Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, December 21, 2011

తెలంగాణ భూముల్లో ఐటీ లూటీ! - ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణపరిశ్రమ -3 (Telangana History Part - 3 and Hyderbad Nizam Histrory

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- భారీగా రియల్‌ఎస్టేట్ దందాలు
- పరిశ్రమలకు తెర్లు పట్టిస్తున్న సర్కార్
- ఔటర్‌రింగ్ రోడ్డు వరకు తరిమివేత
- కాలుష్యేతర యూనిట్లకూ కష్టాలే

Real-Estate1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema









 తెలంగాణ పరిశ్రమలకు సర్కారు తెర్లు పట్టిస్తున్నది. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్నపరిశ్రమలపై కాలుష్య నెపం వేసి ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు నెట్టివేసే కుట్ర చేస్తోంది. ఇదే ఒరవడిలో కాలుష్యేతర కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న యూనిట్లను సైతం తరిమేస్తోంది. ఖాళీ అయిన జాగాలో ఐటీ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో లూటీకి తెగిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాన్ని బూచిగా చూపి.. కొత్త పరిశ్రమలను సీమాంధ్ర జిల్లాలకు తరలించేస్తోంది. ఉన్న పరిశ్రమలు సంపూర్ణంగా పనిచేసేందుకు ప్రోత్సాహకాలు అందకుండా వాటినీ అటకెక్కిస్తోంది. వాటిపై పవర్‌హాలిడే రూపంలో పంజా విసురుతోంది. పొమ్మనడమే కాకుండా.. పొగ కూడా పెడుతున్నది!

హైదరాబాద్, డిసెంబర్ 20 (): ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేతృత్వంలో పరిక్షిశమల శాఖ, పారిక్షిశామికవాడల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం వైఖరేమిటనేది వారిచేత చెప్పించింది. నిజాం కాలం నాటి ఆజామాబాద్ పారిక్షిశామికవాడ నుంచి సనత్‌నగర్, ఉప్పల్, నాచారం, బాలానగర్, జీడిమెట్ల పారిక్షిశామికవాడల చుట్టూ జనావాసాలు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ట్రాఫిక్ సమస్యలు మితిమీరిపోతున్నాయనే నెపంతో వాటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పారిక్షిశామికవాడలను ప్రజోపకర ఇతర అవసరాల కోసం ‘కన్వర్ట్’ చేద్దామనే దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. సర్కారు ఆలోచనలకు సీమాంధ్ర పారిక్షిశామిక వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదివాలా తీసిన పరిక్షిశమలను అతి తక్కువ ధరలకు కొనుగోలుచేసిన సీమాంధ్ర వ్యాపారవేత్తలు కన్వర్షన్ ద్వారా అప్పటి వరకు ఉన్న పరిక్షిశమల స్థానంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్పొరేట్ ఆసుపవూతుల నిర్మాణాల వైపు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ ప్రాంత పరిక్షిశమల్లో నట్ బోల్టుల నుంచి భారీ కంటైనర్ల వరకు తయారవుతున్నాయి.

బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రయివేటు రంగంలో ఉన్న భారీ పరిక్షిశమలకు చిన్నతరహా పరిక్షిశమల నుంచి ముడిసరుకు అందుతున్నది. నిజానికి వీటిలో అనేకం కాలుష్యేతర యూనిట్లే. కానీ.. అది పట్టించుకోకుండా చిన్న తరహా పరిక్షిశమలపై గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలకు ప్రభుత్వం ఒడిగడుతున్న తీరు పట్ల చిన్నతరహా పరిక్షిశమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత దశాబ్దకాలంగా పొల్యూషన్ (కాలుష్యం) పేరిట సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల పరిక్షిశమలపై ఉక్కుపాదం మోపిన సర్కారు, కొత్తగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఉన్న పరిక్షిశమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించేందుకు పావులు కదుపుతోంది. పారిక్షిశామికవాడల్లో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో సీమాంవూధులకు సర్కారు గోల్డెన్ షేక్ హాండ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నది.

పారిక్షిశామిక ఉత్పత్తిరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు కాలుష్యరహిత పరిక్షిశమలు (నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ) ఏర్పాటు పేరుతో తెలంగాణ భూముల్లో ‘మల్టీ యూజ్ జోన్’ అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చారు. కాలుష్యానికి కారకులవుతున్నాయనే నెపంతో ఉన్న పరిక్షిశమలను మూసివేశారు. పారిక్షిశామికవాడల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సీమాంవూధుల చేతుల్లో ఉన్న పరిక్షిశమలు భూములను కాపాడుకునేందుకు పారిక్షిశామిక ఉత్పత్తులు నామమావూతంగా చేస్తూ పారిక్షిశామికీకరణను తిరోగమనానికి తీసుకెళ్తున్నారు.

దీంతో పారిక్షిశామికోత్పత్తులు తగ్గిపోవడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా లీజుల పొడిగింపులను నిలిపివేయడం, పరిక్షిశమల శాఖ ద్వారా శాఖాపరంగా కట్టడి చేయడంతోపాటు స్థానిక సంస్థల నుంచి అభ్యంతరాలను లేవదీస్తూ ఇప్పుడున్న పరిక్షిశమల మనుగడను అడ్డుకునే దుస్సాహసానికి సర్కారు ఒడిగడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పరిక్షిశమలు, ప్రైవేటు రంగంలో కొన్ని వందల పరిక్షిశమలున్నాయి. హైదరాబాద్, దాని పరసర ప్రాంతాలు కలిపి ఇండవూస్టియల్ హబ్‌గా విలసిల్లుతున్నది.

గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిక్షిశమలను ఏర్పాటును అడ్డుకుంటూ పరిక్షిశమలు పెట్టేందుకు వస్తున్న ఔత్సాహిక పారిక్షిశామికవేత్తలను విస్తరణ పేరిట విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ె ల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు తరలించారు. ఈవిధంగా గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల కన్నా సీమాంధ్ర జిల్లాల్లోనే కొత్త పరిక్షిశమలు ఏర్పాటవడం గమనార్హం.

ప్రస్తుతం చలికాలంలోనూ కరెంటు కోతలను అమలుచేస్తున్న సర్కారు పరిక్షిశమలకు పవర్ హాలిడే విషయంలో వివక్ష చూపుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల పవర్‌హాలిడే, ఒక రోజు వీక్లీ హాలిడే పేరుతో పరిక్షిశమలకు విద్యుత్ కోతలను అమలుచేస్తున్నది. ఇదే ప్రభుత్వం సీమాంధ్ర పరిక్షిశమలకు పవర్ హాలిడే మినహాయింపు ఇస్తున్న విషయాన్ని పారిక్షిశామికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నంలో పరిక్షిశమలకు పవర్‌హాలిడే ప్రశ్నే లేదు. కర్నూలులో రోజుకు రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తేనే ఆందోళనలకు పూనుకుంటున్నారు.

ఏపీఐఐసీ భూ పందేరం...
వాస్తవానికి ముఖ్యమంవూతిగా కాసు బ్రహ్మానందడ్డి హయాంలో ఆవిర్భవించిన పారిక్షిశామికవాడల్లో ఎక్కువ సంఖ్యలో చిన్నతరహా పరిక్షిశమలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో చిన్నతరహా పరిక్షిశమలకు సైతం కనీసం ఐదు ఎకరాల చొప్పున భూ కేటాయింపులుండగా, తదుపరి క్రమంగా వెయ్యి గజాలకు భూ కేటాయింపులు దిగజారాయి. పరిక్షిశమలకు భూ కేటాయింపుల అధికారం ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కట్టబెట్టాక నేరుగా భూములను విక్రయించడం ప్రారంభించింది.

ఏపీఐఐసీ ఫక్తు వ్యాపార ధృక్పథంతో వ్యవహరించడం వల్ల గత ఏడు సంవత్సరాలుగా ఇండవూస్టియల్ గ్రోత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలున్నాయి. గతంలో ఏదేని ఒక పరిక్షిశమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే సదరు పరిక్షిశమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాక భూమి సదరు పరిక్షిశమ పేరిట రిజివూస్టేషన్ చేసే పద్ధతి కొనసాగేది. పారిక్షిశామిక అవసరాలకు భూముల కేటాయింపులు ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకువచ్చాక ఏకంగా అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకోవడం, అవసరానికి మించి భూములను నామమావూతపు ధరకు భూముల విక్రయించడం పరిపాటిగా మారిపోయింది.

బహుజన పరిశ్రమ
- కత్తులు చేసిన కండలు మనవి
- చేనేతలో పైచేయి మన నేతన్న
- సాటిలేని చండూరు ఇత్తడి
- నవాబును గరీబు చేసిన యాంత్రీకరణ
- ప్రోత్సాహం కరువైన బడుగు పారిక్షిశామికవేత్త

హైదరాబాద్, డిసెంబర్ 20 () : నాడు రాజులు, రాజ్యాలు ఏవైనా వారు వాడే డెమాస్కస్ కత్తులు చేసింది మన వరంగల్ జిల్లా కమ్మరులే! ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి చూపెట్టింది మన పోచంపల్లి నేతన్నలే. పసిడి కన్నా మెండుగా ఇత్తడి కళారూపాలను ప్రపంచానికి చూపింది చండూరు బడుగులే. యాంత్రీకరణ తొలినాళ్ళలో పారిక్షిశామికరంగాన్ని ఆవిష్కరించిన నవాబులు నేడు గరీబులుగా మారారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగి ఆర్థిక స్థిరత్వంతో పారిక్షిశామికవేత్తలుగా నిలబడాల్సిన దళిత బహుజనులు సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంవూతాల ముందు కునారిల్లారు. అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు బడుగు వర్గాలకు చెందిన కొందరు పట్టుదలగా ముందుకు నెట్టుకొస్తున్నారు.

డెమాస్కస్ కత్తులు మనవే..
తెలంగాణ సమాజంలో రాజుల కాలం నుంచి దళిత బహుజనులే వృత్తి నిపుణులుగా ప్రపంచఖ్యాతి గడించారు. వందల ఏళ్ళు ఉప్పునీటిలో ఉన్నా తుప్పు పట్టని డెమాస్కస్ కత్తులను తయారు చేయడంలో వరంగల్ జిల్లా కమ్మరులు ప్రావీణ్యులు. వీరు తయారుచేసే కత్తులకు ఆనాడే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. మిశ్రమ ధాతు శాస్త్రం (మెటాలజీ)లో హైదరాబాద్ సంస్థానానికి పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కోహినూర్, హార్లాట్, పిట్స్, జాకబ్ లాంటి వజ్రాలను ఉత్పత్తి చేసింది ఇక్కడే.

అగ్గిపెట్టెలో చీర చరిత్ర మనదే..
చేనేత రంగానికి తెలంగాణ ప్రాంతాలైన సిరిసిల్ల, పోచంపల్లి, వరంగల్, భువనగిరి పెట్టింది పేరు. అగ్గిపెట్టెలో పట్టేంత పలుచని చీరను నేసిన ఘనత పోచంపల్లి నేతన్నలకే దక్కింది. వరంగల్‌కు చెందిన నేతన్న ఒకరు 1980 దశకంలో సినీ నటుడు శోభన్‌బాబుపై ఉన్న విపరీతమైన అభిమానంతో తన నేత చతురతతో శోభన్‌బాబు చిత్రపటం చద్దర్ (దుప్పటి)పై చిత్రించారు.

ఇత్తడికీ ప్రసిద్ది ఇక్కడే..
ఇత్తడి పరిక్షిశమకు నల్లగొండ జిల్లా చండూరు ప్రసిద్ధి. ఇప్పటికీ చండూరు ఇత్తడితోనే దేశంలోని ప్రముఖ దేవాలయాలకు తాపడాలు చేస్తున్నారు. పూజా పరికరాలతో పాటు దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు చండురులో తయారై విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి.

వ్యవసాయానికి ఊతం ఇచ్చిన పరిక్షిశమ
ప్రపంచంలో పారిక్షిశామికీకరణ జరగక ముందే తెలంగాణ గడ్డపై ఇలాంటి పరిక్షిశమలు చేతివృత్తులుగా వర్థిల్లాయి. యజమానులు వీరే, కార్మికులు వీరేగా చేతివృత్తుల మనుగడ కొనసాగేది. వీరు తయారు చేస్తున్న వస్తువుల్ని చూసి మరీ ఆకర్షితులై దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఆర్డర్లు ఇచ్చి చేయించుకునేవారు.

ఇది ఆనాటి పరిస్థితి. కాలక్షికమంలో బ్రిటీష్ వాళ్ళు దేశంలోకి వచ్చాక వారి పారిక్షిశామిక ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని దెబ్బతీశారు. ఆ సమయంలో యాంత్రిక ప్రభావం తన రాజ్యంపై కూడా పడే ప్రమాదం ఉందని ముందే ఊహించిన నిజాం నవాబు ఏకంగా యంత్ర పరిక్షిశమలనే తన రాజ్యంలోకి తీసుకువచ్చారు. ఆలా తీసుకువచ్చిన పరిక్షిశమలే ఇక్కడ వ్యవసాయరంగానికి, చేతి వృత్తులకు పోత్స్రాహకంగా మారాయి.

చేతివృత్తులు చెల్లా చెదురు
నిజాం లొంగుబాటు తదుపరి పుట్టుకువచ్చిన పెట్టుబడిదారులు చేతి వృత్తుల్లో నిష్ణాతులైన బడుగు వర్గాలను, వారి వృత్తులను పూర్తిగా అణిచివేశారు. చేనేత వృత్తిని దెబ్బతీసేందుకు పవర్‌లూమ్స్, కుమ్మరి వృత్తి దారులను దెబ్బతీసేందుకు ప్లాస్టిక్ పరిక్షిశమలు, ఇండియన్‌మేడ్ ఫారిన్ లిక్కర్‌తో గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు. జీ వివేక్, ఎం వెంక వంటి కొద్ది మంది దళిత బహుజన పారిక్షిశామికవేత్తలు నిలదొక్కుకోగలిగినా.. ఎంతో మంది ఔత్సాహికులు దూరంగానే ఉండిపోయారు. పరిక్షిశమలు పెట్టేందుకు ఆసక్తి చూపి సర్కారుకు పెట్టిన దరఖాస్తులు జిల్లా పరిక్షిశమల కేంద్రాలకే పరిమితం అవుతున్నాయని వరంగల్ జిల్లా కొడకండ్లకు చెందిన దళిత ఔత్సాహికుడు మురళి విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఆటో నడుపుకొంటున్నారు.

కావాలనే చేయూత నివ్వడంలేదు
ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాలను పరిక్షిశమల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో సీమాంద్ర ఉన్నత వర్గాలకు చెందిన పెట్టుబడిదారుల పరిక్షిశమలే వచ్చాయి. నైపుణ్యం ఉన్నా ఇక్కడి కార్మికులకు అవకాశాలు ఇవ్వలేదు. ఫలితంగా ఒక తరం ఆర్థికంగా చితికిపోయింది.
-గంప చంద్రమోహన్, పారిక్షిశామిక వేత్త



కనుమరుగైన ఖండాంతర ఖ్యాతి
-ఆసియాలో భారీ వస్త్ర పరిక్షిశమ..
-ఇప్పుడు మొండిగోడలతో మిగిలింది..
-సర్‌సిల్క్ మిల్లు మూత పడి 26 ఏళ్లు

20--adb-2b-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( - కాగజ్‌నగర్) తెలంగాణలో భారీ పరిక్షిశమగా విరాజిల్లుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఖండాంతర ఖ్యాతి గాంచిన స్థానిక సర్‌సిల్క్ మిల్లు 26 ఏళ్ల క్రితం మూతపడింది. మిల్లు ఆస్తులు అమ్మేయగా మిగిలిన మొండిగోడలతో చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఆసియా ఖండంలోనే అత్యంత భారీ పట్టు వస్త్ర పరిక్షిశమగా పేరొందిన ఇది ముడి సరుకు కొరత నెపంతో మూతపడింది. 40వ దశకం మొదట్లో నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తపేట కుగ్రామంలో సర్‌సిల్క్ మిల్లును ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ - హైదరాబాద్ రైల్వే మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంది. ఈ పరిక్షిశమకు తోడుగా కాగితపు పరిక్షిశమను కూడా నిజాం నవాబు పక్క పక్కనే ఏర్పాటు చేయడంతో కొత్తపేట కుగ్రామం కాస్తా కాగజ్‌నగర్‌గా గుర్తింపు పొందింది.

నిజాం సంస్థానంలో ఇంజనీరుగా పనిచేసిన లియాఖాత్ అలీ ఖాన్ కృషితో రూ.150 కోట్ల పెట్టుబడితో సర్‌సిల్క్ మిల్లు మొదలైంది. 1950లో మిల్లు నిర్వహణ ప్రముఖ పారిక్షిశామికవేత్త బిర్లా యాజమాన్యంలోకి మారింది. 2500 మంది పర్మినెంట్ కార్మికులు, సిబ్బంది, 1500 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 6వేల మందికి జీవనోపాధి కల్పించిన ఈ మిల్లు 1984లో యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఆల్కహాల్, కరెంట్ కొరతను సాకుగా చూపుతూ లేఆఫ్ విధించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1985 ఏప్రిల్ 26న అక్రమ లాక్‌ఔ్ తో మూతపడింది.

20--adb-2a-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కార్మికుల ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల తర్వాత ప్రయోగాత్మకంగా కార్మిక సహకార పద్ధతిలో మాజీ మంత్రి కేవీ కేశవులు, ప్రైవేటు ప్రమోటర్లు, ఐడీబీఐ రుణంతో 1994 ఏప్రిల్ 16న మిల్లు పునఃవూపారంభింపజేసినప్పటికీ యాజమాన్యం అసమర్థత, అవినీతి కారణంగా ఏడు నెలలకే మరోసారి మూతపడింది. ఆ తర్వాత మిల్లు తెరిచే ఏర్పాటు జరుగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మిల్లు శాశ్వతంగా మూతపడటంతో మిల్లులో పనిచేసే కార్మికులు, సిబ్బంది ఉపాధి కరువై, పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిల్లులో అధికారులుగా అధికారం చెలాయించిన ఉద్యోగులు పేపర్ బాయ్‌లుగా, ట్యూషన్ మాస్టర్లుగా మారాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.

కార్మికులు ఉద్యోగాలు పోయి, పొట్టచేతబట్టుకొని సూరత్, బీమాండి, ముంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్ తదితర నగరాల్లోని వస్త్ర పరిక్షిశమల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల తదితర పట్టణాలకు వలస కూలీలుగా, టీ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడికీ పోలేనివారు స్థానిక దుకాణాల్లో గుమస్తాలుగా పని చేయడం, పండ్ల వ్యాపారాలు చేసుకుటూ బతుకుతున్నారు. ఉపాధి లేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కుటుంబాలను సాకలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.

వ్యక్తులుగా కాదు.. శక్తులుగా..
-తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండలి(టెక్కి) ఏర్పాటు
- ఏకతాటిపైకి తెలంగాణ పారిక్షిశామిక వర్గం
- తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వంపై చర్చ
- చేయల్సిన కృషిపై మార్గనిర్దేశనం

హైదరాబాద్, డిసెంబర్ 20 (టీ న్యూస్): తెలంగాణ కోసం తాము సైతం అంటూ పారిక్షిశామిక వర్గం ముందుకు వచ్చింది. 55 ఏళ్ల సమైక్య పాలనలో పారిక్షిశామిక వాడలను చిదిమేసిన పాలకుల దుర్నీతికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. యజమానులేగానీ వ్యక్తులుగా కాదు.. శక్తులుగా ముందుకు వస్తున్నారు. ఈ రంగంలో పాలక పక్షం వివక్షను బయటి సమాజానికి తెలియజెప్పడంతో పాటు తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాలని భావించిన పరిక్షిశమల యాజమానులు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి)ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగం కుంటు పడుతుందనే అపోహలను పారదోలేందుకు ప్రాంత పారిశ్రామిక వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న పారిక్షిశామిక వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం టెక్కి అంటున్నారు. టెక్కి ఆవిర్భావ మహాసభ మసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న హోటల్ గోల్కొండలో బుధవారం జరగనుంది. పెన్నార్ ఇండవూస్టీస్ చైర్మన్ జే నృపేందర్‌రావు అధ్యక్షతన జరిగే టెక్కి ఆవిర్భావ సమావేశంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రారంభోపన్యాసం చేస్తారు.

తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వం కోసం ఏం చేయాలనే అంశంపై నృపేందర్‌రావు మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ పారిక్షిశామిక విధానం ఏవిధంగా ఉండాలనేదానిపై పత్రాలు, ప్రజెం ఇవ్వనున్నారని టెక్కి అధ్యక్షుడు ఎం వెంక తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంవూతాలున్నా తెలంగాణలో పారిక్షిశామిక రంగ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపుడ్డి, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎమ్మెల్సీ కమలాకర్‌రావులు పాల్గొంటారు.


Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

 
Take By: T News 

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP