పది లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధం

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సార్వత్రిక సమ్మెకు పిలిపునిస్తామని హెచ్చరించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలనిగత తొమ్మిది రోజులుగా తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణపై ప్రభుత్వం స్పందించటం లేదని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. శనివారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ఎదుట లెక్చరర్లు దీక్షా శిబిరాన్ని కోదండరామ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకపోతే ప్రభుత్వానికి సహకరించేది లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చెబితే కేంద్ర ప్రభుత్వం దిగిరాదా అని ప్రశ్నించారు. మార్చి 1న తెలంగాణ ప్రాంతం ద్వారా ఢిల్లీకి ఒక్క రైలు కూడా వెళ్ళనివ్వకుండా రైల్రోకో కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.
0 comments:
Post a Comment