Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, December 7, 2011

అప్పనంగా అప్పగింతలు



Fab-City2 talangana patrika telangana culture telangana politics telangana cinemaకోట్ల విలువైన భూములను వేలల్లో ఖరీదు చేసి పెట్టుబడిదారులకు అప్పగించిన వైనం అభివృద్ధి పేరుతో..ఆరేళ్లకాలంలో పట్నం శివారు భూములన్నీ ఖతంఅభివృద్ధి పేరుతో పరిక్షిశమలను ఆహ్వానించామంటూ అటు టీడీపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూపంపకాలు చేసుకున్నాయి. కొత్త కొత్త ఇండవూస్టియల్ ప్రాజెక్టుల పేరుతో నగర శివార్లలో వేలకు వేల ఎకరాలు సేకరించింది. లక్షల ఎకరాల విలువైన భూములను అత్యంత చవకగా కొని నష్టపరిహారం నామమావూతంగా ఇచ్చి చేతులు దులుపుకొన్నది. దశాబ్దాలుగా..పూర్తిగా వెనుకబడిపోయిన ప్రాంతాల్లో పరిక్షిశమలు ఏర్పాటు చేయాల్సింది పోయి వాటిని కేవలం రాజధానికే పరిమితం చేసి వాటి ముసుగున అనుయాయులకు ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన భూపంపకాలివీ..

2004-05లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న మహేశ్వరం మండలం శ్రీనగర్ గ్రామంలో ఎకరం యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా విలువ కలిగిన 346 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నది. వారికి కేవలం లక్ష రూపాయలిచ్చి హార్డ్‌వేర్ పార్కు పేరుతో వేరెవరికో అప్పగించింది. అదే సమయంలో కాకినాడ జోన్‌లోని ఏలేశ్వర గ్రామంలో 6.14 ఎకరాల భూమిని తీసుకొని ఎకరానికి రూ.1.75 వేల చొప్పున చెల్లించడం గమనార్హం.

2005-06లో నాటి వైఎస్ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం ఎపీఐఐసీ ద్వారా ఒక్క రంగాడ్డి జిల్లాలోనే 1052.155 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించింది. దీనికి నామమామావూతంగా కేవలం కేవలం రూ. 14.43 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారు. ప్రస్తుతం రంగాడ్డి జిల్లాల్లో ఈ భూములు సేకరించిన ప్రాంతంలో ఎకరం నాలుగు కోట్లకు పైగా ధర పలుకుతోంది.
Infosys-Hyd talangana patrika telangana culture telangana politics telangana cinema
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 644.43 ఎకరాల భూమిని రైతుల వద్దనుంచి తీసుకొని ప్రభుత్వం రూ.6.55 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించింది. మొత్తం ఒక్క ఏడాదిలో తెలంగాణ ప్రాంతమైన ఈ రెండు జిల్లాలో 1696.59 ఎకరాల భూమిని తీసుకొని రైతులకు పరిహారంగా 21. కోట్లు మాత్రమే చెల్లించింది.
2005 జనవరిలో.. గోపనపల్లి, ఖాజాగూడ, శేరిలింగంపల్లి/వట్టినాగులపల్లి, మణికొండజాగీర్, రాజేంవూదనగర్‌లలో ఐటీ పార్కు కోసం 675.14 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

2005 నవంబర్ 7న ..మేడ్చల్ మండలం అత్వెల్లిలో బయోటెక్ పార్కు కోసం 205.5 ఎకరాల భూమిని కేటాయించారు.
2004 డిసెంబర్ 23న... అపెరల్ పార్కు కోసం గుండ్ల పోచంపల్లి మేడ్చల్ మండలంలో 58.09 ఎకరాల భూమిని కేటాయించారు. అదే రోజు .. డిస్కవరీ సిటీ కోసం గుండ్ల పోచంపల్లిలో 565.16 ఎకరాల భూమిని కేటాయించారు.
2004 సెప్టెంబర్‌లో.. హార్డ్ వేర్ పార్కు కోసం హయత్‌నగర్ మండలం తుర్కయాంజాల్‌లో 456.19 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో 162 ఎకరాల భూమిని సేకరించడం కోసం ఇచ్చిన నోటీస్‌ను వెనక్కు తీసుకుంది.

Jayabheri-Silicon-Towers talangana patrika telangana culture telangana politics telangana cinema2004 నవంబర్ 17న... ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో 329.07 ఎకరాల భూమిని సేకరించింది.

2004 మార్చి 31న సరూర్‌నగర్ మండలం నాదర్‌గూల్‌లో 770.17 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటీసులిచ్చింది. ఇందులో 593.25 భూమిని సెత్వార్ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా గుర్తించి అదనంగా భూమిని సేకరించారు. భూ సేకరణ చట్టం 48(1) విత్‌వూడాయల్‌నోటీస్ సర్కారుకు పంపించారు. మొత్తం హార్డ్ వేర్ పార్కు కోసం 2803 ఎకరాలను సేకరించింది.
పరిక్షిశమల అభివృద్ధి సంస్థ (ఐడీఏ)కోసం మహేశ్వరం మండలం తుమ్మలూరు-1లో 214.18ఎకరాలు, తుమ్మలూరు-2లో 176.39 ఎకరాలభూమిని, మంకాల్‌లో 75.34, మహబత్‌నగర్‌లో 225.23 ఎకరాలు సేకరించింది. మొత్తం 692.34 ఎకరాల భూమిని సేకరించింది. మొత్తం ఈ ప్రాజెక్టుల కోసం 5000 ఎకరాల భూమిని సేకరింంది.

WIPRO talangana patrika telangana culture telangana politics telangana cinemaఇతర ప్రాజెక్టుల కోసం చంద్రబాబు రంగాడ్డి జిల్లాలోని ఉప్పల్, రాజేంవూదనగర్, శేరిలింగంపల్లి మెదక్‌జిల్లాలోని పటాన్‌చెరువు మండలాల్లో 184 ఎకరాల పట్టా భూమిని సేకరించారు. ఆతరువాత వైఎస్ వచ్చిన ఏడాదిలోనే ఇతర ప్రాజెక్టుల కోసం 96 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో గోల్ఫో కోర్సు కోసం మరోసారి బాబుతో పోటీపడి 77.05 ఎకరాలభూమిని రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకున్నారు.

2007-08లో ... సైబరాబాద్ జోన్‌లో ఐటీపార్కు కోసం వట్టినాగులపల్లిలో 31.08 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి తీసుకున్నారు. దీనికి పరిహారంగా రూ.4.56 కోట్లు ఇచ్చారు. రాయదుర్గం గ్రామంలో లేయింగ్ అప్రోచ్ కోసం0.24 ఎకరాల భూమిని తీసుకొని పరిహారంగా రూ.85 లక్షలు ఇచ్చారు.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News, Assembly, 

 

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP