Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, October 26, 2011

విరమణ కాదు.. విరామమే

- రాజకీయ నేతలూ ఉద్యమంలోకి రండి
- ఉద్యోగ జేఏసీ పిలుపు


swamy-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 25 : ప్రపంచ ఉద్యమాల చర్రితలో సకల జనుల సమ్మె తలమానికంగా నిలిచి ఉంటుందని ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ డిమాండ్ కోసం 42 రోజుల పాటు, రెండు కోట్ల మంది, ప్రజాస్వామిక పంథాలో, ప్రత్యక్షంగా భాగస్వాములైన, మహోన్నత చారివూతాత్మక ఉద్యమ సంఘటన ప్రపంచ ఉద్యమాల చరివూతలోనే జరగలేదని ఆయన ఎలుగెత్తి చాటారు. తాము తెలంగాణ ఉద్యమాన్ని విరమించలేదని, ఇది విరామం మాత్రమేనని, ఉద్యమ రూపాలను మార్చుకుంటూ, రాష్ట్ర సాధనకోసం ఉద్యమిస్తూనే ఉంటామన్నారు. తాము ఏ పార్టీకి అనుబంధం కాదని స్పష్టం చేశారు. మంగళవారం టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగసంఘాల జేఏసీ కోచెర్మన్ జీ దేవీవూపసాద్, సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కోచైర్మన్ సీ విఠల్, మాజీ మంత్రి కోమటిడ్డి వెంకట్‌డ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజల సంఘటిత శక్తితో, తెలంగాణను సాధించుకొని తీరుతామన్న గొప్ప విశ్వాసంతోనే ఉద్యమాల స్వరూపాలను మార్చుకుంటున్నామని తెలిపారు. సమ్మె ఒకానొక ఉద్యమ ఆయుధమని, మరో రూపంలో ఉద్యమాలు ఉంటాయని, తాము ఉద్యమంలోనే ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర సాదన జ్యోతిని దర్శించే వరకు ఉద్యమ దీక్షలోనే ఉంటామని ఆయన ఢంకాభజాయించారు.

ఉద్యోగసంఘాల చైర్మన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు ప్రారంభించిన సకల జనుల సమ్మె గొప్ప విజయాలకు మార్గదర్శకంగా నిలిచిందని, ఈ దివిటీని రాజకీయ నాయకులు అందుకోవాలని విజ్ఞిప్తి చేశారు. కుల సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రజా సంఘాలు, టిఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమొక్షికసీ వంటి పార్టీలు ఉద్యోగుల ఉద్యమాలకు బాసటగా నిలిచారని, ఉద్యోగసంఘాల జేఏసితో కలిసి ఉద్యమించి..అండదండలందించిన ప్రతీ తెలంగాణ వాదికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఉద్యమపథంలో ఆర్‌టీసీ, సింగరేణి కార్మికులు, విద్యుత్తు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్‌సెక్టార్ పరిక్షిశమలలోని కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భుజంభుజం కలిపి నిలిచారని, ఈ వరుసలో కలిసి వచ్చిన ఉద్యమక్షిశేణులకు, శక్తులకు, తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.టీ ఉద్యోగసంఘాల కోచైర్మన్ దేవీవూపసాద్ మాట్లాడుతూ ఆరుదశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన నిలిచి పోరాడుతున్న వీరోచిత చరిత్ర ఒక్క తెలంగాణ ఉద్యోగులకు మాత్రమే ఉన్నదని అన్నారు. సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఇకనుంచి తెలంగాణ వ్యతిరేకులపైన, సమైక్యవాదులపైన, అవహేళన చేసివారిపైన ఉద్యమ దృష్టి ఉంటుందని చెప్పారు. ఒక్క తెలంగాణ ఉద్యోగిపైనైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, తెలంగాణ ఉద్యోగులందరూ ఎదిరిస్తారని హెచ్చరించారు. కోచైర్మన్ సీ విఠల్ ఒక్క తెలంగాణ అంశంపైనే కోర్ కమిటీ ఎనిమిది సార్లు సమావేశం కావడమే, తెలంగాణ సకల జనుల సమ్మె సాధించిన ఘన విజయమని ఆయన పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వబోమని ప్రకటిస్తే వెను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి కోమటిడ్డి వెంకటడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవికి, ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా చేసిన తనకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదన్నారు.

కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 25 : టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. సమ్మె వాయిదా ప్రకటించిన అనంతర పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమ్మెకు సహకరించినందుకు కేసీఆర్‌కు జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో చర్చలు జరిపిన అనంతరం సోమవారం ఉద్యోగులు సమ్మెను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను కలిసిన వారిలో జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవివూపసాద్ ఉన్నారు. 



Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet,
Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,

Read more...

T-Congress men to fight in Delhi

With the Telangana employees withdrawing their agitation, the T-Congress leaders are looking towards the Congress central leadership for its stand on the statehood issue. However, the leaders are clueless about the party’s stand.

“We only see newspaper reports claiming that the Congress is going to announce its stand in November, before the beginning of Parliament’s Winter Session, but so far there is no confirmation from party leaders about this,” said the AICC secretary and Congress MLC, Mr P. Sudhakara Reddy. 

When this newspaper contacted several Telangana Congress MPs, ministers and MLAs, no one was sure of the timing of an announcement on Telangana. Opinions are divided among Telangana Congress leaders on the party’s stand on whether there is going to be a Telangana state or continuation of a united state. 

Meanwhile, the first time Telangana Congress MLAs have decided a follow a two-pronged strategy aimed at not putting the party’s government at risk. They want to continue their “struggle” for Telangana by continuing consultations with party central leaders in Delhi and fight for developmental and welfare projects in their constituency so that no problems are created for the electorate. 

The Medchal MLA, Mr Kittchennagari Laxma Reddy, said that there is no use in fighting in the state on a subject which has to be addressed by Delhi and there is no meaning in not serving the public of their constituencies. 

“So we have evolved a slogan, fight for Telangana in Delhi, and fight for projects in constituencies,” he said. He said very soon all the Telangana MLAs and MLCs will sit together and meet both central and state leaders in this regard.



Take By: DC

Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet,
Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,
T-Congress leaders

Read more...

విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం

- 13 డిమాండ్లకు అంగీకారం 

- హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ స్మారక స్థూపం ఏర్పాటు

హైదరాబాద్, అక్టోబర్ 25 (టీ న్యూస్): విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ యాజమాన్యాలు జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలం అయ్యాయి. మంగళవారం రాత్రి ఏడు గంటలకు చర్చల ప్రక్రియ పూర్తికావడంతో పదమూడు అంశాలపై అధికారికంగా ఒప్పంద పత్రంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(టీజాక్) నేతలు కే రఘు, పీ మోహన్‌డ్డి, ఎన్ జానయ్య, ఎస్ స్వామిడ్డి, టీ అంజిడ్డితో పాటు దాదాపు 22 మంది సంతకాలు చేయగా, విద్యుత్ సంస్థల యాజమాన్యాల తరుపున ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జెన్‌కో ఎండీ విజయానంద్, సెంట్రల్ పవర్ డిస్కమ్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో జేఎండీలు రమేష్, రఘనాథంలతో పాటు ఏడుగురు అధికారులు సంతకాలు చేశారు. అంతకు ముందు ఉదయం పదకొండు గంటలకు టీజాక్ నేతలు ఎన్ జానయ్య, మోహన్‌డ్డి, తిరుపతిడ్డి, వాణి తదితరులు తమ డిమాండ్లపై సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని కలుసుకున్నారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించడంతో ఆ డిమాండ్లపైనే విద్యుత్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన టీజాక్ నేతలు రాతపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటిలో వందేళ్ళ క్రితం నాటి హుస్సేన్‌సాగర్ థర్మల్‌పవర్ ప్లాంట్ స్మారక చిహ్నం ఏర్పాటు అంశం కూడా ఉండడం గమనార్హం.
ఒప్పందంలోని అంశాలు 

1. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.

2. విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిపిన సమ్మెకాలాన్ని డ్యూటీగా పరిగణించడం.

3. సమ్మె కాలానికి వేతనాలు తీసుకోని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్సుగా చెల్లించడం.

4. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్(హైదరబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది పట్ల భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడకుండా ఉండడం.

5. సమ్మె కాలంలో టీజాక్ సభ్యులపై నమోదైన కేసుల ఉపసంహరణ.

6. తెలంగాణ ప్రాంతంలో జెన్‌కో పరిధిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులైన నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి, కంతానపల్లి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయడం.

7. కేటీపీఎస్ అవసరాలను కాదని సింగరేణి బొగ్గును వీటీపీఎస్‌కు, ఆర్టీపీపీకి తరలించకుండా చర్యలు తీసుకోవడం.

8. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీసీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తప్పించి కర్నూలు జోన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాను వేరుచేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడం.

9. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వెయి కలిపచి వారి సర్వీసు రెగ్యులరైజేషన్‌కు చర్యలు తీసుకోవడం.

10. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పించడం.

11. ఉద్యోగులు చనిపోయిన సందర్భంలో వారి కుటుంసభ్యులకు ఉద్యోగ కల్పన(కాంపాసినేట్ అపాయింట్‌మెంట్), అవసరాలను బట్టి సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి చర్యలు.

12. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో అవసరాలకు అనుగునంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు ప్రభుత్వాన్ని కోరడం.

13. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ చారివూతక స్మారక స్థూపాన్ని తెలంగాణ చౌరస్తా(మింట్ కాంపౌండ్) పరిసరాల్లో ఏర్పాటు చేయడం. 


Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet,
Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,

Read more...

ఉద్యమ వెలుగు!

- తెలంగాణ కోసం తెగింపు
- సంఘటిత శక్తిని చాటిన విద్యుత్ ఉద్యోగులు
- అభినందనలు తెలిపిన జేఏసీ చైర్మన్
- ముగిసిన రఘు 72 గంటల దీక్ష
- ఉద్యమానికి కొత్తరూపమిస్తాం: కోదండరాం
- మంత్రులను టార్గెట్ చేద్దాం: పోచారం
- నేతలారా.. పదవులు వీడండి: సంధ్య
- మంద కృష్ణ.. ఎవరికోసం? : సూర్యం
- రైతులు ఉద్యమాన్ని హత్తుకున్నారు: కే రఘు
- ఒకటి నుంచి నిరవధిక దీక్షలు: ఈటెల
- కోర్టుకు వెళ్లి రాజీనామా ఆమోదించుకుంటాం: నాగం
- రాజకీయ ప్రక్రియ ద్వారానే రాష్ట్రం సాధ్యం: విద్యాసాగర్‌రావు


ragu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 25 : తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ కే రఘు మూడు రోజులుగా కొనసాగించిన 72 గంటల దీక్షను మంగళవారం విరమించారు. రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌డ్డి, పోచారం శ్రీనివాస్‌డ్డి, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు, న్యూ డెమొక్షికసి పార్టీ నేతలు సూర్యం, గోవర్ధన్, పీవోడబ్ల్యూ నేత సంధ్య తదితరులు ఉదయం 11.30 గంటలకు రఘు చేత నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉద్యమ నేతలు విద్యుత్ ఉద్యోగుల పోరాటాన్ని అభినందించారు. సర్కారుకు పాలుపోకుండా చేసి సంఘటితశక్తిని చాటిచెప్పారని ప్రశంసించారు. రఘు చేపట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొత్త స్ఫూర్తిని నింపింది. సకలజనుల సమ్మెలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీకి, యూనియన్లకు మధ్య విద్యుత్ సంస్థల యాజమాన్యం చిచ్చుపెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని తిప్పికొ ఆచప దీక్షకు దిగారు.

దీక్షను విచ్ఛిన్నపరచాలనుకున్న యాజమాన్య, ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించిన 72 గంటల దీక్ష మంగళవారం ముగిసింది. ఈ నాలుగురోజులపాటు దీక్షా వేదిక తెలంగాణవాదులకు ప్రధాన కేంద్రంగా మారింది. దీక్షతో నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఉద్యోగులతో నగరంలోని వివిధ జేఏసీలతో విద్యుత్ సౌధ కిటకిటలాడింది. మంగళవారం దీక్ష విరమణ కార్యక్షికమానికి ఉదయం 9 గంటలనుంచే భారీ సంఖ్యలో తెలంగాణవాదులు, విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనన్న ఉత్కం రేపిన దీక్షా ప్రక్రియ ప్రశాతంగా విజయవంతంగా ముగియడంతో రక్షణగా ఉన్న పోలీసులు, విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు ఊపిరిపీల్చుకున్నట్లయింది.

నిరాహారదీక్ష ముగింపు సందర్భంగా రసమయి బాలకిషన్, అరుణోదయ కళామండలి అధ్యక్షుడు రామారావు పాడిన పాటలతో విద్యుత్ సౌధ ప్రాంతం హోరెత్తింది. ఈ కార్యక్షికమంలో టీ జాక్ నాయకులు మోహన్‌డ్డి, జానయ్య, స్వామిడ్డి, శివాజి, అంజిడ్డి, ముస్తాక్, విష్ణూ, సంతోష్, రామకృష్ణ, నిత్య కళ్యాణం, లక్ష్మినారాయణ, మధుసుదన్‌డ్డి, వాణి తదితరులు పాల్గొన్నారు.

ఒకటి నుంచి నిరవధిక దీక్షలు: ఈటెల
తెలంగాణ ప్రాంతాన్ని కొల్లగొట్టిన నవంబర్ ఒకటి దినాన్ని విద్రోహదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌కు చెందిన 14మంది ఎమ్మెల్యేలం ఆమరణ దీక్షకు పూనుకుంటున్నామని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు. రాష్ట్రం సాధించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రజలకు అండగా నిలబడుతామని స్పష్టం చేశారు. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అని చెప్పిన కాంగ్రెస్ నేతల్లారా.. మీ భరతం పట్టడానికి తెలంగాణవాదులు కదులుతున్నారని హెచ్చరించారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మె ద్వారా ఉద్యమం ఉధృతం అయిందని, వారినుంచి పోరాట జ్వాలను తాము అందుకుంటున్నామని ప్రకటించారు.

కోర్టుకు వెళ్లి రాజీనామా ఆమోదించుకుంటాం: నాగం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామాలు చేసినా సీమాంవూధకు చెందిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ రాజీనామాలు ఆమోదించకపోవడం దురదృష్టకరమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి అన్నారు. ఇక తాను స్పీకర్ వద్దకు వెళ్లనని, కోర్టుకు వెళ్లి తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటానని తెలిపారు. ఆ తరువాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాజీనామా చేశామని చెబుతున్న 32 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దమ్ముంటే కోర్టుకు వెళ్లి రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణవాదుల మధ్య ఐక్యత కోసం రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం, టీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఎమ్మెల్సీ పదవి కోసం డీ శ్రీనివాస్ తహతహలాడారని, ప్రస్తుతం మంత్రి పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నారని ఎద్దేవా చేశారు.

మంత్రులను టార్గెట్ చేద్దాం: పోచారం
currentollu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్న మంత్రులను టార్గెట్ చేస్తూ భవిష్యత్ ఉద్యమాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం అన్నారు. సకలజనుల సమ్మెతో ఉద్యోగులు తమ శక్తివంచనలేని పోరాటం చేసి సత్తాను చూపించారని పేర్కొన్నారు. ఇక మిగిలింది కేవలం రాజకీయ ప్రక్రియ కాబట్టి అందుకు అడ్డుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ మంత్రులను టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బాన్సువాడ ఎన్నికలలో ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన టీడీపీ, కాంగ్రెస్‌కు ఓట్లేయించిందని విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం వేరువేరుగా పోటీ చేస్తే ఇద్దరి డిపాజిట్లు గల్లంతయ్యేవేనని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన లగడపాటి, రాయపాటి, మేకపాటి, దేవినేని, పయ్యావుల కేశవులు, కిరణ్‌కుమార్, చంద్రబాబు అంతా ఒక్కటైతారని, మన తెలంగాణ నాయకులకు ఆ బుద్ధిలేదని ధ్వజమెత్తారు.

రాజకీయ ప్రక్రియ ద్వారానే రాష్ట్రం సాధ్యం: విద్యాసాగర్‌రావు
సకలజనుల సమ్మె ద్వారా ఉద్యోగులు తమ శక్తికి మించి పోరాటం చేశారని కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఇక రాజకీయ ప్రక్రియ మాత్రమే మిగిలిందని, అప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధ్యమౌతుందన్నారు. అందుకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రజావూపతినిధులు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రజావూపతినిధులు చేస్తున్న మోసం వల్లే రాష్ట్ర సాధన ప్రక్రియ ముందుకు సాగడం లేదన్నారు. గ్రామక్షిగామాన తిరుగుబాటు జరుగుతున్నా కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఏ పనికైనా సామ దాన భేద దండోపాయాలు అమలుచేస్తారని, ఇక దండోపాయం ఒక్కటే మిగిలిందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అద్వాని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ప్రకటించారని, శాసనసభలో తీర్మానం అవసరం లేదని పేర్కొన్నారు. టీవీ చర్చల్లో ఈ విషయంపై కొంతమంది మేధావులు అధ్వాన్నంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

మంద కృష్ణ.. ఎవరికోసం పనిచేస్తున్నావు?: సూర్యం
తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి సీమాంధ్ర పాలకుల కుట్రలో మందకృష్ణ పావుగా పనిచేస్తున్నాడని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్షికసి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సూర్యం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేయడానికి వ్యతిరేకులతో కలిసి కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడైనా ఒక్క కార్యక్షికమం చేపట్టావా అని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ అని అంటున్న నీవు... ఆ దిశగా చేస్తున్న ప్రయత్నం ఏమిటని ప్రశ్నించారు. ముందు తెలంగాణ సాధిస్తే ఆ తరువాత సామాజిక తెలంగాణ విషయం ఆలోచించవచ్చన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమపంథాలు మార్చడం సహజమని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత రఘు 72 గంటలపాటు చేపట్టిన దీక్ష, కొత్తగా చేపట్టబోయే మరో రూపంలోని ఉద్యమానికి నాంది పలుకుతుందన్నారు.

పదవులు వీడండి: సంధ్య
తెలంగాణ రాష్ట్రం కోసం అవసరమైతే ప్రాణాలు వదులుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్‌డ్డి శవంపై ప్రమాణం చేసి నేడు మాటతప్పారని పీవోడబ్ల్యూ నేత సంధ్య ధ్వజమెత్తారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న మీ గలీజ్ ప్రాణాలు మాకు అవసరం లేదని, తెలంగాణ ప్రజలిచ్చిన పదవులను వదిలేస్తే చాలని, తెలంగాణ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులైన డీ శ్రీనివాస్, దానం నాగేందర్ సిగ్గులేకుండా పదవుల కోసం ముద్దులు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమొక్షికసి నేత గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు వారి అధిష్ఠానాన్ని ఒప్పించి ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని కోరారు.

విజయవంతం.. కొత్తరూపం: కోదండరాం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన సకలజనుల సమ్మె సంపూర్ణంగా విజయవంతమైందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చగలిగామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమ తీవ్రతను గమనించినప్పటికీ స్పందించనట్లు నటించాయని ఆయన విమర్శించారు. పత్రికలు, మీడియా ఉద్యమానికి అనుకూలించకపోగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయని నిరసన వ్యక్తం చేశారు. సకలజనుల సమ్మెను విరమించలేదని, తాత్కాలికంగా విరామం ఇచ్చామని తెలిపారు. విద్యుత్‌శాఖ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఆయన అభినందించారు. రఘు ఆధ్వర్యంలో అవసరమైనప్పుడు ఉద్యోగులంతా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కొత్తరూపం ఇచ్చి మరింత ఉధృతం చేయడానికి జేఏసీలోని అన్ని పక్షాలతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ విద్రోహులదినం అయిన నవంబర్ 1వ తేదీ నుంచి 72గంటలపాటు దీక్ష చేయాలని నిర్ణయించగా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 14 మంది నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న న్యాయవాదులు ఈ నెల 29న చలో పోలవరం కార్యక్షికమాన్ని చేపడుతున్నారని,నవంబర్ 1నుంచి అన్ని కోర్టుల ముందు కొందరు న్యాయవాదులు ఆమరణ దీక్షకు పూనుకుంటున్నారని, మనమంతా అండగా నిలవాలని కోరారు.

రైతులు ఉద్యమాన్ని హత్తుకున్నారు: కే రఘు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ముందుండి పోరాటం చేసినప్పటికీ ఎవరికీ ఇబ్బంది కాకూడదని అత్యవసర సర్వీసులు కొనసాగించామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త రఘు పేర్కొన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి, ఉద్యోగులపై రైతులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని, కానీ రైతులు మాత్రం ఉద్యోగులను తమ హృదయాలకు హత్తుకుని ఉద్యమానికి చేయూతనిచ్చారని గర్వంగా ప్రకటించారు. మామూలు సమయాల్లో ఒకగంట విద్యుత్ సరఫరా నిలిచిపోతే సబ్‌స్టేషన్‌లపై, విద్యుత్ ఉద్యోగులపై దాడులు చేసే రైతులు ఉద్యమ సమయంలో 3-4 గంటలు విద్యుత్ కోతలు విధించినా ఎక్కడ కూడా ఉద్యోగులపై తిరుగుబాటు చేయలేదని, అవసరమైతే నష్టాలను భరించారని, ఇది ఈ ప్రాంత రైతులకున్న తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటిచెబుతుందన్నారు. చర్చల కోసం యాజమాన్యం రమ్మంటే వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన అనేక ప్రాజెక్టుల విషయం ప్రధాన డిమాండ్‌లుగా యాజమాన్యం ముందు పెట్టామని తెలిపారు. యాజమాన్యం చేసిన కుట్రలకు ఆగ్రహం చెందిన ఉద్యోగులు అత్యవసర సర్వీసులు నిలిపివేద్దామని కోరినప్పటికీ కొంత సంయమనం పాటించేందుకు కృషి చేశామని తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వెనుకంజ వేయడంవల్లే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష వెనుకబడుతుందని, సకలజనుల సమ్మె వల్ల అనుకున్న లక్ష్యం సాధించకపోవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రజావూపతినిధుల వైఖరి కారణమని ధ్వజమెత్తారు.


 Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,

Read more...

పక్షం రోజుల్లో తేల్చేయండి!

-పార్టీ సీనియర్లకు సోనియా ఆదేశం?
-తెలంగాణపై నిర్ణయం లేదా.. రోడ్ మ్యాప్!
-పార్లమెంటు సమావేశాల్లోపే వెల్లడి
-వచ్చే నెల 15న విదేశాలకు సోనియా
-పూర్తి స్థాయి చికిత్స కోసం వెళుతున్న మేడం
-ఆ లోపే విభజనపై కీలక ప్రకటన వెల్లడి?
-పురికొల్పుతున్న ఇతర పరిణామాలు
-యూపీ ఎన్నికల్లో విభజనే కాంగ్రెస్ అస్త్రం
-ఢిల్లీని కదిలించిన సకల జనుల సమ్మె


sonia-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూ ఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 25 :రెండేళ్లుగా రగులుతున్న తెలంగాణ సమస్యను కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం నవంబర్ నెలలో పరిష్కరించనున్నాయా? రాష్ట్ర విభజన వ్యవహారం పార్లమెంటు సమావేశాల్లోపే ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయవర్గాలు. ఇందుకు బలమైనవాదనలనూ ఆ వర్గాలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి చికిత్స కోసం సోనియాగాంధీ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. నవంబర్ 15న ఆమె విదేశాలకు వెళతారని తెలుస్తున్నది. ఇదే నెలలో ప్రధాని మన్మోహన్ కూడా అధిక సమయం పర్యటనకు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అంశంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు తేల్చేయాలని ఢిల్లీలోని పార్టీ సీనియర్లకు సోనియా నుంచి సోమవారం స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు ఏఐసీసీలోని అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఇప్పటికే వివిధ స్థాయిల్లో తెలంగాణ సమస్యపై పూర్తిస్థాయి అధ్యయనం జరిగినందున ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని పార్టీ పెద్దలను ఆదేశించిన సోనియాగాంధీ, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలను తన ముందు చర్చించాలని పురమాయించినట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నాయి.

పక్షంరోజుల్లో ఒక కొలిక్కి తేవాలని ఆమె ఆదేశించారని తెలిపాయి. నవంబర్ రెండో వారంలోపు ప్రకటన వెలువరించే విధంగా కసరత్తు ముగించాలని పార్టీ సీనియర్‌లకు సోనియా సూచించినట్లు తెలిసింది. ‘‘మారిన పరిస్థితుల్లో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఏ కొద్దిమందో తప్ప ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు కూడా తెలంగాణపై తక్షణ నిర్ణయాన్నే కోరుకుంటున్నారు. మెజారిటీ అభివూపాయం అంటూ సీమాంధ్ర పక్షపాతంగా వ్యవహరిస్తున్న వారి వల్లనే కొంత జాప్యం జరుగుతోంది. రాష్ట్రం కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ సమస్యలను పెంచుకోవటంలో ఔచిత్యం లేదు. అందుకే సత్వర నిర్ణయం ఇప్పటికైనా తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది’’ అని జాతీయ నేత ఒకరు తమతో జరిపిన చర్చల్లో ప్రస్తావించారని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. దీపావళి తర్వాత కోర్ కమిటీ సభ్యులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.

రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు మరింతకాలం కొనసాగితే ఏర్పడే పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది హస్తిన నేతల్లో సైతం కలవరం కలిగిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణపై జరిగిన ఆందోళనలు, వివిధ స్థాయిల్లో జరిగిన చర్చలు, నివేదికలు పరిశీలించి తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. పార్లమెంటు సమావేశాలు నవంబర్ 3వ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ అంశంపై గత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. బిల్లు పెడితే ఆమోదించేందుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. ఈ సారి సమావేశాల్లోనూ తెలంగాణ అంశం ఉభయ సభలనూ దద్దరిల్లిజేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు సొంత పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు తమ లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి ప్రభుత్వాన్ని, పార్టీని ఇరకాటంలో పెట్టారు. గత సమావేశాలకు వీరు గైర్హాజరయ్యారు.

ఈసారి సమావేశాలకూ రాని పక్షంలో పార్లమెంటు నిబంధనల ప్రకారం వారు సభ్యులుగా కొనసాగే అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో టీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేలా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు నిర్ణయంగానీ రోడ్‌మ్యాప్‌గానీ ప్రకటించాలని కోర్‌కమిటీలోని ప్రణబ్, పటేల్‌ను మేడమ్ కోరినట్లు సమాచారం. అదే పనిలో సీనియర్‌లు నిమగ్నమైనట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ విషయం పక్కనపెట్టినా తమ రాజీనామాలను ఆమోదించాలని ఎంపీలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రాబోయే సమావేశాల్లోనూ వీరు ఇదే ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ అంశం కూడా కాంగ్రెస్‌ను సత్వర నిర్ణయంవైపు నడిపిస్తున్నదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధినేత్రి నుంచి ఆదేశాలు రావడంతో ఈ ప్రక్రియ వేగవంతమైందని సమాచారం.

ఉత్తరవూపదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు మే నెలలో జరగాల్సిన ఎన్నికలు కూడా కాంగ్రెస్‌కు తెలంగాణపై ఒక నిర్ణయానికి రావాల్సిన ఆవశ్యకతను కల్గిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికలను మే నెలలో కాకుండా మరో రెండు నెలలు ముందుగానే నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధపడుతున్నది. యూపీ ఎన్నికలకు ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద ప్రచారాస్త్రం ఏమీ లేదు. దీంతో యూపీ విభజన నినాదాన్ని భుజానికెత్తుకోవాలని ఆలోచిస్తున్నది. యూపీలో అవినీతినిగానీ, మాయావతి పాలనా వైఫల్యాలనుగానీ సొమ్ము చేసుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు, కామన్ క్రీడల నిర్వహణలో అవకతవకలు వంటి భారీ కుంభకోణాలు బయటపడటంతో అవినీతి, అసమర్థతకు కాంగ్రెస్ చిరునామా అన్న భావన జనంలోకి వెళ్లింది. దీంతో రాష్ట్ర విభజన నినాదంతోనే మాయావతిని ఎదుర్కొనాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. అక్కడ రాష్ట్ర విభజన గురించి మాట్లాడే ముందు ఇక్కడ తెలంగాణ అంశాన్ని ముగించేయడమే మేలన్న భావనతో యువరాజు రాహుల్ గాంధీ కూడా ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ తన కీలక భాగస్వామ్య పక్షాలతో ప్రాథమికంగా ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అధికారికంగా పార్టీ వర్కింగ్ కమిటీలో కోర్ కమిటీ నిర్ణయాన్ని ఆమోదింప చేసుకుని, రాజకీయవ్యవహారాల కేబినెట్ కమిటీని సమావేశపర్చి, వారి వద్ద ప్రస్తావిస్తారని తెలిసింది. అనంతరం అఖిలపక్షాన్ని పిలిచి తుది నిర్ణయాన్ని ప్రకటించడమే మిగిలి ఉంటుంది. ఇది పార్లమెంటు సమావేశాలకు ముందుగానే జరుగుతుందని సమాచారం. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తాయని భావించిన తృణముల్ కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఆ ముచ్చట లేదని తేల్చేయడం కాంగ్రెస్‌కు కలిసి వచ్చే మరో అంశం. ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్య పరిష్కారం అధిష్ఠానానికి మరింత సులువైందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం ప్రకటింప చేయాల్సిన విషయంలో సకల జనుల సమ్మె ఘనమైన విజయాలనే సాధించింది. అనేక ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురి చేసినా, లాఠీచార్జిలు, అరెస్టులతో భయపెట్టినా సకల జనుల సమ్మె 42 రోజుల పాటు దిగ్విజయంగా, మహోధృతంగా సాగింది. కీలక రాజకీయ పార్టీల ప్రమేయం లేకున్నా ఉద్యోగ సంఘాలు స్వతంత్ర కార్యాచరణతో, జేఏసీ అడుగు జాడల్లో సమ్మెను విజయవంతం చేశారు. ఈ పరిణామం కేంద్రాన్ని సైతం కలవరపెట్టింది. ఉద్యమ తీవ్రతను నిఘా వర్గాల ద్వారా సేకరించిన కేంద్రం ప్రత్యేకంగా విశ్లేషించినట్టుగా తెలిసింది. భవిష్యత్తులో తెలంగాణ కోసం ఈ వర్గాలు మరింతగా పోరాటాన్ని ఉధృతం చేస్తే పోలీసులతో అణచివేయటం ఏమాత్రం సాధ్యం కాదని, అది మరో రూపం తీసుకునే ప్రమాదముందని కూడా కేంద్రానికి సమాచారం ఉందని తెలిసింది. తెలంగాణలో పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలు, దీక్షలపైనా అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు సమాచారంఅందుతోందని తెలిసింది. తెలంగాణలో పార్టీ శ్రేణులు, నాయకులు పార్టీ నియంవూతణలోనే పనిచేస్తున్నారన్న సదాభివూపాయం పెద్దల్లో నెలకొందని సమాచారం.

రాజధాని సంగతేంటి?
అన్ని సమయాల్లోనూ పార్టీకి వెన్నంటి నిలిచిన సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచడానికి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న ప్రతిపాదనపైనా అధిష్ఠానం దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో గత వారం జరిపిన సుదీర్ఘ చర్చల్లో ఆయన ముందుంచినట్లు సమాచారం. దీనికి జైపాల్ ససేమిరా అన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ను నిర్దిష్ట కాలం పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే అవకాశం ఉందని, కానీ శాశ్వత ఉమ్మడి రాజధానిగా పెడితే తెలంగాణ ఉద్యమం మరింత తీవ్రమవుతుందని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. 



Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project, Sonia Gandhi,

Read more...

పోలవరం టెండర్ వార్ ‘ఢీ’జైన్

- ప్రాజెక్టు డిజైన్ మార్చేది లేదు
- 12.5% తక్కువకు టెండర్ వచ్చింది
- రద్దయితే నష్టం
ఎవరు భర్తీ చేస్తారు?
- పీసీసీ చీఫ్ బొత్స ప్రశ్న
- అటవీ చట్టాలు బొత్సకు తెలుసా?
- గిరిజనులను ముంచే ప్రాజెక్టు వద్దు
- ప్రాజెక్ట్ డిజైన్ మార్చి కట్టాల్సిందే
- కాంగ్రెస్ ఎంపీ కేకే డిమాండ్
- టెండర్లు రద్దు చేయండి
- సీఎంకు బాబు లేఖ
- ఇది రాయడానికి నాలుగు రోజులా?
- బాబుకు టీఆర్‌ఎస్ నేత వినోద్ ప్రశ్న
- టెండర్లు తెలంగాణ వారికి దక్కకూడదా?
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ప్రశ్న
- టీడీపీ.. కాంట్రాక్టర్ల పార్టీ: ఈటెల గుస్సా


botsa-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaపోలవరం ప్రాజెక్టు టెండర్ల వ్యవహారంలో మొదలైన చర్చ... ఇప్పుడు దాని డిజైన్, నిర్మాణాలనూ కలుపుకొంటున్నది. టెండర్ల రద్దుతో పాటు డిజైన్ మార్పు డిమాండ్ కూడా గట్టిగా ముందుకు వస్తున్నది. రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోలవరం నిర్మాణం ఆపాల్సిందేనని టీఆర్‌ఎస్ స్పష్టం చేయగా.. కాంగ్రెస్‌లో భిన్న వైఖరులు వెలువడ్డాయి. టెండర్లు రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంకు లేఖరాయగా.. అసలు విషయం పక్కకు పెట్టి పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ సీపీఎం స్పందించింది. మంగళవారం విలేకరులతో మాట్లాడిన పీసీసీ రాష్ట్ర చీఫ్ బొత్స సత్యనారాయణ... ‘‘పోలవరం డిజైన్ మార్చేది లేదు.. ఇది రాష్ట్ర బహుళ ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టు. రాజకీయ నేతలు పెద్ద మనసుతో సహకరించండి’’ అని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. టెండర్లు రద్దయితే వేరే సంస్థలు 12.5% తక్కువ కోట్ చేయడానికి ముందుకు రాకపోయినా, అంతకంటే ఎక్కువకు కోట్ చేసినా ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు.

ఇది రాష్ట్రం మొత్తానికి పనికొచ్చే ప్రాజెక్టన్న బొత్స.. ముంపుతో నిర్వాసితులయ్యేవారికి మెరుగైన పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ కే కేశవరావు... లక్షలాది గిరిజనులకు నష్టం కల్గించే ప్రాజెక్టులు మాకు వద్దు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందే’’ అని స్పష్టం చేశారు. గిరిజనులకు కల్పించిన అటవీ హక్కుల చట్టం గురించి బొత్సకు ఏం తెలుసని ప్రశ్నించారు. మరోవైపు ఈ వివాదం మొదలైన ఇన్ని రోజులకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పోలవరం టెండర్లు రద్దు చేసి, మళ్లీ పారదర్శకంగా టెండర్లు పిలవాలని సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రానికి చెందిన పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టులకు జాతీయహోదా తెప్పించేందుకు కృషి చేయాలని అన్నారు. చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన టీఆర్‌ఎస్ నేత వినోద్‌కుమార్... ఈ విషయం రాయడానికి నాలుగు రోజులు పట్టిందా? అని ఎద్దేవా చేశారు.

ప్రస్తుత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మిస్తే లక్షల మంది నిరాక్షిశయులవుతారన్న సంగతి తెలిసినప్పటికీ ఆ ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు. టెండర్ల వ్యవహారంలో జరుగుతున్న రాద్ధాంతంపై స్పందించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు... ‘రాష్ట్రంలో ఏ టెండర్లయినా ఆంధ్రావారికే దక్కాలా? తెలంగాణ వారికి హక్కు లేదా? అని నిలదీశారు. అసలు విషయాన్ని పక్కకు నెట్టి అనవసర విషయంపై పార్టీలు రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమన్నారు. పోలవరం ప్రస్తుత డిజైన్‌తో తెలంగాణకు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఒరిగేది శూన్యమని చెప్పారు. ఇదిలా ఉండగా.. టెండర్ల విషయంలో కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీపై పరువు నష్టం దావా వేస్తామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. కాంట్రాక్టర్ల పార్టీగా మారిందని టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆస్తుపూన్నో, కేసీఆర్ ఆస్తుపూన్నో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాలు విసిరారు.


Take By: T News


Keywords: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC. Polavaram Project,

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP