి కారణం ఏమిటని కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
voice2telangana.blogspot.com
నల్ల కుబేరులకు ప్రణబ్‌అండ: కేజ్రీవాల్
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలున్న 700 మంది బడా నేతలకు కాపాడ్డానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రయత్నించారని కేజ్రీవాల్ ఆరోపించారు. వారి నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి వాలెంటరీ డిస్‌క్లోజర్ ఆఫ్ ఇన్‌కం స్కీం (వీడీఐఎస్)ను ప్రవేశపెట్టారని చెప్పారు. విపక్షాల విమర్శలకు జడిసి దాన్ని విరమించుకున్నారన్నారు. ఆదాయపు పన్ను చట్టం కింద వారికి మినహాయింపు ఇవ్వాలని కూడా ముఖర్జీ ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం బడా వ్యక్తులకు అమ్ముడుపోయిందన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం వారికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఈ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలు ఉన్నవారి వివరాలు అధికారికంగా నిరూపించడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి దక్కించుకున్న ఓ కాంగ్రెస్ నేత చెప్పిన వివరాల ప్రకారమే తాము ఈ పరిశోధన చేశామన్నారు. ముగ్గురు వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసి రికార్డు చేసిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే మరింత కూపీలాగి ఈ ఖాతాల వివరాలను సేకరించామని చెప్పారు.

న్యాయవ్యవస్థే తదుపరి లక్ష్యం
రాజకీయ నేతలు, పారిక్షిశామికవేత్తలపై ఆరోపణలు చేసిన సంచలనం సృష్టించిన కేజ్రీవాల్ తదుపరి ఆరోపణలు ఎవరిపై అన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి ఆయన శుక్రవారం సమాధానం ఇచ్చారు. దేశంలోని న్యాయవ్యవస్థే తమ తదుపరి లక్ష్యమన్నారు. దేశంలోని అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసులు ఏళ్ల తరబడి తీర్పుకు నోచుకోకుండా వాయిదాలు పడ్డం వెనుక ఉన్న వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఆధారాలతో మీరు కోర్టుకు ఎందుకు వెళ్లరు అన్న ప్రశ్నకు సమాధానంగా.. మేం కోర్టును ఆశ్రయిస్తే.. ప్రభుత్వం అక్కడ మేనేజ్ చేస్తుందని వ్యాఖ్యానించారు.


- T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP