Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, July 3, 2012

Delete cartoons against politicians, bureaucracy, says textbook panel


 



The six-member panel constituted to review the cartoons used in social sciences textbooks of the National Council for Educational Research and Training (NCERT) has ordered the deletion of several cartoons and words that it says are either “ambiguous”, negative or show politicians and bureaucrats in an ‘incorrect way.

Among the material that gets the chop:

an R.K. Laxman cartoon from the 1950s showing Nehru telling France and Portugal (represented as monkeys, in the context of the demand that they leave Pondicherry and Goa) that ‘I admit years back you were living happily right here when this was all a colonial jungle… but we’ve cleared it now and built a decent house! So you must quit!’ (“Cartoon may be deleted. No politician or institution may be represented as animals”)

a Surendra cartoon from The Hindu showing babus blocking the RTI (“may be deleted as it is not a correct interpretation of the role of the bureaucracy”)

a Huffaker cartoon from the U.S. called ‘One-Party Country’ showing a porcine tycoon with the Senate, presidency and Supreme Court in his pockets (“may be deleted because politicians and institutions are represented as animals”)

an R.K. Laxman cartoon showing a beggar holding a bowl out to a garlanded Indira Gandhi (“may be deleted — being politically sensitive)

in a cartoon describing two Emergency-era notions — “Put simply, committed judiciary and committed bureaucracy means that the judges and officers should be loyal to the ruling party. What a pity!” — the panel says “What a pity!” should be removed.

a Shankar cartoon called ‘Kicking upstairs’ showing Nehru using his foot to propel a politician up into a building labelled ‘Governorship’ (“may be deleted as it conveys a sense of ambiguity”)

The panel’s 40-page report was submitted to the government on June 27. Its terms of reference were to identify educationally inappropriate materials and provide alternative suggestions for the six textbooks in Political Science. One member, M.S.S. Pandian — who said he found nothing objectionable in the books — has issued a dissenting note.

Justifying the proposed deletions, the panel majority headed by S.K. Thorat says in its report: “They [authors] may have reasons to believe that the cartoons used were not offensive but only reflected commonly perceived notions. 

In a society as vast and as diverse as India is, there can always be room for different understanding of the text and interpretation of visuals, and especially cartoons could be viewed differently by different segment of society. It is more so when multiple sensitivities get involved. The sensitivities, genuine or perceived, have to be taken note of and addressed carefully.”

Calling for wider consultation and feedback in the future, the panel said the “best way for that can be pre-testing of texts and visuals in different setting such as rural- urban and various types of schools, discussion with different religious minorities and ethnic minorities, involvement of teachers and faculty from different social and religious background in textbook development, periodic updating, improving and redressing objections in an appropriate academic manner.”

Take By: The Hindu

Read more...

గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి


గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి

yADAGIRE talangana patrika telangana culture telangana politics telangana cinemaఇదీ యాదగిరి చిట్టాపద్దు
- సోమశేఖరరెడ్డి నుంచి అడ్వాన్సుగా రూ.9.5 కోట్లు.
- యాదగిరి నొక్కేసింది రూ.6.5 కోట్లు
- గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో రూ.3.75 కోట్ల నిల్వ
- చలపతిరావుకు ఇచ్చింది రూ.3 కోట్లే
- ఇంటి పక్కనే ప్లాటు కొనుగోలుకు రూ.40 లక్షలు
- నాచారంలో ఇల్లు కొనుగోలుకు రూ.20 లక్షలు
- మారుతి స్విఫ్ట్ కారు కొనుగోలుకు రూ.8.10 లక్షలు కుక్కలను కట్టేసేచోట ఆస్తుల పత్రాలు
- గెస్ట్‌హౌస్‌లో వాటర్‌ట్యాంక్‌కు 20 సీసీ కెమెరాల నిఘా
- డబ్బు స్వాధీనం.. పత్రాలు సీజ్
- లెక్క దొరకని మొత్తం రూ.2.07 కోట్లు
- కర్నూలులో యాదగిరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు
- అజ్ఞాత జీవితానికి గాలి సోదరుడి సహకారం!
- మొబైల్ కాల్స్‌ను ట్రాక్ చేసి పట్టుకున్న ఏసీబీ బెయిల్ ఫర్ సేల్ కేసులో రౌడీషీటర్ అరెస్ట్

హైదరాబాద్, జూలై 2 (): బెయిల్ ఫర్ సేల్ కేసులో కీలక పాత్రధారి అయిన రౌడీషీటర్ యాదగిరిరావు అలియాస్ యాదగిరి అలియాస్ గిరిని ఏసీబీ అధికారులు కర్నూలులోని ఓ హోటల్‌లో అరెస్టు చేశారు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించేందుకు అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి అడ్వాన్సుగా 9.5కోట్ల రూపాయల నగదును తీసుకున్నట్టు యాదగిరి విచారణలో వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను రిటైర్డ్ జడ్జి చలపతిరావుకు ఇచ్చినట్టు వెల్లడించాడు. కొంత డబ్బును తన నివాసంలో దాచిపెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున యాదగిరిని వెంటబెట్టుకుని నాచారంలోని అతని ఇంటికి వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. అదే ప్రాంతంలో ఉన్న యాదగిరి గెస్ట్‌హౌస్‌లో కూడా సోదాలు చేసి, వాటర్‌ట్యాంక్‌లో దాచిపెట్టిన రూ.3.75కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కుక్కలను కట్టి ఉంచే చోటు నుంచి విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు.

యాదగిరి తండ్రి బాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాలికి బెయిల్ డీల్‌లో ఇంకా స్వాధీనం కాకుండా ఉన్న 2.07 కోట్ల రూపాయలు ఎక్కడికి? ఎవరి చేతికి? వెళ్లాయన్న దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బెయిల్ డీల్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి చేతికి ఈ డబ్బు చేరిందా? లేక యాదగిరి ఈ మొత్తాన్ని తన సంబంధీకుల వద్ద దాచి పెట్టుకున్నాడా? అన్న కోణాల్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మంగళవారం యాదగిరిని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని మొత్తం వ్యవహారంపై అతన్ని క్షుణ్ణంగా ప్రశ్నించాలని నిశ్చయించారు.
Gali05 talangana patrika telangana culture telangana politics telangana cinema
గాలి బెయిల్ డీల్‌లో భాగంగా అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి 9.5కోట్ల రూపాయల నగదును అడ్వాన్సుగా తీసుకున్న యాదగిరి బెయిల్ మంజూరైన రాత్రే తన మనిషి ద్వారా చలపతిరావు ఇంటికి రూ.3 కోట్లు ఇచ్చి పంపించాడు. మిగిలిన రూ.6.5కోట్లను తన వద్దనే పెట్టుకున్నాడు. ఒప్పుకున్న ప్రకారం రూ.5కోట్లు ఇవ్వాలి కదా.. అని చలపతిరావు ఫోన్ చేయగా గాలికి మంజూరైన బెయిల్‌పై సీబీఐ అధికారులు హైకోర్టుకు వెళ్లారని, దానిపై నిర్ణయం వెలువడిన తరువాత మిగతా రూ.2కోట్లు ఇస్తానని చెప్పాడు. అయితే.. చలపతిరావు సీబీఐ అధికారులకు చిక్కగానే యాదగిరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ కోసం డీల్ కుదుర్చుకున్న ఆయన తమ్ముడు సోమశేఖరడ్డి, కర్ణాటక రాష్ట్రం కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబులు యాదగిరికి సహకరించారని, పోలీసులకు చిక్కకుండా యాదగిరిని కొన్నిరోజులు బెంగళూరు శివార్లలో దాచిపెట్టినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.

యాదగిరి కోసం వేటను ముమ్మరం చేసిన ఏసీబీ అధికారులు.. బెంగళూరుకు ప్రత్యేక బృందాలను కూడా పంపించారు. సోమశేఖరడ్డి తదితరుల కదలికలపై నిఘా పెట్టారు. యాదగిరితోపాటు సోమశేఖరడ్డి తదితరుల మొబైల్‌ఫోన్లపై కన్నేసి ఉంచారు. దీనిని పసిగట్టిన యాదగిరి ఇటీవలే కర్నూలుకు చేరుకుని ఓ హోటల్‌లో బస చేశాడు. అతని మొబైల్‌ఫోన్ కాల్స్ ద్వారా యాదగిరి కర్నూలులో ఉంటున్నట్టు పసిగట్టిన ఏసీబీ అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

9.5కోట్లు తీసుకున్నా : విచారణలో యాదగిరి
గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించటానికిగాను అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి రూ.9.5కోట్లను అడ్వాన్సుగా తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో యాదగిరి వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను వెంకట చలపతిరావుకు అందచేసినట్టు తెలియచేశాడు. కొంత డబ్బును తన గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో భద్రపరిచినట్టు చెప్పాడు. ఇక, అడ్వాన్సుగా తీసుకున్న మొత్తం నుంచి రూ.40లక్షలు వెచ్చించి తన ఇంటి పక్కనే ఉన్న ప్లాటును, మరో 20లక్షల రూపాయలతో నాచారంలో ఓ ఇల్లును కొన్నట్టు వెల్లడించాడు. మరో 8.10లక్షలు ఖర్చు చేసి మారుతి స్విఫ్ట్ కారు కొన్నట్టు చెప్పాడు.
తెల్లవారుజాము సమయంలో..: ఈ నేపథ్యంలో యాదగిరిని వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున నాచారంలోని అతని ఇంటికి చేరుకున్నారు. యాదగిరి నివాసంతోపాటు అతని గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు జరిపారు.

తనిఖీల్లో గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో యాదగిరి దాచిపెట్టిన 3.75 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సెక్యూరిటీగా యాదగిరి 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు ఓ వాచ్‌మెన్‌ను కూడా నియమించుకున్నట్టు విచారణలో నిర్ధారించుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న తరువాత ఏసీబీ అధికారులు యాదగిరితోపాటు తమ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మరోసారి ప్రశ్నించగా విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తన ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశంలో భద్రపరిచినట్టుగా యాదగిరి వెల్లడించాడు. దాంతో మధ్యాహ్నం 12.30గంటలకు మరోసారి యాదగిరిని వెంట తీసుకుని నాచారం వచ్చిన ఏసీబీ అధికారులు అతని ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశం నుంచి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Take By: T Media

Read more...

శాఖ కరెంటు టెంటు ఆంధ్రోళ్ల టెంటు

Power500 talangana patrika telangana culture telangana politics telangana cinema

తరలిపోయిన
కీలక ప్రాజెక్టులు
యథేచ్ఛగా
ఉద్యోగాల దోపిడీ
తెలంగాణ జిల్లాల్లో నిర్మించాల్సిన
ప్రాజెక్టులను సీమాంవూధకు
తరలించడం ద్వారా ఉద్యోగాల్లో జరిగిన నష్టం
వనరుల్లేనిచోట పవర్‌ప్లాంట్లు
తెలంగాణకు మొండి చేతులు
ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు
పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
కోల్పోయిన తెలంగాణ ప్రాంతం
సీమాంధ్రలో నూరుశాతం స్థానికులే
అందుకోసం జీవోలూ జారీ
నెల రోజుల్లో అమలైన జీవో 564
దశాబ్దంగా మూలపడి
ఉన్న జీవో 610
నిర్ణయాత్మక స్థానాల్లో
సీమాంధ్రులు
వారి ప్రాంతాలకు
అనుగుణంగా జీవోలు
కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు
dddd talangana patrika telangana culture telangana politics telangana cinema

తెలంగాణ ప్రాంతంలోని జెన్‌కో పవర్ ప్రాజెక్టుల్లో 60 శాతం ఉద్యోగులు సీమాంవూధవారే! కానీ.. సీమాంవూధలోని జెన్‌కో ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జాడే కనిపించదు! తెలంగాణ ప్రాంతానికి నీరందించే శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టులో 70 శాతం ఉద్యోగులు సీమాంవూధులే! కానీ.. విజయవాడలోని వీటీపీఎస్ ప్రాజెక్టులో కేవలం పట్టుమని ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు కూడా లేరు! 2011 మార్చి వరకు విద్యుత్‌రంగంలో 80,920 పోస్టులు మంజూరై ఉండగా, వాటిల్లో 23,366 పోస్టులు మాత్రమే తెలంగాణ వారికి దక్కాయి! ఇందులోనూ మూడు వేల మంది తెలంగాణకు వలస వచ్చినవారే! అంటే.. తెలంగాణ గడ్డపై పుట్టిన వారికి దక్కింది కేవలం 20వేల ఉద్యోగాలేనన్నమాట! అంతేకాదు.. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులు సీమాంవూధకు తరలిపోవడంతో ప్రత్యక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను, పరోక్షంగా లక్షలాది ఉపాధి అవకాశాలను తెలంగాణ కోల్పోయింది. సమైక్యాంవూధలో తెలంగాణకు జరిగిన నష్టానికి విద్యుత్ రంగంలోని ఈ అన్యాయాలు మచ్చుతునకలు! విద్యుత్ బయటికి కనిపించదు.. కానీ పట్టుకుంటే షాక్‌కొడు తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలూ అంతే.. పట్టిచూస్తే కానీ అంతుచిక్కవు!!

శాఖ కరెంటు ఆంధోళ్ల టెంటు
తరలిపోయిన కీలక ప్రాజెక్టులు.. యథేచ్ఛగా ఉద్యోగాల దోపిడీ
- వనరుల్లేని చోట పవర్‌ప్లాంట్లు.. తెలంగాణకు మొండి చేతులు
- ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు.. పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
- కోల్పోయిన తెలంగాణ ప్రాంతం.. సీమాంవూధలో నూరుశాతం స్థానికులే
- అందుకోసం జీవోలూ జారీ.. నెల రోజుల్లో అమలైన జీవో 564
- దశాబ్దంగా మూలపడి ఉన్న జీవో 610
- నిర్ణయాత్మక స్థానాల్లో సీమాంవూధులు
- వారి ప్రాంతాలకు అనుగుణంగా జీవోలు
- కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
- సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు

Contral0 talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, జూలై 2 (): సీమాంధ్రులు నిర్ణయాత్మక స్థానాల్లో ఉండి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది! విద్యుత్‌రంగంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, 4 డిస్కమ్‌లలోని ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కకుండా సీమాంవూధులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతల వాదన! లోతుగా తరచి చూస్తే.. నివురుగప్పిన అన్యాయం.. నిప్పులా కనిపిస్తుంటుంది. శాతాలు, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు వాటా దక్కినట్లు కనిపించినా.. కనిపించని అన్యాయం మరోటి ఉంది. అదే తెలంగాణ కోల్పోయిన ఉద్యోగాలు! విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు పుష్కలంగా లభ్యమవుతున్నా తెలంగాణ ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టకపోవడం, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను సీమాంవూధకు తరలించడం, రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో తెలంగాణ నష్టపోయిన ఉద్యోగాలు 16వేలకుపైనే! ట్రాన్స్‌కోలో 8,302 మంది, జెన్‌కోలో 15,647 మంది, నాలుగు డిస్కమ్‌లలో 56,971 మంది ఉద్యోగులున్నారు.

రాష్ట్రంలో ఉన్న నాలుగు డిస్కమ్‌లలో రెండు డిస్కమ్(ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లు పూర్తిగా సీమాంధ్ర పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 26,605 మంది పనిచేస్తుండగా, సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో 30,366 మంది ఉద్యోగులున్నారు. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది వలసవాదులు ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సీపీడీసీఎల్ పరిధిలో రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా ఉండడంతో ఈ రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనిచేస్తున్నారు. సీమాంవూధలో నూటికి నూరుశాతం అక్కడివారే ఉద్యోగాలు పొందుతుండగా అదే విధానం తెలంగాణలో ఎందుకు పాటించడం లేదన్నది ప్రశ్న!
Power10 talangana patrika telangana culture telangana politics telangana cinema

అంటే.. వంద మార్కులు వచ్చేలా చదివిన విద్యార్థికి 40మార్కులు వేసి.. అసలు ఒక్కమార్కు వచ్చేందుకూ ఆస్కారం లేని విద్యార్థికి 60 మార్కులు వేసిన ప్రభుత్వం.. సమతుల్యం పాటించామంటూ మోసగించే యత్నాలను నిస్సిగ్గుగా చేస్తున్నది! అంతేకాదు.. ఈ అన్యాయంలో పెను జీవన విధ్వంసం కూడా కనిపిస్తుంది. సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా కోసం తెలంగాణ నుంచి బొగ్గు అందిస్తున్నారు. ఈ పేరుతో భారీ స్థాయిలో ఓపెన్‌కాస్ట్ గనులను తవ్వి.. వందల వేల గ్రామాల ఉనికిని అదృశ్యం చేస్తున్నారు. వెరసి.. విద్యుత్ రంగంపై సీమాంధ్ర పాలకుల వివక్ష ఫలితంగా అటు ఉద్యోగిత పరంగానే కాకుండా.. ఇటు ఆర్థికంగానూ తెలంగాణ నష్టపోయింది. మరోవైపు వనరుల్లేని ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి బొగ్గు రవాణా, అక్కడి ప్రాజెక్టులనుంచి విద్యుత్ పంపిణీలో నష్టాలు కలిసి.. అక్కడ తయారయ్యే విద్యుత్ ఖరీదును అమాంతం పెంచివేస్తున్నది.

1969లో వికసించిన విద్యుత్ తేజం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉవ్వెత్తున రాజుకొనడానికి నాంది పలికింది విద్యుత్ రంగమే! 1957లో ఏపీ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ టు రెసిడెన్సీ యాక్ట్‌ను విద్యుత్ బోర్డు.. నాటి ఎపీఎస్‌ఈబీలో అమలు చేయాలంటూ ఓ విద్యార్థి చేసిన ఆమరణ నిరాహార దీక్ష.. దవానలంలా వ్యాపించి.. తెలంగాణ పది జిల్లాలకూ విస్తరించింది. జై తెలంగాణ అంటూ యావత్ ప్రాంతం నినదించేందుకు గొంతుక అయ్యింది! అదే స్ఫూర్తి విద్యుత్ రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నది.

మొన్నటి సహాయ నిరాకరణ ఉద్యమం, తదుపరి సకల జనుల సమ్మెలో విద్యుత్ తేజం వికసించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సమరశంఖం పూరించింది. విద్యుత్ రంగంలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకుండా సీమాంవూధులు కుట్రలు చేస్తే ఉప్పెనలాంటి ఉద్యమాన్ని చవిచూడాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా ఉన్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(టీ జాక్) హెచ్చరిస్తున్నది. గత ఆరు దశాబ్దాల చరివూతను నెమరేసుకుని సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయనేతలు మసలు కుంటారో, మలిఉద్యమాన్ని చవిచూస్తారో వారే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు వర్తింపజేయాల్సిందేనని, దీనిపై న్యాయస్థానాల్లో కేసులుంటే ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
Power50 talangana patrika telangana culture telangana politics telangana cinema

1957లో చట్టం
ఏపీ ఎంప్లాయ్‌మెంట్, రిక్రూట్‌మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్-1957 ప్రకారం 14 ఏళ్లపాటు పాటు స్థానికంగా ఉన్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. ఈ చట్టాన్ని విద్యుత్‌బోర్డు(ఎపీఎస్‌ఇబి)లో వర్తింపజేయాలని తెలంగాణ యువకులు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ చట్టం విద్యుత్‌బోర్డుకు వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా 1969లో ఖమ్మం జిల్లా పాల్వంచలో ఒక విద్యార్ధి చేసిన ఆమరణ నిరాహారదీక్ష తీవ్రత దావానలంగా తెలంగాణ జిల్లాలకు విస్తరించి 1969 తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. హైకోర్టు తీర్పుపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు.

అయితే సుప్రీంకోర్టు సైతం విద్యుత్‌బోర్డుకు 1957 చట్టం వర్తించదని హైకోర్టు తీర్పునే ఖరారుచేసింది. దాంతోపాటు 1957 చట్టం అమలుకు ముందున్న ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు 1971లో తీర్పు ఇచ్చింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంవూతిగా ఉన్న పీవీ నరసింహారావు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దానిని జీర్ణించుకోలేని సీమాంధ్ర రాజకీయనేతలు ముల్కీ రూల్స్ అమలుచేస్తే తమకు ఉద్యోగ అవకాశాలు దక్కవని గుర్తించి, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షతో జై ఆంధ్రా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర రూపందాల్చడంతో నాటి కాంగ్రెస్ అధిష్ఠానం పీవీతో సీఎం పదవికి రాజీనామా చేయించింది. ఆ తర్వాత కేంద్రం 1974లో రాజ్యాంగ సవరణ (37) చేసి ముల్కీ నిబంధనలను తొలగించింది. అనంతరం 1975 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అయితే నాడు అధికారంలో ఉన్న పాలకులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయనేతల ఉద్యమం ఫలితంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గిర్‌గ్లానీ కమిషన్ 2004లో ప్రభుత్వానికి సుదీర్ఘమైన నివేదిక సమర్పించింది. విద్యుత్ రంగానికి సంబంధించిన ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో సంస్థల్లోనూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని సిఫారసు చేసింది.

బొగ్గు సింగరేణిది-సోకు సీమాంధ్రులుది
విద్యుత్ రంగంలో మొదటి నుంచి సీమాంధ్ర పెట్టుబడిదారులదే పైచేయిగా ఉంది. ప్రత్యేకించి గత మూడు దశాబ్దాలుగా సీమాంవూధులు విద్యుత్‌రంగాన్ని కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. విద్యుత్‌రంగంలో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రం ఎల్లలుదాటి ఇతర రాష్ట్రాలకు, మరో అడుగు ముందుకేసి విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి సహజవాయు నిక్షేపాలు, సహజ వనరులను సొంతం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. తెలంగాణ నుంచి వచ్చే బొగ్గు ఆధారంగానే సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన ప్రాజెక్టులు. కానీ.. సీమాంధ్ర పాలకులు వాటిని తమ తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. దీనికి అదనంగా తెలంగాణలో బొగ్గు తవ్వకాలకు ఓపెన్‌కాస్టుల పేరిట పెను జీవన విధ్వంసం జరుగుతున్నది.

సీమాంధ్రులదే పెత్తనం......
విద్యుత్‌రంగంలో అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులుగా, డైరెక్టర్లుగా సీమాంవూధులే అగ్రభాగంగా ఉన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఒక్క ట్రాన్స్‌కోలోనే రిజిస్టర్ అయిన బడా కాంట్రాక్టర్లు 21మంది ఉంటే.. వారిలో 19మంది సీమాంవూధులే. ఇలాంటి పరిస్థితులకు నాటి సీఎం చంద్రబాబు ప్రధాన కారణమన్న విమర్శ బలంగా ఉంది. సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తికి పాతర వేసి, ప్రైవేటురంగంలో విద్యుత్ ఉత్పత్తికి ఆయన హయాంలోనే ప్రాధాన్యం ఇచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు పెట్టేందుకుకు అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు హయంలో సీమాంవూధుల నక్కజిత్తుల కారణంగా ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులు ఏ ఒక్కటీ ఈనాటి వరకు ఆచరణకు నోచుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఏపీఎస్‌ఈబీ నాటినుంచే సీమాంవూధులు కుట్రలు కుతంవూతాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో పనిచేసిన మెజారిటీ డైరెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన దాఖలాలున్నాయి. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించుకుంటూ, వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుట్రపూరితంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సంస్కరణల తదుపరి అప్పట్లో విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా పనిచేసినవారు ఇప్పుడు అదే సీమాంధ్ర పవర్ ప్రాజెక్టుల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం.

గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్‌వూపాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎన్నో మతలబులున్నాయి. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో ప్రాజెక్టు విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతోనే ల్యాంకో ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ మతలబు ఉంది. అంతే కాకుండా మర్చంట్ పవర్‌వూపాజెక్టుగా ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టును ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫారసు చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఆ విధంగా వచ్చిన ల్యాంకో ఇటీవల సకల జనుల సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడు రాష్ట్రానికి విక్రయాలు జరిపింది. ఫలితంగా కరెంటు కోతలతో ఒకవైపు పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోగా, పరిక్షిశమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా రైతుకూలీలు, పరిక్షిశమల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి కొరవడింది.

తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిల్వలు, నీటి లభ్యత ఉన్నా ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు రాలేదు. సత్తుపల్లిలో 600మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. చుట్టూ బొగ్గు ఉన్నా కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. సత్తుపల్లి ప్రాజెక్టు వస్తే తెలంగాణ సస్యశ్యామలమై ఉండేది. కరీంనగర్ జిల్లా నేదునూరులో 2100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు 2002లోనే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కేవలం 26 నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు.

గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతోనే ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోయింది. సకాలంలో ఇది పూర్తి అయితే 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. దాంతో జెన్‌కోకు పేరు ప్రతిష్ఠలు రావడంతోపాటు వ్యవసాయ, పారిక్షిశామికరంగాల్లో తెలంగాణ దూసుకు పరిస్థితులుండేవి. ఇదే సమయంలో 2003లో సీమాంవూధకు చెందిన నాలుగు గ్యాస్ పవర్ ప్రాజెక్టులు జీవీకే 220 మెగావాట్లు, వేమగిరి 370 మెగావాట్లు, గౌతమి 464 మెగావాట్లు, కోనసీమ 445 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో 1400 మెగావాట్ల సామర్థ్యం గల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే అన్నీ అనుమతులు వచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పడేసింది. కాంతానపల్లితోపాటు మరికొన్ని హైడెల్ పవర్ ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో వ్యవసాయరంగం, పారిక్షిశామికరంగాలు ఎదగాల్సినంతగా ఎదలేకపోయాయి. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయింది.

ఒప్పందాల ఉల్లంఘనలు
విద్యుత్ సంస్కరణల సమయంలో చేసుకున్న ఒప్పందాల్లో అనేకం ఈనాటికీ అమలుకు నోచుకోలేదు. గతేడాది సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతాంగానికి, వినియోగదారులకు మెరుగైన కరెంటు సేవలు అందిస్తూనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో భాగస్వామ్యమై కీలక భూమిక పోషించారు. సింగరేణి కార్మికుల సమ్మె, తదుపరి కరెంటోళ్ల సమ్మె సర్కారును ఇరకాటంలో పెట్టింది. దాంతో గత ఏడాది అక్టోబర్ 25న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ యాజమాన్యాలు రాతపూర్వక ఒప్పందాలు చేసుకున్నాయి. ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. మొత్తం 13 అంశాలపై యాజమాన్యాలు అధికారికంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కే రఘు, పీ మోహన్‌డ్డి, ఎం జానయ్య, ఎస్ స్వామిడ్డి, టీ అంజిడ్డితో పాటు దాదాపు 22 మంది సంతకాలు చేయగా, విద్యుత్ సంస్థల యాజమాన్యాల తరఫున ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జెన్‌కో ఎండీ విజయానంద్, సెంట్రల్ పవర్ డిస్కమ్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో జేఎండీలు రమేష్, రఘనాథంలతో పాటు ఏడుగురు అధికారులు సంతకాలు చేశారు.

జీవోల అమలులో ఎంతో తేడా
ఆచరణలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకపోవడంపై వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతలను తట్టుకునేందుకు 1985 డిసెంబర్‌లో అప్పటి సీఎం ఎన్‌టీఆర్ 610 జీవో తెచ్చారు. విచిత్రం ఏమంటే 610 జీవో జారీకి నెల ముందు రాయలసీమ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 564ను తీసుకువచ్చింది. రాయలసీమ జిల్లాల్లో (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) ఇతర జిల్లాల ఉద్యోగులు ఉండరాదనేది జీవో సారాంశం. ప్రభుత్వం ఈ జీవోను నెలలో అమలుచేసి రాయలసీమలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఉన్నపళాన వెనక్కి పంపించింది. అప్పట్లో రాయలసీమ నేతలు తెలంగాణ ఉద్యోగుల పట్ల కిరాతకంగా వ్యవహరించిన తీరును ఇప్పటికీ ఉద్యోగులు మరచిపోలేదు. కేవలం నెల గడువులో 564 జీవోను నిఖార్సుగా అమలు చేసిన ప్రభుత్వం దశాబ్దకాలంగా 610 జీవోను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదంటే తెలంగాణపై ఎంతటి పక్షపాతధోరణి ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రత్యేకవాదులు అంటున్నారు.

రాయలసీమ ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌వూపాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్ళు లేవని సాకులు చెప్పిన ఆనాటి పాలకులు నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, పోతిడ్డి పాడు నుంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయి. ఆర్టీపీపీ కోసం దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పొతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఒప్పందంలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి
1. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.
2. విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిపిన సమ్మెకాలాన్ని డ్యూటీగా పరిగణించడం.
3. సమ్మె కాలానికి వేతనాలు తీసుకోని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్సుగా చెల్లించడం.
4. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్ (హైదరబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది పట్ల భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడకుండా ఉండడం.
5. సమ్మె కాలంలో టీజాక్ సభ్యులపై నమోదైన కేసుల ఉపసంహరణ.
6. తెలంగాణ ప్రాంతంలో జెన్‌కో పరిధిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులైన నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి, కాంతానపల్లి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయడం.
7. కేటీపీఎస్ అవసరాలను కాదని సింగరేణి బొగ్గును వీటీపీఎస్‌కు, ఆర్టీపీపీకి తరలించకుండా చర్యలు తీసుకోవడం.
8. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీసీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తప్పించి కర్నూలు జోన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాను వేరు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడం.
9. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయి కల్పించి, వారి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవడం.
10. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించడం.
11. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన (కాంపాసినేట్ అపాయింట్‌మెంట్), అవసరాలను బట్టి సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి చర్యలు.
12. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో అవసరాలకు
అనుగుణంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు ప్రభుత్వాన్ని కోరడం.
13. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ చారివూతక స్మారక స్తూపాన్ని
తెలంగాణ చౌరస్తా (మింట్ కాంపౌండ్)వద్ద ఏర్పాటు చేయడం.

Take By: T Media

Read more...

Monday, July 2, 2012

French Airports Forcing Muslim Women to Remove Veil


The growing injustices of French Government against its Muslim citizens are on high. The airports in France are forcing Muslim women to take off their hijab.

The incidents have triggered outrage in France's Muslim community for ignoring the religious minority’s personal freedoms as reported in Today’s Zaman.


In the report Narin Yuksel told Zaman that “I am 65. What could there be under the headscarf of a 65-year-old woman?” Narin is one of the women who were asked to remove their headscarves at Nantes Atlantique Airport.

She further said “they told me that I would not be able to board my plane if I don't take off my headscarf.”

The report further says that Muslim women problem started two weeks ago when the Collective Against Islamophobia in France (CCIF) announced that Nantes Atlantique Airport has made it obligatory for veiled women to take off their hijab and place it in the X-ray machine along with their other belongings.

The practice was applied by the SGA, the company responsible for Nantes Atlantique Airport's security.

Airport officers asked women to remove their hijab at the conveyor with other belongings.

When women asked to be allowed to take hijab off in a special room for women only, their request was rejected.

The women were told that they must place their headscarves on the conveyor going through the X-ray machine if they wanted to avoid missing their plane.

“When we asked them to do the security check in a special room, they threatened to call the police if my mom didn't take off her headscarf,” Yüksel's daughter Hatice said.

The SGA defended their actions, claiming that dangerous materials could be hidden under the headscarves, which has triggered outrage in France's Muslim community.

According to EU airport security regulations, security staff do not have the authority to ask women to take their headscarves off.

Take By: Siasat News

Read more...

సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు


సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు

- సగానికి పైగా శిథిలావస్థలో
- కానరాని కనీస సౌకర్యాలు
- పలుచోట్ల కనిపించని మరుగుదొడ్లు
- 29 కాలేజీల్లో ప్రయోగశాలలు కరువు
- 20 చోట్ల ప్రహరీలూ లేవు
- 300కు పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీ
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఆందోళనలో విద్యార్థులు

దాహమేస్తే ఓర్చుకోవాలి..
మంచినీళ్లు దొరకవు గనుక..!
మూత్రమొస్తే ఆపుకోవాలి..
మరుగుదొడ్లు లేవుగనుక..!
వర్షమొస్తే బయటకు పరిగెత్తాలి..!
పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు గనుక..!
పందులు, పశువులకూ ప్రవేశముంది..
ప్రహరీలు లేవుగనుక..!
కాలేజీకి రాకపోయినా ఫర్వాలేదు..
లెక్చరర్లే లేరుగనుక..!


సర్కారీ ఇంటర్ కళాశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి..! సగానికిపైగా శిథిలావస్థకు చేరుకొని బంజరుదొడ్లను తలపిస్తున్నాయి..! పాఠాలు చెప్పే అధ్యాపకులే కాదు.. కాగడా వేసి వెతికినా కనీస సౌకర్యాలు కానరావడం లేదు..! వర్షమొస్తే ఎప్పుడు కూలుతాయో తెలియని పైకప్పుల కింద చదువులు కొనసాగించే పరిస్థితి లేదు..! దీంతో పదోతరగతి పాసై, ఎన్నో ఆశలతో కాలేజీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు వాస్తవ పరిస్థితిని జీర్ణించుకోలేక లబోదిబోమంటున్నారు..!

జిల్లావ్యాప్తంగా 71 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు(50- బాలురు, -బాలికలు),11 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు (బాలురు-, బాలికలు-3), రెండు గిరిజన సంక్షేమ గురుకుల కళాలలు(బాలురు-1, బాలికలు-1) ఎనిమిది ప్రైవేటు కో-ఆపరేటివ్ కళాశాలలున్నాయి. మారుమూల మండలాలు మినహా దాదాపు మండలానికో జూనియర్ కళాశాల ఉంది. వీటిలో సగానికి పైగా కళాశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీ వర్షమొస్తే గదుల పైకప్పులు, గోడలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 21 కళాశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

 చాలా చోట్ల బెంచీలు, బల్లలు లేవు. విరిగిపోయి మూలపడ్డవాటికి మరమ్మతులు చేయించేవారు లేరు. 300కు పైగా జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకువస్తున్నారు. పది కళాశాలలకు ప్రిన్సిపాళ్లు కూడా లేరు. 25 మందికన్నా తక్కువ విద్యార్థులుంటే సెక్షన్ ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించడంతో దాదాపు 10 కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 20 కళాశాలకు ప్రహరీలు లేకపోవడంతో పశువులు, పందులు లోపలికి వస్తున్నాయి.

దీంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. పదింట్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మూత్రం వస్తే బయటకు పరిగెత్తాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచినీటికీ ఇక్కట్లు పడాల్సి వస్తోంది. 29కి పైగా కళాశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు లేవు. లైబ్రరీయన్లు లేకపోవడంతో గ్రంథాలయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 50 దాకా పీడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో క్రీడల అడ్రస్ లేకుండా పోయింది.

Take by: T news

Read more...

మెడికల్ సీట్ల కుట్ర


- index talangana patrika telangana culture telangana politics telangana cinema సీమాంవూధకు అదనంగా 150 సీట్లు.. తెలంగాణకు సున్నాయే
- 250 సీట్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కటీ తేలేదు
- అధికారుల నిర్లక్ష్యంతో రాని వరంగల్, గాంధీ సీట్లు
- కనీస సౌకర్యాలు లేవని ఉస్మానియా సీట్లు కట్
- అవిలేకున్నా సీమాంధ్ర కాలేజీలకు సీట్లు
- మెడికల్ సీట్ల విషయంలో కొనసాగుతున్న వివక్ష

హైదరాబాద్, జూలై 1 (): ఇది మరో దగా.. తెలంగాణ పట్ల సీమాంధ్ర అధికారులు, వారితో కలిసిపోయే ప్రభుత్వాల తీరును బట్టబయలు చేసే మరో సందర్భం. మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. దీనికి తోడు ఈ సంవత్సరం మెడికల్ సీట్ల విషయంలో కూడా తెలంగాణకు వివక్షే ఎదురైంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్ల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తులు పంపిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీమాంవూధకే సీట్లు తెప్పించే బాధ్యతను తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గుంటూరు, అనంతపురం కాలేజీల నివేదికలను ఎంసీఐకి పంపలేదు. ఎనిమిది కాలేజీల నివేదికలనే పంపారు. వాటిల్లో తెలంగాణ నుంచి గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీల నివేదికలు కూడా ఉన్నాయి. ఎంసీఐ పరిశీలన బృందం ఇన్‌స్పెక్షన్‌కు వచ్చినప్పుడు దాదాపు ఏ కాలేజీలోనూ కనీస మౌలిక సదుపాయాలు లేవని, భవనాలు, ల్యాబ్‌లు, రేడియాలజీ యూనిట్లు, తాగునీరు, బాత్‌రూంలు సరిగ్గా లేవని రాష్ట్రానికి లేఖ రాసింది.

ఆ లేఖలో విశాఖపట్నం కాలేజీకి సీట్లు ఇచ్చేందుకు ఓకే కానీ, ఈ కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను మెడికల్ అండ్ హెల్త్ సెక్రెటరీ బాధ్యత తీసుకుంటే ఇస్తామని మెలి క పెట్టింది. ఇందుకు ప్రతి లేఖ ఇవ్వడంతో విశాఖపట్నం కాలేజీకి సీట్లు దక్కాయి. ఇక విజయవాడ, కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజీలకు కూడా 50సీట్ల చొప్పున దక్కాయి. మొత్తంగా సీమాంవూధలోని మూడు కాలేజీలకు అదనంగా 150 సీట్లుదక్కాయి. అదే తెలంగాణ విషయానికొస్తే ఉస్మానియా కాలేజీలో తాగునీరు, కరెంటువైర్లు బయటకు కనిపిస్తున్నాయనే సాకును చూపి సీట్లు ఇవ్వలేదు. ఇక గాంధీలో ఓపీ తక్కువ ఉందనే కారణంతో అసలు ఇన్‌స్పెక్షనే చేయలేదు. ఇక వరంగల్ కాలేజీ విషయానికొస్తే ఇక్కడ పనిచేసిన మాజీ ప్రిన్సిపల్ కాలేజీ రిపోర్టునే సరైన సమయానికి డీఎంఈకి ఇవ్వలేకపోయారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ కాలేజీకి కూడా ఎంసీఐ బృందం పరిశీలనకు వెళ్లలేదు. అంటే తెలంగాణలోని మూడు కాలేజీలకు సీట్లు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం, సీమాంధ్ర అధికారుల కుట్ర ఉందని తెలుస్తోంది.

నిజామాబాద్ కాలేజీకి స్టాఫ్‌ను కేటాయించి, భవనాలు త్వరగా పూర్తిచేసి ఉంటే ఈ ఏడాది వంద సీట్లతో కాలేజీ ప్రారంభమయ్యేది. కానీ అధికారులు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఈ కాలేజీ 2010లో ప్రారంభమైన ఇప్పటికీ సీట్లు తెచ్చుకోలేకపోతోంది. ఇలా తెలంగాణకు రావాల్సిన 250సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి వైద్య రంగంలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలొస్తున్నాయి.

సౌకర్యాలు లేకున్నా సీమాంవూధకు సీట్లు
తెలంగాణలో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీలో తాగునీరు, బాత్‌రూం, ల్యాబ్‌లలో రిపేర్లు సాకుగా చూపి 50సీట్లు రాకుండా పోయాయి. అదే సీమాంవూధలోని విజయవాడ మెడికల్ కాలేజీలో రేడియాలజీ, రూరల్ హెల్త్ సెంటర్ భవనం, మరికొన్ని సౌకర్యాలు లేకపోయానా ఎంసీఐ సీట్లు మంజూరు చేసింది. దీని వెనుక సీమాంధ్ర అధికారులు కుట్ర ఉందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియాలో చిన్నచిన్న సమస్యలుంటే సీట్లు ఇవ్వరుగానీ, సీమాంవూధలో మాత్రం భవనాలు, డిపార్ట్‌మెంట్లు లేకపోయినా సీట్లు ఎలా ఇస్తారనే మౌలిక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ఇది స్టేట్‌వైడ్ కాలేజీ కనుక సీట్లు మూడు ప్రాంతాలకు సమానంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ కాలేజీలో లేని సౌకర్యాలు బయటకు చెబితే ఉన్న సీట్లు పోతాయని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రాంతానికి నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన సీట్లను పక్కన పెట్టి 30సీట్లు మాత్రమే ఇందులో ఇస్తున్నారు.

Take By: T News

Read more...

రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా -ప్రణబ్‌


నేనిప్పుడు కాంగ్రెస్ వ్యక్తిని కాదు.. అందరివాడిని
- రాష్ట్రపతి ఎన్నికలో ‘అద్భుతం’పై విశ్వాసం లేదు
- మజ్లిస్ నేతలు మా మిత్రులు.. వారిని సంప్రతిస్తా
- పదవికే వన్నె తెచ్చిన దక్షిణాది రాష్ట్రపతులు
- వారి అడుగు జాడల్లోనే నడుస్తా
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- అనంతరం విలేకరులతో భేటీ
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం
- ఆయన దృష్టిలో పడేందుకు నేతల తంటాలు
- దానం, బండ చంద్రాడ్డి మధ్య వాగ్వాదం
ప్రణబ్‌కు తప్పని తెలంగాణ సెగ ఓయూలో దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్, జూలై 1( రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు ఎవరికీ మద్దతునివ్వని పార్టీలు తనకు మద్దతు ప్రకటించి, గెలిపించాలని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు మిగతా పార్టీలు కూడా తనకు మద్దతు తెలియజేస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఎన్‌డీయే అభ్యర్థి పీఏ సంగ్మా చేసిన వ్యాఖ్యలపై ప్రణబ్ స్పందిస్తూ అలాంటి అద్భుతాలు జరుగుతాయని తాను విశ్వసించడం లేదని అన్నారు. ఆదివారం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశం అనంతరం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా గతంలో తాను చాలాసార్లు హైదరాబాద్‌కు వచ్చి మీడియా మిత్రులతో మాట్లాడానని, తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని ప్రణబ్ చెప్పారు. ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించేందుకు గతంలో తాను ఇక్కడికి వచ్చానని, ఇప్పుడు ఆ పాలసీల గురించి చెప్పలేనని అన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాడని, పార్టీ, ప్రభుత్వ విధానాల గురించి తాను ఇప్పుడు మాట్లాడలేనని ఆయన స్పష్టంచేశారు. అయితే కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏవైనా తన వద్దకు వస్తే వాటిపై మాత్రం మాట్లాడగలనని ఆయన చెప్పారు.

ఈ నెల 15 వరకు ప్రచారం
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజ్ జాబితాలోని సభ్యులను కలిసేందుకు తాను శనివారం చెన్నై నుంచి తన ప్రచారం ప్రారంభించానని ప్రణబ్ తెలిపారు. అయితే దీన్ని తాను ప్రచారం అనుకోవడం లేదని అన్నారు. ఆంధ్రవూపదేశ్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు. తన ప్రచారం ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుందని, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తనకు మద్దతు ఇస్తున్న ఎలక్షిక్టోరల్ జాబితా సభ్యులను కలువనున్నట్లు ఆయన తెలిపారు. మజ్లిస్ నేతలను కలుస్తారా? అన్న ప్రశ్నకు వాళ్లు మా మిత్రులు, వాళ్ళతో కూడా సంప్రతింపులు జరుపుతానని ప్రణబ్ స్పష్టంచేశారు. మద్దతు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రంలోని టీఆర్‌స్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ అధ్యక్షులను కూడా కలుస్తారా? అని అడిగితే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయమై పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదని, పైగా తాను ఎలక్షిక్టోరల్ జాబితాలోని సభ్యులతో మాత్రమే మాట్లాడుతానని ఆయన చెప్పారు.


రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఆయా పార్టీలే నిర్ణయం తీసుకుంటాయని, ఈ సంప్రదాయం 1952 నుంచి వస్తున్నదని ఆయన తెలియజేస్తూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇంకా తనకు మద్దతు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోలేదని అన్నారు. యూపీఏలోని తృణముల్ కాంగ్రెస్‌తోపాటు యూపీయేతర పార్టీలు, అధికార కూటమికి వ్యతిరేక పార్టీలు ఇంకా మద్దతు విషయంలో తమ తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు.

సమన్వయపర్చేందుకు వచ్చా: ఆజాద్
అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలకు తాను పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నందునే పార్టీ సభ్యులను సమన్వయపర్చేందుకు ప్రణబ్‌తోకలిసి వచ్చినటు తెలిపారు.

కాంగ్రెస్‌లో ప్రతిభకు కొదవ లేదు: ప్రణబ్
బెంగళూరు: రాష్ట్రపతి పదవికి పోటీచేస్తూ.. తాను రాజకీయాల నుంచి తప్పుకోనుండటంవల్ల సంక్షోభ పరిష్కార విషయంలో అధికార యూపీఏ సర్కారుకు ఎలాంటి సమస్యా రాబోదని రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మెరుగైన ప్రతిభావంతులకు కొదవ లేదని, తన స్థానాన్ని వారు భర్తీ చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రజావూపతినిధులతో ఆయన ఆదివారమిక్కడ భేటీ అయ్యారు.

రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తా: ప్రణబ్
- జూబ్లీహాల్‌లో కాంగ్రెస్ నేతలతో సమావేశం
- ప్రణబ్‌కు ఘనస్వాగతం, సన్మానం

రాష్ట్రపతి ఎన్నికలో తనని గెలిపిస్తే.. ఆ పదవికి వన్నె తెస్తానని యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌లో సంక్షోభ పరిష్కర్తగా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ అన్నారు. 46 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి, గౌరవాన్ని పొందినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తాను కాంగ్రెస్ సభ్యుడిగా కాకుండా రాష్ట్రపతి అభ్యర్థిగా నగరానికి వచ్చినట్లు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు చెప్పారు. గతంలో తాను పార్టీ ప్రతినిధిగా ఇక్కడ సమస్యలు పరిష్కరించేందుకు వచ్చేవాడినని, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతు కోసం మీ ముందుకు వచ్చానని ప్రణబ్ అన్నారు.

తాను ఇప్పుడు పార్టీ వ్యక్తిని కాదని, అందరి మనిషినని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న ప్రణబ్, గులాం నబీ ఆజాద్‌తో కలిసి ఆదివారం ఉదయం జూబ్లీహాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్షం(సీఎల్పీ) సమావేశంలో పాల్గొన్నారు. తనను గెలిపించాలని ఆయన సీఎల్పీ సభ్యులను కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన సుమారు గంటకుపైగా జూబ్లీహాల్‌లో ఉండి సీఎల్పీ సభ్యులను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు కూడా ఆయన కోరారు. ఈ సందర్భంగా సీఎల్పీని ఉద్దేశించి 25 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కువసేపు భారత రాజ్యాంగం, విధానాల గురించే మాట్లాడటం గమనార్హం.

దక్షిణాది నుంచి నీలం సంజీవడ్డి, ఆర్ వెంకవూటామన్, వీవీ గిరి, రాజగోపాలచారి, సర్వేపల్లి రాధకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం.. ఇలా ఎంతోమంది రాష్ట్రపతులుగా పనిచేశారని, వీరంతా ఉన్నత సంప్రదాయాలు, పద్ధతులను పాటిస్తూ ఆ పదవికి, దేశానికి ఎంతో మంచిపేరు తీసుకొచ్చారని వివరించారు. వారి అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని ప్రణబ్ దక్షిణాది సెంటిమెంట్‌తో సభ్యుల మనసు దోచే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎన్నుకున్నందుకు యూపీఏకు, మరీ ముఖ్యంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. యూపీయేతర పార్టీలు కూడా తనకు మద్దతు ఇస్తున్నందుకు ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అలాంటి పార్టీలు కూడా తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని మద్దతు పలకాలని ఆయన తృణముల్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు.

దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు ఎంతో కీలకమైనవని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం కిరణ్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఓటు వేసి గెలిపించాలని సీఎల్పీ సభ్యులను కోరారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ కార్యక్షికమానికి అధ్యక్షత వహించగా, శాసన సభ వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో యూపీఏ ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి, ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP