Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Monday, December 26, 2011

మహిళా కమిషన్ చైర్మన్‌గా జయసుధ?

- ఆమె ైవైపే సీఎం మొగ్గు
- అధిష్ఠానం ఆమోదం?
- త్వరలో అధికారిక ఉత్తర్వులు
- జగన్ వర్గం నుంచి వచ్చినందుకు నజరానా?


jaya-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 25 (:సినీనటి, సికింవూదాబాద్ ఎమ్మెల్యే జయసుధను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి స్ఫూర్తితో సినీపరిక్షిశమ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జయసుధ, ఆయన ప్రోత్సాహంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింవూదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత నాలుగు నెలలకే ఊహించని రీతిలో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

వైఎస్సార్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రయాణంపై ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత పార్టీకి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్ తనయుడు జగన్‌కు బాసటగా నిలుస్తూ ఆయనకు మద్దతిస్తూ వచ్చారు. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నప్పటికీ అతనికి అండగా ఉంటూ కాంగ్రెస్‌లో జగన్ వర్గం ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు.

వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించిన జగన్ వర్గం ఎమ్మెల్యేల బృందంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ ప్రయోగించిన పునరాకర్షక్ మంత్రం తో జయసుధ జగన్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

అప్పటి నుంచి ఆమె సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని పలు సందర్భాల్లో ఒక మంచి ముఖ్యమంవూతిగా పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కిరణ్ కూడా సినీ గ్లామర్ ఉన్న జయసుధ పార్టీ నుంచి చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సికింవూదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పలు అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించారు. అంతే కాకుండా పునరాకర్షక్ మంత్రంలో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు జయసుధకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కిరణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవికి వన్నె తెచ్చే నాయకురాలి కోసం పార్టీ అన్వేషిస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జయసుధను మించి ఆ లక్షణాలు, అర్హతలున్న నేతలు ఎవరూ లేరని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. జయసుధకు ఆ పదవి ఇవ్వడం ద్వారా జగన్ వర్గం నుంచి కాంగ్రెస్‌కు వచ్చినందుకు ఆమెకు నజరానాగా చెప్పుకోవచ్చని, జగన్‌కు మద్దతుగా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, నేతలను కూడా సొంతగూటికి రప్పించుకోవచ్చని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఈ విషయంలో ఆయన పార్టీ అధిష్ఠానంతో చర్చించి జయసుధ పేరుకు ఆమోదం కూడా పొందినట్లు సమాచారం. గతంలో మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మేరి రవీంవూధనాథ్, కమిషన్ సభ్యులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వీధి పోరుకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ కమిషన్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి కమిషన్ చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. నాటి నుంచి పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలు ఆ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Take By: T News

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP