Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, June 19, 2012

మారిన సిలబస్ పై పట్టు ఎలా?


 


రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (S.C.E.R.T.) ఇటీవల మూడవ, ఆరవ, ఏడవ తరగతుల పాఠ్యపుస్తకాలను అప్‌గ్రేడ్ చేసి విద్యార్థులకు అందించింది. ఈ నూతన పాఠ్యపుస్తకాలను చక్కగా ఉపయోగించి పిల్లలు విద్యాభివృద్ధిని సాధించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు ఎలాంటి పాత్ర నిర్వహించాలి? విద్యార్థులు ఎలాంటి కృత్యాలు చేస్తూ అభ్యసించాలి? అసలు ఈ మారిన సిలబస్‌లో ఉన్న నూతన అంశాలేమిటి? అనే అంశాలను సోదాహర ణంగా పరిశీలిద్దాం.

కృత్యాలలో పాల్గొనాలి
ఆరవ తరగతిలో ‘మన ఆహారం’ అనే సైన్సు పాఠంలో మొత్తం నాలుగు కృత్యాలు ఉన్నాయి. ‘1.రకరకాల ఆహార పదార్థాలు, 2.ఆహారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, 3. మనం వంట చేద్దాం, 4. ఆహారం నిలువ చేద్దాం.’ విద్యార్థులు ఈ నాలుగు కృత్యాలలో పాల్గొని జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి. ఆహార పదార్థాలను పరిశీలించడం, వాటి గురించి చర్చించడం, కావలసి పదార్థాల గురించి సమాచారం సేకరించడం, ‘వంట’ చేయడాన్ని ఒక ప్రయోగంలా నిర్వహించడం, చివరగా ఆహారాన్ని నిల్వచేసే విధానాలు అవలంభించడం ద్వారా పిల్లలలో ప్రయోగాత్మక జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటిస్తూ క్రమపద్ధతిలో ఈ కృత్యాలు నిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా ‘జంతువులు ఏమి తింటాయి’ పాఠ్యాంశం లో ‘ఆహారం తీసుకోవడం’-అనే కృత్యంలో ఏయే జంతువు ఎలాంటి ఆహారం తీసుకుంటుందో వివరాలు సేకరించాలి. ‘దారాల నుంచి వస్తువుల దాకా’ అనే పాఠ్యాంశంలో ‘నూలు వడకడం’, ‘చాపలు అల్లుదాం’ వంటి కృత్యాలు విద్యార్థుల్లో చేతివృత్తులపై అవగాహనను పెంచగలవు. పని చేసే తత్వాన్ని, పనిలో సహకారాన్ని, మెళకువలను అర్థం చేసుకోగలరు. అందుకే, ప్రతికృత్యంలో విద్యార్థిని భాగస్వామిని చేయాలి.

గణితంలో సాధన
ఆరవ తరగతి గణితంలో విద్యార్థులు ‘ప్రయత్నించండి’ అని ఇచ్చిన అంశం క్రింద ఉన్న కృత్యాలను తప్పనిసరిగా చేయాలి. ‘బీజగణిత పరిచయం’ పాఠ్యాంశంలో ఇవ్వబడిన అమరికలు 1, 2, 3,లను చూసిన పిదప ‘ప్రయత్నించండి’ టైటిల్ క్రింద ‘పక్క అగ్గిపుల్లల అమరికకు తగిన సూత్రం రాయండి?’ వంటి కృత్యాలు, ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కృత్యాల నిర్వహణ వల్ల విద్యార్థులు బీజగణిత భావనలను బాగా అర్థం చేసుకోగలుగుతారు.

‘చుట్టు కొలతలు- వైశాల్యాలు’ పాఠ్యాంశంలో ఒక తీగను ముక్కలుగా కత్తిరించి, ఆ ముక్కలతో రకరకాల జ్యామి తీయ ఆకృతులను నిర్మించడం, ఆ ఆకారాల వైశాల్యాలను, చుట్టుకొలతలను దారం, స్కేలు సహాయంతో కొలవడం వంటి కృత్యాలు చేస్తూ విద్యార్థి ప్రాథమిక గణిత ప్రక్రి యలు, భావనలు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. తద్వారా క్రమంగా గణి త జ్ఞానాన్ని సంతరించు కోగలుగుతాడు.

ఉపాధ్యాయులు చేయవలసినది....
విద్యార్థుల ప్రాథమిక అవగాహనలను, వారి స్థాయిలను మ్యాపింగ్ చేసుకోడం ద్వారా బోధన మొదలుపెట్టాలి. విద్యార్థుల్లో ఆలోచన, ప్రశ్నించే తత్వం పెంపొందించడానికి పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలను, కృత్యాలను, ఉదాహరణలను వినియోగించు కోవాలి. కృత్యాలకు కావలసిన పరికరాల తయారీ, సేకరణలలో పిల్లలు కూడా పాలుపంచుకునేలా చేస్తే వారిలో ఉత్సాహం చిగురిస్తుంది. విద్యార్థులు తమ వంతు పనిచేస్తుంటే ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తూ ప్రోత్సహిస్తూ, అభినం దిస్తూ, తగిన సూచన లను అందిస్తూ ఉండాలి.

నివేదికలు రచింపజేయాలి
విద్యార్థులు కృత్యాన్ని ముగించి న తరువాత ఆ కృత్యం యొక్క మొదటి ప్రక్రియ నుండి చివరి ప్రక్రియ వరకు గల అంశాలను వివరిస్తూ నివేదిక రచించమని విద్యార్థులను ప్రోత్సహించాలి. బొమ్మలు గీయించడం, భాగాలు గుర్తించడం వంటి కీలక అంశాలను విద్యార్థులు నివేదికలలో పొందుపరిచేలా చూడాలి.

స్థానిక వనరులు
వస్తువులను, పరికరాలను సేకరించే సమయంలో స్థానికంగా లభించే వనరులను వినియోగించడం నేర్పించాలి. ప్రతీదానికీ ‘షాప్’కు వెళ్లి ‘షాపింగ్’ చేయాలి అనే కృత్రిమ ధోరణిని పిల్లలు విస్మరించేలా గైడ్ చేయాలి. ‘నోకాస్ట్’, ‘లోకాస్ట్’ మెరియల్‌ను సేకరించే గుణం వారిని ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకునే దిశలో మెరుగైన విధంగా సిద్ధం చేస్తుంది.

తాము నేర్చుకున్న అంశాలను, కృత్యాలను విద్యార్థులు అర్థం చేసుకొని స్వయంగా సమాధానాలు ఇచ్చే విధంగా వారిని సిద్ధం చేయాలి. అంతేగాని తరగతిలోని విద్యార్థు లంతా కలిసి కట్టుగా గా సమాధానాన్ని రాసేలా ప్రోత్సహించ కూడదు. ఇది వారిలోని విభిన్నతను, వారి ఆలోచన సృజనాత్మకతను అడ్డుకుంటుంది. అందుకే ఉపాధ్యా యులు విద్యార్థులను కృత్యోన్ముఖులను చేయాల్సి ఉంది. గోడపత్రిక, బులెటిన్ బోర్డు, ఎగ్జిబిషన్ లాంటి ఏదో ఒక ప్రక్రియ ద్వారా విద్యార్థి తన స్వీయ ఆలోచనలను వెలువరించేలా ప్రోత్సహించాలి.

Take By: T News

Read more...

ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా!


ఒక్క ఏజెంట్‌కూ లైసెన్సు లేదు
రెండేళ్లుగా యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు
హైదరాబాద్, జూన్ 18 ():డ్రైవింగ్ లైసెన్సు లేదని చలాన్ రాస్తారు. లైసెన్సు ఉన్నా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ దగ్గర లేదంటూ జరిమానా విధిస్తారు. ఇవన్నీ ఉంటే పొల్యూషన్ సర్టిఫికెట్ ఏదీ? హెల్మెట్ ఎక్కడ? అంటూ నిలదీస్తారు. దబాయిస్తారు.

 ఇవన్నీ.. అంత ప్రమాదకరం కాని ద్విచక్షికవాహనదారుల విషయంలో కనిపించే దృశ్యాలు. మరి.. ప్రాణాంతక నిర్లక్ష్యం ప్రదర్శించే ‘ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా’ గురించి అధికార గణం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే ఏయే చర్యలు చేపడుతోంది? నిజంతెలుసుకుంటే నివ్వెరపోవాల్సిందే. షిర్డీ వెళ్లే బస్సు రోడ్డుప్రమాదానికి గురై 32 మంది దుర్మరణం చెందడంతో, రవాణాశాఖ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో సుమారు 600 వరకు ట్రావెల్ ఏజెంట్లు ఉన్నారు. వీరికి సంబంధించి 1215 ప్రైవేటు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరుగుతున్నాయి.

వాస్తవానికి ప్రైవేటు బస్సు రోడ్డుపై నడుపుకోవాలంటే ముందుగా టికెట్ బుకింగ్ చేసుకునేందుకు రవాణాశాఖ నుంచి లైసెన్సు తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర లేదా అంతర్‌రాష్ట్ర పర్మిట్ తీసుకోవడం, మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించడం వంటివి ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్లో ఒక్క ట్రావెల్ ఏజెంట్‌కూ లైసెన్సు లేదు. కొందరి లైసెన్సుల కాలపరిమితి 2007లో, మరికొందరివి 2009లో ముగిసిపోయింది. ఇప్పటివరకు ఒక్కరూ రెన్యువల్ చేయించుకోలేదు. సోమవారం జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూడటంతో రవాణాశాఖాధికారులు కంగుతిన్నారు. లైసెన్సు లేకపోయినా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయంటే అందుకు మొదట బాధ్యత వహించాల్సింది రవాణాశాఖే.

అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనధికార ఆదేశాలు ఉండటంతో, రవాణాశాఖ అధికారులు ఎవ్వరూ వాటి గురించి ఆరా తీసే ధైర్యం చేయలేకపోతున్నారని సమాచారం. లైసెన్సు లేని ఏజెంట్లు టికెట్లు విక్రయించకూడదు, బస్సులు తిప్పకూడదు. కానీ రెండేళ్లుగా ట్రావెల్స్.. మాఫియా స్థాయిలో నిబంధనలు గాలికి వదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ విషయమై రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరిని ‘టీ మీడియా’ ప్రశ్నించగా 2009 దాకా ఏడాదికి 2500 కేసుల వరకు రాసేవారమని, అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం నుంచి అనధికార ఆదేశాలు రావడంతో రెండేళ్లుగా వాటి జోలికి వెళ్లడం లేదన్నారు.

సవాలక్ష నిబంధనలు.. ఖాతరు చేసేదెవరు?
వాస్తవానికి వాహనాలు, ప్రయాణానికి సంబంధించి నిబంధనలు బోలెడున్నాయి. పట్టించుకునేవారే లేరు. ప్రైవేటు బస్సులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నా పట్టించుకుని శిక్షించేవారు కరువయ్యారు. లైసెన్సు సమయంలో కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి తీసుకుంటారు. ఒకచోట నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అక్కడే ఆగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్‌గా కాకుండా స్టేజీ క్యారియర్‌గా తిరుగుతున్నాయి. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.

ఈ విషయం రవాణాఅధికారులకు తెలిసినా, పైస్థాయిలో ఒత్తిడి ఉండటంతో చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. కాంట్రాక్టు క్యారియర్ అనుమతి ఉన్న బస్సుల్లో తప్పనిసరిగా ప్రయాణికుల వివరాలు ఉండాలనే నిబంధన కూడా అమలుకావడం లేదు. ఈ నిబంధన అమలుకాకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారి వివరాలు తెలియక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదాహరణకు మొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో రవాణా అధికారులు ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్‌చేసి వివరాలు అడిగితే, తమ వద్ద వివరాలు ఏమీలేవని జవాబు వచ్చింది.

 హైదరాబాద్ నగరంలో 40మంది బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు బుక్ అయ్యాయని తెలియడంతో, 44 మంది ప్రయాణికుల వివరాల కోసం నాలుగుగంటలపాటు శ్రమించి 40 మంది ఏజెంట్లను వాకబు చేసి అందుబాటులో ఉన్న వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించగలిగామని రవాణాశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ ‘టీ మీడియా’తో చెప్పారు.

 ఆర్టీసీ బస్సులు స్టేజీ క్యారియర్ల కిందకు వస్తాయని, వాటిల్లో కూడా రిజర్వేషన్ చేయించుకునేవారి జాబితా ఉండే విధంగా ప్రయత్నిస్తామని రవాణా శాఖాధికారి ఒకరు చెప్పారు.

డ్రైవర్లకు పరీక్షలు, విశ్రాంతి మాటేమిటి?

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్లుగా నడపాలంటే వాల్వో బస్సుకు మూడు నెలలకు రూ.1.40 లక్షలు, హైటెక్ బస్సులకు మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష చొప్పున చెల్లించాలి. అలా ప్రతి సంవత్సరానికి నాలుగుసార్లు పన్ను చెల్లించాలి. పర్మిట్ కోసం అంతపూరాష్ట్ర బస్సులకు సీటుకు రూ.3675, రాష్ట్ర సర్వీసులకు రూ.2625 చొప్పున చెల్లించాలి. రెండేళ్ల నుంచి లైసెన్సులు రెన్యువల్ చేసుకోకపోవడంతో, కేవలం పర్మిట్లు మాత్రమే కట్టి బస్సులు తిప్పుకుంటున్నారు. ఫలితంగా పన్ను రూపేణా ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లలో నష్టం వాటిల్లుతోంది. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేదు.

 ప్రభుత్వరంగ సంస్థ అయినప్పటికీ ఆర్టీసీ నుంచి సకాలంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు బస్సులపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇందులో ఆంతర్యం అధికారులకు, ప్రభుత్వానికే తెలుసు! లైసెన్సుల జోలికి వెళ్లని రవాణాశాఖ కేవలం వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూన్సులు ఉన్నాయో లేదో చూసి ఊరుకుంటోంది. గత కొంతకాలం నుంచి అదీ లేదు. అయితే ప్రైవేటు బస్సుల్లో చాలావరకు కొత్త బస్సులే కావడంతో ఫిట్‌నెస్ సమస్య పెద్దగా ఎదురుకావడం లేదు.

 కొన్ని బస్సుల యాజమాన్యాలు ఒకే పర్మిట్ రెండు, మూడు బస్సులు తిప్పడం, లేదా ఒకే నంబర్‌తో రెండు బస్సులు నడపడం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనదారులకు, కార్లలో ప్రయాణించేవారికి మద్యం తాగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు జరుపుతున్నారు. కానీ ఒక్క బస్సు డ్రైవర్‌ను కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. కనీసం ఆ ఆలోచన కూడా అటు పోలీసుశాఖకుగానీ ఇటు రవాణా అధికారులకు గానీ ఎందుకు తలెత్తడం లేదో! బస్సులో ప్రయాణికుల ప్రాణాలు బస్సు నడిపే డ్రైవర్‌పై ఆధారపడి ఉంటాయి.

 బస్సు డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి. తగినంత విశ్రాంతినివ్వాలి. కానీ మెజార్టీ యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు షిర్డీ బస్సు ప్రమాద ఘటనతో కాస్త హడావిడి చేస్తున్న ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటుందో, కంటి తుడుపు చర్యలతో సరిపెడుతుందో చూడాలి.

Take By : T News

Read more...

Microsoft unveils ‘Surface’ tablet computer


Microsoft has unveiled Surface, a tablet computer to compete with Apple’s iPad.

CEO Steve Ballmer was on hand to announce the new tablet, calling it part of a “whole new family of devices” the company is developing. 

One version of the device, which won’t go on sale until sometime in the fall, is about 9.3 millimetres thick and works on the Windows RT operating system. 

It comes with a kickstand to hold it upright and a touch keyboard cover that snaps on using magnets. 

The device weighs under 680 grams and will cost about as much as other tablet computers. Its debut is set to coincide with the upcoming fall release of Microsoft’s much-anticipated Windows 8 operating system. 

Steven Sinofsky, president of Microsoft’s Windows division, called the device a “tablet that’s a great PC PC that’s a great tablet.” 

A slightly thicker version, less than 14 millimetres thick and under 910 grams, will work on Microsoft’s upcoming Windows 8 Pro operating system and cost as much as an Ultrabook, the company said. The pro version comes with a stylus that allows users to make handwritten notes on documents such as PDF files.
Each tablet comes with a keyboard cover that is just 3 millimetres thick. The kickstand for both tablets was just 0.7 millimetres thick, slimmer than a credit card. 

Microsoft has been making software for tablets since 2002, when it shipped the Windows XP Tablet PC Edition. Many big PC makers produced tablets that ran the software, but they were never big sellers. The tablets were based on PC technology, and were heavy, with short battery lives. 

Microsoft didn’t say how long the Surface would last on battery power. 

Microsoft’s decision to make its own tablet is a departure from the software maker’s strategy the personal computer market. With PCs, Microsoft was content to leave the design and marketing of the hardware to other companies, such as Hewlett-Packard, Dell, Lenovo and Acer, that licensed the Windows operating system and other software applications. 

The more hands-on approach with its tablet indicates that Microsoft either lacks confidence in the ability of its PC partners to design compelling alternatives to Apple’s iPad or it believes it needs more control to ensure Windows plays a major role in the increasingly important mobile computing market. 

Whatever Microsoft’s motives, the company’s tablet plans risk alienating some of its longtime partners in the PC industry.

Read more...

India announces $10 billion for debt-ridden eurozone


Leaders of the G-20 and guests pose for the family photo in Los Cabos, Mexico.

India on Tuesday announced a $10 billion contribution to the IMF’s additional $430 billion financial firewall to help the debt-wracked 17-nation eurozone so that the faltering world economy is protected against the spread of any financial contagion.

The announcement was made by Prime Minister Manmohan Singh in his address at the Plenary Session of the seventh summit of the Group of developed and developing countries (G-20) in the Mexican resort town of Los Cabos against the backdrop of growing calls to nations to increase contributions to the International Monetary Fund (IMF) for the bailout fund.

India’s contribution along with pledges by other member countries of the five-nation BRICS bloc has helped increase IMF’s resources and give a boost to the $430 billion fund being used as a firewall to support struggling eurozone economies.

“The International Monetary Fund has a critical supportive role to play in stabilising the eurozone. All members must help the Fund to play this role, I am happy to announce that India has decided to contribute $10 billion to the IMF’s additional firewall of $430 billion,” he told the world leaders at the seventh summit of the grouping which accounts for 80 per cent the world’s GDP.

India has previously pledged to make contributions to the bailout fund but did not disclose the exact amount of its contribution to the fund.

According to Chinese Vice Finance Minister Zhu Guangyo, the BRICS is committed to pledge $60 billion to boost the firewall. Besides India and China, the other countries in the bloc are Brazil, Russia and South Africa.

The IMF fund will serve to help governments that are struggling to cope with debt repayments but eurozone leaders still faced pressure from their G-20 peers to make reforms to head off future financial crisis.

Calls were being made to the eurozone to put in place a bigger financial firewall to combat the crisis before other countries will pour more cash into the IMF 

Noting that developed countries have expanded the resources of the IMF enormously, largely to support programmes in rich countries, Dr. Singh said that steps are now needed to be taken to substantially expand the resource base of Multilateral Development banks so that they have the firepower to help developing countries pursue their development goals. 

Take By: The Hindu News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP