Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, December 2, 2011

పంజా పవర్



pawan-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaపవన్‌కళ్యాణ్ చిత్రం వస్తోందంటే అందరిలోనూ ఆసక్తే. రాబోయే ‘పంజా’ చిత్రానికైతే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కారణం ఈ చిత్రంలో ఆయన విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తుండటమే. ప్రస్తుతం నిర్మాణమవుతున్న క్రేజీ హీరోల చిత్రాల బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్‌తో టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో తెరకెక్కిన ‘పంజా’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపుగా యాభై కోట్ల బిజినెస్ జరుపుకోవడం తెలుగు చిత్ర పరిక్షిశమలో సంచలనంగా మారింది.

నైజామ్ ఏరియా హక్కులు (దాదాపుగా)14 కోట్లకు అమ్ముడుపోగా సీడెడ్ ఏరియా పంపిణీ హక్కుల కింద ఈ చిత్రం 6.5 కోట్ల వసూలు చేసిందట. నెల్లూరు: 1.4 కోట్లు, కృష్ణ: 2 కోట్లు, గుంటూరు: 3 కోట్లు, వైజాగ్: 3 కోట్లు, ఈస్ట్ గోదావరి: 2.4 కోట్లు, వెస్ట్‌గోదావరి: 2 కోట్లు యుఎస్‌ఎ: 3 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే విస్మయపరుస్తోంది. ఇవి కాక ఓవర్సీస్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ మొత్తంగా కలిపి దాదాపుగా 12 కోట్లు కొల్లగొట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా కలిపితే పవన్‌కళ్యాణ్ ‘పంజా’ చిత్రం విడుదలకు ముందే 50 కోట్లు వసూలు చేసిందని, విడుదలయ్యాక బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటం విశేషం.

Take By: T News


Tags: T News, hmtv, tv9,  Cinema, Images, sex, hot images, MoviesTollywood, Bollywood, Hollywood, Dacanwood, Paanja, Pavankanlyan

Read more...

అవినీతి.. భారత్



parliment-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema అంతర్జాతీయ సూచీలో 95వ స్థానం
మూడేళ్లుగా దిగజారుతున్న ర్యాంకు.. గత ఏడాది 87వ స్థానంలో..
చైనా, శ్రీలంకల కన్నా ఇక్కడే ఎక్కువ.. పాక్‌తో పోలిస్తే మెరుగు
వరుస కుంభకోణాలు, నేతల అరెస్టులు.. కారణాలు!


న్యూఢిల్లీ, డిసెంబర్ 1:భారతదేశంలో అవినీతి భూతం నానాటికీ పెట్రేగుతోంది. లంచాలకు మరిగి, ప్రజాసేవ అటకెక్కించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు దేశంలో కొదువే లేకపోవడంతో అవినీతి హద్దూఅదుపు లేకుండా విజృభిస్తోంది. ఓవైపు అవినీతిపై ఉక్కుపాదం మోపే లోక్‌పాల్ కోసం సామాజిక ఉద్యమనేత అన్నా హజారే నాయకత్వంలో జోరుగా ఉద్యమం సాగుతున్నా, అవినీతిని ఎంతమాత్రం సహించం, కూకటివేళ్లతో పెకిలిస్తామని జాతీయస్థాయిలో నేతలు ఉపన్యాసాలు దంచుతున్నా, దేశంలోని అవినీతిపరులు తొణకుండా, బెణకుండా తమ పని తాము సాగిస్తున్నారు! చేయి తడిపితేనా.. అమ్యామ్యాలు ముట్టితేనే సర్కారీ కార్యాలయాల్లో పనులు సాగుతున్నాయి! అవినీతిలో ఆరితేరిన రాజకీయ నాయకులు రోజుకో భారీ కుంభకోణంతో దేశంలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇక మన దేశంలో అవినీతి ఎలా తగ్గుముఖం పడుతోంది? ఈ జ్యాఢ్యాన్ని నియంవూతించే విషయంలో మన ప్రతిష్ట ఎలా మెరుగుతోంది?? అందుకే 183 దేశాలతో టాన్స్‌పన్సీ ఇంటేర్నేషనల్ రూపొందించిన అంతర్జాతీయ అవినీతి సూచి(కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్-సీపీఐ)లో భారత్ 95వ స్థానంలో నిలిచింది. అవినీతి నియంవూతణ విషయంలో భారత్ ర్యాంకు క్రమంగా దిగజారుతోంది. అవినీతి విషయంలో 10 మార్కులకు గాను భారత్ 3.1 మార్కులను మాత్రమే సాధించింది. 2007లో అత్యధికంగా 3.5 మార్కులు తెచ్చుకున్న భారత్ ఆ ఏడు 180 దేశాల సీపీఐలో 72వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్రమంగా మన ర్యాంకు దారుణంగా పడిపోతూ వస్తోంది. అవినీతిని నియంవూతించడంలో వ్యవస్థ తీరు నానాటికీ తీసికట్టుగా ఉందని ప్రజలు భావించడమే ఇందుకు కారణం. గత ఏడాది ఈ జాబితాలో 87వ స్థానంలో నిలిచిన మన దేశం ఈ ఏడాది ఎనిమిది స్థానాలు దిగజారింది. పొరుగు దేశాలు చైనా(75 ర్యాంకు), శ్రీలంక (86)ల కన్నా ఎంతో వెనుకబడిన ఇండియా.. 134వ స్థానంలో ఉన్న దాయాది పాకిస్థాన్‌తో పోలిస్తే మెరుగు అనిపించుకుంది. ప్రభుత్వ రంగాల్లో అవినీతి గురించిన వివరాల ఆధారంగా సీపీఐ వివిధ దేశాలకు ర్యాంకులను నిర్ధారిస్తోంది. ఇందుకోసం నిపుణులైన అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల నుంచి సంక్లిష్ట ప్రక్రియ ద్వారా సమాచారం సేకరిస్తోంది.

13 అధ్యాయనాల ఆధారంగా భారత ర్యాంకును నిర్ణయించారు. దేశం పనితీరుపై ప్రపంచబ్యాంకు నివేదిక, ఇనిస్టిట్యూషనల్ అసెస్‌మెంట్, వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఒపినియన్ సర్వే, గ్లోబల్ ఇన్‌సైట్ ఇచ్చిన రిస్క్ రేటింగ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పన్సీ రూపొందించిన తాజా జాబితాలో 9.5 మార్కులతో న్యూజీల్యాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్, ఫిన్‌ల్యాండ్‌లు నిలిచాయి. అస్థిరత, అంతర్గత సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న సోమాలియా, ఉత్తర కొరియా, మయున్మార్, అఫ్గానిస్థాన్‌లు అట్టడుగు స్థానానికి పరిమితమయ్యాయి. దిమ్మతిరిగే కుంభకోణాలు వెలుగు చూస్తుండటం, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్లు అరెస్టవ్వడం, అవినీతి పీచమణచడం కోసం లోక్‌పాల్ ఉద్యమం జోరుగా సాగుతుండటం.. మన దేశ ర్యాంకు దిగజారడానికి కొద్దిస్థాయిలో దోహదపడొచ్చునని ట్రాన్స్‌పన్సీ ఇంటర్నేషనల్ ఇండియా బాధ్యులు తెలిపారు.

కుదిపేసిన కుంభకోణాలు..
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ మధ్యకాలంలో దేశాన్ని వరుస కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో, సామాన్యుడి ఊహకందని రేంజ్‌లో లక్షల కోట్ల రూపాయాల కుంభకోణాలు వెలుగుచూశాయి. 2జీ నుంచి ఓటుకు నోటు వరకు అన్నీ ప్రజల్లో గుబులు రేపిన కుంభకోణాలే. ఆ వివరాలు..

2జీ స్పెక్ట్రం స్కాం:
2జీ కేటాయింపులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టి, వారి నుంచి ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలపై ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంతో రూ.1.76 లక్షల కోట్లు నష్టపోయిందన్న కాగ్ నివేదికతో దేశం దిమ్మెరపోయింది. ఈ స్కాంలో టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో సహా ముఖ్య ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ ప్రముఖులు నిందితులుగా ఉన్నారు

ఓటుకు నోటు:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaయూపీఏ-1 ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కడం కోసం ఎంపీలను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచిందని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నోట్ల కట్టలు ప్రదర్శించడంతో సంచలనం సృష్టించింది. ఈ స్కాంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీవీసీ నియామకంపై నిరసనలు:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaకేంద్ర విజిపూన్స్ కమిషనర్‌గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడం కూడా కేంద్రంలోని యూపీఏ సర్కారును తీవ్రంగా ఇరకాటంలో పడేసింది. కేరళలో పామోలిన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజే థామస్‌ను సీవీసీగా నియమించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన దిగిపోక తప్పలేదు. ఇది కేంద్రానికి ఎదురుదెబ్బగా మారింది.

ఆదర్శ్ కుంభకోణం:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaముంబైలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాల కోసం నిర్మించిన ఆదర్శ్ సోసైటీలో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ, ఆర్మీ అధికారులు ప్లాటు పొందడం కోసం నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ స్కాం దెబ్బతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కామన్ క్రీడల కుంభకోణం:
suresh talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రతిష్ఠాత్మక కామన్ క్రీడల నిర్వహణ విషయంలో ఆది నుంచి అక్రమాలు వెలుగుచూశాయి. చివరి క్షణం వరకు పనులు కొనసాగడం, వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు, అసలు క్రీడలు సజావుగా జరుగుతాయా అన్న ఉత్కంఠ మధ్య.. ఎలాంటి అవాంతరం లేకుండా ఈ క్రీడలు ముగిశాయి. అయితే కామన్ క్రీడల నిర్వహణలో జరిగిన ఎన్నో అక్రమాలు వెలుగుచూడడంతో కామన్ క్రీడల చైర్మన్ సురేశ్ కల్మాడీ జైలు పాలయ్యారు. మరికొందరు నిర్వాహకులు కూడా అరెస్టయ్యారు.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News  

Read more...

నల్లచట్టాలతో ఉద్యమాన్ని ఆపలేరు



kcr-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema- అణచివేయాలనుకుంటే మరింత తీవ్రం
- సీఎం కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారు
- తెలంగాణ మంత్రులకు చీమూ నెత్తురు లేదు
- టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
- చెరుకు సుధాకర్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్


(-వరంగల్):ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి నియంతలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని సహించలేక ప్రభుత్వం నల్ల చట్టాలతో అణచాలని చూస్తోందని మండిపడ్డారు. అణచివేయాలనుకుంటే ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రముఖ వైద్యుడు చెరుకు సుధాకర్‌ను ప్రభుత్వం అకారణంగా అరెస్టు చేసిందని తప్పుపట్టారు. ఆయన ఆరోగ్యం ఏమీ బాగాలేదని, ఆయనను ప్రభుత్వం తక్షణమే బేషరతుగా విడుదల చే యాలని డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి, నాసా కేసు మోపడంతో వరంగల్ జైలుకు పంపిన డాక్టర్ చెరుకు సుధాకర్‌ను ఇటీవల అనారోగ్యం కారణంగా ఎంజీఎం ఆసుపవూతికి తరలించారు. ఆసుపవూతిలో ఉన్న ఆయనను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం పరామర్శించారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహాడ్డి, వరంగల్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి ఉన్నారు.

అనంతరం మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘చెరుకు సుధాకర్‌ను అర్ధరాత్రి అరెస్టు చేయడంతో మా ఎమ్మెల్యేలందరూ తెలంగాణ మంత్రులను కలిస్తే 10 నుంచి 15 రోజు ల్లో విడుదల చేస్తామన్నరు. తెలంగాణ కోసం ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమం చేస్తున్న వ్యక్తిని అదీ పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడం ఏమిటని వారే ఆశ్చర్యపోయారు. ఆయన విడుదలకు సహకరిస్తామన్నారు. కానీ ఏమీ చేయలేకపోతున్నారు. తెలంగాణ మం త్రులకు చీమూనెత్తురు, సిగ్గూ శరం ఏమాత్రం లేవు’’ అని ఆయన ఈ ప్రాంత మంత్రులపై, వారి చేతకానితనంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అరెస్టులతో అడ్డుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి చూస్తే అంతకన్నా అవివేకం ఏమీ ఉండదని ఆయన విమర్శించారు. నల్గొండలో ప్రజావైద్యుడిగా పేరున్న చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంతో మమేకమై తమ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారని, అలాంటి వ్యక్తిపై నల్లచట్టాలు, నాసాలు ప్రయోగిస్తే వాటికి తెలంగాణవాదులు ఎవ్వరూ భయపడేదిలేదన్నారు. చెరుకు సుధాకర్‌ను ఎలా విడుదల చేసుకోవాలో తమకు తెలుసునని, రాష్ట్ర హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ మంత్రులు సిగ్గూశరం లేకుండా చీమూనెత్తురు లేకుండా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము ఉద్యమిస్తే 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం హామీనిచ్చిందని, దానిని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని, ఎటువంటి కేసులు పెట్టి, ఎంత భయానక వాతావరణం సృష్టించాలని చూసినా తెలంగాణ భయపడేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. చెరుకు సుధాకర్‌ను ఆస్పత్రి నుంచి తొందరగా జైలుకు పంపాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, సీనియర్ నేతలు కన్నెబోయిన రాజయ్యయాదవ్, ముత్తిడ్డి యాదగిరిడ్డి, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవడ్డి తదితరులు పాల్గొన్నారు.

కంటతడి పెట్టిన కేసీఆర్
వరంగల్ రూరల్: వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించిన పార్టీ అధినేత కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. సుధాకర్ ఆరో గ్య పరిస్థితిని చలించిపోయా రు. ఒక్కసారిగా ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. ‘‘అన్నా నువ్వేం భయపడొద్దు.. నీకు, నీ కుటుంబానికి మేము న్నాం. నీ వెనకాల యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నారు’’ అని భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభు త్వం బేషరతుగా విడుదల చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమం ఆగదు
మేడిపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు ఉద్యమకారులపై ఎన్ని నాసా కేసులు పెట్టినా వెనుకకు తగ్గేది లేదని, తెలంగాణ ఉద్యమం కొసాగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌లో పోలీసు నిర్బంధంలో ఉన్న టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పరామర్శించేందుకు గురువారం వెళుతూ మార్గమధ్యంలో మేడిపల్లి పరిధిలోని చెంగిచర్ల చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణవాదులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా పోరాడుతున్నవారిపై దుర్మార్గమైన దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపె సభను జరుగనివ్వబోమని, శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపె ఉద్యమించాలని కోరారు. తెలంగాణ ఉద్య మం చల్లబడిందనే సీమాంధ్ర నేతల ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్షికమంలో రంగాడ్డి జిల్లా టీఆర్‌ఎస్ కార్యదర్శి పంగ మహేందర్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నత్తి మైసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చర్ల ఆంజనేయులు, బింగి జంగయ్యయాదవ్, ఏర్పుల వెంక మేకల వెంక చంద్రశేఖర్, పన్నాబాయ్, సునీల్, సంపత్, యాదగిరి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News
  


Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP