Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, June 28, 2012

గోప్యజ్ఞానం కాల్‌యుగ! కాల్‌లిస్టుల సంచలనం క్యా హై?


వ్యక్తుల ప్రైవసీ మాటేమిటి?.. మీడియా పాత్రేమిటి? చట్టం చుట్టరికం ఎందాక?
- కాల్‌లిస్టుల వ్యవహారంలో సందర్భాన్ని బట్టి నేరం తీవ్రత పెరుగుతుందా?
- బోఫోర్స్ నుంచి తెహల్కా దాకా.. మారుతూ వచ్చిన మీడియా మాటేమిటి?
- రెండుగా చీలిన రాష్ట్ర మీడియాలో ఏది సత్యం.. ఏదసత్యం?

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన మొబైల్‌లో ఎవరితో మాట్లాడారు క్లాస్‌మేట్ చంద్రబాల ఎవరికి ఫోన్ చేశారు.. వారి మొబైల్ కాల్‌లిస్టులో ఎవవరి నంబర్లున్నాయి ఇది తెలుసుకోవాలంటే చట్టవూపకారం తెలుసుకోవచ్చా.. తెలుసుకోవచ్చుననుకుంటే అది వారి ప్రైవసీకి భంగం కలిగించినట్టు కాదా?.. వారే కాదు, ఎవరి నంబర్ల నుంచి కాల్స్ ఎటు వెళ్లాయో ఏ సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది? పోలీసు అధికారుల స్థాయిలో ఇది సాధ్యమే అయినా, ప్రైవేటు వ్యక్తులు దొడ్డిదారిన ఆ పని చేస్తే ఎలా? అసలు వ్యక్తుల ప్రైవసీకి అర్థమే లేదా?.. ఒకవేళ ఉన్నతస్థాయి వ్యక్తులకు సంబంధించి ఈ సమాచారాన్ని తెలుసుకుంటే అది అధికార రహస్యాల చట్టం కింద తీవ్రమైన నేరం అవుతుందా?

ఆధునిక సాంకేతిక పరిజ్ఖానంతో మీడియా బహుదా విస్తరించిన కాలంలో ఉన్నాం. కాలంతో పాటు కొత్త ప్రశ్నలూ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే కాల్‌లిస్టుల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం ఒకవైపు, దానిని అందిపుచ్చుకొని ప్రైవసీ పరిధిని ఛేదించుకొని సమాచార సేకరణ దిశగా పరుగులు పెడుతున్న మీడియా మరోవైపు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు పెను తుఫాన్‌గా మారిన కాల్‌లిస్టుల వ్యవహారంపై.. ఇప్పటికే రాష్ట్రంలో రెండుగా విడిపోయిన మీడియాను గమనిస్తున్నవారికి, ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కాల్‌లిస్టులను సేకరించి నేర పరిశోధన చేసిన ఉదంతాలు ఒక ఎత్తయితే, ఇదే కాల్‌లిస్టుల వ్యవహారంలో ఏకంగా ఓ జర్నలిస్టుపై కేసులు నమోదు కావడం ఇప్పుడు తాజా పరిణామం. జాతీయ స్థాయిలో బోఫోర్స్ కుంభకోణం మొదలుకొని గత దశాబ్దంలోని తెహల్కా స్టింగ్ ఆపరేషన్ వరకు నిజాన్ని నిగ్గు తేల్చేందుకు మీడియా కొత్త పుంతలు తొక్కింది.

మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు ఆనాడు చట్టబద్ధత లేకపోయినా, మారిన పరిస్థితుల్లో ఆ ఆపరేషన్‌ను కోర్టులు కూడా ఆమోదించాయి. అదే క్రమంలో ఇప్పుడున్న మార్గాలను దాటి జర్నలిస్టులు సమాచార సేకరణకు పూనుకుంటే చట్టపరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఇప్పుడు రాష్ట్రంలో కాల్‌లిస్టుల వివాదం ముందుకు తెచ్చింది. గతంలో మద్దెలచెరువు సూరి హంతకుడు భాను అజ్ఞాతంలో ఉన్నపుడు అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్టును మీడియా ప్రతినిధులే బయటపెట్టారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన కాల్‌లిస్టును బయటపెట్టడమూ సంచలనమే అయింది. గుంటూరు రూరల్ ఎస్పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మాట్లాడారంటూ ఓ వ్యక్తి కాల్‌లిస్టుతో కోర్టుకెక్కడమూ జరిగింది. అయితే, ఆ కేసులు వేరు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసు తీవ్రత వేరు కేసు తీవ్రతను బట్టి కాల్‌లిస్టుల సేకరణలో నేరం తీవ్రత కూడా మారుతుందా అనేది ఇక్కడ ప్రశ్నగా నిలిచింది. జర్నలిస్టు యాదగిరిరెడ్డి అక్రమ మార్గంలో జేడీ కాల్‌లిస్టును సేకరించారు. అది నేరమే కావచ్చు. అంతమాత్రాన అధికార రహస్యాల చట్టం కింద పరిగణించేంత నేరమా అనేది మరో ప్రశ్న.

హైదరాబాద్, జూన్ 27 () సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...ఆయన క్లాస్‌మేట్ వాసిడ్డి చంద్రబాల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టుల వ్యవహారంలో ఇటు మీడియా, అటు దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వైఖరిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ అక్రమాస్తులు, కంపెనీల కేసుల నేపథ్యంలో ఇప్పటికే రెండుగా విడిపోయిన మీడియా రంగం తమకు ఆసక్తి ఉన్న కోణాల్లో మాత్రమే వార్త కథనాలను వండివారుస్తూ మొదలుపెట్టిన ‘మీడియా యుద్ధం’ చివరకు జర్నలిస్టుల విధులనే ప్రశ్నార్థకం చేసే దశకు చేరుకుంది. వేర్వేరు కుంభకోణాలు...కేసులకు సంబంధించి వివరాలు కావాల్సి వచ్చినపుడు మీడియా ప్రతినిధులు వేర్వేరు మార్గాల్లో సమాచారాన్ని సేకరించటం పరిపాటి. ఆనాటి బోఫోర్స్ కుంభకోణం మొదలుకుని రాష్ట్రాన్ని కుదిపేసిన మాజీ గవర్నర్ తివారీ రాసలీలల వ్యవహారం...మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న భాను సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ వరకు జర్నలిస్టులు తమకు వీలైన మార్గాల్లోనే సమాచారాన్ని సంపాదించారు.

ప్రయివేట్ వ్యక్తులు ఐపీఎస్ అధికారుల మొబైల్‌ఫోన్ల కాల్‌లిస్టులను సేకరించి బయటపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఉదంతంలోనూ జర్నలిస్టులపైగానీ.పయివేట్ వ్యక్తులపైగానీ కేసులు నమోదు కాలేదు. కానీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంగా మారిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ...వాసిడ్డి చంద్రబాల సెల్‌ఫోన్ల కాల్‌లిస్టుల ఉదంతంలో మాత్రం మీడియా ప్రతినిధి యాదగిరిడ్డిపై కేసులు నమోదయ్యాయి.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా సదరు జర్నలిస్టుపై కేసులు పెట్టటం. యాదగిరిడ్డి చేసింది తప్పే...అయితే ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదని న్యాయ నిపుణులు చెబుతుండగా, ఓ మీడియా ప్రతినిధిగా రాష్ట్రం మొత్తం మీద చర్చనీయంగా ఉన్న కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వృత్తి ధర్మంలో భాగంగానే అతను చంద్రబాల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సేకరించాడని జర్నలిస్టు సంఘాల నేతలు అంటున్నారు. కాగా, చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించేందుకు సదరు జర్నలిస్టు అనుసరించిన విధానం ఖచ్చితంగా తప్పేనని సీనియర్ ఐపీఎస్ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తమిళనాడు తరహాలో పార్టీలవారీగానో...సొంత ప్రయోజనాల కోసమో మీడియా రెండుగా విడిపోవటం వల్ల ఏ అంశంలోనూ ప్రజలకు పూర్తి నిజాలు తెలియకుండా పోతుండటంతోపాటు ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

అందరి దృష్టి...
హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జగన్ కంపెనీలపై కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మేళ్లు పొందిన సంస్థలు, వ్యక్తులే జగన్‌కు చెందిన కంపెనీల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని సీబీఐ అధికారులు దర్యాప్తులో తేల్చారు. అంతా క్విడ్-వూపో-కో పద్ధతిలోనే జరిగిందంటూ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో అభియోగాలు కూడా మోపారు. జగన్‌తోపాటు ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్‌ఛైర్మన్ విజయసాయిడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌లను అరెస్టు కూడా చేశారు. ఆరేళ్లపాటు ముఖ్యమంవూతిగా ఉన్న వై.ఎస్.రాజశేఖర్‌డ్డి కుమారుడు జగన్‌కు సంబంధించిన కేసు కావటంతో దీనిపై మొదటి నుంచి అటు మీడియా ఇటు ప్రజల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రెండుగా విడిపోయిన మీడియాలో ఒకరు అంతా చట్టవూపకారమే జరిగిందంటూ వాదనలు వినిపిస్తుండగా మరొకరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలాది కోట్ల ప్రజాధనం లూటీ చేశారంటూ వరుస కథనాలను ఇ స్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

ఆరోపణలతో దుమారం...
సరిగ్గా దీనిపైనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మొదటి నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఉద్దేశపూర్వకంగా మీడియాలో కొందరికి లీకులు ఇస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ...జగన్ ప్రతిష్టను దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఉప ఎన్నికల సమయంలో కావాలని జగన్‌ను దెబ్బతీసేలా లీకులు ఇస్తూ, జగన్ వర్గం మరింతగా బలపడకుండా సీబీఐ అధికారులు కుట్ర పన్నారనేది వారి ప్రధాన ఆరోపణ. జగన్ అరెస్టు, ఇతరత్రా కథనాలు ఎంతో ముందుగా లీక్ కావడంతో కూడా ఎన్నికల సమయంలో తమ పార్టీకి ఎంతో నష్టంగా వారు భావిస్తున్నారు.

ఇలాంటి లీక్‌లు రానట్లయితే ఇంకా కొందరు నేతలు తమ పార్టీలోకి వచ్చే వారని రెండు కీలక పార్టీల నుంచి వలసలు ఇంకా పెరిగేవని, కానీ సీబీఐ లీక్‌ల వల్లనే ఇవి కొంతవరకు తగ్గినట్లుగా కూడా జగన్ వర్గం వారు వాదిస్తూ, ఇది కుట్రలో భాగమనే విధంగా విమర్శలు చేస్తూ, లక్ష్మీనారాయణను టార్గెట్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ప్రభుత్వంలో సలహాదారునిగా పనిచేసిన ఓ నాయకుని బంధువు లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్టును సంపాదించే ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం నాందేడ్‌లోని ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీని ఆశ్రయించారు. సదరు ఏజన్సీ నిర్వాహకులు నాందేడ్ ఎస్‌పీ సహాయంతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించి దానిని అతనికి అందచేసినట్టుగా పోలీసులు అంతర్గతంగా జరిపిన విచారణలో వెల్లడైంది. ఆ తరువాత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన నేత బంధువు జగన్ కంపెనీల కేసులో లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు.

కారణాలు తెలియవుగాని ఆ తరువాత కొన్నిరోజులకు ఆయన తన పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇలా బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరింది. ఆ తరువాత మీడియా ప్రతినిధి యాదగిరిడ్డి చేతికి చిక్కింది. కాగా, తన మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్ బయటకు వచ్చిందని తెలిసి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తన సెల్‌ఫోన్ నెంబర్‌ను అప్పుడే మార్చుకున్నారు. తప్పితే తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ ఎలా బయటకు వచ్చిందన్న దానిపై మాత్రం ఆరా తీయలేదు. అయితే పోలీసు కేసు లేకుండా ఫోన్ కాల్స్ లిస్టును కోరడంలో ఔచిత్యం లేదని.. అయినప్పటికీ జేడీ, చంద్రబాల లిస్టును పోలీసులు సేకరించడం తప్పని, అయితే జర్నలిస్టుగా తనకు లభించిన వివరాలను ప్రచురిస్తే మాత్రమే తప్పనే విధంగా పోలీసుల కేసు నమోదు చేయడం సమంజసం కాదనే వాదనలు వినిపిస్తున్నారు.

ఇవిగో ఆధారాలు..
ఆ తరువాత కొన్నిరోజులకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఓ వర్గం మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు దొరికాయని ప్రకటించారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు తరచుగా వాసిడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్లు చేస్తున్నారని...ఆమె తన మొబైల్ నుంచి ఓ పత్రిక అధినేతకు కూడా ఫోన్లు చేసినట్టుగా ఆధారాలున్నాయని వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే లీకులు నిజమే అనిపిస్తోందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ తరువాత ఈ ఉదంతం పలు మలుపులు తిరిగింది. ఓ మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ వరుస కథనాలు రాగా మరో మీడియాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను సమర్థిస్తూ కథనాలు వచ్చాయి. దాంతో అసలు జరిగిందేమిటి? వాస్తవాలు ఏమిటి? అన్నది జనానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

చంద్రబాల ఫిర్యాదుతో...
ఇటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాల తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించి దానిని బహిరంగ పరచటం ద్వారా ప్రతిష్టను దెబ్బ తీశారంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి జరిపిన దర్యాప్తులో జర్నలిస్టు యాదగిరి నాచారం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సహాయంతో ఆమె మొబైల్‌ఫోన్ కాల్ లిస్ట్‌ను సంపాదించినట్టుగా తేలింది. యాదగిరిడ్డి అడిగిన వెంటనే ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కూడా వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా...పైగా మల్కాజిగిరి డీసీపీ ఈ-మెయిల్ ఐడీని తస్కరించి కాల్‌లిస్ట్‌ను తెప్పించి యాదగిరిడ్డికి ఇచ్చారు. దీని ఆధారంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, చంద్రబాలపై ఆరోపణలను తీవ్రతరం చేశారు. ఈ విషయంపై సీనియర్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడినపుడు.. ఈ విషయంలో యాదగిరిడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లు చేసింది చట్టవూపకారం తప్పేనని వ్యాఖ్యానించారు. ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని దొడ్డిదారుల్లో సంపాదించే హక్కు ఎవ్వరికీ ఉండదన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు.

ఇదే మొదటిసారి కాదు...
యాదగిరిడ్డిపై తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సీనియర్ జర్నలిస్టులు తప్పుపడుతున్నారు. మీడియా ప్రతినిధులు...చివరకు ప్రయివేట్ వ్యక్తులు సైతం ఇతరుల మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులను సంపాదించటం ఇదే మొదటిసారి కాదన్నారు. మద్దెలచెరువు సూరిని హత్య చేసిన భాను అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం మీడియా ప్రతినిధులే అతని సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని గుర్తు చేశారు. భాను మొబైల్‌ఫోన్ కాల్‌లిస్టులో సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉండటాన్ని కూడా మీడియానే వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు. గుంటూరు రూరల్ ఎస్‌పీగా పనిచేసిన శ్యాంసుందర్ తన భార్యతో వందలసార్లు మొబైల్‌ఫోన్‌లో మాట్లాడారంటూ కే.కార్తిక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేయటమే కాకుండా కాల్‌లిస్ట్‌ను సమర్పించిన ఉదంతాన్ని కూడా గుర్తు చేశారు. విజయవాడ కమిషనర్‌గా పనిచేసినపుడు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తనను ఫోన్‌లో వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైనాన్ని కూడా ఉదహరించారు. ఏ డిటెక్టీవ్ ఏజన్సీకి వెళ్లి...ఫలానా నెంబర్ వివరాలు కావాలంటే ఒకటి రెండు రోజుల్లో తెచ్చి ఇవ్వటం లేదా? అని ప్రశ్నించారు. ఈ అన్ని సందర్భాల్లో ప్రస్తావనకు రాని అధికార రహస్యాల చట్టం ఇప్పుడెలా ముందుకు వచ్చిందని అడిగారు. ఈ పరిణామాలు దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై ఖచ్చితంగా అనుమానాలు కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.

అంత తీవ్ర చట్టమా?
సైబరాబాద్ పోలీసులు జర్నలిస్టు యాదగిరి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కూడా కేసులు నమోదు చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ కేసులో అధికార రహస్యాల చట్టం ఎందుకు వచ్చిందో? ఎలా వచ్చిందో? తమకు అర్థం కావటం లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. చంద్రబాల సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్‌ను సంపాదించటానికి యాదగిరిడ్డి అనుసరించిన మార్గం తప్పుడుదే అయినా...ఓ ప్రయివేట్ మహిళ కాల్‌లిస్ట్ సంపాదిస్తే అది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొనసాగుతున్న వార్‌లో భాగంగా ఓ వర్గం మీడియా జరిగినదాన్ని భూతద్దంలో చూపించటం...దర్యాప్తు సంస్థలు సైతం యాదగిరిడ్డిని మీడియా ప్రతినిధిగా కాకుండా జగన్‌కు చెందిన పత్రికలో పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన మనిషిలా చూడటం వల్లనే ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారేమో అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా.. అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటాన్ని సమర్థించక పోవటం గమనార్హం. అయితే అటు లక్ష్మీనారాయణ, ఇటు చంద్రబాల కాల్‌లిస్ట్‌లను అక్రమ పద్ధతిలో సంపాదించడం కూడా సరైనది కాదని మరికొందరు అభివూపాయపడుతున్నారు. వీరితో మాట్లాడినపుడు రాష్ట్రంలోని మీడియాలో క్రమంగా తమిళనాడులోని మీడియా తరహాలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అక్కడ పార్టీలవారీగా విడిపోయిన మీడియా పరస్పరం బురద చల్లుకోవటం సర్వసాధారణమైపోయిందని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలో...పార్టీల వారీగా పక్షం తీసుకోవటం వల్లనే తెలియదుగాని మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషించారు.

ప్రైవసీ ఇంకా ప్రాథమిక హక్కు కాదు
- జీవించే హక్కులో అంతర్భాగమన్న సుప్రీంకోర్టు

హైదరాబాద్, జూన్ 27 (టీ మీడియా): రాజ్యాంగ నిర్మాణం జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రైవసీ ప్రాథమిక హక్కుగా గుర్తింపునకు నోచుకోలేదు. 1964లో ఉత్తరవూపదేశ్- ఖరక్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవసీ అన్నది జీవించే హక్కులో అంతర్భాగమని మాత్రమే వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి జీవితంలోకి మరో వ్యక్తి తొంగిచూడటం ప్రైవసీని భంగపరిచినట్టు కాదంటూ మేనకాగాంధీ-రచయిత కుష్వంత్‌సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. కుష్వంత్‌సింగ్ రచించిన ట్రూత్ లవ్ అండ్ లిటిల్ మలైస్ పుస్తకంలో తన ప్రైవసీకి భంగం కలిగించేవిధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచిన మరో కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది.

ప్రైవసీ హక్కు అన్నది రాజ్యాంగం కల్పించలేదని, అయితే కేసు అంశాల ఆధారంగా మాత్రమే దానిని గుర్తించాలని వ్యాఖ్యానించింది. అయితే, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్ స్టాకింగ్, సైబర్ స్నూపింగ్, స్పాం మెయిల్, మొబైల్‌ఫోన్లు, హ్యాకింగ్ ద్వారా ఒక వ్యక్తి జీవితంలోకి ఇతరులు జోక్యం చేసుకోవటానికి అనేక అవకాశాలు లభించాయి. దీనిని అరిక ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 72 ప్రకారం ఎవరైనా ప్రభుత్వ అధికారి తన అధికారాన్ని ఉపయోగించుకుని ఇతరులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి మరెవరికో అందజేస్తే, చట్టం ప్రకారం సదరు అధికారి శిక్షార్హుడవుతాడు.

వాస్తవాలను వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా ఇప్పటికీ అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


మీడియా సంస్థల్లోకి రాజకీయాలు వచ్చి అవి విడిపోయాయి. మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేని కోసమో వాడడు. చంద్రబాల కాల్ లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవు
సమాచార సేకరణలో జర్నలిస్టుకు ప్రత్యేక హక్కులు లేవుగానీ ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో వాస్తవాలను వెల్లడించడానికి అనువుగా కొన్ని సదుపాయాలున్నాయి. వార్తను ఇచ్చే, చెప్పే వ్యక్తుల దగ్గర ఈ సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు. సమాచార సేకరణ వృత్తి ధర్మంలో భాగంగా ప్రభుత్వ వర్గాలతోపాటు, సమాజంలోని పలు వర్గాల ప్రజలతో జర్నలిస్టులు సన్నిహితంగా మెలుగుతారు. కొన్ని సందర్భాలలో వాస్తవాల వెలికితీయడంలో జర్నలిస్టులకు అనేక అడ్డంకులు ఏర్పడుతుంటాయి. అధికార రహస్యాల చట్టం అందులో ఒకటి. అందులోని సెక్షన్ ఐదులోని క్లాజు ప్రజలకు సమాచారాన్ని దూరం చేస్తుంది. ప్రజా ఒత్తిడి ఫలితంగా ఈ చట్టంలో కొన్ని మినహాయింపులతో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు. అయినా అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్లు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత లేకుండా చేసేందుకు, ప్రభుత్వ దుర్నీతి, లంచగొండి వ్యవహారాలను కప్పిపుచ్చేందుకు తోడ్పడుతున్నాయి. వీటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు సమాచారాన్ని అందించే క్రమంలో ఈ అంశాలను కొన్నింటిని ప్రచురిస్తే, ప్రసారం చేస్తే అధికార రహస్యాల చట్టం ఉల్లంఘన కింద నేరారోపణ చేసి విచారించడానికి ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి. ఒక వర్కింగ్ జర్నలిస్టుగా, ప్రజావూపయోజనమే పరమావధిగా భావించేవారు అవసరమైతే కష్టనష్టాలను కూడా ఎదుర్కోవాలి.
- కే శ్రీనివాసడ్డి, విశాలాంధ్ర సంపాదకుడు,
ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్


సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు
సమాచారాన్ని సేకరించడం జర్నలిస్టుల హక్కు. రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమే పత్రికా స్వేచ్ఛ. జర్నలిస్టులు వార్తలు రాయడానికి అనేక పద్ధతులు అవలంబిస్తారు. వారిని ఆపే హక్కు ఎవరికీ లేదు. అయితే వికిలీక్స్ అధినేత అసాంజే, తెహల్కా విలేకరులు కుంభకోణాలు బయట పెట్టడంతో ప్రభుత్వాలు చట్టం దృష్టితో వారిని శిక్షించాయి. కానీ వారి చర్యలను ప్రజలు హర్షించారు. మన రాష్ట్రంలోని విషయాలకు వస్తే ఈ మధ్యన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కొన్ని పత్రికలు, చానెళ్లతో మాట్లాడిన వ్యవహారాన్ని బయటపెట్టినప్పుడు వ్యక్తులుగా జర్నలిస్టులను ఇందులోకి లాగవద్దని చెప్పాం. మీడియా సంస్థల్లో రాజకీయాలు వచ్చి విడిపోయాయి.

మీ రాజకీయ గొడవల్లోకి జర్నలిస్టులను లాగకూడదు. అలాగే యాదగిరిడ్డి విషయంలో కూడా అంతే. యాదగిరిడ్డి సమాచారాన్ని దేనికోసం వాడడు. చంద్రబాల కాల్‌లిస్ట్ సేకరించి, చంద్రబాల, జేడీ లక్ష్మీనారాయణ, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను బ్లాక్‌మెయిల్ చేయలేదు. అసలు ఆ సమాచారాన్ని ఎక్కడా వాడలేదు. ఏదో మతలబు ఉందన్న సందేహంతోనే యాదగిరిడ్డి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత అధికార రహస్యాల చట్టానికి కాలం చెల్లింది. ఆ చట్టం కింద నేరారోపణ చేయడం ఆక్షేపణీయం.
- దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్


అధికార రహస్యాల చట్టానికి విలువ లేదు
అధికార రహస్యాల చట్టం బ్రిటీష్ కాలం నాటి పురాతన చట్టం. సమాచార హక్కు చట్టం రావటానికి ముందే దీనికి విలువ లేకుండా పోయింది. విదేశీ వ్యవహారాలు, దేశ భద్రత, రక్షణశాఖకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దాదాపు 12 కేసుల్లో తీర్పులు వెలువరిస్తూ స్పష్టం చేసింది. జర్నలిస్టులపై అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయటం సరైంది కాదు. స్టోలెన్ ఎవిడెన్స్ ఈజ్ వ్యాలిడ్ ఎవిడెన్స్ (దొంగిలించబడిన సాక్ష్యం పరిగణనలోకి తీసుకోవాలి) అంటూ బ్రిటీష్ కాలంనాటి ప్రీవీ కౌన్సిల్ (అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం) సైతం చెప్పింది. ఇప్పటికీ దేశంలోని అన్ని న్యాయస్థానాలు దీనిని అనుసరిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టులు సమాచారాన్ని సేకరించవచ్చు. దానిని బహిరంగపరచవచ్చు.
- కే రామకృష్ణాడ్డి, సీనియర్ న్యాయవాది


జర్నలిస్టులపై కేసులు తప్పు
ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వాతంత్య్రం, ప్రైవసీ అన్నది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు. తాజా వివాదాన్ని అలా పక్కనబెడితే ప్రైవసీ చాటున తప్పుడు వ్యవహారాలకు పాల్పడినపుడు రాజ్యాంగం ప్రకారం రక్షణ ఉండదు. తప్పులు చేసినవారి గురించి బయటపెట్టటంలో తప్పు లేదు. వాస్తవాలను వెలికితీసే జర్నలిస్టులపై కేసులు పెట్టటం తప్పు. దీనిపై మీడియా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది.
-ఎస్ రాంచందర్‌రావు, సీనియర్ న్యాయవాది


సమాచార సేకరణ విలేకరుల వృత్తి ధర్మం
కుంభకోణాల కేసుల్లో వాస్తవ వివరాలను తెలుసుకుని బహిర్గతం చేయడం అన్నది జర్నలిస్టుల వృత్తి. దీనివల్లనే బోఫోర్స్ లాంటి కుంభకోణాలు సైతం వెలుగు చూశాయి. మావోయిస్టులతో, గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో సైతం మీడియా ప్రతినిధులు మాట్లాడారు. సమాచారాన్ని ప్రజలకు అందజేశారు. అటువంటి సందర్భాల్లో సైతం కేసులు నమోదు కాలేదు. ఓ మహిళ మొబైల్ ఫోన్ కాల్‌లిస్ట్‌ను తీసుకున్నంత మాత్రాన తీవ్రమైన అధికార రహస్యాల చట్టం ప్రకారం కేసు నమోదు చేయటం సరైంది కాదు.
- శ్రీరంగారావు, న్యాయవాది

Take By: T News

0 comments:

About This Blog

తెలుగు బ్లాగుల

my blog directory

Free Counters
CashAdvanceHelp

Total Blog Directory Submit Blog & RSS Feeds
Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!
Submit your website to 20 Search Engines - FREE with ineedhits!
You have not participated at the forum. Use the forum before you use this widget!
Make Money Blogging

Blog Directory Blog Topsites
Submit Blog
Blogs Blog Tools Allie Marie

Blogs Directory


Blog Directory

Blogger Help Templates Widgets SEO Tips Submit Site to Google Link building 

packages
Search engine submissions Politics
billiga hotellrum london Wutzle My Blog!

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service.
Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP