Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, December 22, 2011

తెలంగాణ పరిక్షిశమల్ని కాపాడుకుందాం - T industry body launched ( TEECI) Telangana Chambers of Commerce and Industry

 (TEECI Means - Telangana Chambers of Commerce and Industry)

సీమాంవూధుల దోపిడీని అరికడుదాం: వక్తల పిలుపు
తెలంగాణ యవనికపై ‘టెక్కి’ ఆవిర్భావం
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
తెలంగాణను విదర్భతో ముడిపెట్టొద్దు: పేర్వారం
తెలంగాణ ప్రజలు పాలేర్లుగా మారాల్సి వస్తోంది: విపకాశ్
టెక్కీ ఆవిర్భావం శుభపరిణామం: అల్లం నారాయణ

tred-talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 21 ():‘‘భారత్ హెవీ ఎలక్షికికల్స్ లిమిటెడ్‌లో ఓ ఉన్నత స్థాయి ఉద్యోగి (సీమాంధ్ర వ్యక్తి) తన పలుకుబడిని ఉపయోగించి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 3,500 మందికి ఉద్యోగాలు కల్పించారు. దీంతో స్థానిక తెలంగాణ యువత తమ ఉపాధి అవకాశాల్ని కోల్పోవాల్సి వచ్చింది.’’

‘‘బూర్గుల రామకృష్ణారావు (తెలంగాణ వ్యక్తి) సమీప బంధువు ఒకరు పరిక్షిశమ స్థాపించేందుకు తన భూమిని తనఖా పెట్టి బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా, బ్యాంకు మొండిచేయి చూపింది. చివరకు విసుగెత్తిన ఆయన భూమిని ఓ సీమాంవూధుడికి విక్రయించాడు. తెలంగాణ వ్యక్తికి రుణం ఇచ్చేందుకు అంగీకరించని ఆ బ్యాంకు సీమాంధ్ర వ్యక్తికి అదే భూమిపై రెండు నెలల్లో రుణం మంజూరు చేసింది.’’

‘‘తెలంగాణకు చెందిన పారిక్షిశామికవేత్త ఒకరు విశాఖపట్నం సమీపంలో సిమెంట్ పరిక్షిశమ స్థాపనకు ప్రయత్నించి అనువైన స్థలం కోసం సంప్రదించగా ఏపీఐఐసీ తాను సేకరించిన ధరకంటే 10 రెట్లు అధికంగా ధరకు భూమిని కేటాయించింది. ఆ స్థలంలోనూ సిమెంట్ పరిక్షిశమ ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల పాటు సీమాంధ్ర నాయకులు, పారిక్షిశామిక వేత్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చివరకు మరో స్థలంలో ఆయన పరిక్షిశమ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.’’

... ఇవి తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టీఈసీసీఐ-టెక్కి) ఆవిర్భావ సమావేశంలో పలువురు వ్యక్తులు ఉదహరించిన సంఘటలు. సీమాంవూధుల పాలనలో తెలంగాణ పారిక్షిశామిక రంగం ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, అణచివేతకు సంబంధించిన ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇలా రంగాల్లో దోపిడీకి గురైన తెలంగాణ సమాజం ఉత్తేజితమై దోపిడీదారులపై తిరుగుబావుటా ఎగురవేస్తున్న క్రమంలో తాజాగా తెలంగాణ పారిక్షిశామిక వేత్తల సైతం తమ పోరాటానికి అంకురార్పణ చేశారు. ఒకప్పుడు మూడు పువ్వులు ఆరుకాయలుగా పరిఢవిల్లిన తెలంగాణ పారిక్షిశామిక రంగం దశల వారీగా దెబ్బతినడం వెనుక ఉన్న సీమాంవూధుల కుట్రను ఎండగడుతూ, పునురుజ్జీవం దిశగా అడుగులు వేస్తోంది. 

తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య వేత్తలకు ప్రోత్సాహం అందించి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే ధ్యేయంగా టెక్కీ ఆవిర్భవించింది. ఈ కార్యక్షికమం బుధవారం నగరంలోని గోల్కొండ హోటల్‌లో అట్టహాసంగా జరిగింది. ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ సీహెచ్ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. టెక్కి వెబ్‌సైట్‌ను పేర్వారం రాములు ఆవిష్కరించారు. పెన్నార్ ఇండవూస్టీస్8 చైర్మన్ జె.ఉపేందర్‌రావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్షికమంలో టెక్కి అధ్యక్షుడు ఎం ఉపాధ్యక్షులు వై.జైహింద్ రెడ్డి, వేదకుమార్, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ, విపకాశ్, ప్రముఖ రాజకీయ నాయకులు కమలాకర్, ప్రొ.రమేష్, ఇండవూస్టియలిస్ట్ బ్రహ్మయ్య, జె.బాపుడ్డి తదితరులు మాట్లాడారు.

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: హనుమంతరావు
చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు, పద్మభూషణ్ హనుమంతరావు అభివూపాయపడ్డారు. ఆర్థిక ప్రగతిని సాధించడం అనేది భారత ఆర్థిక ప్రణాళికలో కీలకాంశం అన్నారు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచీ అమలుచేస్తున్న ప్రణాళికల్లో నిర్ధేశించుకున్న లక్ష్యాలతో పోలిస్తే సాధించిన ప్రగతి తక్కువగానే ఉందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత అభివృద్ధిలో వేగం పుంజుకున్నప్పటికీ పేదరిక పెరిగారనారు. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు పారిక్షిశామికవేత్తలకు మంచి ఊపునిచ్చాయని పేర్కొన్నారు. 

జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్8గఢ్ రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఆయా ప్రాంతాల అభివృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. ఈ అభివృద్ధి మాతృ రాష్ట్రాల(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధికంటే ఎక్కువుందన్నారు. రాష్ట్రాల ఏర్పాటులో ఇంతకు ముందు రాష్ట్రాలు సైతం చిన్నవిగా మారాయని తెలిపారు. తద్వారా ఈ రాష్ట్రాల్లోనూ(బీహార్, ఉత్తరవూపదేశ్, మధ్యవూపదేశ్) అభివృద్ధి రేటు పెరిగిందన్నారు. గత ఐదేళ్లలో బీహార్ సాధించిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు. మహరాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ కారణంగానే విదర్భ, తెలంగాణకు పోలికుందని పలువురు భావిస్తారు, కానీ ‘విదర్భ నిరాదరణకు గురైతే తెలంగాణ దోపిడీకి గురైందని’ ప్రొ.జయశంకర్ ఒక చక్కని వివరణ ఇచ్చారని హనుమంతరావు గుర్తుచేశారు. రాష్ట్రంలోని మొత్తం పరిక్షిశమల్లో 62 శాతం తెలంగాణ ప్రాంతంలో ఉండగా, వాటిలో 75శాతం సీమాంధ్ర వ్యక్తులకు చెందినవేనన్నారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల్లోనూ తెలంగాణ వారికి 25శాతం కూడా దక్కలేదన్నారు.

రక్తం మరిగిపోతోంది: పేర్వారం
అనాదిగా తెలంగాణ అణచివేతకు గురికావడం ఒకెత్తయితే 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం పరిణామాలతో అంతకు మించిన అన్యాయం జరుగుతోందని రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్8 పేర్వారం రాములు అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి చిదంబరం, ప్రధాన మంత్రి తదితరులు ఇస్తున్న స్టేట్‌మెంట్లు చూస్తుంటే మాలాంటి రిటైర్డ్ ఉద్యోగులకూ రక్తం మరిగిపోతోంది’ అని ఘాటుగా స్పందించారు. ‘ఆంవూధవూపదేశ్ ఆవిర్భావానికి వ్యతిరేకంగా 1952లోనే (నేను రెండో తరగతిలో ఉన్నా) ఈ ప్రాంతంలో వ్యతిరేకత ఉంది..’ అని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక డిమాండ్లకు పోలిక లేదన్నారు. తెలంగాణను విదర్భతో ముడిపెట్టడం తగదని పేర్కొన్నారు. తెలంగాణలో పారిక్షిశామిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని, సీమాంవూధుల పెత్తనం మొదలయ్యాకే ఈ ప్రాంతం దోపిడీకి గురైందన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.

అవినీతిలో ఎందెందు వెతికినా సీమాంవూధులే: కేటీఆర్
దేశంలో జరిగిన దాదాపు అవినీతి కుంభకోణాల్లో సీమాంవూధుల పాత్ర ఉండటం వారి దోపిడీ విధానానికి నిదర్శనమని టీఆర్‌ఎస్8 ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అన్న నానుడిని వీరు నిజం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నిజాం షుగర్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్8 రాజశేఖరడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి వైఎస్8 తాను అధికారంలోకి వచ్చాక పూర్తి భిన్నంగా వ్యవహరించి నిజాం షుగర్స్‌ను కోలుకోలేని స్థితికి వచ్చేలా చేశారని మండిపడ్డారు. తెలంగాణ భూములను కొల్లగొ చంద్రబాబు ప్రభుత్వం కిటీకీలు తెరిస్తే కాంగ్రెస్8 ఏకంగా తలుపులే తెరిచిందన్నారు.

అభివృద్ధికంటే దోపిడే అధికం: ప్రకాశ్
సీమాంవూధులు హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్ధం అని ప్రముఖ తెలంగాణవాది విపకాశ్ అన్నారు. ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావానికి ముందు ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ ఎన్నో రెట్లు అభివృద్ధి చెంది ఉందని గుర్తుచేశారు. తమకు అనువైన ప్రాంతంగా భావించి తెలంగాణకు వచ్చిన సీమాంవూధులు అంచెలంచెలుగా ఇక్కడి వనరుల్ని దోచుకున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వారుపెట్టిన పెట్టుబడులకన్నా ప్రభుత్వం ద్వారా పొందిన రాయితీలు, ప్రయోజనమే అధికమన్నారు. చర్లపల్లి పారిక్షిశామికవాడలో ఉన్న సుమారు 500 కంపెనీల్లో 300 వరకు సీమాంవూధుల ఆధీనంలోనివే అయినప్పటికీ, ఆయా కంపెనీల పెట్టుబడులు మిగతా వాటితో పోలిస్తే 10శాతం కూడా లేవని చెప్పారు. కేవలం ఫార్మా రంగంలోనే సీమాంవూధులు అధికంగా పెట్టుబడులు పెట్టారన్నారు. ఈ ప్రాంతంలో నెలకొల్పిన ఫార్మా కంపెనీల వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. పరిక్షిశమల కోసం స్థలాల్ని కోల్పోయిన తెలంగాణ ప్రజలు సొంత భూముల్లో పాలేర్లుగా మారాల్సిన దుస్థితికి వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విధ్వంసం నుంచి పునరుజ్జీవనం దిశగా: అల్లం
అడుగడుగునా విధ్వంసానికి గురైన తెలంగాణ పారిక్షిశామిక, వాణిజ్య రంగాన్ని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ‘నమస్తే తెలంగాణ’ సంపాదకులు అల్లం నారాయణ అభివూపాయపడ్డారు. సీమాంవూధులు ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ సమాజాన్ని దోపిడీకి గురిచేశారన్నారు. తొలుత సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ దోపిడీ ఆరంభమైందని వివరించారు. ఒకప్పటి మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ పవర్ ప్రాజెక్టు ప్రస్తుతం ఐమాక్స్ శిథిలాల కిందికి చేరిపోయిందన్నారు.

మీడియా హౌజ్‌లూ అదే దారిపట్టాయని చెప్పారు. విదర్భ వెనుకబడిన ప్రాంతం అయితే తెలంగాణ దోపిడీకి గురైన ప్రాంతం అని అన్నారు. సీమాంవూధుల విచ్చలవిడి దోపిడీతో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో నష్టపోయిందని, నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి సంస్థపూన్నో ఖాయిలా పడ్డాయని పేర్కొన్నారు. ఐడీపీఎల్ మూతపడిన వెంటనే చౌటుప్పల్ పరిసరాల్లో సీమాంవూధులకు చెందిన సుమారు 40ఫార్మా కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ పారిక్షిశామిక రంగం ఆర్థిక స్వావలంభన సాధించి నిలదొక్కుకోవడంలో భాగంగా టెక్కీ ఆవిర్భావం తొలి అడుగని ఆయన అన్నారు.

Take By: T News

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP