Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, November 3, 2011

విలీనంపై...బూర్గుల ఏమన్నారు?

- ఇవిగో వాస్తవాలు
- నాటి బూర్గుల భయం..
- నేటి వాస్తవ రూపం
- వికీసోర్స్‌లో నాటి బూర్గుల లేఖ
- విలీనానికి తెలంగాణ వ్యతిరేకమని వెల్లడి.. జీవన విధానం దెబ్బతింటుందని జనం భయం
- ఉద్యోగాల్లో అసమానతలపై అనుమానం..
- విలీనంపై ఆంధ్రలో గట్టిగా లేరు
- కానీ తెలంగాణలో బలమైన వ్యతిరేకత

1.Dr-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
: నాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలుగు జాతి ఒకే రాష్ట్రంలో కలిసి ఉండాలని భావించే సమైక్యరాష్ట్రానికి అంగీకరించారని చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? నేతి బీరలో నెయ్యంత! నిజమే.. తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో కలిసి సమైక్య రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తెలంగాణ అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటుందని ఆనాడే బూర్గుల కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు తన విశ్లేషణను అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు యూఎన్ ధేబర్‌కు లేఖ రూపంలో వివరించారు. విలీనంపై తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవికతను ఆయన ఆ లేఖలో స్పష్టంగా వెల్లడించారు. ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావానికి కొద్ది నెలల ముందు ఆయన ఈ లేఖ రాశారు. ఆ లేఖ బూర్గుల కుటుంబీకుల వద్ద ఇప్పటికీ ఉంది.

దానిని రామకృష్ణారావు తనయుడు విజయ్ వికీసోర్స్‌తో పంచుకున్నారు. విశాలాంధ్ర మద్దతుదారులు ఏం చెబుతున్నారు? విలీనంపై తెలంగాణ వారు ఎందుకు భయపడుతున్నారు? అన్నదానిపై ఆ లేఖలో బూర్గుల స్థూలంగానే అయినా స్పష్టంగా వెల్లడించారు. ఆనాడు బూర్గుల తన లేఖలో తెలంగాణవాళ్లు ఏవైతే భయాలు వ్యక్తం చేశారని చెప్పారో.. అవే వాస్తవాలుగా మారడం విశేషం. లేఖ సారాంశం ఇలా ఉంది...
‘‘శ్రీ యూఎన్ దేభర్ గారికి, ఇప్పుడు నేను రాస్తున్న ఈ లేఖ మధ్యంతర నివేదికలాంటిది. త్వరలోనే పూర్తి స్థాయి లేఖ రాస్తాను. నేను, శ్రీ భార్గవ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించాం. ఉన్న తక్కువ సమయంలో మేం గమనించిన విషయాలపై అంచనాను ఇస్తున్నాను. ఈ సమస్యపై (విలీనం) తెలంగాణలో గణనీయమైన ఆందోళన ఉందనడంలో సందేహం లేదు. ప్రావిన్స్ మొత్తంలో ఈ ఆందోళన ఉంది.

నా అంచనా ప్రకారం ఇక్కడ మెజా ర్టీ ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఓ బలమైన సెక్షన్ ప్రజలు విశాలాంవూధకు సానుకూలంగా ఉన్నారు. కానీ మెజార్టీ ప్రజలు ఎస్సార్సీ సిఫారసు చేసిన విధంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలని కోరుతున్నారు. దీనిపై నేను తర్వాత పూర్తి స్థాయి విశ్లేషణ ఇస్తాను. ఏది ఏమైనా మెజార్టీ ప్రజల అభివూపాయం ప్రత్యేక తెలంగాణవైపు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి మంచి చెడ్డలను స్థూలంగా ఇప్పుడు వివరిస్తాను. విశాలాంధ్ర మద్దతుదారులు కింది అంశాలను ప్రస్తావిస్తున్నారు.

హైదరాబాద్ రాష్ట్రాన్ని ఉన్నది ఉన్నట్లుగానే ఉంచాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతం భాష పరంగా ముక్కలుగా ఉన్నందున, అందులో రెండు ప్రధాన ముక్కలు వారి సొంత భాషా ప్రాంతాలకు వెళ్లిపోయినందున, మూడవ ముక్క తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో కలవాలి... విశాలాంధ్ర నినాదం చాలా కాలం నుంచి ఉంది. ఇది భావోద్వేగపూరితమైన డిమాండ్. విశాలాంధ్ర ఏర్పడితే భూస్వామ్య సమాజం పోతుందనేది వారి ఆకాంక్ష.. సాంస్కృతిక సమక్షిగతను కోరుకునేవారు తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలు కలిసి ఉండాలని భావిస్తున్నారు.... పెద్ద రాష్ట్రంలో పదవుల సంఖ్య, శాఖల సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది కాబట్టి ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. ఒకే గవర్నర్ ఉంటారు. ఒకటే హైకోర్టు ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే ఉంటుంది. ఇలా అన్ని శాఖలు కూడా.. పెద్ద రాష్ట్రంలో భారీ ఎత్తున పారిక్షిశామిక అభివృద్ధికి అవకాశం ఉంటుందనే నమ్మకం.

ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనుకునేవారి అభివూపాయాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశాలాంధ్ర భావన గణనీయంగా బలహీనపడిందని వారు విశ్వసిస్తున్నారు. పూర్తి తెలుగు రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడితే అది మరింత బలహీనపడిపోతుంది. విలీనంపై ఆంధ్ర ప్రాంతంలో బలమైన ఉద్యమం ఏమీ లేదు. కానీ ఆంధ్రతో విలీనంపై తెలంగాణలో బలమైన ఆందోళన ఉంది... తెలంగాణ ఏర్పడితే ఆచరణలో ఇదిఎవరినీ నొప్పించదు. సిద్ధాంతకర్తలు, భావోద్వేగంతో ఉన్న కొందరు ప్రజలు నిరుత్సాహానికి గురవుతారు తప్పించి ఉద్యమాలకు దిగరు... కానీ తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో విలీనమైతే మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది... తెలుగు వాళ్లుగా ఉంటూనే గత 175ఏళ్లుగా తెలంగాణ ప్రజలుగా తమదైన సొంత జీవన విధానాన్ని నిర్మించుకున్నారు.

ఇది ఆంధ్ర ప్రాంత తెలుగువారి జీవనవిధానానికి పూర్తి భిన్నమైనది. విలీనం జరిగితే తమ జీవన విధానం నాశనమవుతుందని ఇక్కడివారు భయపడుతున్నారు. అదే వారి ఆందోళన.... తెలంగాణలో ఎక్కువ మంది ఉర్దూ భాష తెలిసినవారో ఉర్దూ భాష మాట్లాడేవారో ఉన్నారు. వందేళ్లకుపైబడి ఉర్దూ ఇక్కడి ప్రజల జీవనంలో భాగమైంది. పరిపాలన ఉర్దూలోనూ సాగుతుంది. రికార్డులు ఉర్దూలోనే ఉంటాయి. కోర్టు ప్రొసీడింగ్స్ ఉర్దూలో జరుగుతాయి. లాయర్లు, వృత్తి నిపుణులు తమ కార్యకలాపాలు ఉర్దూలో నిర్వహిస్తారు. కనుక విలీనం జరిగితే తమ జీవితంలో ఉర్దూ ప్రాధాన్యం తగ్గిపోతుందని సహజంగానే వారు భయపడుతున్నారు... విద్యావిషయాల్లో ఆంధ్రతో పోల్చితే తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. ప్రత్యేకించి ఇంగ్లిష్ చదువుల్లో వారు బాగా వెనుకబడి ఉన్నారు. అందుకు మౌలిక సదుపాయాలు లేకపోవడమో లేదా తగినంత లేకపోవడమో కారణం కావచ్చు.

దీని వల్ల పెద్ద రాష్ట్రంలో వారికి భీకరమైన ప్రతికూలత ఎదురవుతుందని భయపడుతున్నారు. ఆంధ్రలో వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఉండగా.. హైదరాబాద్‌లో వారి సంఖ్య వందల్లో కూడా లేదు. ఇది ఉద్యోగాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు... ఆర్థిక విషయాలకు సంబంధించి విశాలాంవూధలో తాము బాధితులవుతామని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. సగటు తెలంగాణ ప్రజలు పేదవాళ్లు. ఆంధ్రలోని వారితో పోల్చితే డబ్బు నిల్వలు లేనివాళ్లు. భూములతో పాటు చిన్న, పెద్ద వ్యాపారాల్లో తక్షణ దోపిడీ ఉంటుందని వారి భయం. ఇదే అన్నింటికంటే పెద్ద భయం... భాష ఒకటే అయినప్పటికీ ఉభయ రాష్ట్రాల్లోని తెలుగువారి మధ్య ప్రేమ లేదనడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి.

రజాకర్‌ల సమయంలో, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన వెంటనే జరిగిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలతో మరాఠీ, కన్నడ ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు దయతో ఉండగా.. ఆంధ్ర ప్రాంత అధికారులు మాత్రం కటువుగా వ్యవహరించారు. అనేక పీడకలలు ఉన్నాయి. ఇవి తెలంగాణ ప్రజల మనసులో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.

ఆంధ్ర దయాదాక్షిణ్యాలపై బతకాలని తెలంగాణవాళ్లు కోరుకోవడం లేదు... విశాలాంధ్ర కోసం డిమాండ్ చేస్తున్న కమ్యూనిస్టులు, కమ్యూనలిస్టులు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. పెద్ద రాష్ట్రానికి వారు ప్రకటించిన మద్దతులో చిత్తశుద్ధిలేదు... ఎస్సార్సీ సిఫారసు చేసిన ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నవారంతా తమ ప్రజల ఆకాంక్షలను వెల్లడించేందుకు ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని చెబుతున్నారు. పరీక్ష పెడితే విలీనాన్ని మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తారని అంటున్నారు. ఇదే అంశంపై ఎన్నికలు పెడితే కమ్యూనిస్టులకు గానీ, కమ్యూనలిస్టులకు గానీ, విశాలాంధ్ర మద్దతుదారులకుగానీ ఒక్క సీటు కూడా రాదని స్పష్టం చేస్తున్నారు... నేను విలీనం జరిగే లాభనష్టాల గుర్చి రేఖామావూతంగా వివరించాను. నా స్వంత అభివూపాయం చెప్పడం ఇప్పుడు తగదు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచినట్లయితే ఉమ్మడి పాలనా వ్యవహారాలకు ఎలాంటి హాని జరగదు. ఉదాహరణకు ఉభయ ప్రాంతాలకు గవర్నర్, హైకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటివి ఉమ్మడిగానే కొనసాగించవచ్చు....’’


Take By: T News


Tags: Telangana News,  Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy,  Telangana agitation, statehood demand, Komati Reddy, Venkat Reddy,

 

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP