టెట్ రద్దు కోసం ఐక్య ఉద్యమాలు
నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని యువజన, విద్యార్థి సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. టెట్ రద్దు, ఎస్జీటీలో బీఈడీ అభ్యర్థులకు అనుమతి, వయోపరిమితి వంటి అంశాలపై ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించాయి. ఈ నెల 31న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నాయి. సోమవారం ఏఐవైఎఫ్ కార్యాలయంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీడీఎస్యూ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో జేఎల్ గౌతంకుమార్, రాములు యాదవ్, ఎన్ లెనిన్బాబు, భాస్కర్, ఎం హన్మేశ్ పాల్గొన్నారు.
Take By: T News
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)

























0 comments:
Post a Comment