Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Saturday, December 24, 2011

ఉడుకుతున్న భూగోళం (Global Warming)

glob talangana patrika telangana culture telangana politics telangana cinema
- హరిత గృహ వాయువులతో ఉష్ణోక్షిగతలో తీవ్ర మార్పులు
- ప్రతి దశాబ్దానికి 0.1 డిగ్రీల సెంటిక్షిగేడ్ పెరుగుదల
- కరిగిపోనున్న ధ్రువపు మంచు- వచ్చే కొన్నేళ్లలో..జీవం మనుగడ ప్రశ్నార్థకం
- ఖండాల శీతోష్ణస్థితిలో పెనుమార్పులు - భారత్‌కూ పెను ముప్పు


ఏళ్లుగా భూవాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. చలికాలంలో వేడి, వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు, ఎండ కాయాల్సిన సమయంలో వానలు పడుతూ.. జనజీవనాన్ని శీతోష్ణస్థితి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వీటికి తుఫాన్‌లు తోడై జీవజాతిని కలవరపెడుతోంది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా..? మానవుల స్వయంకృతాపరాధం వల్ల పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలు.

వాతావరణంలో వీటి చేరిక అధికమై భూగోళం మండిపోతోంది. పారిక్షిశామికాభివృద్ధి పేరిట గాలిలోకి వదులుతున్న కర్బనం భూమినే మింగేసే స్థితికి చేరుకుంది. హరిత గృహ వాయువు నగీన్‌హౌస్ గ్యాసెస్) ల వల్ల ఉష్ణోక్షిగతలు ఉచ్ఛస్థితికి చేరుకున్నాయి. ఏడాదికేడాది ఉష్ణోక్షిగత పెరుగుదల పరంపర ఇలాగే కొనసాగితే.. భూమి వేడెక్కి శీతోష్ణస్థితిలో తీవ్ర మార్పులు రానున్నాయి. ఫలితంగా.. కరువు, క్షామంతోపాటు హిమానీ నదాలు కరగడంతో సమువూదాలు ఉప్పొంగి ధరివూతిపై జీవం మనుగడే ప్రశ్నార్థకమవనుంది. ఈ భయంకర నిజాలు నాసా పరిశోధనలో వెలుగుచూశాయి.

పారిక్షిశామిక యుగాని కంటే ముందు కాలం (1880)తో పోల్చినపుడు ప్రస్తుతం భూ ఉపరితల ఉష్ణోక్షిగత 0.8 డిగ్రీ సెంటిక్షిగేడ్ (1.4 డిగ్రీల ఫారన్‌హీట్స్) పెరిగింది. అంతటితో ఆగకుండా ప్రతి దశాబ్దానికి ఉష్ణోక్షిగత 0.1 డిగ్రీల సెంటిక్షిగేడ్ (0.2 డిగ్రీల ఫారన్‌హీట్‌కు) పెరుగుతూనే ఉంది. ఫలితంగా పగలు, రాత్రి ఉష్ణోక్షిగతలు అమాం తం పెరిగిపోయి.. చల్లని వాతావరణమే కనుమరుగవుతోంది. వేడి పవనాలు భూవాతావరణంలోకి దూసుకొస్తున్నాయి. దీంతో శీతోష్ణస్థితి సమతౌల్యం దెబ్బతిని పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి.

1970 నుంచి ప్రపంచంలోని చాలా చోట్ల కరువుకు ప్రధానం కారణం ఈ భూతాపమే. ఉష్ణోక్షిగతలో మార్పుల వల్ల ప్రపంచ దేశాలను సైక్లోన్‌లు కుదిపేస్తున్నాయి. వీటి తాకిడికి కోట్ల మంది ప్రజలు నిరాక్షిశయులై ఆకలితో అలమటిస్తున్నారు. హిమానీ నదాల కరుగుదల ఈ ఉష్ణోక్షిగతలో మార్పులతో ముంచుకొచ్చే పెనువూపమాదం. 1880 నుంచి ఇప్పటి వరకూ పెరుగుతున్న ఉష్ణోక్షిగత వల్ల ఇప్పటికే ధ్రువాల వద్ద ముఖ్యంగా మంచు దుప్పటి అలుముకున్న అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కరిగి సముద్ర మట్టాల స్థాయి ఘననీయంగా పెరిగిపోయింది.

ఈ రెండు ప్రాంతాల్లో నాసాకు చెందిన గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 10,000 ఏళ్ల క్రితం సముద్రం మట్టం స్థాయి 25 మీటర్లు (82 ఫీట్లు) ఉండేది. అప్పటి నుంచీ భౌగోళిక ఉష్ణోక్షిగత ప్రతీ డిగ్రీ పెరుగుదలకు సముద్ర మట్టం స్థాయి 20 మీటర్లు (66 ఫీట్లు) పెరుగుతున్నట్లు పరిశోధకులు లెక్కకట్టారు. మంచు కరుగుదల అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండకుండా పశ్చిమ అంటార్కిటికాలోని పైన్ దీవిలో అనూహ్య పరిమాణంలో ఉంటోందని తేల్చారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే.. 2100 సంవత్సరంలో సముద్ర మట్టపు స్థాయి పెరిగి నీరంతా భూమిని ముంచేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఉష్ణోక్షిగతలో పెరుగుదలకు కారణం..
పారిక్షిశామిక యుగం పూర్వం కంటే ప్రస్తుత కాలంలో ఉష్ణోక్షిగతలో పెరుగుదలకు ప్రధాన కారణం హరిత గృహ వాయువులు. విద్యుత్ ఉత్పత్తికి శిలాజ ఇంధనాలను మండిచడం, కార్లు, భాకీ పరిక్షిశమల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరి భూతాపాన్ని కలుగజేస్తున్నాయి. 10,000 సంవత్సరాలకు పూర్వంతో పోల్చినపుడు వాతావరణంలో కార్బన్‌డయాకె్సైడ్ శాతం రెట్టింపు పరిమాణంలో ఉండడం ఉష్ణోక్షిగత పెరుగుదలకు దారితీసింది. పారిక్షిశామిక ఉద్గారాలలో కార్బన్‌డైఆకె్సైడ్‌ను 390 పార్ట్స్ ఫర్ మిలియన్లకు తగ్గించాల్సి ఉంటుంది.

అయితే దీనిపై దేశాధినేతలు క్రోటోవూపొటోకాల్ ఒప్పందం చేసుకుని దశాబ్దాలుగా చర్చలు జరుపుతున్నా.. అవి ఓ కొలిక్కి రాకపోవంతో 350 పార్ట్స్ ఫర్ మిలియన్ల కార్బన్‌డైఆకె్సైడ్ వాతావరణంలో కొనసాగుతూనే ఉంది. దీనిపై దేశాధినేతలు సాచివేత ధోరణి అవలంభిస్తుండటంతో భౌగోళిక వాతావరణంలో కార్బన్ ఉద్గారాల స్థాయి సంవత్సరానికి సరాసరిగా 0.0001 పార్ట్స్ ఫర్ మిలియన్ పెరుగుతోంది. దీని ప్రభావం వల్లే ఇప్పటికే ధ్రువవూపాంతాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుదల రూపంలో భవిష్యత్తు విపత్తు కళ్లముందు కదలాడుతోంది.

భూతాపం పరిణామాలు
nasa talangana patrika telangana culture telangana politics telangana cinema1. భూమిపై చల్లని రాత్రి, పగలు, మంచు తగ్గిపోయాయి
2. రాత్రి, పగటి ఉష్ణోక్షిగతలు గణనీయంగా పెరిగాయి
3. మైదాన ప్రాంతాల్లోకి వేడిగాలులు వీస్తున్నాయి.
4. సముద్ర మట్టాల స్థాయి పెరిగిపోయింది
5. 1970 నుంచి కరువు తాండవం చేస్తోంది
6. మూడు దశాబ్దాలుగా.. సైక్లోన్ల తాకిడి పెరిగిపోయింది
7. ఉష్ణమండల ప్రాంతంలో నీటి వనరులు తగ్గిపోయాయి

ఖండాలపై ప్రభావం
1. అమెరికా ఖండం: పశ్చిమ ప్రాంతంలోని మంచు చాలా వరకు కరిగిపోయింది. వర్షాధార ప్రాంతంలో 5-10 శాతం పంట నికర దిగుబడి తగ్గిపోయింది. అధిక తీవ్రత గల వేడిగాలులు నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తూర్పు అమజోనియాలోని సవన్నా అడవులు తగ్గిపోయి జీవ వైవిధ్యంలో భారీ వ్యత్యాసం ఏర్పడింది.
2. ఐరోపా: సముద్ర మట్టాల పెరుగుదలతో వరదల బీభత్సం పెరిగిపోయింది. పర్వత ప్రాంతాల్లో హిమానీ నదాలు కరిగిపోయాయి. మంచు తగ్గిపోవడంతో అనేక జీవజాతులు కనుమరుగైపోయాయి. దక్షిణ ఐరోపాలో పంట దిగుబడి తీవ్రంగా తగ్గిపోయింది.
3. ఆఫ్రికా: వర్షాలు తగ్గిపోవడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. 2020 కల్లా 75 నుంచి 250 మంది ప్రజలు నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతారని అంచనా. పదేళ్లలో 50 శాతం పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంది.
4. ఆసియా: కేంద్ర, దక్షిణ, తూర్పు, ఆగ్నేయాసియాలో 2050 వరకు మంచినీటి లభ్యత గణనీయంగా తగ్గనుంది. తీరవూపాంతాలను వరదలు ముంచెత్తే అవకాశం అధికం.

భారత్‌కూ పొంచి ఉన్న ముప్పు
అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలనే లక్ష్యంతో పారిక్షిశామికాభివృద్ధికి కృషి చేస్తోన్న భారత్‌లోనూ ఉద్గారాలు తీవ్రత హెచ్చుస్థాయిలో పెరిగిపోతోంది. దీంతో గత కొంతకాలంగా మన దేశంలో భూతాపం తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. దీనివల్ల సహజవనరులు, వ్యవసాయం, నీరు, అడవులు తగ్గిపోయి కరువు బారినపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2045 కల్లా శీతోష్ణస్థితిలో భారీగా మార్పులు చోటుచేసుకున్న దేశాలలో మూడో స్థానంలోకి భారత్ ఎగబాకనుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ కమ్యూనికేషన్స్ (నాట్కామ్) పేర్కొంది.

భారత్‌పై భూతాప ప్రభావం
1. గంగా, బ్రహ్మపుత్ర నదీ ప్రాంతంలోని హిమానీ నదాలు క్షీణిస్తున్నాయి. వేసవిలో మంచు కరిగి 70 శాతం నీటి రూపంలో వెళ్లిపోతోంది
2. అస్థవ్యస్థ రుతుపవనాల వల్ల నదులలోని నీరు తగ్గి.. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి కుంటుపడుతోంది
3. ప్రతి 1 డిగ్రీ సెంటిక్షిగేడ్ ఉష్ణోక్షిగత పెరుగుదలకు 4-5 మిలియన్ టన్నల గోధుమల ఉత్పత్తి తగ్గిపోతోంది
4. సముద్ర మట్టం పెరిగిపోయి తీరవూపాంత ప్రజలకు మంచినీరు కరువవుతోంది
5. దేశ తీర, ఉష్ణమండల ప్రాంతంలో వరదలు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది
6. నాసా అధ్యయనం ప్రకారం భూతాపం వల్ల 2050 కల్లా భారత్‌లోని 50 శాతం అటవీవూపాంతం కనుమరుగైపోయి..జీవజాతులు అంతరించిపోయే ప్రమాదముంది.-సెంట్రల్ డెస్క్

Take By: T News  

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP