Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Sunday, February 27, 2011

ఉద్యోగుల సహాయ నిరాకరణకు మద్దతుగా ర్యాలీ

సిద్దిపేట,: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో చేస్తున్న సహాయ నిరాకరణకు మద్దతుగా శుక్రవారం నాడు రాజకీయ జేఏసీ మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వ హించి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో బైటాయించిన ఉద్యోగులకు మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. పదవులు శాశ్వతం కాదని ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తున్న వారందరిని ప్రజలు పూవుల్లో పెట్టుకుని మరీ అందలం ఎక్కిస్తారన్నారు. ఇందుకు నిదర్శనంగానే ఉపఎన్నికల్లో రాజీనామాలు చేసిన అభ్యర్థులను తెలంగాణవాదులు భారీ మెజార్టీతో గెలిపిం చారన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు సాకారం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని ఇలాంటి సమయంలో రాజకీయాలు మంచిది కాదన్నారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా ఎజండాలు పక్కనపెట్టి తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఉద్యమిం చాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమం లో పాల్గొనని ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల చేతిలో భంగపాటుకు గురికాక తప్పద న్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణకు జడ్పీటీసీ బాలం రంగం, ఎంపీపీ ఉపాద్యక్షులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కూర బా ్‌రెడ్డి, ఎంపీటీసీలు కొండం సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, సర్పంచ్‌ ర్రె రాజు, జీడిపల్లి కమలాకర్‌రావు, బాలకిషన్‌, నరేష్‌, వెంకట్‌గౌడ్‌, డాల్పిన్‌ మురళీ, పాల సాయిరాం, చిప్ప ప్రభాకర్‌, బూర విజయ, నందాదేవి, మంతూరి పద్మ, సుశీల, టైగర్‌ నర్సమ్మలు సంఘీభావం ప్రకటించారు.అదే విధంగా ఐసీడీఎస్‌ ఉద్యోగులు, రేషన్‌డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సహాయ నిరాకరణకు సంఘీభావం ప్రకటిం చారు. అంతకు ముందు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోనే మిహ ళలు బతుకమ్మ, ఉద్యోగులు కబడ్డీ ఆటలను ఆడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు విక్రం, శ్రీహరి, వేణు గోపాల్‌రెడ్డి, బిక్షపతి, గురువారెడ్డి, బిక్షపతి, పరమేశ్వర్‌, కమాల్‌, రాజు, మజీద్‌, చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖరవర్మ, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

నంగునూరులో...
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం మండల ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో నంగునూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా తహిసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ వీధుల గుండా విద్యార్థులు, రాజకీయ జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు నరేందర్‌ మాట్లాడుతూ మార్చి 5వ తేదీ వరకు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు తప్పనిసరిగా పాలుపంచు కోవాలన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పడే వరకు కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభాకర్‌, సుగుణ, ప్రభాకర ్‌రావు, హరికిషన్‌, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు జయ పాల్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, రాజయ్య, సుభాష్‌చందర్‌, రాజ కీయ జేఏసీ నాయకులు సారయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌గౌడ్‌, సోమిరెడ్డి, సత్యనారాయణ, యాదమల్లు, పురేందర్‌, వేణుచక్రవర్తి, సతీష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నా

Read more...

ఉత్తరాంధ్రతో.. తెలంగాణ !


apnesహైదరాబాద్‌,  తెలంగాణలో ఉత్తరాం ధ్రకు చెందిన మూడు జిల్లాలు కలిపి హైదరాబాద్‌ స్టేట్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తాజాగా తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఉన్న భౌగోళిక స్వరూపంతో కూడిన తెలంగాణ ప్రాంతంతో ప్రత్యేక రాష్ట్రం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, సముద్ర తీర ప్రాంతంతో కూడిన రాష్ట్రం ఉంటేనే సత్వరంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందనే ప్రతిపాదనలను అధికార పక్షానికి చెందిన సభ్యులే తెరమీదికి తీసుకొస్తున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను తెలంగాణతో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల సౌకర్యాలు, వసతులు, సామాజిక, రాజకీయ, వాస్తు... అంశాల పరంగా కలిసి వస్తుందని వారు అభిప్రాయ పడు తున్నారు. ఇలా చేయడం వల్ల రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మరింత బలపడుతుందని, అన్ని వర్గాల వారికి కలిసొస్తుం దంటూ పాలకపక్షానికి చెందిన తెలంగాణ, ఉత్తరాంధ్ర నేతలు పలువురు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే విషయమై శుక్రవారం కాంగ్రెస్‌కు చెందిన కొందరు సభ్యులు అసెంబ్లీ లాబీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.

టిఆర్‌ఎస్‌, తెలం గాణ టీడిపి, సిపిఐ సభ్యులతో పాటు తెలంగాణ, ఉత్తరాం ధ్ర జిల్లాలకు చెందిన పార్టీ సభ్యుల చెవిలో సైతం పడే శారు. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు ఫోన్ల ద్వారా ఈ ప్రతిపాదనలు తెలియజేశారు. ఈ మూడు జిల్లాలను కలుపుకుంటే తెంలగాణకు కలిసొచ్చే ఆంశా లను సభ్యులందరికి వివరించారు. దీంతో వారు కొత్త వాదంపై ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. వారిలో కొందరైతే ఇలాగైతే బాగుంటుందంటూ ఈ ప్రతిపాదన లను తెరమీదకు తీసుకొచ్చిన అధికార పక్ష సభ్యులకు ఫోన్లు చేసి అభినందించడం మొదలుపెట్టారు. ఈ కొత్త డిమాండ్‌ను కేంద్రం, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళేం దుకు వారు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలోని పది జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రానికి బదులు హైదరాబాద్‌ స్టేట్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఇప్పుడు తెరమీదకు వస్తున్నది. ఉత్తరాంధ్రలోని ఆ మూడు జిల్లాలు కూడా తెలంగాణ తర హాలోనే వెనుకబడ్డ ప్రాంతాలే. అందుకే వాటిని తెలంగాణ ప్రాంతంలో కలుపుకుంటే రెండు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. అంతే కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రానికి సముద్ర తీరప్రాంతం ఉంటుంది. మూడు ఓడరేవులు, మరో అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రాష్ట్రానికి లభిస్తుంది. ఐటి రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నది. పెట్రో కారిడార్‌, మూడు థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, ఖనిజ సంబద, మరో ప్రఖ్యాత యూనివర్సిటీ కొత్త రాష్ట్రంలో ఉంటాయి.ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని తెలంగాణ అని కాకుండా హైదరాబాద్‌ స్టేట్‌గా ప్రకటిస్తే బాగుంటుంది. పైగా ప్రస్తుత రాజధాని హైదరాబాద్‌ తమకు కావాలని మరొకరు డిమాండ్‌ చేసే పరిస్థితి ఉండదు.

ఇక వాస్తుపరంగా కూడా ఈ కొత్త ప్రతిపాదన బాగా కలిసొస్తుందంటున్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ బౌగో ళిక స్వరూపంలో వాస్తు దోషం ఉంది. అందుకే గత నలభై ఏళ్ళుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్న, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా రాష్ట్రం ఏర్పాటు కాలేదు. కొత్తగా ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాలను కలుపుకోవడం వల్ల ఈశాన్యం (నార్త్‌ ఈస్ట్‌) వైపు నీళ్ళు కలిగి భూమి పల్లంగా ఉండటం, నైరుతి వైపు కొండలు, బరువుతో ఎత్తు ప్రాంతం ఉండటం వల్ల వాస్తు ప్రకారంగా కొత్త రాష్ట్రానికి బాగా కలిసొస్తుంది. ప్రపంచంలో మరే రాష్ట్రం అభివృద్ధి చెందని విధంగా రాష్ట్రం ప్రగతి సాధిస్తుం ది. ఖమ్మం, భద్రాచలం, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, నర్సిపట్నం మీదుగా విశాఖ వరకు జాతీయ రహాదారి, రైల్వే లైన్లు వేసుకోవడం ద్వారా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. సామాజిక ఆంశాలు కూడా ప్రతిపా దిత కొత్త రాష్ట్రానికి బాగా కలిసొస్తాయి. సముద్రం, వనరులతో కూడిన తెలంగాణ ఉంటేనే లాభం. ఇది ముందు తరాలకు కూడా బాగా ఉపయోగ పడుతుంది.

ఇక రాజకీయ పరమైన అంశాలకు వస్తే తెలంగాణ, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కలుపుకుంటే మొత్తం 13 రాష్ట్రాలతో హైదరాబాద్‌ స్టేట్‌ ఆవిర్భవిస్తుంది. శాసన సభ్యుల సంఖ్య 153, లోక్‌సభ సభ్యుల సంఖ్య 22కు చేరుతుంది. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టినా మెజారిటీతో సునాయసంగా అది నెగ్గుతుంది. బిజెపి లాంటి మతతత్వ పార్టీలు బలపడేందుకు అవకాశం ఉండదు. ఇదే భయంతో మజ్లిస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నది. ఉత్తరాంధ్ర జిల్లాలు మూడు కలిస్తే అలాంటి భయమే ఉండదు. సామాజిక సమతుల్యత ఉంటుంది.

తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి, ఉత్తరాంధ్ర నుంచి డిప్యూటీ సిఎం, అటువారు సిఎం అయితే ఇటు నుంచి డిప్యూటీ సిఎం ఇలా పదవుల విషయంలో కూడా అవగాహనతో ముందుకు వెళ్ళొచ్చు. పైగా ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మెజారిటీ ప్రజలందరు తెలంగాణతో కలిసి ఉండటంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. వారితో తెలంగాణ వారికి సైతం పెద్దగా సమస్యలు ఉండవు. రాయలసీమ, కోస్తాలోని మిగతా జిల్లాలతో ఏర్పాటయ్యే రాష్ట్రంలో చిరంజీవికి బాధ్యతలు అప్పగించడం, టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మరింత బలంగా ఎదుగుతుంది. అధికార పక్షానికి చెందిన తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ఎమ్మెల్యేలు కొందరు ఈ అంశాలన్నింటిని వివరిస్తూ శుక్రవారం అసెంబ్లీలో లాబీల్లో, ఆయా పార్టీల సభ్యుల చాంబర్లలో విస్తృతంగా ప్రచారం సాగించారు. ఈ తాజా ప్రతిపాదనలపై టిఆర్‌ఎస్‌, తెలంగాణ టీడిపి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు సానుకూలంగా స్పందించడమే కాకుండా దీనిపై లోతుగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది


Tag: News, AP, Telangana, Telagnana News, KCR, Hot News, Images, Sexy, Tollywood,  Hot Images, Video, RajNews, hmtv, TV,  Medak, Siddiper,


take By: Suryaa.com

Read more...

In the Loving Memory of My Brave Brothers – by Syed AbdulMuqtadir

జై తెలంగాణ నినాదంతొ ధరిత్రి దద్దరిల్లింది
జిత్తుల మారి నాయకుల గుండె గుభేల్ మన్నది
నవ రాష్ట్రొద్యమానికి పునాది వేసిన మగధీరులకు
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు
కన్న తల్లి కోసం ఉద్యమించిన సాహసులకు జొహార్లు
ఎన్నొ దీక్షలు ఇంకెన్నెన్నొ ఉద్యమాలు చెసిన ధీరులను
కొనలేక,లొంగ దీసె దారి లేక, మభ్య పెట్టె మార్గం లేక
ఆశ చూపి నమ్మించి మృత్యు వాత పెట్టింది ప్రభుత్వం
అన్ని ఆఫర్లు కాలదన్ని తెలంగాణకు సై అన్నరు
ప్రాణాలిచ్చారు కాని ఆశయాన్ని వదల లేదు
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు
నా హక్కులు దొచుకున్నోన్ని నేనొదిలి పెట్టను – అరేయి 
మందీ మార్బలంతొ వచ్చి నన్ను బెదిరింప జూడకు
నేనొక్క కీకేస్తినంటె గుండె పలిగి సస్తవు
ప్రాణాలిచ్చీతందుకు మేమెప్పుడయినా సిధ్ధమే
నీ నెత్తుటి దాహం తీర్చనికి మేమంతా సిద్ధమె
తెలంగాణ సాధనకు శవాలె మెట్లయితె
మా నెత్తురుతో నీ దాహార్తి తీరుతుందంటె
కాల్చరా ముందు నన్ను, ఒక్క మెట్టు పెరుగుతుంది
నా తెలంగాణ ఒక్క మెట్టు నా వాళ్ళకు  దగ్గరవుతది
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు
కన్న భూమి పునరుధ్ధరణకు రక్త తర్పణమే ముఖ్యమైతె
నా ప్రతి రక్తపు బొట్టు నా తల్లి కోసం ఇలాగె చిందిస్తాను
అమ్మా నీ కొసం నా ప్రాణమె బలి హారం
తల్లి తెలంగాణ నీ కోసం అన్ని ఒదులుకుంటాము
ఇదే నా ప్రమాణం, ఇదే మా ప్రమాణం
నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళూ ఎందరో అమరజీవులు
వాళ్ళందరి సాక్షిగా నీకు స్వతంత్రం తెప్పిస్తాం
అమ్మా తెలంగాణా నీకు స్వతంత్రం తెప్పిస్తాం
జొహార్లు జొహార్లు తెలంగాణ అమర వీరులకు ఇవే మా జొహార్లు 
జై తెలంగాణ , జై జై తెలంగాణ

Read more...

పది లక్షల మందితో హైదరాబాద్‌ దిగ్బంధం


kcr-sachహైదరాబాద్‌,మేజర్‌న్యూస్‌: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్లు ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటం కొనసాగిద్దామని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. మార్చి10న ‘మిలియన్‌ మార్చ్‌ టు హైదరాబాద్‌’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 10 లక్షల మందితో హైదరాబాద్‌ నగరాన్ని దిగ్బంధించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. రోడ్ల ద్వారా హైదరాబాద్‌లోకి ఒక్క చీమను కూడా దూరనిచ్చేది లేదన్నారు. రోడ్లపైనే వంటావార్పు ఉంటుందని చెప్పారు. శనివారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో లెక్చరర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కేసీఆర్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సార్వత్రిక సమ్మెకు పిలిపునిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలనిగత తొమ్మిది రోజులుగా తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణపై ప్రభుత్వం స్పందించటం లేదని టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ చెప్పారు. శనివారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం ఎదుట లెక్చరర్లు దీక్షా శిబిరాన్ని కోదండరామ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకపోతే ప్రభుత్వానికి సహకరించేది లేదని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు చెబితే కేంద్ర ప్రభుత్వం దిగిరాదా అని ప్రశ్నించారు. మార్చి 1న తెలంగాణ ప్రాంతం ద్వారా ఢిల్లీకి ఒక్క రైలు కూడా వెళ్ళనివ్వకుండా రైల్‌రోకో కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. 

Read more...

‘కారు’ కలిస్తేనే .. తెలంగాణ


Pranabmukharjiఇప్పటిదాకా అన్ని పార్టీలపై ఒత్తిడి పెంచుతున్న టీఆర్‌ఎస్‌ ఇకపై తానే ఒత్తిడి ఎదుర్కోనుంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు టీఆర్‌ఎస్‌ కోర్టుకే చేరింది. టీఆర్‌ఎస్‌ తన పార్టీలో విలీనం అయితేనే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తామని కాం గ్రెస్‌ నాయకత్వం తనను కలుస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేయ డంతో.. ఇకపై టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు సమా చారం. తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో తమపై పెరుగుతున్న ఒత్తిళ్ల నుంచి రక్షించాలంటూ ఇటీవల కొందరు ఎంపీలు ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్‌ వద్దకు వెళ్లారు.

ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారని, జేఏసీ సైతం తమను ఇబ్బందిపెడుతోందంటూ వారు మొరపెట్టుకున్నారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ రోజూ తెలంగాణ తీర్మానం కోసం స్తంభింపచేస్తోందని, ఫలితంగా ప్రజల్లో కాంగ్రెస్‌ ఎంపీలు ఏమీ చేయ డం లేదన్న వ్యతిరేకత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీల ఆవేదనవిన్న ప్రణబ్‌, అహ్మద్‌ పటేల్‌ తెలంగాణపై నిర్ణయం రాజ కీయ ప్రయోజనాలతో ముడిపడి ఉందని, అందుకు మీరు కూడా సహకరించాలని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనే రాష్ట్ర విభ జనకు కేంద్రం నిర్దిష్ట నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించి, టీఆర్‌ ఎస్‌కు రాజకీయ ప్రయోజనం పొందమని చెప్ప లేము కదా? అని సూటిగానే ప్రశ్నించినట్లు తెలిసింది. పీఆర్పీని విలీనం చేయడం ద్వారా కోస్తాలో పార్టీ బలపడిందని వివరించారు.

అదేవిధంగా తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడం ద్వారా అక్కడ కూడా పార్టీ బలపడాలన్నదే పార్టీ విధానమని వారికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని అహ్మద్‌పటేల్‌ సైతం పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ం ఇవ్వడం సాధ్యం కాదని, ఆ మేరకు మీరు టీఆర్‌ఎస్‌ను ఒప్పించాలని కూడా డీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ‘విలీనంపై మీరంతా టీఆర్‌ఎస్‌పై ఎంత ఒత్తిడి తీసుకువస్తే మేం కూడా అంత త్వరగా నిర్ణయం తీసుకుంటామ’ని విస్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.

Ahmed_Patelదీనితో.. తెలంగాణ రావాలంటే టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనం కావాలన్న నినాదంతో ఒత్తిడి చేయాలని కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఒత్తిడి పెంచితే ప్రజల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ వస్తుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ విలీనం అయితే, తెలంగాణ త్వరగా వస్తుందన్న ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సర్వే సత్యనారాయణ వంటి ఎంపీలు టీఆర్‌ఎస్‌ వెంటనే కాంగ్రెస్‌లో విలీనం చేస్తే అమ్మగారు (సోనియా) వెంటనే తెలంగాణ ఇచ్చేస్తుందని, ఇక తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎందుకని కేసీఆర్‌ సమక్షంలోనే సర్వే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరో సందర్భంలో సర్వేనే ‘టీఆర్‌ఎస్‌ విలీనం కాకుండా కాంగ్రెస్‌ తెలంగాణ ఎలా ఇస్తుంది.

వాళ్లకు పొలిటికల్‌ అడ్వాంటేజ్‌ ఇచ్చి మేం నష్టపోవాలా?’ అని ప్రశ్నించటం గమనార్హం. అప్పుడు సోనియా తెలంగాణ ఇస్తే ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని, తెలంగాణ వస్తే తాను బర్ఖాస్‌ అయ్యేందుకు సిద్ధమేనని స్వయంగా కేసీఆర్‌ కూడా ప్రకటించారు.మరోవైపు.. డీఎస్‌ కూడా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేసీఆర్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధిష్ఠానం నుంచి తనకు వచ్చిన ఆదేశాలను డీఎస్‌ వివరించినట్లు సమాచారం. అయితే.. ముందు తెలంగాణ ఇవ్వాలని, ఆ తర్వాతే తమ పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్‌ చెప్పినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాగా, కేసీఆర్‌ మాటలను విశ్వసించడానికి లేదని, ఒకవేళ ఆయన మాట నమ్మి తెలంగాణ ప్రకటిస్తే ఆ తర్వాత విలీనంపై అడ్డం తిరిగితే మళ్లీ కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌పై ఆధారపడక తప్పదంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగానే విలీనం షరతు విధించినట్లు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఇకపై కాంగ్రెస్‌ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కోనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని చెబుతున్నందున.. తెలంగణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తే తెలంగాణ వెంటనే వస్తుందన్న వాదనతో కాంగ్రెస్‌ తెరపైకి రానుంది. కేసీఆర్‌ మళ్లీ తాజాగా రూటు మార్చి కాంగ్రెస్‌ను విమర్శిస్తుండటంతో కాంగ్రెస్‌ సైతం టీఆర్‌ఎస్‌ను త్వరగా విలీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

take By: Suryaa

Read more...

Telangana Intifada

ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వస్తుందన్నా , ఇధిగిధిగోవచ్చింధక్కా
మండు తున్నా అత్మల్లో రగులుతున్న జ్వాలాల్లో
బడబాజ్ఞుల్లో రుధిరాగ్నుల్లొ
పోరు మంటల వెలుగుల్లో, జ్వలిస్తున్న ఆశల్లో
కసిగ కసికసిగ,వడిగా వడివడిగా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచీంద్తమ్మి , ఇధిగిధిగో వఛిన్ధి సెల్లె
మా అమరుల ఆత్మ ఘోష మీకిప్పుడు మృత్యు ఘోషమా అమరుల ఆత్మ ఘోష మీకిప్పుడు మృత్యు ఘోష
మా వన్నె ౦  సురేంధ ర్ మొదలు మా ముస్తఫా అన్న వరకు
రక్తం చిందీంచి, అగ్గిలో బుగ్గి అయ్యీ  మా  ధిక్కు సూస్తుంటే
ఆర్తితో ఆగడుతో, కోపంతో రోషంతో
కధన్ తొక్కి యాదగిరి నర్సిమ్మలు ఉగ్రులై, రుద్రులై
దిక్కులు పిక్కటి ల్ల , లాంకోలు దద్ధరిల్ల పోరు గంట మోగిస్తుంటే
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచిందమ్మా , ఇధిగిధిగో వచ్చిందయ్యా
మన ద్రోహుల మట్టుబెట్టి, జగన్ ధన్దు చుట్ట బెట్టి
కావూరి హిల్స్ చడును చేసి, లాం కొను లంకల ధించి
జయభేరి బూర తీసి, రాయపాటి రంగు తీసి
సీయమ్ల, గవర్నర్ల మర్యాదగా సాగనంపి
లజ్జ లేని మన మంత్రుల గున్ పార్క్‌ల వంగబెట్టే
లాంగ్ మార్చ్ వచ్చిందయ్యా, ఇమ్మినెంట్లీ విమోచనయ్యా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచిందమ్మా , ఇధిగిధిగో వచ్చిందయ్యా
గౌలీగుడ గళ్లీలో, గుల్ జార్  హౌస్ సందులో
మధీన మండ్ల ల్లో , హుస్సైని అలం బురుజుల్లో
ఫీల్‌ఖానా అడుగుల్లో, బెగమ్ బజార్ నగవుల్లొ
ఆడిక్కమెట్ సదువుల్లొ, మాంకాలమ్మ పూజల్లో
భాగులతో, చెరువులతో అలరారిన మా నేల
ఈజిప్ట్ లలను , లిబియా లను, ట్యూనీషియా లను
అగ్రాణించుకున్న నేల,ఆఫ్రికన్ కేవల్రీ ఉన్న నే ల ,
ఇరానీయన్ల కన్న నే ల
కాయస్థులు, కన్నడిగులు, మరాటీలు
తమిళులు రాజస్థానీలు , మన ముస్లిం భాయీలు
కలిసి మేలిసి ఆలయ్ భలాైలు ఇచుకున్న నేల
అసలు సిసలు మా  నేల హైధారభాధు మా స్వేధం, మా స్వంతం
మరి అహంతో, మధంతో  ఇంకా ధోచుకొనే ధాహంతో కాదంటే
అధె లాల్ దర్వాజా నుండి మీ అసెంబ్లీ అని కులుకుతున్న మా హైధెరబాధు టౌన్ హాల్ వరకు
కత్తులను చేతబట్టి మీ కుత్తుకలు ఉత్తరీయా
ఎగిసి ఎగిసి పడుతున్న తెలంగాణ ఇంతిఫాదా
ఉజ్వలమై ప్రజ్వలనమై తెలంగాణ ఇంతిఫాదా
అధుగధిగొ వచింధీ భై, ఇధిగిధిగోవచ్చింది బహెన్
Jai Telangana
Bala Yugandar

Take By : Simply telangana

Read more...

Today Hyderabad. Tomorrow Telangana? Hyderabad not a freezone. Assembly to pass a resolution.

The Andhra Pradesh assembly will Thursday pass a resolution urging the central government to bring an amendment to the Presidential Order to protect jobs for the Telangana people in Hyderabad.
At an all-party meet convened Wednesday evening to discuss the Supreme Court’s refusal to review its order declaring Hyderabad a ‘free zone’ for recruitments in government jobs, the Congress government agreed to bring the resolution.
Leaders of all the parties were unanimous that the relevant paragraph of the Presidential Order relating to jobs for locals in Hyderabad should be amended to set aside the court order.
Minister for Information and Public Relations Geeta Reddy told reporters after the meeting that the resolution would be sent to the central government and the home ministry would refer it to the Indian president.
The decision came a day after the Supreme Court refused to admit a petition of the state government, seeking a review of its earlier order declaring Hyderabad a free zone for recruitments in police department.
Earlier, opposition parties stalled the proceedings of the state assembly over the issue, forcing Chief Minister K. Rosaiah to invite an all-party meeting to discuss future course of action.
Rosaiah told the assembly that he had no objection to passing a resolution urging the central government to bring an amendment to set aside the Supreme Court order.
‘Hyderabad is part of sixth zone and not a free zone. Nobody needs to have any doubts over this,’ Rosaiah told the agitated members. He said the issue was sensitive and in Supreme Court and hence could not be discussed in an open house.
Later, Congress MPs from Telangana urged Rosaiah to pass a resolution in the assembly.
Telangana Rashtra Samiti (TRS) chief K. Chandrasekhara Rao, who had revived movement for separate statehood to Telangana following the Supreme Court order last year, warned the government of serious consequences if it failed to protect the interests of Telangana people.
In October last year, the Supreme Court had declared that Hyderabad was not a part of Telangana but a free zone as far as recruitments and postings in government were concerned.

Read more...

Tahrir Square in Hyderabad : KCR

Around one million Telangana people will besiege Hyderabad  on March 10 and stay put till the Centre announces a T state, Telangana Rashtra Samithi (TRS) president K Chandrasekhar Rao has said.

Addressing employees of the Intermediate Board, who have been participating in the non-cooperation movement, at the Board office here today, the TRS chief said on March 10, the city would reverberate with ‘Jai Telangana’ slogans by one million people who would reach here from across Telangana and would not go back till the Central government made a statement on the Telangana issue in the Parliament.

Prime Minister Manmohan Singh would act as per the wishes of UPA chairperson Sonia Gandhi. She had the remote control and this was proved in the Lok Sabha when the TRS and NDA members stalled the proceedings in the House on T issue, the TRS chief said.

“When Opposition leader Sushma Swaraj cornered the Prime Minister on the T issue by explaining that four lakh government employees were not attending duties as part of their non-cooperation movement, the Prime Minister did not speak a single word on the T issue,” the TRS chief said.

“We want to demonstrate people’s wish to the UPA chairperson. So we decided to lay siege to Hyderabad,” he said. Telangana people would not get justice in United Andhra Pradesh. “All the problems of T will be solved only in a separate Tstate,” Rao declared.

The TRS would give one special increment to all government employees once the T-state was formed, which would be a Telangana increment, he added.

TTDPF convenor Nagam Janardhan Reddy, BJP state president G Kishan Reddy , TJAC chairman Prof M Kodandaram. CPI ML(New Democracy) leader Sandhya and several others addressed the meeting.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP