Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, October 13, 2011

సమ్మె విచ్ఛిన్నానికి సీఎం కుట్ర?

- కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో మంతనాలు
- గ్రేటర్ ఎమ్మెల్యేల పేరుతో డ్రామా
- చేతులు మారిన రూ.150 కోట్లు?
- తెలంగాణ విద్యార్థులపై నేతల కపట ప్రేమ
- పేరెంట్స్ కమిటీ ముసుగులో గందరగోళం


kiran-kumar-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 12(టీ న్యూస్): తెలంగాణ ఉద్యమం నుంచి విద్యార్థులను వేరు చేయాలనే కార్పొరేట్ కుట్ర జరుగుతోంది. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు తెలంగాణ కోసం ఉద్యమించాలన్న భావన పెరిగింది. విద్యాసంస్థలను బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటుండడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదంవూడులతో ఒత్తిళ్లు చేయించి కళాశాలలను నడిపించాలని కుట్ర పన్నింది. ఈకుట్ర కూడా విఫలమవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దింపింది. ఇందులో భాగంగానే సమ్మె చేస్తున్న వారిపై కూడా దాడులు చేస్తామనే సంకేతాలను కిరణ్ సర్కారు ఇస్తోంది. సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కుమ్మకై్క సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర పన్నారు. సమ్మెతో విద్యార్ధుల భవిష్యత్‌ను నాశనం చేయొద్దంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. గతంలో ఇదే ముఖ్యమంత్రి తెలంగాణ కావాలని ఉద్యమించిన పేద విద్యార్థులను పోలీసులతో విచక్షణారహితంగా కొట్టించారు. విశ్వవిద్యాలయాలను పోలీస్ క్యాంప్‌లుగా మార్చారు.

కానీ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వ్యాపారం దెబ్బతింటుందనగానే హడావుడిగా సీఎం రంగంలోకి దిగారు. వారితో రహస్య మంతనాలు చేశారు. ఐఐటీ, మెడిసిన్ భ్రమల్లో సగటు విద్యార్థుల తల్లిదంవూడులను ఉంచి, కోట్లు దండుకుంటున్న సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలను కాపాడటానికి నడుం బిగించారు. సర్కారు విద్య సర్వ నాశనమైనా ఫర్వాలేదు కానీ, ఇక ప్రైవేట్ విద్యాసంస్థకు ఇబ్బంది కలుగకూడదన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు సీమాంవూధకు చెందిన టీడీపీ నేతలను కూడా కలుపుకొని సమ్మెకు వ్యతిరేకంగా కృత్రిమ ఆందోళనలు చేయించే కార్యక్షికమానికి పూనుకున్నారు. ఈ వ్యవహారంలో సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థల నుంచి రూ.150 కోట్లు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పేరెంట్స్ కమిటీ పేర్లతో రగడ
హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది విద్యార్థుల తల్లిదంవూడులతో విలేకరుల సమావేశాలు పెట్టించి ఉద్యమం నుంచి విద్యార్థుల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు చెందిన ఎన్నారై కాలేజీ వద్ద కుట్రను మొదలుపెట్టి, ప్రభుత్వం నెమ్మదిగా తెలంగాణ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. పేరెంట్స్ కమిటీల పేరుతో సమ్మె పట్ల దుష్ర్పచారం చేస్తోంది. ఇందులో భాగంగానే సంగాడ్డి ఎమ్మెల్యే తూర్పు జయవూపకాశ్ రెడ్డి భార్య, సంగాడ్డి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నిర్మల కొంత మంది మహిళలను వెంటబెట్టుకుని సంగాడ్డి ఐబీ గెస్ట్‌హౌజ్ వద్ద ఆందోళన చేపట్టారు. పెద్దగా తెలంగాణవాదుల నుంచి మద్దతు లభించక పోవటంతో ఆందోళన విరమించారు. విశాలాంధ్ర పేరుతో కొంత మంది సీమాంధ్ర నేతలు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పరకాల ప్రభాకర్, మాజీ ఐపీఎస్ ఆంజనేయడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విలేకరులపై చిందులేశారు.

గ్రేటర్ ఎమ్మెల్యేలను రంగంలోకి దించిన సీఎం
ముఖ్యమంత్రి కిరణ్ బాధ్యతను ఆయన అనుంగులైన గ్రేటర్ ఎమ్మెల్యేలు నెత్తికెత్తుకున్నారు. మంగళ, బుధవారాలలో సీఎల్‌పీ కేంద్రంగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రంగాడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలు నిర్వహించి విద్యాసంస్థలను, విద్యుత్‌ను సమ్మెనుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున చేతులు మారడంతో ఈ మేరకు విద్యార్థుల పేరుతో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తేవడం చాతకాని ఈ నేతలు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి విద్యార్థుల చదువులను సాకుగా చూపుతున్నారంటున్నారు.

సమ్మెనుంచి విద్యాసంస్థలను మినహాయించాలనడం కాదు... సమస్య పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అది చాతకానప్పుడు సమ్మెనుంచి మినహాయింపులు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదని తెలంగాణ నగార ఎమ్మెల్యే హరీశ్వర్‌డ్డి మండిపడ్డారు. విద్యాసంస్థలను సమ్మెనుంచి మినహాయించమని కోరడం కాదు... తెలంగాణ తెస్తే అసలు సమ్మెనే ఉండదు కదా... ఆదిశగా ప్రయత్నం చేయమని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌డ్డి గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్‌డ్డి, రాజిడ్డి, భిక్షపతియాదవ్‌లకు సలహా ఇచ్చారు.

ఆదాయంపై ప్రభావం చూపుతుందనే...
హైదరాబాద్‌తో సహా వివిధ తెలంగాణ జిల్లాలో సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలు దాదాపు మూడునుంచి నాలుగు వేల కోట్ల రూపాయల మధ్య వ్యాపారం కొనసాగిస్తున్నాయని ఒక అంచనా. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే విద్యాసంస్థల క్యాలెండర్ దెబ్బతింటుందని, ఫలితంగా వ్యాపారంలో భారీగా లాభాలు పడిపోతాయని కార్పొరేట్ విద్యాసంస్థలు భావిస్తున్నాయి.. హైదరాబాద్‌తో పాటు వివిధ తెలంగాణ జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, గౌతమి, ఎన్‌ఆర్‌ఐ, వికాస్, విజ్ఞాన్‌లతో పాటు కార్పొరేట్ టెక్నోస్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలా ఒక్కో సంస్థ వందల సంఖ్యలో తమ బ్రాంచీలను నిర్వహిస్తున్నాయి. ఈ విద్యాసంస్థల ఒక్కో క్యాంపస్‌లో 1500ల నుంచి రెండు వేల వరకు విద్యార్థులున్నారు. ఈ సంస్థలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.

Tags: Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP