Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, October 11, 2011

ఇక వర్కింగ్ కమిటీకి!

- నిర్ణయాధికారం బదిలీ చేసిన కోర్‌కమిటీ
- తెలంగాణపై వైఖరి చెప్పేది సీడబ్ల్యూసీయే
- అక్కడ చర్చించాక సర్కారు పరిధిలోకి
- వీలైనంత త్వరలో వర్కింగ్ కమిటీ భేటీ?
- ఇక కాంగ్రెస్ జాతీయ నేతల అభివూపాయ సేకరణ
- రేణుక, చిరంజీవిలతో ఇంటర్వ్యూ
- కావూరిని పిలవని కాంగ్రెస్ అధిష్ఠానం
- నిర్ణయం ఏదైనా... అదుపు చేయొచ్చు
- విలేకరులతో చిరంజీవి వ్యాఖ్యలు

Paranaba-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, అక్టోబర్ 10 :తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీ ఒక వైఖరిని వెలువరిస్తుందనుకున్న తరుణంలో అది కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోర్టులోకి వెళ్లింది. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రముఖులతో వ్యక్తిగత అభివూపాయ సేకరణను సోమవారం ముగించిన కాంగ్రెస్ కోర్ కమిటీ.. దీనిపై నిర్ణయాధికారాన్ని పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన సీడబ్ల్యూసీకి బదిలీ చేసింది. ఇక తెలంగాణపై పార్టీలోని జాతీయ స్థాయి నేతల అభివూపాయాలను సీడబ్ల్యూసీ తెలుసుకొని, పార్టీ తుది వైఖరిని ప్రకటిస్తుందని భావిస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా రాష్ట్ర ప్రముఖుల నుంచి సేకరించిన అభివూపాయాలను క్రోడీకరించి, తయారుచేసిన నివేదికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నేడో రేపో అందించనున్నారు.

దానిపై సీడబ్ల్యూసీలో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తన వైఖరిని బయటపెట్టనుంది. సీడబ్ల్యుసీ నిర్ణయానికి కాంగ్రెస్ సభ్యులందరూ కట్టుబడి ఉండాలని పార్టీ నైతిక నియమావళి సూచిస్తున్నది. దీంతో తెలంగాణపై సీడబ్ల్యుసీ నిర్ణయమే అంతిమం కానుంది. తెలంగాణకు అనుకూలంగా

డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు సీడబ్ల్యుసీ అమోదం లేనందున దానికి కట్టుబడబోమంటూ కొందరు సీమాంధ్ర నేతలు మొండికేసిన సంగతి తెలిసిందే. అంతేకాక రాజీనామాలతో పార్టీని ధిక్కరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమస్య పరిష్కారానికి సీడబ్ల్యుసీలో జరుగనున్న చర్చే కీలకం కానుంది. అయితే సీడబ్ల్యుసీ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నదానిపై నిర్దిష్ట అంచనా లేనప్పటికీ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా వారంలోగా సమావేశపర్చవచ్చని ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నది.

ఒకసారి సీడబ్ల్యూసీ తెలంగాణపై వైఖరిని తేల్చాక ఈ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్లనుంది. దీనికి అనుగుణంగా కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, వివిధ పార్టీల అభివూపాయాలను తెలుసుకుంటుంది. దాని ఆధారంగా రాష్ట్ర విభజన అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడితో ఇది ఒక కొలిక్కి వస్తుందా? లేక మరో వేదికకు మారుతుందా? అన్నది కాంగ్రెస్ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి, కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి అభివూపాయాలను తెలుసుకున్న అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. ఇక జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతల అభివూపాయాలను సేకరిస్తామని చెప్పారు. ‘‘చిరంజీవి, రేణుక అభివూపాయాన్ని తీసుకున్నాం. ఈ రోజుకు మా షెడ్యూల్ ఇదే. కోర్ కమిటీ సభ్యులంతా ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లే నిర్ణయం అంత సులభం కాదు. జటిలమైన సమస్య కనుక అందరి అభివూపాయాలనూ తీసుకోవాలి. అభివూపాయ సేకరణ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు సహా పలువురి అభివూపాయాలను సేకరించాం. ఇక జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకుల అభివూపాయాలను తీసుకుంటాం.

అది కొనసాగుతోంది’’ అని చెప్పారు. చిరంజీవి, రేణుకల అభివూపాయాన్ని తీసుకున్న సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, ఆజాద్, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. వారంతా ఒక్కొక్కరితో దాదాపు ఇరవై నిమిషాల పాటు మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితులతో పాటు తెలంగాణ సమస్య పరిష్కారానికి వారి అభివూపాయాలను తెలుసుకున్నారు. శనివారం మాదిరిగానే పలు ప్రశ్నలు వేసి, ప్రస్తుత పరిస్థితులపై వారి వైఖరిని రాబట్టారు. తెలంగాణ ఇవ్వాలా? వద్దా? వంటి సూటి ప్రశ్నలూ సంధించారు. సీమాంవూధలో 16 మంది ఎమ్మెల్యేలతో ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న చిరంజీవి నుంచి, తెలంగాణ ఇచ్చే పక్షంలో సీమాంవూధలో పర్యవసానాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై ఉన్న అభ్యంతరాలను కూడా విచారించినట్లు తెలిసింది.

హైదారాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా సమ్మెను నివారించగలమా? రాష్ట్ర విభజనే జరిగితే సీమాంవూధలో పార్టీ భవిష్యత్తు ఏంటి? మీ వర్గ ఎమ్మెల్యేల నుంచి వచ్చే వ్యతిరేకత ఎలా ఉండే అవకాశం ఉంది? లాంటి ప్రశ్నలకు చిరంజీవి నుంచి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. దానికి చిరంజీవి తాను సమైక్యవాదిని అయినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటానని కోర్‌కమిటీకి హామీ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణ సమస్యకు సత్వర పరిష్కారం కనుక్కోవడమే పార్టీకి అన్ని విధాలా మేలని ఆయన అభివూపాయపడినట్లు సమాచారం. నిర్ణయం తీసుకున్న తర్వాత అంతా సర్దుకుంటుందని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సమావేశంలో రేణుక ఏ అభివూపాయాలు వ్యక్తం చేశారన్నది తెలియరాలేదు. ఆమె విలేకరులతో మాట్లాడటానికి కూడా నిరాకరించి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12.20 గంటలకు చిరంజీవిని పిలిచిన కోర్‌కమిటీ సభ్యులు.. 20 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి.. అనంతరం రేణుకను పిలిచారు. ఆమెతో కూడా 20 నిమిషాలు మాట్లాడారు.

కావూరి అభివూపాయాన్ని కోరలేదు!

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ ఎంపీ కావూరి సాంబశివరావు అభివూపాయాన్ని కోర్ కమిటీ సోమవారం సేకరిస్తుందని ప్రచారం జరిగినా సమావేశానికి ఆయన్ను ఆహ్వానించలేదు. అభివూపాయ సేకరణ జరపాల్సినవారి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతోనే ఆయనను ఆహ్వానించలేదని తెలిసింది. అయితే ఆదివారమే తన అభివూపాయాలను ప్రణబ్ వద్ద కావూరి వ్యక్తం చేసినందువల్ల కోర్ కమిటీ సమావేశానికి ఆయన రాలేదని మరో వాదన వినిపిస్తున్నది.

అదే సందర్భంలో ప్రణబ్ ముఖర్జీతో విజయవాడ ఎంపీ లగడపాటి ఆదివారం రాత్రి పదకొండున్నరకు సమావేశమయ్యారు. వారి చర్చల వివరాలు బయటకు తెలియనప్పటికీ.. లగడపాటి వ్యక్తిగత సహాయకుడొకరు ప్రణబ్ ముఖర్జీ కార్యలయానికి సోమవారం వచ్చి.. కొన్ని కాగితాలు అందించి వెళ్లడం కనిపించింది. కాగా.. కోర్‌కమిటీ సభ్యులనుకలిసిన అనంతరం విలేకరులతో రేణుకాచౌదరి మాట్లాడుతూ ‘‘నేనేమీ వ్యాఖ్యానించను. సంప్రతింపులు కొనసాగుతున్న సమయంలో మాట్లాడటం అపరిపక్వతే అవుతుంది’’ అన్నారు. చిరంజీవి మాట్లాడూతూ ‘‘అధిష్ఠానం ఆహ్వానం మేరకు వచ్చాను. రాష్ట్రంలో పరిస్థితులపై నా అభివూపాయాన్ని తెలియజేశాను. సమ్మె వల్ల అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నందున త్వరితగతిన ఒక నిర్ణయం జరగాలి. ఇదే సరైన సమయం. ఏ నిర్ణయం తీసుకున్నా జరగబోయే పరిణామాలను అదుపు చేయవచ్చు. నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఆలస్యం అవ్వటం వల్ల ప్రజల్లో అశాంతి పెరుగుతున్నందున మరింత జాప్యం పనికిరాదు. నా అభివూపాయం మీకందరికి తెలుసు’’ అన్నారు.


0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP