Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, October 25, 2011

కంగుతిన్న సర్కార్ కరెంటోళ్ళ సమ్మెతో..; షాక్..షాక్

- జేఏసీ నేత రఘు దీక్షకు మద్దతు
- జనంతో కిటకిటలాడిన విద్యుత్ సౌధ
- తరలివచ్చి అండగా నిలిచిన ఉద్యమకారులు
- నేడు దీక్ష విరమణ

eetala-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, అక్టోబర్ 24 : విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
కో ఆర్డినేటర్ కే రఘు చేపట్టిన 72 గంటల దీక్షకు విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఈ దీక్ష తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని మరింతగా రగిలించి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. సకల జనుల సమ్మెలో ప్రధాన భూమిక పోషిస్తున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మధ్య చీలిక తీసుకువచ్చే ఇంధనశాఖ ఉన్నతాధికారుల కుట్రలకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష ఆశించినదానికంటే ఎక్కువగా సత్ఫలితాలనందిస్తోంది. వివిధ పక్షాల, ప్రజాసంఘాల నేతలు, ప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటించి ఈ వేదికగా తెలంగాణ సమాజానికి తమ అభివూపాయాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగంలో ఉద్యోగులు ఈ విధంగా సుదీర్ఘ దీక్షకు పూనుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సమ్మె విరమణ అంశంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో కాకుండా, కేవలం ఉద్యోగసంఘాలతోనే చర్చలు జరపాలని విద్యుత్ ఉన్నతాధికారులు కుట్రపూరితంగా ఉద్యోగుల మధ్య విభజన తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు రఘు దీక్షతో విఫలమయ్యాయి. ఖైరతాబాద్ విద్యుత్‌సౌధలో జేఏసీ నేత రఘు చేపట్టిన 72 గంటల దీక్షా విజయవంతమయ్యేందుకు జేఏసీ నేతలు ఏ జానయ్య, మోహన్‌డ్డి, స్వామిడ్డి, ముస్తాక్ తదితరులు ముందుకొచ్చారు. దీక్షాశిబిరం గత రెండు రోజులుగా తెలంగాణవాదులకు ప్రధాన కేంద్రంగా మారింది. దాంతో రఘు దీక్షను భగ్నం చేసేందుకు సర్కారు పన్నిన కుయుక్తులు సైతం విఫలమయ్యాయి. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు రఘు తన మూడురోజుల దీక్షను విరమించనున్నారు.

gaddar-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త రఘు 72 గంటల నిరాహార దీక్షలో భాగంగా మూడవ రోజు ఉదయం 9గంటల నుంచే పరామర్శల తాకిడి పెరిగింది. తెలంగాణలోని పది జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. జిల్లాల నుంచి తరలివచ్చిన వే మందితో విద్యుత్‌సౌధ ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. విద్యుత్ ఉద్యోగులతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ జేఏసీల నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు రాజకీయ నాయకులు కూడా భారీగా తరలిరావడంతో జనంతో నిండిపోయింది. సెక్యూరిటీగా ఉన్న పోలీసులు విద్యుత్‌సౌధకు ఒకవైపున ఉన్న గేట్‌ను పూర్తిగా మూసివేశారు. విద్యుత్‌సౌధ కార్యాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు సాయంత్రం వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గద్దర్ పాటలతో, సంధ్య ప్రసంగం అందరినీ ఉర్రూతలూగించింది.

కాంగ్రెస్ నాయకులు కేశవరావు వచ్చిన సందర్భంలో ఉద్యోగులు వ్యతిరేకంగా నినాదాలు చేయగా నిర్వాహకులు వారిని శాంతింపజేశారు. ఈ కార్యక్షికమంలో విద్యుత్ ఉద్యోగుల ఎంపీటీసీఎల్ చైర్మన్ తిరుపతిడ్డి, కో-కన్వీనర్ మోహన్‌డ్డి, సీపీడీసీఎల్ చైర్మన్ జానయ్య, ప్రజావూఫంట్ నాయకుడు వేదకుమార్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్, డాక్టర్స్ జేఏసీ కన్వీనర్ నర్సయ్య, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి మల్లికార్జున్, న్యూ డెమోక్షికసి నాయకురాలు ఝాన్సీ, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు అమానుల్లాఖాన్, ఆర్టీసీ జేఏసీ నేత సలీం, వివిధ జిల్లాల ప్రతినిధులు వెంకట్‌నర్సింహాడ్డి, కరెంట్‌రావు, జగన్, యాదగిరి, నిత్యకళ్యాణం, లక్ష్మినారాయణ, పూర్వం చందర్‌రావు, లక్ష్మణ్, కృష్ణయ్య తదితరులు ప్రసంగించారు.

పత్రికలు, మీడియా ఏ పక్షం?
ప్రజా ఉద్యమంలో పత్రికలు, మీడియాలు ఏ పక్షం వహిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి సీమాంధ్ర మీడియా, పత్రికలు దుష్ర్పచారం సాగిస్తున్నాయి. ఉద్యమంవల్ల విద్యార్థుల చదువులు నాశనం అవుతున్నాయని, పేద ప్రజల బతుకు ఆగమౌతుందని, సింగరేణి కార్మికుల సమ్మె వల్ల తెలంగాణ రైతుల పంటలు ఎండుతున్నాయని మొసలి కన్నీరు కార్చడం సీమాంధ్ర మీడియా చేస్తున్న దగా, మోసానికి నిదర్శనం. ఈ సీమాంధ్ర పత్రికలు అసలు దీనికి కారణమైన ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిపోయి, ఉద్యమాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అద్భుతమైన ఉద్యమం సాగుతుంటే, తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొంటుంటే కలాలను ఎవరిపై ఎక్కుపెట్టారు?

మహిళలను రాజ్యాంగ విరుద్ధంగా రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన పాలకులను, పోలీసులను ఎందుకు ప్రశ్నించలేదు? శవాల మీద ప్రమాణాలు చేసిన మంత్రులు ప్రజాఉద్యమంలో కలిసి రావాల్సిన మంత్రులు మాట మరిచి ముఖ్యమంవూతికి సేవలు చేస్తున్న తెలంగాణ ప్రాంత మంత్రులను ప్రజపూవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. చిదంబరం, ప్రణబ్‌లకు మధ్య ఏర్పడ్డ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి సమయం తీసుకున్న సోనియాగాంధీకి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షపై చర్చించడానికి సమయం దొరకడం లేదా?

ద్రోహుపూవ్వరో తేలింది
kodanda-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసకలజనుల సమ్మె తెలంగాణ ద్రోహులు ఎవ రో బయటపెట్టింది. రాష్ట్ర ఏర్పాటు పట్ల ఎవరి వైఖరి ఏమిటో సకలజనుల స మ్మె స్పష్టం చేసింది. సమ్మె తెలంగాణ సమాజాన్ని మాత్రం ఐక్యంగా చేయగలిగింది. ఇది గొప్ప విజ యం. ఇంతకాలం మౌనం గా ఉన్న కేంద్ర ప్రభుత్వం చర్చలు, కోర్ కమిటీల సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకోకతప్పదన్న స్థాయికి వచ్చింది. సమ్మె తగ్గుముఖం పడుతుందని ఎవరూ అధైర్యపడొద్దు. సమ్మె అనేక రూపాలుగా రూపాంతరాలు చెందుతూ రోజురోజుకూ ఉధృతం అవుతుంది. ఎవరికీ ఇబ్బంది కావద్దని కొంత విరామం ఇచ్చాం.

అవసరమైతే ఏ క్షణమైనా రావడానికి సింగరేణి, ఆర్టీసీ, ఉపాధ్యాయులు వంటి వర్గాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు నలుగురి కోసం సహాయపడే మనసత్వం ఉన్నవారే తప్ప కుట్రలు, కుతంవూతాలకు పాల్పడేవారు కాదు. విద్యుత్ ఉద్యోగులు ధైర్యంగా ఉండాలి. మీ వెంట నాలుగున్నర కోట్ల ప్రజానీకం ఉందనే విషయాన్ని గమనించాలి. జేఏసీ ఎప్పటికీ మీ వెంటే నిలబడుతుంది. మంగళవారం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో చర్చించి ఒక కార్యాచరణను ప్రకటిస్తాం.



Take By: T News


Tags: Telangana News, Chiranjeevi on Telangana, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, NIC meet, Telangana agitation, statehood demand, JAC,  bandh in Telanagana, Sangareddy, CM, Rajanarsimha, TEJAC

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP