తెలంగాణ ఏర్పడ్డాక దళితుడే తొలి సీఏం
- కాపలా కుక్కలా ఉంటా..ఏ పదవీ తీసుకోను
- మీరిచ్చే తీర్పుతో ఢిల్లీ పీఠం అదరాలి
- కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రావొద్దు
- బాన్సువాడ ప్రజలకు కేసీఆర్ పిలుపు
- రాష్ట్రం వచ్చాక ముస్లింలకు, బంజారాలకు 12 శాతం రిజర్వేషన్లు
- ఉద్యమాన్ని విరమించామనే హక్కు మహమూద్కు లేదు
- బాన్సువాడ ప్రచార సభలో కేసీఆర్
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమం కీలకదశలో ఉన్న సమయంలో జరుగుతున్న బాన్సువాడ ఉప ఎన్నికల్లో ఢిల్లీ పీఠం అదిరేలా తీర్పు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాన్సువాడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి బాన్సువాడలో జరిగిన పోచారం శ్రీనివాస్డ్డి ప్రచార సభలో అశేష జనవాహిణిను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుపై ఢిల్లీలో సంప్రతింపులు జరుగుతున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికలో నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించే అవకాశం కేవలం బాన్సువాడ ప్రజలకు దక్కిందని చెప్పారు. ఇంతటి కీలకమైన బాధ్యతను గుర్తెరిగి ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యేవిధంగా చారివూతాత్మకమైన తీర్పునివ్వాలని కోరారు.
ఈఎన్నిక తెలంగాణ ప్రజానీకానికి ఇజ్జత్కా సవాల్గా నిలిచిందని గుర్తు చేశారు. ఎన్నికలు రావచ్చు పోవచ్చు, కానీ ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఎన్నికలు అరుదుగా వస్తాయనే విషయాన్ని గుర్తెరిగి టీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. బాన్సువాడలో పోటీ చేసే ముఖం లేక టీడీపీ, పోటీ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్కు సుఖం లేని పరిస్థితి ఉందని చమత్కరించారు. పోచారం శ్రీనివాస్డ్డిని ఏకక్షిగీవంగా ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమైనా సీఎం కుట్రలో భాగంగానే ఎన్నిక అనివార్యమైందన్నారు. అయినప్పటికీ 70 గ్రామాలు పోచారం కోసం ఏకక్షిగీవం బాటపట్టడం సంతోషకరమన్నారు. త్యాగధనుడైన పోచారంను అఖండ మెజార్టీతో గెలిపించి ఉన్న సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టే
ఉప ఎన్నికల్లో ముఖం లేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్పై బురద చల్లుతున్నారని ఆరోపించారు. బీజేపీతో టీఆర్ఎస్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నదని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్నారు. టీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ముస్లింలకు12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రచారాన్ని నిజామాబాద్ ముస్లింలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు. గతంలో నిజామాబాద్ ఉపఎన్నికల్లో నా విజ్ఞప్తి మేరకు అక్కడి ముస్లింలు డి.శ్రీనివాస్ను ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించారని గుర్తు చేశారు. ఇక్కడ పుట్టి పెరిగిన సెటిలర్లు మా బిడ్డలేనని కేసీఆర్ స్పష్టం చేశారు. సెటిలర్లు పెద్ద మనసుతో టీఆర్ఎస్కు ఓటువేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతేనే నిజాంసాగర్ రైతాంగానికి సింగూరు జలాలు ధారాదత్తం అవుతాయని స్పష్టం చేశారు. సింగూరు ఆ నీళ్లన్నీ నిజాంసాగర్కే దక్కితే సెటిలర్లకే ఎక్కువ లాభమని చెప్పారు.
బంజారాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఆరు శాతం రిజర్వేషన్లతో నష్టపోతున్నారని, ప్రత్యేక రాష్ట్రంలో 12 శాతం రిజర్వేషన్లు దక్కుతాయన్నారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి ఉన్నతస్థాయి విద్య అవకాశాలతో పాటు చట్టసభలు, స్థానిక సంస్థల్లో 12 శాతం ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పారు. ఈ అంశాలను గుర్తెరిగి టీఆర్ఎస్కే పట్టం కట్టాలని కోరారు.
సీమాంధ్ర సర్కారుపై నిప్పులు
సమ్మెపై కత్తిగట్టిన సీఎం, డీజీపీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కేసీఆర్ తీవ్రస్వరంతో హెచ్చరించారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రలను సాగనివ్వమన్నారు. అగ్గితో గోక్కుంటే బొగ్గయ్యేది మీరేనని, తెలంగాణతో పెట్టుకోవద్దని హితవు పలికారు. ‘ మీ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మా కోదండరాం ఆర్టీసీ నేతలు, ఉద్యోగ సంఘాలను అరెస్ట్లు చేయిస్తున్నారు. మీ అరెస్ట్లు, లాఠీలు, లూటీలకు భయపడేది లేదు. తెలంగాణలోని డిపో కార్యదర్శులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఆ ఆటలను అడ్డుకొని తీరతాం’ అని సీఎం, డీజీపీలకు అల్టిమేటం జారీ చేశారు. సమ్మె విరమింపజేస్తున్నామని చెప్పే హక్కు మహమూద్ లేదన్నారు. అవసరమైతే తెలంగాణ ఎన్ఎంయూ ఏర్పాటు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు నడువనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపొద్దని, హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణే కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తల తెగిపడినా హైదరాబాద్ను వదులుకునేది లేదన్నారు. ఉద్యోగులకు తెలంగాణ వచ్చాక ఒక నెల బోనస్తో సహా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
నీళ్లు,నిధులు, ఉద్యోగాల కోసమే పోరాటం
డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పోచారం శ్రీనివాస్డ్డి, గంపగోవర్ధన్, జోగురామన్న వంటి ఎమ్మెల్యేలతో పాటు అనేకమంది ఎంపీలు పదవులకు రాజీనామా చేస్తున్న తీరు దేశంలో ఎక్కడా చూడబోమన్నారు. ఇక్కడి ప్రజావూపతినిధులు చూపుతున్న తెగువ ఉద్యమ చైతన్యానికి ప్రతీక అని అభివర్ణించారు. నీళ్లు, నిధులు, వనరులు, కొలువులను సీమాంవూధులు కొల్లగొట్టుకొనిపోతుంటే కడుపు మండి స్వరాష్ట్రం కోసం పోరాడుతున్నామని ఉద్ఘాటించారు. 1969లో 24వేల మంది స్థానికేతరులు తెలంగాణ కొలువులను కొల్లాగట్టారని తేలినా, ఎన్టీఆర్ హయాంలో 59వేల కొలువులు స్థానికేతరులతో భర్తీ అయ్యాయని లెక్కలు తేలినా ఒక్కర్నీ వెనక్కి పంపించలేదని వివరించారు. మన కొలువుల్లో రిక్రూట్ అయి రిటైర్మెంట్ అయినా, మనోళ్లకు మాత్రం కొలువులు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చాక దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తాను కాపలా కుక్కలా ఉంటానని, ఏ పదవీ తీసుకోనని స్పష్టం చేశారు. భారీ బహిరంగ సభలో అభ్యర్థి పోచారం శ్రీనివాస్డ్డి, టీఆర్ఎస్ నేతలు హరీష్రావు, కేటీఆర్, నాయిని నర్సింహాడ్డి, ఎమ్మెల్యేలు జోగురామన్న, గంపగోవర్ధన్, ఓదేలు, సమ్మయ్య, విద్యాసాగర్రావు, ఏనుగు రవీందర్డ్డి, కొప్పుల ఈశ్వర్, సీనియర్ నేతలు యూసుఫ్ అలీ, జగదీశ్వర్డ్డి, జితేందర్డ్డి, గణేష్గుప్త, నీరంజన్డ్డి, రాములునాయక్, మహమూద్ అలీఖాన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, సురేందర్డ్డి తదితరులు పాల్గొన్నారు.
-సీమాంవూధులే బస్సులను కాల్చి ఉద్యమంపైకి నెట్టేస్తున్నారు
- సీఎం ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది
- 1956కు ముందటి తెలంగాణే కావాలి: కేసీఆర్
- టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్: ‘సీమాంవూధులు కావాలనే బస్సులను కాలపెట్టి, ఆ పాపాన్ని తెలంగాణ ఉద్యమంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా ఇన్సూన్స్ కె్లైయిమ్ చేసుకోడానినే ఇలాంటి చిల్లర పనులకు ఒడిగడుతున్నారు. స్వయంగా సీఎం కిరణ్కుమార్డ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. స్వయంపాలన కోసం శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని సీమాంధ్ర పాలకులు తప్పుదోవ పట్టించడానికి కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ఆద్యమంలోకి అసాంఘిక శక్తులు తలదూర్చాయని స్వయంగా సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కలిసుంటే తెలంగాణకు మోసం జరుగుతోందని నిర్ధారణ అయినందునే..
1956లో ఆంధ్రవూపదేశ్లో కలిపిన మా తెలంగాణ కావాలని కోరుతున్నామన్నారు. ఆదిలాబాద్ సరిహద్దులో లోయర్ పెన్గంగ ప్రాజెక్ట్ నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదన్నారు. లోయర్పెన్ గంగ పూర్తయితే తాంసి, జైనథ్ మండలాల్లో వరదల కారణంగా నష్టపోయే పంటను కాపాడుకోవచ్చని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ బాధలు వర్ణనాతీతమని, ‘తెలంగాణ గురించి రాస్తే భారతం.. వింటే రామాయణం’ అవుతుందని వివరించారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట సమ్మె శిబిరంలో ‘జిల్లేడమ్మ జిట్ట’ పాటపాడి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు.
టీఆర్ఎస్తో పొత్తుతోనే గెలిచా: జోగు
2009లో టీడీపీ చూసో.. నన్ను చూసో ప్రజలు ఓటేయలేదని, అప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నందునే గెలిచానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చెప్పారు. కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఐదువేల మంది కార్యకర్తలతో రామన్న సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు, సర్పంచ్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చేరినవారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment