Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, February 11, 2011

ఆఫీస్‌కొచ్చినా పనిచేయరు తెలంగాణ డిమాండ్‌తో 17 నుంచి ఉద్యోగుల ఆందోళన సహాయ నిరాకరణ సన్నాహకంగా నేడు ధర్నా అరెస్టయినా ఆగకుండి రెండంచెల నాయకత్వం ప్రత్నామ్న

హైదరాబాద్, ఫిబ్రవరి 10 : తెలంగాణలో సమ్మె వాతావరణం అలముకుంటోంది. ఈ నెల 17 నుంచి మొదలయ్యే 'సహాయ నిరాకరణ' ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చినా విధులు నిర్వహించరు. అయితే, ఉద్యమ ప్రభావాన్ని సాధ్యమైన మేర తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిందిగా ప్రభుత్వం వివిధ శాఖల అధిపతులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు ఉద్యమ సన్నాహకాల్లో భాగంగా జంట నగరాల్లోని 10 వేల మంది ఉద్యోగులు శుక్రవారం జీహెచ్ఎంసీ వద్ద 'మహాధర్నా' నిర్వహించనున్నారు.

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే 'తెలంగాణ' బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో చేపట్టనున్న ఈ ఆందోళన గురించి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. 'ఒక్క ఫైలు కూడా కదలకూడదు. ప్రభుత్వ సమాచారాలనూ చేరవేసే ప్రసక్తి లేదు. మంత్రుల ప్రోటోకాల్స్, పర్యటనలను పట్టించుకోరాదు' అని ఉద్యోగులకు పిలుపునిచ్చినట్లు జేఏసీ అగ్రనేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్ గురువారం విలేకరులకు వెల్లడించారు. సీమాంధ్రకు ఆర్టీసీ బస్సులను నడపవద్దని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చామన్నారు

. ప్రజలు, సీమాంధ్ర ఉద్యోగులు, పార్టీలు తమకు సహకరించాలని వారు విఙ్ఞప్తి చేశారు. అలాగే మంత్రుల, ఉన్నతాధికారుల వాహనాలను నడపరాదని ప్రభుత్వ డ్రైవర్లు నిర్ణయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా అడ్డుకోవాలని ఆ శాఖ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉపాధ్యాయులు రెండోదశ జనగణనకు వెళ్లిపోవడంతో తరగతులు సరిగా జరగని నేపథ్యంలో మిగిలిన టీచర్లు కూడా విధులకు నిరాకరిస్తే తమ పరిస్థితి ఏమిటని వచ్చేనెలలో పరీక్షలు రాయడం ఎలాగని విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.

ఏదేమైనా పారిశుధ్యంతోపాటు వైద్య, ఆరోగ్య శాఖల్లో అత్యవసర సేవలు మినహా 17 నుంచి పౌర జీవనం స్తంభించనుంది. ఫలితంగా తెలంగాణలో రోజుకు రూ.50 కోట్ల వంతున ప్రభుత్వాదాయం పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్సైజ్ ఉద్యోగులు కూడా ఆందోళనకు దిగుతున్నందువల్ల మద్యంపై వసూళ్లనూ కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ నష్టాన్ని నివారించుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం తమను అరెస్టు చేసినా ఉద్యమ ఊపు ఆగకుండా ఎక్కడికక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలో దిగేలా అగ్రనేతలు వ్యూహం సిద్ధం చేశారు.


take BY: Andhrajyohti

Read more...

సిఎం రచ్చబండను నిరసిస్తూ న్యాయవాదుల విధుల బహిష్కరణ-ధర్నా

వరంగల్‌ లీగల్‌ మేజర్‌ న్యూస్‌ః జిల్లాకు రచ్చబండ కార్యక్రమంలో పేరుతో వస్తున్న సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను నిరసిస్తూ జిల్లా న్యాయవాదులు కోర్టుగేట్లు మూసివేసి గురువారం విధులు బహిష్కరించారు.అనంతరం ధర్నాకు దిగారు. రచ్చబండ వద్దు... తెలంగాణా ముద్దు.. జై తెలంగాణ...జైజై తెలంగాణ... అంటూ నినాదాలు చేసిన వందలాది మంది న్యాయవాదులు కోర్టు ప్రధాన గేట్లు మూసివేసి గేట్ల ముందు బైఠాయించారు. అనంతరం జిల్లా కోర్టు ముందు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వద్దిరాజు గణేష్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సిఎం కిరణ్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నాడని ఆయన ఎన్నికుట్రలు, కుతంత్రాలు పన్నినా ఉద్యమం ఆగదని ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు. తమకు రచ్చబండ లాంటి జిమ్మిక్కుల కార్యక్రమాలు వద్దని కేవలం తెలంగాణ కావాలన్నారు. ప్రజలు రచ్చబండ వద్దని నిర్వహిస్తున్నా పోలీసు బలగాలతో బలవంగా నిర్వహించడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. ఎంతో మంది పోలీసులను పెట్టినా తెలంగాణ వాదులు రచ్చబండను రచ్చచేశారని అన్నారు. అనంతరం జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చిల్లా రాజేంద్రప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఎం. సహోదర్‌రెడ్డి పలువురు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు మాట్లాడారు.

పోలీసులతో వాగ్వాదం - తోపులాట
సిఎం రాకను నిరసిస్తూ జిల్లా ప్రధాన గేట్లు మూసివేసిన క్రమంలో సుబేదారి సిఐ వెంకటేశ్వరబాబు తమ బలగాలతో అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో న్యాయవాదులకు, సిఐకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టు గేట్లు తీయాలని సుబేదారి సిఐ అనగా నిరసనలో భాగంగానే గేట్లు మూసి వేసామని న్యాయవాదుల విషయంలో సుబేదారి సిఐ చూపిస్తున్న అత్యుత్సాహం పనికిరాదని నినదించారు. పోలీస్‌ గోబ్యాక్‌... ప్రజాస్వామ్య దేశమా... పోలీసుల రాజ్యమా... అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సిఐ వెంకటేశ్వరబాబు తమ బలగాలతో కోర్టు గేట్లు బలవంతంగా తీయడానికి ప్రయత్నించారు.

కానీ న్యాయవాదులు అడ్డుకొని గేట్ల ముందు బైఠాయించారు. ఈ క్రమంలో కొంత తోపులాట జరిగింది.వందలాది మంది న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు బలగాలను తీసుకొని వెంటనే వెళ్లి పోవాలని సి వెంకటేశ్వరబాబుపై మండిపడ్డారు. పోలీసుల బలగాల రాకతో రక్షణ వలయంగా ఏర్పడ్డ న్యాయవాదుల ఉదృతికి తగ్గిన పోలీసులు వెనుకడుగు వేశారు. అనంతరం తమ బలగాలను తీసుకొని సిఐ అక్కడి నుండి వెళ్లిపోయారు.

take BY: Suryaa

Read more...

ఆపరేషన్‌ కేసీఆర్‌




ప్రజారాజ్యం పార్టీ విలీనంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం మరో అడుగు ముందుకేసి, టీఆర్‌ఎస్‌ను కూడా తనలో విలీనం చేసుకుని, అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంతో అడుగులేస్తోంది. ఆ మేరకు కేసీఆర్‌ను ఒప్పించే బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీని వాస్‌కు అప్పగించారు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే అంశంపై గురువారం సోనియా తనను కలసిన డీఎస్‌తో సుదీర్ఘంగా చర్చించారు. విశ్వస నీయ సమాచారం ప్రకారం.. జగన్‌ నిష్ర్కమణ, తిరుగుబాటుతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అని శ్చితి దిశగా సాగుతున్న ఆందోళనకర వాతావరణం నుంచి బయటపడేందుకు, పీఆర్పీని తాజాగా తనలో విలీనం చేసుకుని సీమాంధ్రలోఒకింత ఊపిరిపీల్చుకున్న నాయకత్వం... తాజాగా తెలంగాణలో బలం ఉన్న టీఆర్‌ఎస్‌ను సైతం విలీనం చేసుకుని సీమాంధ్ర, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది.

అందులో భాగంగా.. గురువారం తనను కలసిని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించాలని ఆమె డీఎస్‌ను ఆదేశించారు.

sonia-cతెలంగాణ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉందని, అయితే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటుచేసేం దుకు కేసీఆర్‌ను అంగీకరింపచేయాలని మేడమ్‌ డీఎస్‌ను ఆదేశించారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల వరకూ కేసీఆర్‌ను మౌనంగా ఉండాలని, ఆ తర్వాత హైద రాబాద్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటుచేసి, రాష్ట్రాన్ని విభజిస్తా మని కేసీఆర్‌కు హామీ ఇవ్వాలని డీఎస్‌ ఆదేశించారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ను విలీనం చేసిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు, పార్టీలో కీలక పదవులు అప్పగిస్తామని చెప్పాలన్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సమయంలో అనుకోని పరిస్థితిలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటే, సర్కారును గట్టెక్కించా లని కేసీఆర్‌ను కోరాలని సోనియా డీఎస్‌ను ఆదేశించారు. ఈ అంశంపై అహ్మద్‌పటేల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, వీరప్పమొ యిలీతో చర్చించాలని ఆదేశించారు. కేసీఆర్‌తో చర్చించి, విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియను పక్కకుపెడితే.. కాంగ్రెస్‌ తెలంగాణను ఇస్తే సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటామని, కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ ఇస్తే బర్కాస్‌ కావడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీన ప్రక్రియ వ్యవహారం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యా నిస్తున్నాయి. దానికితోడు తెలంగాణ ఇచ్చి తాము టీఆర్‌ ఎస్‌కు ఎందుకు క్రెడిట్‌ ఇస్తామని, అందువల్ల టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బాహాటం గానే వ్యాఖ్యానించిన విషయం విస్మరించకూడదు. స్వయం గా డీఎస్‌ సైతం తమకు ఎవరి అవసరం ఉంటే వారితో మాట్లాడతామని, కేసీఆర్‌తో కూడా మాట్లాడమని వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.

నిజానికి... కేసీఆర్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిపై చాలాకాలం నుంచీ గురి ఉందన్న వ్యాఖ్యలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నవే. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జన్మదినం సందర్భంగా సోనియా స్వయంగా ఫోన్‌ చేసి అభినందలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్‌ వెంటనే చిన్నారెడ్డికి ఫోన్‌ చేసి, తాను ఇక కాంగ్రెస్‌లో చేరి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తీసుకుం టానంటూ అక్కడ తాను విందు ఇచ్చిన జర్నలిస్టుల సమక్షంలో చెప్పిన విషయం చర్చనీయాంశమయింది.

అయితే.. ఢిల్లీలో జరుగుతున్న విలీన ప్రక్రియ ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ నేత వినొద్‌కుమార్‌ కొట్టివేసినా, కేసీఆర్‌ గతంలో అనేక సందర్భాల్లో అనుసరించిన వైఖరి పరిశీలిస్తే దీన్ని కొట్టిపారేయడానికి లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు వార్తలను ఖండించిన కేసీఆర్‌ ఆ తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009 నాటి ఎన్నికల ముందు టీడీపీతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపైనా ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత మహాకూటమిలో భాగస్వామిగా మారారు.

గతానుభవాల దృష్ట్యా.. కాంగ్రెస్‌లో విలీనంపై టీఆర్‌ఎస్‌ వాదన కూడా అదేవిధంగా ఉందంటున్నారు. పీఆర్పీ అధినేత చిరంజీవి సైతం తన పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందన్న వార్తలపై పలుమార్లు అగ్గిరాముడ య్యారు. తిరిగి ఆయనే గత ఆదివారం స్వయంగా ఢిల్లీకి వెళ్లి. సోనియా సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

take BY: Suryaa.com

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP