Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Friday, January 20, 2012

దగా పడిన ధర్మాస్పత్రి

- మందు బిళ్లలకూ దిక్కులేదు
- ఉన్న స్టాక్‌తోనే పంపిణీ మాయ
- మూలన పడిన విలువైన మెషినరీ
- కార్పొరేట్‌తో సర్కారు దోస్తానా!
- 10% కార్పొరేట్ వైద్యం ఉచితం
- కానీ.. కాగితాలకే పరిమితం
- వర్ధిల్లుతున్న ‘కార్పొరేట్ శ్రీ’
- ఈ పథకంలో రూ.3593 కోట్లు ఖర్చు
- ప్రైవేటు కార్పొరేట్‌కేరూ.2853 కోట్లు
- భారీగా అక్రమాలు..బయటపడేవి కొన్నే

Hospital1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
రెండు తెల్లమందు బిళ్లలు.. రెండు ఎర్రగోలీలు! మహా అయితే ఓ సూదిమందు! గత కొన్నేళ్లుగా సర్కారీ వైద్యం తీరిదే! కొన్ని చోట్ల ఇవీ ఉండవు! మారుమూల పల్లెల్లో సీజనల్ వ్యాధులు విజృంభించినా.. దిక్కులేని పరిస్థితి! ఏదైనా ప్రాణం మీదికి వస్తే ఏరియా ఆస్పవూతులో, జిల్లా ఆస్పవూతులో గతి! అక్కడా పరిస్థితులు అంతంత మాత్రమే ఉండటంతో సర్కారీ వైద్యం కునారిల్లుతోంది. కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ సేవలో పడిన ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం ధర్మాస్పవూతులను దగా చేస్తున్నది. ప్రభుత్వాస్పవూతుల ఉసురు తీసి.. కార్పొరేట్‌కు ఊపిరిపోస్తున్నది!

ప్రభుత్వ నిండు నిర్లక్ష్యం కారణంగా ధర్మాస్పవూతులు దగా పడుతున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బంది లేక, మందుల్లేక, అధునాతన యంత్రసామగ్రి ఉన్నా.. చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించే దిక్కులేక కునారిల్లుతున్నాయి. అదే సమయంలో ఖరీదైన వైద్యానికి పెట్టిందిపేరైన కార్పొరేట్ వైద్యశాలలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అక్కడ వైద్యం ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు గతంలో ఆ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు.. దాంతో కొంతకాలం పాటు ఆ ఆస్పవూతులు ఈగలు తోలుకున్న పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ప్రభుత్వ పుణ్యమాని ఆరోగ్యశ్రీ పేరుతో ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఈ ఆస్పవూతులను కాపాడేందుకు, పోషించేందుకు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లు స్థాయిలో వాటికి బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఫలితంగా ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు గుప్పెడు రోగాలకు మాత్రమే కోట్లలో ఉంటున్నది తప్పించి.. ప్రజల తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన, ఏరియా, జిల్లా ఆస్పవూతులపైనా ఉండటం లేదని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.

(, హైదరాబాద్)ఈ ఆర్థిక సంవత్సరం మందుల కోసం ప్రభుత్వం రూ.310 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.112కోట్లు గ్రీన్ చానల్ కింద ఇస్తామని నాలుగు నెలలక్షికితం చెప్పింది. ఇప్పటికీ రూపాయి కూడావిడుదలచేయలేదు. మందులు సరఫరా చేసే అనేక సంస్థలు కోర్టు కేసుల్లో ఉన్నాయి.వీటిని పరిష్కరించాలని ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాసినా ప్రభుత్వంగానీ, ఏజీ గానీ శ్రద్ధ పెట్టడం లేదని అధికారులే అంటున్నారు. మందుల పంపిణీలో అవినీతిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మందులు జిల్లా కేంద్రాల్లోని గోడౌన్లలో ఉండడంతో అక్కడికి మందుల కోసం వెళ్లేవారిని రూ.2వేల నుండి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మందులు అయిపోయినా పీహెచ్‌సీల్లోని సిబ్బంది మందులకోసం జిల్లా కేంద్రాలకు వెళ్లడం లేదనే వాదన ఉంది.

ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల కొన్ని సలహాలు కూడా చేశారు.అవి.. 1.మందుల కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా నేరుగా పీహెచ్‌సీల నుండి ఇండెంట్ తెప్పించడం. 2.శస్త్ర చికిత్సకు అవసరమైన సామాక్షిగికి ప్రతినెలా ముందుగానే ఇండెంట్ పెట్టడం. 3.ఆస్పవూతులకు సరఫరా చేసిన మందుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఆస్పవూతుల్లో అందే సేవలపై ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఆన్‌లైన్‌లో సమాచారం ఉంచాలి.4.ఆస్పవూతుల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను బోర్డుల రాయాలి. కానీ.. వీటిని ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు.

మూలపడిన మెషినరీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పవూతుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువైన సామాగ్రి ఉంది. ఇందులో రూ.450కోట్ల విలువైన మెషినరీని ప్రస్తుతం వాడటం లేదు.చిన్నచిన్న రిపేర్ల వల్ల ఇవి మూలపడ్డాయి. ఈ బాధ్యత నిర్వహించాల్సిన ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో యంత్రాలు పని చేయక రోగులు ప్రైవేటు ఆస్పవూతులకు వెళ్లి ఆస్తులు కరిగించుకునే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.

కార్పొరేట్‌తో దోస్తానా
సొమ్ములుం ఆస్పత్రి గడప తొక్కనిచ్చేది అన్న రీతిలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పవూతులు వ్యవహరిస్తున్నాయి. అధికార యంత్రాగం, పర్యవేక్షణ, తనిఖీ, నిఘా వంటివి ఏమాత్రం లేకపోవడంతో కార్పొరేట్ ఆస్పవూతులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. ఇక్కడ వసూలు చేసే చార్జీలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకే రకమైన రోగానికి, పరీక్షకు పలు ఆస్పవూతులు పలు రకాల చార్జీలు వసూలు చేస్తున్నాయి. చికిత్సతో రోగం కుదిరినా.. ఈ బిల్లులు చూసి వారి గుండెలు గుభేల్మంటున్న పరిస్థితి ఉందన్నవాదన ఎప్పటినుంచో ఉంది. రాజధాని పరిధిలో దాదాపు 2200ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పవూతులున్నాయి.ఇందులో 1500 ఆస్పవూతులకే అనుమతులున్నాయని తెలుస్తోంది. వివిధ సేవల చార్జీల వివరాలను నోటీసు బోర్డులో పేర్కొనాల్సి ఉంది. చాలా ఆస్పవూతుల్లో ఇవి కనిపించవు.

ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీలు పొందిన కారణంగా తమ ఆస్పవూతుల్లో పదిశాతం రోగులకు ఉచిత సేవలు అందిస్తామని ప్రభుత్వానికి అంగీకార పత్రం ఇస్తాయి. ఇలా రాయితీలు, సబ్సిడీలు పొందిన ఆస్పవూతుల్లో ఏ ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతున్న దాఖలాలు లేవు. అపోలో ఆస్పత్రి సహా అనేకం ఇదే బాటలో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రభుత్వం నుండి రూ.200కోట్ల విలువైన భూమిని సాధారణ ధరకు తీసుకుంది. ఇది ట్రస్టు ఆస్పత్రి కనుక తెలంగాణతో పాటు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారూ విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా తెలంగాణ నుండి ఒక్కరు కూడా డైరెక్టర్ కాలేదు. కేర్ ఆస్పత్రి యాజమాన్యం గుండె సంబంధ వ్యాధులున్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ను ఆసరాగా చేసుకుని, అవే ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేస్తూ, ఫౌండేషన్‌కు చూపిస్తూ డబ్బులు దండుకుంటోందనే ఆరోపణలున్నాయి.

కనిపించని తనిఖీలు
ఏటా రాష్ట్రంలో దాదాపు రూ.10వేల కోట్ల విలువైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో రూ.7వేలకోట్లకు పైగా ప్రైవేటు ఆస్పవూతుల జేబుల్లోకి వెళ్తున్నాయని అంచనా. కార్పొరేట్ ఆస్పవూతుల వ్యవహారాలను జిల్లా డీఎంహెచ్‌వో తనిఖీ చేయాలి. కొన్ని తనిఖీ బృందాలూ ఉండాలి. కానీ రాష్ట్రంలోని ఏ ఆస్పవూతిలోనూ తనిఖీలు జరగడంలేదని నిపుణులు అంటున్నారు. నెలనెలా మామూళ్లు అందడంతోనే అధికారులు నిమ్మకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. మందుల షాపుల్లోనూ తనిఖీలు లేవు. నాశిరకం మందుల అమ్మకాలను నిరోధించేందుకు డ్రగ్ కంట్రోల్ అథార్టీ ఉన్నా.. తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో మెడికల్ షాపుల్లో జరిగే అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని అంటున్నారు.

కార్పొరేట్ శ్రీ
అందరికీ మెరుగైన వైద్యం పేరుతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ.. కార్పొరేట్ ఆస్పవూతులకు కల్పతరువుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 2007లో ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించారు. అప్పటిదాకా కార్పొరేట్ ఆస్పవూతుల్లో ఈగలు తోలుకునే పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ఆరోగ్యశ్రీ రాకతో కార్పొరేట్ ఆస్పవూతులు నేడు ధనికులకంటే పేదలతోనే కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.3593కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో రూ.2853కోట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పవూతులకు,మిగిలిన రూ.740 కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు బిల్లులు చెల్లించారు. కార్పొరేట్ ఆస్పవూతులకు ఇచ్చిన డబ్బును ప్రభుత్వ ఆస్పవూతుల కోసం ఖర్చు చేసి ఉంటే మళ్లీ ప్రభుత్వ ఆస్పవూతులు జీవం పోసుకునేవని అధికారులు,మేధావులుఅంటున్నారు.ఒకసంస్థ చేసిన సర్వేలో రూ.2వేల కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు ఖర్చు చేస్తే కార్పొరేట్‌కు దీటుగా పనిచేస్తాయని, పూర్తిగా ఉచిత సేవలందించవచ్చని పేర్కొంది.

అయినా.. కార్పొరేట్‌కు దోచిపెట్టడానికే ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ కింద ఇంకెన్ని కోటె్లైనా ఇచ్చేందుకు సిద్ధమని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీలో అక్రమాలకూ అంతూపొంతూ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆస్పవూతులుఅవసరం లేకున్నా ఆపరేషన్లు చేసి బిల్లులు దండుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాకు హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌పై ఆరోగ్యశ్రీ ట్రస్టు క్రిమినల్ కేసులు పెట్టింది. గాంధీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎన్‌వీఎన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ సెంటర్‌పై ఈ నెల 15న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ ఐపీసీ 406-42కింద క్రిమినల్ కేసు పెట్టారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు, అనవసరమైన హెర్నియా శస్త్రచికిత్సలు చేసి ప్రజలను మోసం చేశారని రిపోర్టులో తేలిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఆరోగ్యశ్రీ పరిధిలో అనేకం జరుగుతున్నాయి.

DRRR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసర్కార్ వైద్యం పూర్తిగా నిర్వీర్యం కావడానికి ప్రభుత్వాలే కారణం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కార్పొరేట్ ఆస్పవూతులు ప్రైవేటు రంగంలోకి వచ్చాయి. దీనికి ముందు వైద్య వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. రాష్ట్రంలో మొదటి పౌరుడు గవర్నర్ నుండి మామూలు వ్యక్తి వరకు ప్రభుత్వ ఆస్పవూతికి వచ్చి అత్యుత్తమ చికిత్స చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ రానురాను కేటాయింపులు తగ్గిస్తూ కావాలనే ప్రభుత్వ వైద్యాన్ని సర్కారు నిర్వీర్యం చేసింది. ప్రభుత్వమే మందులు, పరికరాల కొరత సృష్టించడం మొదలు పెట్టింది. కార్పొరేట్ రంగం ఆవిర్భవించాక ప్రభుత్వ ఆస్పవూతులకు బడ్జెట్ పెంచాల్సింది పోయి ప్రభుత్వరంగ ఉద్యోగులకు ప్రైవేటు సెక్టార్‌లో ఇన్స్యూన్స్ చేయించి ప్రోత్సహించింది.
- డాక్టర్ నర్సయ్య, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు

తమిళనాడులో ఏ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ ఆస్పవూతుల్లో వైద్యం చేయించుకుంటారు. ఆ పరిస్థితి గతంలో మన రాష్ట్రంలోనూ ఉండేది. కానీ నేడు ప్రభుత్వమే కావాలని కార్పొరేట్‌ను ప్రోత్సహిస్తూ సీమాంధ్రవ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త కార్పొరేట్ ఆస్పవూతులొచ్చి కోట్లు దండుకుంటున్నాయి. పేదలకు 20శాతం ఉచితవైద్యం చేస్తామని చెప్పి వచ్చిన వాళ్లు ఒక్కరికీ వైద్యం అందించడం లేదు. లాబీయింగ్‌తో మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్న డబ్బుతోనే ప్రభుత్వ ఆస్పవూతులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయవచ్చు. కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వైద్యం చేస్తామంటే ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది? నమ్మకం పోయింది కనుకే ప్రభుత్వ ఆస్పవూతులు నిర్వీర్యం అవుతున్నాయి.
- డాక్టర్ రమేష్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
Take By: T News

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP