Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, June 23, 2012

ఇప్పుడు వీస్తున్నది.. తెలంగాణ గాలి



- విడిపోవడంపై అంచనాకొచ్చిన సీమాంధ్ర నేతలు
- అక్కడా ఇక్కడా బతకాలంటే.. తెలంగాణే మార్గం!
- జగన్ జోరును అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం
- రాష్ట్ర ప్రకటనతో తెలంగాణలో నెట్టుకురావచ్చు
- ఉప ఫలితాలతో మెట్టు దిగుతున్న సీమ నేతలు
- జూలైలో ఉద్యమానికి రెడీ అవుతున్న తెలంగాణ
అవును.. 

ఇప్పుడు తెలంగాణ గాలి వీస్తున్నది! ఉద్యమక్షిశేణుల్లోనే కాదు.. సాక్షాత్తూ తెలంగాణ వ్యతిరేక వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దల్లోనూ..! ఒక టీజీ వెంక ఒక ఏరాసు ప్రతాప్‌డ్డి.. ఒక బొత్స సత్యనారాయణ.. ఇవి ఇంకా తొలి స్వరాలే! రాష్ట్ర విభజనకు వ్యతిరేకత నుంచి.. మా హక్కులు దక్కితే చాలు అన్నంత స్థితికి.. అక్కడి నుంచి.. 

తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరనే ఆందోళనను వ్యక్తం చేసే స్థాయికి పడిపోయిన నేతల మాటల తీవ్రత! రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుని.. 2014 ఎన్నికల్లో అందివస్తే అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన! ఉప ఎన్నికల్లో సమైక్యవాదం విలువలేకుండా పోయిన వేళ.. సీమాంవూధలో భవిష్యత్ కళ్లకు కడుతుండగా.. కనీసం తెలంగాణలోనైనా పార్టీని బతికించుకునేందుకు ఆఖరి అస్త్రం! తెలంగాణలో బట్టకడితే.. సీమాంవూధలోనూ ఏదో విధంగా బతికేద్దామని ఆశ! అందుకు ఉన్న ఏకైక ఆస్కారం.. తెలంగాణపై ‘నిర్ణయం’! అందుకే మారుతున్న స్వరం!!

హైదరాబాద్ జూన్ 19 () : ఇక తెలంగాణ నిర్ణయాత్మక దశకు చేరుకుందా? రాష్ట్రపతి ఎన్నికల తదనంతరం కాంగ్రెస్ తీసుకోబోయే ప్రధాన విధానపరమైన నిర్ణయాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉండబోతున్నదా? తెలంగాణ వ్యతిరేకులు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాటలను కేంద్రం పక్కనపెట్టబోతున్నదా? అవుననే అంటున్నారు.. సాక్షాత్తూ సీమాంధ్ర నేతలు! పరకాల ఉప ఎన్నిక ఫలితం ఆసరాగా మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఆశించిన కేసీఆర్ మాటలు.. నిజమవుతాయని భావించే విధంగా ప్రస్తుత సీమాంధ్ర నేతల మాటలు వినిపిస్తున్నాయి! ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమైక్యవాదం ఆత్మరక్షణలో పడిపోయింది! సీమాంధ్ర నియోజకవర్గాల్లో జగన్‌కు ఓటేస్తే రాష్ట్రం ముక్కలవడం ఖాయమన్న నేతలు.. జనం తమ వాదనను వినిపించుకోకపోవడాన్ని గుర్తించినట్లున్నారు.

ఉప ఎన్నికలకు ముందు వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్ర నేతలు తమ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిళ్లు తెచ్చారు. రాష్ట్రాన్ని విడదీస్తే ఇక్కడ సీమాంవూధలో కాంగ్రెస్ ఖతం అవుతుందని హెచ్చరించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. నేతల తీరూ మారింది. తెలంగాణ ఇస్తారేమోనన్న భయం వేస్తోందనే స్థాయిలో సీమాంధ్ర నేతల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఇస్తే ఇచ్చారు.. కనీసం మా హక్కులనైనా కాపాడండి అని అదే నేతలు వేడుకుంటున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం సీమాంవూధలో పోటీ చేసిన 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 2చోట్ల గెలిచి 7చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. తెలంగాణలో పోటీ చేసిన ఒక్క స్థానంలో డిపాజిట్ కోల్పోయి ఐదో స్థానంలో నిలిచింది. ‘2014లో ప్రధాని రేసులో రాహుల్‌గాంధీ ఉంటారని తేలిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ గత రెండు సాధారణ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీలనిచ్చిన ఏపీపై ఆశ పెట్టుకుంది. కానీ.. సీమాంవూధలో నష్టం జరిగిపోయింది. ఇక మిగిలింది తెలంగాణే. ఇక్కడ ఆశలు ఇంకా సజీవం.

ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణపైనే. సీమాంవూధలో పార్టీకి భవిష్యత్తు లేదని, చిరంజీవి వచ్చినా చిరు ప్రయోజనం కూడా లేదని తెలిపోవడంతో అధిష్ఠానం తెలంగాణపై నాన్చడం ఆపేసి, తేల్చడం ఎంచుకుంది’ అని సీమాంధ్ర ప్రాంత ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే తేల్చే మొట్టమొదటి అంశం తెలంగాణేనని అక్కడినుంచి తెలంగాణ నేతలకు సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలు తెలంగాణపై ఒకవేళ తేల్చితే తమతో మాట్లాడిన తరువాతే తేల్చాలని, తమ డిమాండ్లు, వాటాలు తేల్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కాళ్లబేరానికి వస్తున్నారు. రాయలసీమ మంత్రులు టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌డ్డి ఢిల్లీ పెద్దలను కలిసి సందర్భంలో వారికి అధిష్ఠానం నుంచి పలు ప్రశ్నలు ఎదురైనట్లు సమాచారం. ‘మీ మాటలు నమ్మి నష్టపోయింది చాలు’ అంటూ తలంటుపోసినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో ఎందుకు ఓడిపోయామనే దానిపై సమాధానం చెప్పుకోలేకపోయారని తెలిసింది.

తెలంగాణ ఏర్పాటు ఖాయమంటూ టీజీ, ఏరాసు వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనివేనని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పరకాల విజయం నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సైతం తమ గొంతు వినిపిస్తూ.. సీమాంధ్ర నేతల వాదనలు వారి ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డీలాపడిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే చేపట్టే అంశాలేవీ లేవని, చాలా కాలంగా పెడింగ్‌లోఉన్న తెలంగాణ అంశాన్ని పరిష్కరిస్తామని తెలంగాణ నేతలకు సర్దిచెబుతున్నారు. ‘ఢిల్లీ నుండి వస్తున్న సంకేతాలు చూస్తుంటే మరో మూడు నెలలు ఆగాలనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్రం ఇస్తామన్నట్లుగా మా ఎంపీలు చెబుతున్నారు. తెలంగాణ తేల్చకుంటే జరిగే నష్టాన్ని అధిష్ఠానం అంచనా వేసింది. అందుకే రాష్ట్రం ఇచ్చే విషయంలో మాకు సంకేతాలు పంపుతోంది’ అని తెలంగాణనేత ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. జైల్లో ఉన్న జగన్‌ను వెళ్లి కలిశారు. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మద్దతివ్వాలని హైకమాండ్ అభ్యర్థన మేరకే ఆయన జగన్‌ను కలిసినట్లు సమాచారం.

ఈ పరిణామం కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతోంది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించేందుకు టీజేఏసీ సిద్ధమవుతున్న తరుణంలో నెలాఖరు తరువాత తెలంగాణ వేడి గల్లీ నుండి ఢిల్లీకి తాకుతుందని, అప్పుడు రాష్ట్రం ఇవ్వడం తథ్యమనే సంకేతాలను తెలంగాణ నేతలిస్తున్నారు.

సీమాంధ్ర నేతల్లో జగన్ గుబులు

సీమాంధ్ర నేతల స్వరం మారడం వెనుక జగన్ ఆధ్వర్యంలోని వైస్సార్సీపీ ఇటీవలి ఘన విజయాలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో డిపాజిట్లు దక్కించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల నాటికి సీమాంవూధలో సైతం అడ్రస్ లేకుండాపోయే పరిస్థితి దాపురించే ప్రమాదం కనిపిస్తుండడంతో పార్టీ నేతల్లో ఆందోళన రేగుతోంది. దీంతో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలకడం ద్వారా తెలంగాణ ప్రాంతంలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో పార్టీకి పునరుజీవ్జవం తథ్యమని ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చాక సీమాంవూధలో ఏదో ఒకటి చేసి నెట్టుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నది వారి ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు తెలంగాణకు బదులు రాయల తెలంగాణను ముందుకు తెస్తున్నారు.

ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆఖరి ప్రయత్నంగా లాబీయింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. రాయల తెలంగాణ ఏర్పాటుతో రాయలసీమలో జగన్ జోరును కడప, చిత్తూరు జిల్లాలకే పరిమితం చేయడం ద్వారా సంఖ్యాబలం విషయంలో ఇటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేని పరిస్థితి తలెత్తకుండా నిరోధించగలమనే అభివూపాయం వారి మాటల్లో వినిపిస్తున్నది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, మరో మాజీ మంత్రి, కొందరు సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనివార్యమైన పక్షంలో అనంతపురం, కర్నూలు.. ఈ రెండు జిల్లాలు కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కోస్తాంధ్ర నేతల్లో సైతం అత్యధికులు రాష్ట్ర విభజనకే తలూపే పరిస్థితి కనిపిస్తోంది.

ఉత్తరాంవూధతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంత వరకు కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. కనుక తెలంగాణ ఏర్పాటు చేసినా, రాయల తెలంగాణ ఇచ్చినా ఆంధ్రాలో కొంత వరకు పార్టీని బతికించుకోవచ్చని వారు అభివూపాయపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, ప్రజావూపతినిధులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రకటిస్తే అక్కడ, ఇక్కడ పార్టీ ఉంటుందన్న నమ్మకం, ధీమా వారిలో కనిపిస్తోంది. పార్టీ అధిష్ఠానం వద్ద కూడా ఇదే వాదన వినిపించేందుకు వారు సమయాత్తమవుతున్నట్లు సమాచారం.

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP