సమ్మెపై గన్ను కుట్ర కన్ను
-హస్తిన డైరెక్షన్.. కిరణ్ సర్కార్ యాక్షన్
-అటు నిర్బంధం.. ఇటు కుయుక్తులు
- తొలి దెబ్బ ఆర్టీసీ ఐక్యతపై
- ఎన్ఎంయూతో కుమ్మక్కు
- సింగరేణిలోనూ అదే కుట్ర!
- చర్చలంటూనే అణచివేతలు
- యథేచ్ఛగా అరెస్టుల పర్వం
- రైల్రోకో కట్టడికి వ్యూహం
- ఖాకీమయమైన తెలంగాణ
- కేసుల పేరుతో బెదిరింపులు
- ఒక్కటైన కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర నాయకత్వం
- కృత్రిమ ఉద్యమాల సృష్టి
- తల్లిదంవూడులపేర రోడ్లపైకి
- సమ్మెతో కష్టాలంటూ ఆంధ్రోళ్ల చానళ్ల గగ్గోలు
హైదరాబాద్, అక్టోబర్ 10 (టీ న్యూస్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న మహోధృత సకల జనుల సమ్మె 28వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో సీమాంధ్ర సర్కారు తన కుట్ర నేత్రాలు తెరిచింది. హస్తిన పర్యటన నుంచి సీఎం కిరణ్కుమార్ వచ్చీరాగానే కుతంవూతాల మంత్రాంగం మొదలయ్యింది. ప్రలోభాలు.. బెదిరింపులు.. అరెస్టులు.. ఏది వీలైతే అది! ఆదివారంనాడు గని కార్మికులకు సంఘీభావంగా బయల్దేరిన బస్సు యాత్రను అడ్డుకుని, నిర్బంధకాండకు తెర తీసిన కిరణ్ సర్కారు.. సోమవారం మరో అడుగు ముందుకేసింది. తెలంగాణవూపాంత ఆర్టీసీ కార్మికుల ఐక్యతపై దెబ్బకొట్టింది. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్ఎంయూలోని సీమాంధ్ర నాయకత్వంతో కుమ్మక్కయిన ప్రభుత్వం... వారితో ఏకపక్షంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేయించింది.
సర్కారుతో అంటకాగిన ఎన్ఎంయూ నేతలు.. అత్యుత్సాహానికి పోయి.. ఏకంగా ఎన్ఎంయూ తెలంగాణ ఫోరంనే రద్దు చేశారు. ఈ పరిణామంపై ఆర్టీసీ కార్మికలోకం భగ్గుమన్నది. తెలంగాణ కోసం సమ్మె నోటీసు ఇస్తే.. కార్మికుల లబ్ధి పేరుతో సమ్మె విరమించడమేంటని నిలదీసింది. ఎన్ఎంయూ నేతలు మహమూద్, నాగేశ్వరరావు వైఖరిని నిరసిస్తూ మంగళవారం నాడు వారి దిష్ట్టిబొమ్మలకు శవయాత్రలు చేసేందుకు సన్నద్ధమవుతున్నది. తెలంగాణలో ఆర్టీసీ పయ్య కదలనిచ్చేది లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు.
ఆర్టీసీలో తొలి కుట్ర అమలు చేసిన క్రమంలోనే కొరకరాని కొయ్యలుగా తయారైన సింగరేణి కార్మికుల్లో కూడా చిచ్చుపె ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఓ వైపు సమ్మె శాంతియుతంగా సాగుతున్నదని కితాబునిస్తూనే.. తన నిర్బంధకాండను కొనసాగించే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అరెస్టులకు దిగింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్కు ఒక కార్యక్షికమం నిమిత్తం వెళ్లిన రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను అక్రమంగా అరెస్టు మొదటి పేజీ తరువాయిచేసింది. ఆయనతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామడ్డిని సైతం పోలీసుస్టేషన్కు తరలించింది. సర్కారు చర్యపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో కోదండరాంను వదిలిన పోలీసులు.. అశ్వత్థామడ్డిని మాత్రం పోలీస్ స్టేషన్లకు తిప్పుతుతూ మేజివూస్టేట్ముందుకు తెచ్చారు. మరోవైపు బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగే నిరవధిక రైల్రోకోలను విఫలం చేసేందుకూ ప్రణాళికలు రచించారు.
రైల్రోకోలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ఎస్ ఏ హుదా చెప్పారు. నిర్వాహకులను కూడా వదిలేది లేదని లేదని బెదిరించారు. ఏమేం చేస్తే ఏయే కేసులు పెడతారో లిస్టు వినిపించారు. ఇప్పటికే 92 కంపెనీల కేంద్ర బలగాలుండగా.. మరిన్ని బలగాలను రప్పించి.. వాటి సాయంతో రైళ్లను నడిపేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. బందోబస్తుతో రైళ్లను నడపలేమని రైల్వే అధికారులు చేతుపూత్తేస్తున్నా.పభుత్వం వారిపై ఒత్తిడి పెంచుతోందని సమాచారం. అదే సమయంలో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి ప్రాంతాన్ని పోలీసు క్యాంపులుగా మార్చి కార్మికులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేసే సర్కారు కుట్రలో సీమాంధ్ర చానళ్లూ భాగస్వాములయ్యాయి. సోమవారం పొద్దున్నుంచే తెలంగాణవాదంపై విరుచుకుపడ్డాయి. సమ్మె వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఏకరువు పెట్టాయి. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోతున్నారంటూ కపట ప్రేమ ఒలకబోశాయి.
త్వరలో జరగనున్న రైల్రోకోలను అడ్డుకునేందుకూ తమ వంతు ప్రయత్నాలు చేశాయి. రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకోబోతున్నారంటూ బెదిరింపులకు దిగా యి. నిజానికి తెలంగాణ సాధించేదాకా స్కూళ్లు తెరవబోమని పాఠశాలల యాజమాన్యాలు, పాఠాలు చెప్పబోమని ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. కానీ.. దానిని విచ్ఛిన్నం చేయడానికే సర్కారు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. అటు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కూడా సకల జనుల సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరి కఠినంగా ఉండబోతున్నదని కుండబద్దలు కొట్టారు. బలవంతంగా స్కూళ్లు బంద్ చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఈ మేరకు పోలీసులు ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. తల్లిదంవూడుల పేరుతో కృత్రిమ ఉద్యమం సృష్టించారు.
బలవంతంగా స్కూళ్లను పని చేయించేందుకు విఫలయత్నం చేశారు. సింగరేణి సమ్మెను అణచివేసేందుకూ ప్రభుత్వం సమాయత్తమవుతున్నదన్న సంకేతాలు ఇచ్చిన సీఎం.. బలవంతంగా బొగ్గు ఉత్పత్తిని అడ్డుకునేవారిని సహించేది లేదంటూ హూంకరించారు. మరోవైపు ఉద్యోగులను నానా ఇక్కట్లకు గురి చేయడమే లక్ష్యంగా నో వర్క్ నో పే విధానాన్ని గట్టిగా అమలు చేస్తున్నది. దసరా పండుగకు కూడా ఉద్యోగుల ఇళ్లలో సంతోషం లేకుండా చేసి.. తెలంగాణ ఉద్యోగుల పట్ల శత్రుపూరిత వైఖరిని ప్రదర్శించింది. ఇంత నిర్బంధం అమలు చేస్తూనే మరోవైపు చర్చలంటూ ప్రభుత్వ ఉద్యోగులను, టీచర్ల సంఘాలను ఆహ్వానించింది. కొన్ని సీమాంధ్ర సంఘాలను దువ్వే ప్రయత్నాల్లో ప్రభుత్వపెద్దలు ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా సకల జనుల సమ్మె ప్రభావం లేదని చెప్పేందుకు, మహోధృత ఉద్యమాన్ని మరుగుజ్జు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చూపడానికి కిరణ్సర్కారు నానా యాతనలు పడుతున్నట్లు కనిపిస్తున్నది.
తెలంగాణ ప్రాంతంలో పంటలు ఎండబెట్టి.. ఆ నెపాన్ని ఉద్యమంపైకి నెట్టేయాలని ప్రయత్నిస్తున్న సర్కారు... అదే విధానాన్ని విద్యారంగంపైనా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నది. సకల జనుల సమ్మెతో విద్యార్థుల భవిష్యత్ పాడయిపోతోందంటూ దీనికి కూడా తెలంగాణ ఉద్యమ నేతలే కారణమని బురద చల్లడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత అవసరమైతే అదనపు తరగతులను నిర్వహిస్తామని, సెలవు దినాల్లో కూడా పని చేస్తామని అధ్యాపకులు తెలంగాణ విద్యార్థులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ సమ్మె జరిగిన రోజుల్లో పది రోజులకు పైగా దసరా సెలవులే కావడంతో విద్యార్థులు, తల్లిదంవూడులు ఆందోళన చెందడం లేదు. అయినప్పటికీ సీఎం గోరంతలు కొండంతలు చేస్తూ తెలంగాణ విద్యార్థుల పట్ల తనకు మాత్రమే ఆందోళన ఉన్నట్లు ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారని తెలంగాణ టీచర్ల జేఏసీ నాయకులు విమర్శిస్తున్నారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ పనిగట్టుకొని ఒక వర్గం చేస్తున్న ప్రచారం వెనుక కూడా సీఎం హస్తం ఉన్నట్లు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సర్కారు నిర్బంధంపై రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన హోం మంత్రి చూస్తూ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. సోమవారం టీజేఏసీ బృందం హోంమంత్రి సబితాడ్డితో సమావేశమై పోలీసుల ఆకృత్యాలను వివరించింది. హోంమంవూతిగా జోక్యం చేసుకోవాలని కోరింది. తెలంగాణ కోసం రాజీనామా చేసి ఉద్యమంలోకి కలిసి రావాలని సబితకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రాంతానికి చెందినందున సీమాంధ్ర పాలకులు వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్నారని, ఇన్ని అవమానాలు భరిస్తూ ఎందుకు ఆ పదవిలో కొనసాగుతున్నారని కోదండరాం ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సబితాడ్డి మాట్లాడుతూ తాను తెలంగాణ ఆడబిడ్డనేనని, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సభ్యులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. అరెస్టుల ప్రక్రియపై పోలీసులకు తగిన ఆదేశాలిస్తానని చెప్పారు. ఈ బృందంలో వీ శ్రీనివాస్గౌడ్, సీ విఠల్, అద్దంకి దయాకర్, సత్యం, టీఆర్ఎస్ నాయకుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ తదితరులు ఉన్నారు.
0 comments:
Post a Comment