Wednesday, December 21, 2011
తెలంగాణ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెస్తాం - టెక్కి అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు
-తెలంగాణలో ఉత్పత్తి నైపుణ్యానికి కొదవ లేదు
- పరిశ్రమలను పథకం ప్రకారం అణిచేశారు
- ప్రత్యేక రాష్ట్రంలోనే మన మనుగడ
- రాష్ట్రం ఏర్పడితే ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
- స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి
- తెలంగాణ పెట్టుబడిదారులకు సలహాలు
‘‘సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ పారిక్షిశామిక రంగాన్ని ఛిద్రం చేశారు. నిజాంల కాలంలో నిత్యం కళకళలాడిన పరిక్షిశమలు నేడు కనుమరుగయ్యాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని టెక్కి అధ్యక్షులు వెంక చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన సీమాంధ్ర పారిక్షిశామికవేత్తల కుట్రలు, కుతంవూతాలను ఎదిరించి ఈ రంగంలో నిలబడ్డారు. పారిక్షిశామిక అభివృద్ధి కోసం ఏర్పడిన ఫ్యాప్సీ ఒక ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పారిక్షిశామిక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ వాణిజ్య పారిక్షిశామిక మండలి(టెక్కి)ని ఏర్పాటు చేశామని అన్నారు. వెంక టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..
(, హైదరాబాద్)ఒక సంస్థ ఉండగా మరొక సంస్థ ఏర్పాటు జరుతున్నదంటే, అక్కడ స్థానికుల ప్రమేయం సరిగ్గా లేకపోవడమే కారణంగా భావించాల్సింది ఉంటుందని టెక్కి అధ్యక్షులు ఎం వెంక చెప్పారు. ఫ్యాప్సీలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం రక్షించుకునేందుకే టెక్కిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో పరిక్షిశమల పాత్ర ఏంటి?
నిజాం సంస్థానాధీశులు పరిక్షిశమల ద్వారా ఖజానాకు భారీ ఆదాయం వచ్చేలా చేశారు. వ్యవసాయం అభివృద్ధికి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాజులు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ పరిక్షిశమలను తెచ్చారు. స్పిన్నింగ్ మిల్స్, దాల్, రైస్, షుగర్స్ మిల్స్లు ఈ కోవలోనివే. సహజ వనరులు కూడా అధికంగా ఉండడంతో వీటిని ఉపయోగించుకోవడానికి స్టీల్, ఇంజనీరింగ్ పరిక్షిశమలను పెట్టారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ను కల్పించారు.
సమైక్య రాష్ర్టంలో పారిక్షిశామిక అభివృద్ధి ఎలా జరిగింది? తెలంగాణ పాత్ర ఎంత?
సమైక్య రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృద్ధి ఒకవైపే ఎక్కువ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నది సీమాంవూధలే. దీంతో వారికే ప్రోత్సాహకాలు ఎక్కువగా లభించేవి. అనుకున్న స్థాయిలో తెలంగాణ వారికి పోత్సాహకాలు దొరకడం లేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ పారిక్షిశామిక రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగాయా?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్రంగ పరిక్షిశమల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. సింగరేణి గనుల్లో అధికార వర్గం అంతా సీమాంవూధలే. దీంతో వారు తమ ప్రాంతానికి చెందిన వారినే కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. స్థానికులకు కాంట్రాక్టర్లుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారు. ఆఫీసు స్టాఫ్ ఉద్యోగాల్లోనూ వారే చేరారు. గనిలో పని చేసే కార్మికులు మాత్రమే తెలంగాణ బిడ్డలు. బీహెచ్ఈఎల్ తదితర కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. సీమాంవూధులు హైదరాబాద్లోనే పరిక్షిశమలు ఏర్పాటు చేసినా, వాటిల్లో స్థానిక తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు
నిజాం కాలంలో వెలిగిన పరిక్షిశమలు నేడు మూతపడటానికి కారణాలేంటి?
సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ పరిక్షిశమలు మూతపడ్డాయి. దీనికి ఆంధ్రా అధికారులు ఊతమిచ్చేలా కావాలనే నిర్లక్ష్యం చేశారు. అవి మూతపడేలా చేశారని పరిక్షిశమలు మూతపడిన తీరు చూస్తే అర్థమవుతుంది.
ప్రైవేట్ రంగంలో తెలంగాణ పెట్టుబడిదారుల పాత్ర ఏంటి?
ప్రైవేట్రంగంలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలు ఎదిగే అవకాశాలు లేకుండా దొడ్డిదారిన అడ్డుకున్నారు. వర్గంలోనూ వారిదే పైచేయి కావడంతో చివరకు రుణ సౌకర్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిక్షిశమలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం సరైన పద్ధతిలో అందకపోవడంతో పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా వెనక్కు తగ్గారు.
తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు వ్యాపారం చేయడం రాదనే విమర్శలున్నాయి కదా?
ఈ ప్రచారం పథకం ప్రకారం సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రనే. తెలంగాణ పారిక్షిశామికవేత్తలు మొదటి నుంచి ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి సారించారు. కాకపోతే తెలంగాణ వారికి కుట్రలు, కుతంవూతాలు తెలియవంతే. కానీ.. 80 శాతం సీమాంవూధుల పరిక్షిశమలు వచ్చాయి. అధికార వర్గంలో కూడా వారే ఉండడంతో పరిక్షిశమల లైసెన్స్లు, సబ్సిడీలు వారికే ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ వాళ్లు ఒ ప్రాజెక్టు తీసుకొని వెళితే.. అనుమతులు ఇవ్వకుండా వేధిస్తారు. విసిగించి ప్రాజెక్టులను కాజేస్తారు. చివరకు తెలంగాణ మున్సిపాలిటీల్లో వచ్చే చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే కాంట్రాక్టు మొత్తం సీమాంవూధకు చెందిన రాంకీకే ఇవ్వాలని సెక్ర స్థాయి అధికారులు ఓరల్గా చెప్పి ఇతరులకు అవకాశాలు లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. .
తెలంగాణ కార్మికులు పని చేయరు కాబట్టే.. ఉద్యోగాలు రావట్లేదన్న ప్రచారం ఉంది..
పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంలో ఇదీ ఒక భాగమే. కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చికుక్క అని ప్రచారం చేయాలన్న తీరుగా, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకూదన్న ఉద్దేశంతో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సీమాంధ్ర పరిక్షిశమల్లో పనిచేసే కొద్ది మంది తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు చాలా పోటీతత్వంతో పని చేస్తున్నారు. నిజాం హయాంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఉన్నారు. వరంగల్లో తయారు చేసిన కత్తులు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవంటే ఇక్కడి కార్మిక శక్తి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి.
తెలంగాణ పారిక్షిశామిక రంగం కోసం టెక్కి ఏం చేయాలనుకుంటోంది?
తెలంగాణ పారిక్షిశామిక రంగానికి జరిగిన అన్యాయంపై శ్వేత పత్రం తయారు చేస్తాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇస్తాం. సర్కారు స్పందించకపోతే ముఖ్యమంవూతిని కలుస్తాం. అక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేం తయారు చేసే రిపోర్టు ప్రభుత్వానికి నచ్చే పద్ధతిలో ఉంటుంది. పారిక్షిశామికరంగంలోకి కొత్త వచ్చే ఔత్సాహికులను మేం ప్రోత్సహిస్తాం. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని వస్తే దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలా సలహాలిస్తాం. మా అనుభవాన్ని వారికి ఉపయోగపడేలా సహకారం అందిస్తాం. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ అంతటా కొత్త పరిక్షిశమలు వచ్చేలా ప్రయత్నిస్తాం.
ఈ మేరకు టెక్కి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తుంది. ఈ కమిటీల ద్వారా నిత్యం సమాచారాన్ని సేకరించి, సమీక్షించి పారిక్షిశామికాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇదే సమయంలో కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ఇకపై వచ్చే పరిక్షిశమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తాం. ఈ మేరకు ప్రతివిషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తాం. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విదేశీ పెట్టుబడుల సహకారాలతో ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పునరుద్ధరించేందుకు టెక్కి పూనుకుంటుంది. ఈ మేరకు పేపర్ వర్క్ చేస్తున్నాం
Telangana History
Read Part - 1 click this link
http://voice2telangana.blogspot.com/2011/12/nizam-in-telangana.html
Read Part - 2 click this link
http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html
Read Part - 3 click this link
http://voice2telangana.blogspot.com/2011/12/telangana-history-part-3-and-hyderbad.html
Take By: T News .
తెలంగాణ భూముల్లో ఐటీ లూటీ! - ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణపరిశ్రమ -3 (Telangana History Part - 3 and Hyderbad Nizam Histrory
- పరిశ్రమలకు తెర్లు పట్టిస్తున్న సర్కార్
- ఔటర్రింగ్ రోడ్డు వరకు తరిమివేత
- కాలుష్యేతర యూనిట్లకూ కష్టాలే
తెలంగాణ పరిశ్రమలకు సర్కారు తెర్లు పట్టిస్తున్నది. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్నపరిశ్రమలపై కాలుష్య నెపం వేసి ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు నెట్టివేసే కుట్ర చేస్తోంది. ఇదే ఒరవడిలో కాలుష్యేతర కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న యూనిట్లను సైతం తరిమేస్తోంది. ఖాళీ అయిన జాగాలో ఐటీ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో లూటీకి తెగిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాన్ని బూచిగా చూపి.. కొత్త పరిశ్రమలను సీమాంధ్ర జిల్లాలకు తరలించేస్తోంది. ఉన్న పరిశ్రమలు సంపూర్ణంగా పనిచేసేందుకు ప్రోత్సాహకాలు అందకుండా వాటినీ అటకెక్కిస్తోంది. వాటిపై పవర్హాలిడే రూపంలో పంజా విసురుతోంది. పొమ్మనడమే కాకుండా.. పొగ కూడా పెడుతున్నది!
హైదరాబాద్, డిసెంబర్ 20 (): ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేతృత్వంలో పరిక్షిశమల శాఖ, పారిక్షిశామికవాడల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం వైఖరేమిటనేది వారిచేత చెప్పించింది. నిజాం కాలం నాటి ఆజామాబాద్ పారిక్షిశామికవాడ నుంచి సనత్నగర్, ఉప్పల్, నాచారం, బాలానగర్, జీడిమెట్ల పారిక్షిశామికవాడల చుట్టూ జనావాసాలు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ట్రాఫిక్ సమస్యలు మితిమీరిపోతున్నాయనే నెపంతో వాటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పారిక్షిశామికవాడలను ప్రజోపకర ఇతర అవసరాల కోసం ‘కన్వర్ట్’ చేద్దామనే దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. సర్కారు ఆలోచనలకు సీమాంధ్ర పారిక్షిశామిక వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.
బీహెచ్ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రయివేటు రంగంలో ఉన్న భారీ పరిక్షిశమలకు చిన్నతరహా పరిక్షిశమల నుంచి ముడిసరుకు అందుతున్నది. నిజానికి వీటిలో అనేకం కాలుష్యేతర యూనిట్లే. కానీ.. అది పట్టించుకోకుండా చిన్న తరహా పరిక్షిశమలపై గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలకు ప్రభుత్వం ఒడిగడుతున్న తీరు పట్ల చిన్నతరహా పరిక్షిశమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గత దశాబ్దకాలంగా పొల్యూషన్ (కాలుష్యం) పేరిట సనత్నగర్, బాలానగర్, జీడిమెట్ల పరిక్షిశమలపై ఉక్కుపాదం మోపిన సర్కారు, కొత్తగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఉన్న పరిక్షిశమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించేందుకు పావులు కదుపుతోంది. పారిక్షిశామికవాడల్లో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో సీమాంవూధులకు సర్కారు గోల్డెన్ షేక్ హాండ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నది.
పారిక్షిశామిక ఉత్పత్తిరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు కాలుష్యరహిత పరిక్షిశమలు (నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ) ఏర్పాటు పేరుతో తెలంగాణ భూముల్లో ‘మల్టీ యూజ్ జోన్’ అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చారు. కాలుష్యానికి కారకులవుతున్నాయనే నెపంతో ఉన్న పరిక్షిశమలను మూసివేశారు. పారిక్షిశామికవాడల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సీమాంవూధుల చేతుల్లో ఉన్న పరిక్షిశమలు భూములను కాపాడుకునేందుకు పారిక్షిశామిక ఉత్పత్తులు నామమావూతంగా చేస్తూ పారిక్షిశామికీకరణను తిరోగమనానికి తీసుకెళ్తున్నారు.
దీంతో పారిక్షిశామికోత్పత్తులు తగ్గిపోవడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా లీజుల పొడిగింపులను నిలిపివేయడం, పరిక్షిశమల శాఖ ద్వారా శాఖాపరంగా కట్టడి చేయడంతోపాటు స్థానిక సంస్థల నుంచి అభ్యంతరాలను లేవదీస్తూ ఇప్పుడున్న పరిక్షిశమల మనుగడను అడ్డుకునే దుస్సాహసానికి సర్కారు ఒడిగడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పరిక్షిశమలు, ప్రైవేటు రంగంలో కొన్ని వందల పరిక్షిశమలున్నాయి. హైదరాబాద్, దాని పరసర ప్రాంతాలు కలిపి ఇండవూస్టియల్ హబ్గా విలసిల్లుతున్నది.
గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిక్షిశమలను ఏర్పాటును అడ్డుకుంటూ పరిక్షిశమలు పెట్టేందుకు వస్తున్న ఔత్సాహిక పారిక్షిశామికవేత్తలను విస్తరణ పేరిట విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ె ల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు తరలించారు. ఈవిధంగా గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల కన్నా సీమాంధ్ర జిల్లాల్లోనే కొత్త పరిక్షిశమలు ఏర్పాటవడం గమనార్హం.
ప్రస్తుతం చలికాలంలోనూ కరెంటు కోతలను అమలుచేస్తున్న సర్కారు పరిక్షిశమలకు పవర్ హాలిడే విషయంలో వివక్ష చూపుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల పవర్హాలిడే, ఒక రోజు వీక్లీ హాలిడే పేరుతో పరిక్షిశమలకు విద్యుత్ కోతలను అమలుచేస్తున్నది. ఇదే ప్రభుత్వం సీమాంధ్ర పరిక్షిశమలకు పవర్ హాలిడే మినహాయింపు ఇస్తున్న విషయాన్ని పారిక్షిశామికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నంలో పరిక్షిశమలకు పవర్హాలిడే ప్రశ్నే లేదు. కర్నూలులో రోజుకు రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తేనే ఆందోళనలకు పూనుకుంటున్నారు.
ఏపీఐఐసీ ఫక్తు వ్యాపార ధృక్పథంతో వ్యవహరించడం వల్ల గత ఏడు సంవత్సరాలుగా ఇండవూస్టియల్ గ్రోత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలున్నాయి. గతంలో ఏదేని ఒక పరిక్షిశమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే సదరు పరిక్షిశమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాక భూమి సదరు పరిక్షిశమ పేరిట రిజివూస్టేషన్ చేసే పద్ధతి కొనసాగేది. పారిక్షిశామిక అవసరాలకు భూముల కేటాయింపులు ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకువచ్చాక ఏకంగా అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకోవడం, అవసరానికి మించి భూములను నామమావూతపు ధరకు భూముల విక్రయించడం పరిపాటిగా మారిపోయింది.
- చేనేతలో పైచేయి మన నేతన్న
- సాటిలేని చండూరు ఇత్తడి
- నవాబును గరీబు చేసిన యాంత్రీకరణ
- ప్రోత్సాహం కరువైన బడుగు పారిక్షిశామికవేత్త
హైదరాబాద్, డిసెంబర్ 20 () : నాడు రాజులు, రాజ్యాలు ఏవైనా వారు వాడే డెమాస్కస్ కత్తులు చేసింది మన వరంగల్ జిల్లా కమ్మరులే! ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి చూపెట్టింది మన పోచంపల్లి నేతన్నలే. పసిడి కన్నా మెండుగా ఇత్తడి కళారూపాలను ప్రపంచానికి చూపింది చండూరు బడుగులే. యాంత్రీకరణ తొలినాళ్ళలో పారిక్షిశామికరంగాన్ని ఆవిష్కరించిన నవాబులు నేడు గరీబులుగా మారారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగి ఆర్థిక స్థిరత్వంతో పారిక్షిశామికవేత్తలుగా నిలబడాల్సిన దళిత బహుజనులు సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంవూతాల ముందు కునారిల్లారు. అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు బడుగు వర్గాలకు చెందిన కొందరు పట్టుదలగా ముందుకు నెట్టుకొస్తున్నారు.
ఇది ఆనాటి పరిస్థితి. కాలక్షికమంలో బ్రిటీష్ వాళ్ళు దేశంలోకి వచ్చాక వారి పారిక్షిశామిక ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని దెబ్బతీశారు. ఆ సమయంలో యాంత్రిక ప్రభావం తన రాజ్యంపై కూడా పడే ప్రమాదం ఉందని ముందే ఊహించిన నిజాం నవాబు ఏకంగా యంత్ర పరిక్షిశమలనే తన రాజ్యంలోకి తీసుకువచ్చారు. ఆలా తీసుకువచ్చిన పరిక్షిశమలే ఇక్కడ వ్యవసాయరంగానికి, చేతి వృత్తులకు పోత్స్రాహకంగా మారాయి.
కావాలనే చేయూత నివ్వడంలేదు
ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాలను పరిక్షిశమల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో సీమాంద్ర ఉన్నత వర్గాలకు చెందిన పెట్టుబడిదారుల పరిక్షిశమలే వచ్చాయి. నైపుణ్యం ఉన్నా ఇక్కడి కార్మికులకు అవకాశాలు ఇవ్వలేదు. ఫలితంగా ఒక తరం ఆర్థికంగా చితికిపోయింది.
-ఇప్పుడు మొండిగోడలతో మిగిలింది..
-సర్సిల్క్ మిల్లు మూత పడి 26 ఏళ్లు
నిజాం సంస్థానంలో ఇంజనీరుగా పనిచేసిన లియాఖాత్ అలీ ఖాన్ కృషితో రూ.150 కోట్ల పెట్టుబడితో సర్సిల్క్ మిల్లు మొదలైంది. 1950లో మిల్లు నిర్వహణ ప్రముఖ పారిక్షిశామికవేత్త బిర్లా యాజమాన్యంలోకి మారింది. 2500 మంది పర్మినెంట్ కార్మికులు, సిబ్బంది, 1500 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 6వేల మందికి జీవనోపాధి కల్పించిన ఈ మిల్లు 1984లో యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఆల్కహాల్, కరెంట్ కొరతను సాకుగా చూపుతూ లేఆఫ్ విధించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1985 ఏప్రిల్ 26న అక్రమ లాక్ఔ్ తో మూతపడింది.
కార్మికులు ఉద్యోగాలు పోయి, పొట్టచేతబట్టుకొని సూరత్, బీమాండి, ముంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్ తదితర నగరాల్లోని వస్త్ర పరిక్షిశమల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల తదితర పట్టణాలకు వలస కూలీలుగా, టీ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడికీ పోలేనివారు స్థానిక దుకాణాల్లో గుమస్తాలుగా పని చేయడం, పండ్ల వ్యాపారాలు చేసుకుటూ బతుకుతున్నారు. ఉపాధి లేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కుటుంబాలను సాకలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.
- ఏకతాటిపైకి తెలంగాణ పారిక్షిశామిక వర్గం
- తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వంపై చర్చ
- చేయల్సిన కృషిపై మార్గనిర్దేశనం
హైదరాబాద్, డిసెంబర్ 20 (టీ న్యూస్): తెలంగాణ కోసం తాము సైతం అంటూ పారిక్షిశామిక వర్గం ముందుకు వచ్చింది. 55 ఏళ్ల సమైక్య పాలనలో పారిక్షిశామిక వాడలను చిదిమేసిన పాలకుల దుర్నీతికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. యజమానులేగానీ వ్యక్తులుగా కాదు.. శక్తులుగా ముందుకు వస్తున్నారు. ఈ రంగంలో పాలక పక్షం వివక్షను బయటి సమాజానికి తెలియజెప్పడంతో పాటు తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాలని భావించిన పరిక్షిశమల యాజమానులు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి)ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగం కుంటు పడుతుందనే అపోహలను పారదోలేందుకు ప్రాంత పారిశ్రామిక వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న పారిక్షిశామిక వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం టెక్కి అంటున్నారు. టెక్కి ఆవిర్భావ మహాసభ మసాబ్ట్యాంక్ వద్ద ఉన్న హోటల్ గోల్కొండలో బుధవారం జరగనుంది. పెన్నార్ ఇండవూస్టీస్ చైర్మన్ జే నృపేందర్రావు అధ్యక్షతన జరిగే టెక్కి ఆవిర్భావ సమావేశంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రారంభోపన్యాసం చేస్తారు.
తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వం కోసం ఏం చేయాలనే అంశంపై నృపేందర్రావు మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ పారిక్షిశామిక విధానం ఏవిధంగా ఉండాలనేదానిపై పత్రాలు, ప్రజెం ఇవ్వనున్నారని టెక్కి అధ్యక్షుడు ఎం వెంక తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంవూతాలున్నా తెలంగాణలో పారిక్షిశామిక రంగ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపుడ్డి, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎమ్మెల్సీ కమలాకర్రావులు పాల్గొంటారు.
Read Part - 2 click this link
http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html
Take By: T News Read more...
Tuesday, December 20, 2011
30 of world’s 50 wealthiest Arabs are Saudis
The UAE got only four on the list and Qatar just three.
Manja' makers look forward to soaring profits
Chomsky, 70 others oppose Assange's extradition
రోజూ ఒక్క పూట బడే..?
ఆత్మకూర్.ఎస్)పాఠశాల భవనంలో కళాశాలను నిర్వహించడం వల్ల విద్యార్థులు వలసలు వెలుతున్నా అధ్యాపకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. మండల పరిధిలోని నెమ్మికల్ కళాశాల భవనం నిర్మించి ఎనిమిది నెలలైనా ఉపాధ్యాయులు, లెక్చరర్లు కుమ్మకై్క కళాశాలను తరలించకుండా ఒక్క పూట చదువు చెప్పి తప్పించు కుంటున్నారు. దాదాపు 550మంది విద్యార్థులున్న నెమ్మికల్ ఉన్నత పాఠశాలలో నేడు 200ల మంది కూడా మిగలలేదు. ఒక పూట పాఠశాల మరోక పూట కళాశాల కారణంగా బోధన కష్టమవుతుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు, కలెక్టర్కు విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. నూతన కళాశాలలో వసతులు ఉన్నప్పటికీ ఎదో ఒక్కటి సాకు చెప్పి ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ కళాశాలను తరలించకుండా అంతర్గత ప్రయత్నాలు చేస్తున్నారు.
కళాశాల తరలిస్తే లెక్చరర్లు, ఉపాధ్యాయులు రెండు పూటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇతర వ్యాపారాలకు అలవాటు పడిన అధ్యాపక బృందం విధులు నిర్వహించడం కష్టమౌ తది. అందుకే కళాశాల తరలింపును వారు అంతర్గతంగా అడ్డుకొంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కళాశాల తరలించకపోవడం వలన ఒక పూట పాఠశాల చదువుతో న్యాయం జరగడం లేదని ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఇతర పాఠశాలలకు వలసలు వెళుతున్నారు. ప్రభుత్వ హాస్టల్లో వందకుపైగా ఉన్న విద్యార్థులు వలసల కారణంగా ఇప్పుడు 27 మంది మిగిలారు. కళాశాలలోను ఇదే తంతు జరుగుతోంది. నాణ్యమైన విద్య అందించలేని కళాశాల అధ్యాపక బృందం పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తున్నారు. దాని కారణంగా ప్రతిభ గల విద్యార్థుల భవిష్యత్ అధ్వాన్నంగా మారుతోంది.
కళాశాల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని, నాసిరకం తలుపులు, కిటికీలు, విద్యుత్ పరికరాలు, ఫ్యాన్లు అమర్చడంతో ఇటీవల కళాశాల భవనం పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీఓ జి.మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి పనులు మరోసారి చేశారు. కళాశాలను నూతన భవణంలోకి మార్చాలని రెండు పూటలా పాఠశాల, కళాశాల నడపాలని కొంతమంది జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే కళాశాలను తరలించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
కన్నీటి పల్లెలు
- ఎండుతున్న గొంతులు
- ముంచుకొస్తున్న మంచినీటి ముప్పు
- తెల్లారుజామునే బోరుబావుల వద్ద బారులు
- అడుగంటిన భూగర్భజలాలు
- కరెంటు కోతలతో మరింత కష్టం
- తూతూ మంత్రంగా ట్యాంకర్లతో నీటి సరఫరా
- కానరాని బోర్ల మరమ్మతులు
- ప్రత్యేకాధికారుల పాలనలో అరిగోస
: వేసవి రాక ముందే తాగునీటి కోసం ప్రజలు అరిగోస పడుతున్నారు. వర్షాభావంతో అడుగంటిన భూగర్భజలాలు, వట్టిపోయిన బోరు బావులు, పనిచేయని రక్షిత నీటి పథకాలు, కరెంటు కోతలు, అధికారుల నిర్లక్ష్యం వెరసి జనం గొంతుపూండేలా చేస్తున్నాయి. గ్రామాల్లో తెల్లారుజామున మూడు గంటలకే ‘పానిపట్టు’ యుద్ధం మొదలవుతోంది.
తాగునీటి సమస్యతో బతుకులు కడతేరుతున్నాయి. తాగునీటి కోసం వెళ్లిన ఓ తల్లి ఇంటికొచ్చే సరికి ఐదునెలల పసికందు గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి మృతి చెందిన హృదయవిదారకమైన సంఘటన రెండురోజుల క్రితం రంగాడ్డి జిల్లా చేవెళ్లలో చోటుచేసుకుంది. వేసవి రాకముందే ప్రజల గొంతెండుతోంది. ప్రత్యేకాధికారుల పాలన నీటిఎద్దడిని ఏమాత్రం తీర్చలేకపోతోంది. జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరున్నా వాటిని ప్రజలకు అందించడంలో పాలకులు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.భాగ్యనగరం ప్రజల క‘న్నీళ్ల’ కథ అంతులేనిది. 87లక్షల జనాభాకు సరిపడా నీరందించలేని పరిస్థితి. రోజుకు 459 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ)నీరు అవసరం ఉండగా జలమండలి అధికారులు కేవలం 340 ఎంజీడీలు మాత్రమే అందిస్తున్నారు. ఇందులోనూ ప్రాంతాల వారీగా వివక్ష ప్రదర్శిస్తున్నారు. రోజుకు మనిషి 165 లీటర్లు అందించాల్సి ఉండగా ప్రముఖులకు 500 లీటర్లు, మురికివాడలకు 100 లీటర్లతో సరిపెడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్లో విలీనమయిన 12 మున్సిపాలిటీ ప్రాంత ప్రజల గోస వర్ణనాతీతం. అంతర్జాతీయ నగరంగా ఎదిగామని చెప్పుకునే ప్రభు త్వం ఇక్కడి ప్రజలకు వారానికోకసారి నీరు సరఫరా చేస్తోంది. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నగరానికి గోదావరి, కృష్ణా మూడో దశ పథకాలు చేపడుతున్నామంటూ ప్రతి సమావేశంలోనూ ఊదరగొట్టే నేతలు ఈ పథకాల పనితీరు చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి. గోదావరి ప్రాజెక్టు మూడేళ్లలో 25శాతం పనులు జరగగా కృష్ణా మూడోదశ మాత్రం ఇంక కాగితాలపైనే నలుగుతోంది. ఇవన్నీ వెరసి కాలనీలకు అతీతంగా ఇక్కడి ప్రజలు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
తాగునీటికి తహ తహ
వరంగల్ జిల్లాలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాలేదు. సెప్టెంబర్ నుంచి వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. దీంతో నీటిమట్టం తగ్గిపోయి గ్రామాల్లోని చేతి పంపులకు నీరు అందక రెండు వేల చేతి పంపులు పూర్తిగా పనిచేయడంలేదు. మరో వెయ్యి చేతి పంపుల్లో డిసెంబర్ రెండోవారం నాటికే నీరు అందక పనిచేయడంలేదు. భూగర్భ జలాల నీటి మట్టం సాధారణ నీటి మట్టంకన్నా నాలుగు మీటర్లకు అడుగంటాయి. గ్రామాల్లో కరెంటు కోత తీవ్రంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరంగల్లో కూడా మంచినీటి ఎద్దడి ఏర్పడంతో మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. పాఖాల, రామప్ప చెరువుల్లో నీరు అడుగంటడంతో సమక్షిగనీటి పథకాలు మూలకు పడనున్నాయి. ఎస్సాస్పీ నీటిని రెగ్యులర్గా విడుదల చేస్తేనే సమగ్ర నీటి పథకాలు పనిచేసే పరిస్థితి ఉంది. ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదలచేసింది.
వారానికి ఒకసారే ఇంటి ఎదుట కల్లాపి
నల్లగొండ జిల్లాలో మంచినీటి కోసం ప్రజలు అప్పుడే అవస్థలు పడాల్సి వస్తోంది. చండూరు మండలంలోని గుండ్రపల్లిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వారం రోజులకు ఒక సారి మాత్రమే ఇంటిముందు కల్లాపి చల్లుకుంటున్నారు. వంటకు నీరు దొరికితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నారు. నియోజకవర్గంలో స్కీం బోర్లన్నీ ఎండిపోయాయి. కృష్ణా జలాలు అందడం లేదు. మిర్యాలగూడ ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. వేముపల్లిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో బేతవోలు చెరువు నుంచి మండలానికి నీరు అందుతున్నా అవి మురికిగా వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొండపాడు ప్రాజెక్టు పూర్తై పైప్లైన్ పూర్తి కాలేదు. సూర్యాపేటలో 70 శాతం ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. భువనగిరి, యాదగిరిగుట్టలో కూడా అదే పరిస్థితి.
వేసవి రాకముందే నీటికి కటకట
నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవి రాకముందే మంచినీటి కోసం జనం అవస్థలు పడుతున్నారు. గాంధారి మండలం బీర్లమార్ తండా, కొత్తబజార్ తండా, జ్జెపల్లి, ఉత్తూనూరు, బుర్గర్, జువ్వాడి, బ్రహ్మణిపల్లి, కర్ణగడ్డతండాలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. బుర్గుల్లో బోర్లలో నీరు రాకపోవడంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. బ్రాహ్మణపల్లిలో పూర్తిగా ఫ్లోరైడ్నీరు ఉండటంతో మంచినీటి ట్యాంకుకు వెళ్లే పైప్లైన్లు చెడిపోయినాపట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండలంలోని కొల్లూర్, దేశాయిపేట్, తిర్మలాపూర్లో నీటి పైప్లైన్ అస్తవ్యస్తంగా తయారైంది. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం తడిహిప్పర్గా, అంతాపూర్లో పైప్లైన్ ధ్వంసమై, ఉన్న బోర్లు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల ట్యాంకులు నిర్మించినా కనెక్షన్ ఇవ్వకపోవడంతో వృథాగా పడిఉన్నాయి.
దాహార్తి తీర్చని ట్యాంకర్ల సరఫరా
రంగాడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 705 గ్రామ పంచాయతీలున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 1,472 ఉండగా10,532 చేతిపంపులున్నాయి. ఇందులో సగానికి పైగా చేతిపంపులు వర్షాభావంతో వట్టిపోయాయి. త్రీఫేజ్ కరెంటు సపె్లై లేకపోవడంతో చాలా చోట్ల బోర్లున్నా గొంతుతడవటం లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా ఇవీ దాహర్తిని తీర్చలేకపోతున్నాయి. వ్యవసాయ బోర్లు కిరాయికి తీసుకుని మరీ నీటిని అందిస్తున్నా ఎద్దడి తీవ్రతను తగ్గించలేకపోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో సమస్య తీవ్రంగా ఉంది. తెల్లవారుజామున మూడు గంటలకే నీటికోసం క్యూ కడుతున్నారు. రెండురోజుల క్రితం చేవెళ్ల మండలం అల్లవాడలో భీమమ్మ నీళ్లకు వెళ్లగా ఐదు నెలల కుమారుడు భానువూపసాద్ ఏడ్చి ఏడ్చి ప్రాణాలోదిలిన విషయం తెలిసిందే.
గుక్కెడు నీటికోసం కిలోమీటర్ల దూరం
మహబూబ్నగర్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్ట ప్రాంతాల్లో ఇప్పటికే వారానికి ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడు కావడంతో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు సైతం ఎండిపోవడంతో పశువులకు కూడా నీళ్లు కరువవడంతో రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. జిల్లాలోని 1,545 గ్రామాల్లో 17,132 చేతిపంపులు ఉండగా, అందులో సగం ఇప్పటికే పనిచేయడం లేదు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రభాకర్ తెలిపారు. కరువు నివారణ పథకం కింద రూ. 4 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.
అస్తవ్యస్తంగా మంచినీటి వ్యవస్థ
ఆదిలాబాద్ జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ వెయ్యి గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. జిల్లావ్యాప్తంగా 2,463 రక్షిత మంచినీటి పథకాలు, 20,309 బోరుబావులుండగా మూరుమూల ప్రాంతాల్లో త్రీఫేజ్ విద్యుత్ లేకపోవడంతో కొన్ని పనిచేయకపోగా మరికొన్ని చెడిపోయాయి. ముథోల్ మండలం బిద్రెల్లిలో మంచినీటి సరఫరా నిలిచివడంతో రెండుకిలోమీటర్ల దూరంనుంచి నీరు తెచ్చుకుంటున్నారు. బాసర నుంచి పైప్లైన్ద్వారా గ్రామానికి నీరు రావాల్సి ఉండగా గ్రామశివారులోని బోరు మోటర్ చెడిపోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది.
తలాపునే గోదారి.. తీరని దాహం
ఖమ్మం జిల్లాలో మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. ఏళ్ల నాటి బోర్లు మొరాయిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. వాటికి కనీస మరమ్మతులు లేక కొన్నిచోట్ల పనికిరాకుండా పోయాయి. జిల్లాలో తాగునీటికి 20కిపైగా మండలా ప్రజలు అల్లాడుతున్నారు. తలాపున గోదావరి ఉన్నా నీటి కష్టాలు మాత్రం తీర్చే నాథుడే కరువయ్యాడు. దాదాపు ప్రతి పంచాయతీలో ఐదు నుంచి 10కిపైగా బోరు మోటార్లు రిపేరులో ఉన్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో వేళాపాళా లేని నీటి సరఫరా ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. రాత్రి వేళల్లోనూ నీటిని సరఫరా చేస్తుండటంతో ఇబ్బందిగా మారింది.
తాగునీటి సరఫరా అంతంతే
కరీంనగర్ జిల్లాలో మొత్తం 2,260 హాబి పూర్తిగా తాగునీరు అందుతున్న గ్రామాలు 295 మాత్ర మే. 81 గ్రామా ల్లో తాగునీటి వ్యవస్థేలేదు. మిగ తా గ్రామాల్లో పాక్షికంగా తాగునీరు అందుతోంది. 2,158 రక్షి త మంచినీటి పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. 20,988 బోరు బావుల్లో వెయ్యి పనిచేడంలేదు. జిల్లాలోని మంథని, సిరిసిల్ల డివిజన్లతోపాటు హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. వేములవాడ, కొండగట్టులోనూ సమస్య తీవ్రంగా ఉంది.
మెతుకుసీమలో పథకాలు అసంపూర్ణం
ప్రత్యేకాధికారుల పాలనలో మెదక్ జిల్లాలోని గ్రామాలు తాగునీటికి అల్లాడుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ప్రత్యేక మంచినీటి పథకాలున్నా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అవాంతరాలతో ప్రజల గొంతెండుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 212 కోట్లతో నిర్మాణంలో ఉన్న 26 మంచినీటి పథకాలు నత్తనడకన నడుస్తుండటంతో ప్రజల దాహార్తి తీరడంలేదు. సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు మినహా జిల్లాలోని మిగతా గ్రామీణ ప్రాంతాల్లో చేతి పంపులు, బోరుబావుల ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతోంది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాలకు ఉద్దేశించిన సత్యసాయి మంచినీటి సరఫరా పథకం నిర్వహణ లోపంతో కుదేలైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోనే సింగూరు ప్రాజెక్టు ఉన్నా స్థానికులకు తాగునీటి గోస తప్పడం లేదు.
Take By: T News
ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణ పరిశ్రమ -2 (Telangana History - Nizam in Telangana)
- వేల మంది కార్మికులు రోడ్లపైకి
- కొత్త పరిక్షిశమల్లో ఉద్యోగులు సీమాంధ్ర జిల్లాలవారే
- తోడైన సరళీకరణ విధానాలు
- మాయమైన తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతం
- విధ్వంసానికి గురైన కార్మికవాడ
తెలంగాణకు కొంగు బంగారాల్లా భాసిల్లిన అనేకానేక పరిక్షిశమలు.. ఇప్పుడు అంతర్థానమయ్యాయి! ప్రపంచ బ్యాంకుకు అవల్దర్జా జీతగాళ్లుగా మారిన ముఖ్యమంవూతుల చేతిలో దగాపడ్డాయి. పాలకుల కుట్రలకు తోడు ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు తోడై.. తెలంగాణ పరిక్షిశమల గొంతునులిమాయి! వాటి సమాధులే పునాదులుగా సీమాంధ్ర బడాబాబుల పారిక్షిశామిక సామ్రాజ్యాల భువన భవనాలు ఎదిగాయి! ఐడీపీఎల్, ఆల్విన్, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్, డీబీఆర్ మిల్స్, ఆజంజాహీ మిల్స్ ఒక అనేకానేక పరిక్షిశమలు.. అన్నీ లాభాల్లో, ఉత్పత్తుల నాణ్యతలో ప్రఖ్యాతిగాంచినవే! దేశంలో ఆమాట కొస్తే ఆసియాలోనే అతి పెద్ద కర్మాగారాలు కొన్ని! వేల మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించినవి! హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆనాడే నిలబెట్టిన ఘనత వహించినవి! తెలంగాణ పేరును దిగంతాలకు వ్యాప్తి చేసిన అద్భుతాలు! ఏవీ ఇవన్నీ? ఎక్కడకు పోయాయి?
దేశంలోనే మొట్టమొదట సారి విద్యుత్ను ఉత్పత్తి చేసి, హైదరాబాద్ నగరాన్ని వెలుగులతో నింపిన హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్.. ఇప్పుడు ఐమాక్స్ జిలుగుల కింద సమాధి అయి ఉంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన నిజాం షుగర్స్.. పాలకుల దుర్నీతికి బలైపోయింది. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డీబీఆర్ మిల్స్.. దొంగల బారిన పడి మొండిగోడలతో మిగిలింది! భారీ లాభాల్లో ఉన్న హైదరాబాద్ ఆల్విన్.. అడ్డికిపావుశేరు ధరకే ఓల్టాస్ కంపెనీకి సొంతమై.. తరువాత రియల్టర్లపాలైంది! ఆసియాలోనే ప్రఖ్యాతిగాంచిన ఐడీపీఎల్ గుండెలపై ప్రైవేట్ ఫార్మా కాళ్లు నిగడదన్ని ఎదిగింది!
ఆసియాలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్లు ఆజంజాహి నేడు చెత్త కంపెనీ రాంకీ ఖాతాలోకి వెళ్లింది! వస్త్రాలు ఉత్పత్తి చేయాల్సిన ఫ్యాక్టరీ స్థలం నేడు రియల్ ఎస్టేట్ వెంచర్గా మారింది! సనత్నగర్, ఆజామాబాద్, కాటేదాన్, ఉప్పల్ పారిక్షిశామిక ప్రాంతాలు ఇప్పుడు కళ తప్పాయి! ఇది తెలంగాణ పారిక్షిశామిక సామ్రాజ్యం కుప్పకూలిన తీరు! వలస వచ్చి పాగావేసిన సీమాంధ్ర బడాబాబులు, వారికి వెన్నుదన్నులిచ్చిన పాలకులు తెలంగాణ పరిక్షిశమల ఆయువు తీసిన వైనం! పాత కంపెనీలు బొందపెట్టి..
కొత్త కంపెనీలు తెచ్చారు సరే.. నిబంధనల ప్రకారం రావాల్సిన ఉద్యోగాలైనా దక్కాయా? అంటే అవీ సీమాంధ్ర జిల్లాల వాసులకే వశమయ్యాయి! ఉన్న ఉపాధి పోయి.. కొత్త ఉపాధి లేక ఇప్పుడు తెలంగాణ యువత నిరాశా నిస్పృహలతో రగిలిపోతున్నది! పోనీ పారిక్షిశామికరంగంలో తెలంగాణ ఔత్సాహికులు ఎదిగారా అంటే అదీ లేదు! ఇదీ.. కోటి రతనాల వీణ ధ్వంసమైన తీరు! పాలకుల దుర్నీతి తెలంగాణ పారిక్షిశామిక ప్రాంతంపై వేయి పడగపూత్తి విషం చిమ్మిన విధం! వేల మందికి నీడనిచ్చిన తెలంగాణ పరిక్షిశమల చెట్టు కొమ్మలను ఒక్కొక్కటిగా నరికిపారేసిన దారుణం!
-ఐడీపీఎల్ సమాధులపై ప్రైవేట్ ఫార్మా సామ్రాజ్యాలు
కొందరు వ్యక్తుల స్వార్థం.. ఈ సంస్థలో పని చేసే సుమారు 6వేల మంది కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసింది. ఇది హైదరాబాద్ నగరంలో బాలానగర్లోని ఐడీపీఎల్ వ్యథ. భారతదేశంలో దీనితో పాటు ప్రారంభమైన మద్రాస్, రిషికేష్, గుర్గావ్ సంస్థలు నేటికీ సవ్యంగా నడుస్తుండగా హైదరాబాద్ సంస్థ మాత్రం ప్రారంభమైన మూడు దశాబ్దాలకు మూతపడింది.
అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1961 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నాలుగుచోట్ల ఐడీపీఎల్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 1967లో బాలానగర్లో హైదరాబాద్ యూనిట్ ప్రారంభమైంది. రష్యన్ కొలాబరేషన్తో ప్రారంభించిన ఈ సంస్థ ఎన్నో రకాల బల్క్ డ్రగ్స్ను దేశవిదేశాలకు సరఫరా చేసింది. జాబ్ ఓరియం ప్రారంభించిన ఈ యూనిట్ అనతికాలంలోనే లాభాల బాటలో పయనించి మిగిలిన యూనిట్లకు మదర్ యూనిట్గా మారింది. మందుల తయారీ, టానిక్ల తయారీలో పదేళ్లపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఊహించిన దానికంటే అధికస్థాయిలో పేరువూపఖ్యాతులు గడించింది.
ఆ తరువాత ఈ సంస్థలోకి ఆంధ్రా ప్రాంత ఉన్నతోద్యోగులు (జీఎం స్థాయి) రంగ ప్రవేశం చేశారు. అప్పటికే ఈ సంస్థలో సీనియర్ కెమిస్టుగా పనిచేస్తూ అపార పరిజ్ఞానం సంపాదించిన డాక్టర్ అంజిడ్డి తన పలుకుబడిని ఉపయోగించి డిజైన్ డెవలప్మెంట్ ప్రాసెస్ (డీడీపీ) విభాగం హెడ్గా మార్పించుకున్నాడని చెబుతారు. నెమ్మదినెమ్మదిగా ఈ సంస్థ టెక్నాలజీని అనుసరించి ఓ సంస్థను నిర్వహించడానికి కావలసినంత టెక్నాలజీని సమకూర్చుకున్నాడు.
ఆ తరువాత ఐడీపీఎల్కు 1981-82లో రాంరాం చెప్పి మరో ఉన్నతోద్యోగి చంద్రశేఖర్డ్డితో కలిసి ఏకంగా ఎస్ఓఎల్ పేరిట ఓ లేబొరేటరీని స్థాపించాడు. 1984లో పూర్తిస్థాయిలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీపేరుతో భారీ పరిక్షిశమను స్థాపించాడు. కాగా ఐడీపీఎల్లో ఉన్న ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఆర్డర్లకు తగిన ఉత్పత్తిని అందించలేకపోయారు. ఇదే అదునుగా డాక్టర్ రెడ్డీస్ బాటలోనే రాంప్రసాద్ రెడ్డి అరబిందో లేబొరేటరీస్ను ప్రారంభించారు. సీమాంవూధులైన ఉన్నతోద్యోగులు ఈ పరిక్షిశమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, వచ్చిన ఆర్డర్లను కొత్తగా ఆవిర్భవించిన పరిక్షిశమలకు గుట్టుచప్పుడు కాకుండా మళ్లించి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పడు అధికారంలో ఉన్న కొందరు మంత్రిస్థాయి నేతలు డాక్టర్ రెడ్డీస్, అరబిందో సంస్థలకు సహకారం అందించి, ఐడీపీఎల్ పతనానికి పరోక్షంగా కారకులైనట్లు మాజీ ఐడీపీఎల్ ఉద్యోగులు చెబుతున్నారు.
ఆంధ్రవూపదేశ్కు, ప్రత్యేకించి తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ పరిక్షిశమ దిగజారిపోతున్నా పట్టించుకోలేదని, పైగా ఆయన కూతురుకు చెందిన ఓ డ్రగ్ పరిక్షిశమకు సహకారమందించాల్సిందిగా ఉన్నతోద్యోగులకు పరోక్షంగా సందేశమందినట్లు వారు పేర్కొన్నారు. పరిక్షిశమ మూతపడి ఓ వైపు కార్మికులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు కోట్ల రూపాయల విలువచేసే ఐడీపీఎల్ ఖాళీ భూమిని కైవశం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ పరిక్షిశమ స్థాపనకు ప్రభుత్వం కేటాయించిన 891 ఎకరాల్లో కొందరు ముస్లింలకు చెందిన పట్టాస్థలాలు ఉన్నాయని, ప్రస్తుతం పరిక్షిశమ నడవడం లేనందున, నాడు వాటికి నష్టపరిహారం చెల్లించనందున వారికి చెందిన భూమిని తిరిగి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేయించి, వెనుక తానుండి మంత్రివర్యులు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
నిజాం షుగర్స్ను నాటి సీఎం చంద్రబాబు సీమాంధ్ర పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మివేయగా, అధికారంలోకి రాకముందు అది అక్రమమని ఘోషించిన రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం షుగర్స్ స్వాధీనానికి వీసమెత్తు ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. నిజాం షుగర్స్ను తీసుకున్న డెల్టా పేపర్ మిల్స్ యాజమాన్యం జాయింట్ వెంచర్ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లఘిస్తున్నప్పటికీ కిరణ్ సర్కార్ మౌనం వహిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది.
ఇదీ గత వైభవం: 1938లో నిజామాబాద్ జిల్లా బోధన్లో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ దేశంలోనే ప్రభుత్వరంగంలో ఏర్పాటయిన అతిపెద్ద ఫ్యాక్టరీగా నిలిచింది. బోధన్ పరిసరాల్లో చెరుకును సొంతంగా పండించటానికి అప్పటి నైజాం పాలకుల హయాంలో సుమారు 16 వేల ఎకరాల వ్యవసాయక్షేవూతాలను ఈ ఫ్యాక్టరీకి సమకూర్చటం మరో ప్రత్యేకత. ఆంధ్రాలో చక్కెర ఫ్యాక్టరీలంటే తెలియని రోజుల్లోనే తెలంగాణలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మొదట వెయ్యి టన్నుల సామర్థ్యంతో ప్రారంభించారు. 1952లో రెండవ యూనిట్ ఏర్పాటు చేశారు. బోధన్లో నిజాం షుగర్స్ మదర్ యూనిట్గా పిలిచే శక్కర్నగర్ యూనిట్ ఆర్జించిన లాభాలతో రాష్ట్రంలో 7 చక్కెర ఫ్యాక్టరీలు, 3 ఆల్కహాల్ డిస్టిలరీలు, నాగార్జునసాగర్లో మెషినరీ డివిజన్ స్థాపించారు.
శక్కర్నగర్ యూనిట్ లాభాలతో నిజాం షుగర్స్ ఆధ్వర్యంలో 1970 దశకంలో హిందూపూర్, మిర్యాలగూడ, జహీరాబాద్లో కొత్త చక్కెర ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. 1980 దశకంలో బొబ్బిలి, సీతానగరంలో ఖాయిలాపడిన చక్కెర ఫ్యాక్టరీలను, పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు డిస్టిలరీని నిజాం షుగర్స్ అధీనంలోకి తీసుకొచ్చారు. అనంతరం మెట్పల్లిలో కొత్తగా మరో చక్కెర ఫ్యాక్టరీని నిజాం షుగర్స్ నిర్మించింది. చివరగా 1988లో మెదక్లో కొత్తగా నిజాం షుగర్స్ యూనిట్ ఏర్పడింది. ఆనాడు బోధన్ ఫ్యాక్టరీకి 40 కిలోమీటర్ల దూరం మేరకు ఫ్యాక్టరీకి రెండు వైపులా లైట్ రైల్వే లైన్ ఉండేది.
ముఖ్యంగా తెలంగాణలోని ప్రభుత్వరంగ కార్మికులు, చెరుకు రైతులకు నిజాం షుగర్స్ ఒక అండగా ఉంటూ ప్రైవేట్ ఫ్యాక్టరీలకు పోటీ సంస్థగా ఉందన్న సత్యాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా 2002లో నిజాం షుగర్స్లోని నాలుగు యూనిట్లను డెల్టా పేపర్ మిల్స్ అనే సీమాంధ్ర కంపెనీకి అప్పగించింది. జాయింట్ వెంచర్ పేరిట జరిగిన ఈ ప్రైవేటీకరణ మార్పులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. రూ.600 కోట్లు విలువ చేసే యూనిట్లను కేవలం రూ.68 కోట్లకు డెల్టా పేపర్ మిల్స్కు అక్రమంగా నిర్వహించిన స్విచ్ చాలెంజ్ టెండర్ల ద్వారా అప్పగించారని విమర్శలున్నాయి.సభాసంఘం నివేదిక తుంగలోకి: వైఎస్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారంపై సభాసంఘాన్ని నియమించింది. రెండేళ్ళ పాటు విచారణ జరిపిన సభాసంఘం..
స్విచ్ చాలెంజ్ పద్ధతిని తప్పుపట్టింది. జాయింట్ వెంచర్ను రద్దుచేసి నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. అధికారంలోకి రాకముందు నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్.. అధికారంలోకి వచ్చాక సిఫారసులను పట్టించుకోకపోవడం శోచనీయం. జాయింట్ వెంచర్లో నిబంధనలను కూడా ప్రైవేట్ యాజమాన్యం ఉల్లంఘించిందని సభాసంఘం తేల్చినప్పటికీ ఏ ఒక్క సిఫారసునూ అమలు చేయలేదు. ఫలితంగా ప్రైవేట్ యాజమాన్యంలో కార్మికులు, చెరుకు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
-గడియారాలు, బస్ బాడీలతో ప్రఖ్యాతి
-అధికార దుర్వినియోగంతో పతనం
-పట్టించుకోని పాలకులు
1952లో భారతదేశ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను తయారు చేసి అందించిన ఘనత ఆల్విన్దే. ఆ తర్వాతి కాలంలో బస్ బాడీ యూనిట్గా రూపాం తరం చెంది 1963లో ఏపీఎస్ఆర్టీసీకి డెబుల్ డెక్కర్ బస్సును తయారు చేసి మరో ఘనతను సాధించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్విన్ను ప్రభుత్వ రంగ పరిశ్రమగా ప్రకటించింది. ఆపై 1981లో మూడవ యూనిట్గా జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఎనలేని ఖ్యాతిని గడిచింది.
అనంతరం 1983లో నిసాన్ సమన్వయంతో రిప్రిజిరేటర్ల తయారీ రంగంలోకి ప్రవేశించింది. పలురకాల వాహనాలనూ ఉత్పత్తి చేసింది. సుమారు 48ఏళ్లపాటు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్పత్తి రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ 1990లో జీఎంగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ అధికార దుర్వినియోగానికి బలవడం మొదలైంది. దీనికి తోడు అప్పటి కార్మిక సంఘ నేతలు సైతం వంతపాడటం కూడా ఆల్విన్పాలిట శాపమైందన్న విమర్శలున్నాయి.
పరిశ్రమపక్కనే ప్రస్తుతం ఓ క్లబ్ నిర్వహిస్తున్న వ్యక్తి పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం పేరుతో కాంట్రాక్టర్గా రంగప్రవేశం చేసి, సదరు జీఎంతో దోిస్తీ చేస్తూ పనులు చేయకుండానే అక్రమాలకు పాల్పడుతూ ఈ పరిశ్రమ పతనానికి పరోక్షంగా కారకుడయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడేళ్ళ కాలంలోనే మూతపడే స్థాయికి చేరి 1993వ సంవత్సరంలో కార్మికులను రోడ్డున పడేసింది. ఆ తరువాత 1994వ సంవత్సరంలో బీఐఎఫ్ఆర్ ద్వారా వివిధ కంపెనీలకు భాగస్వామ్యం పంచి కొందరు కార్మికులకు ఉపాధి కల్పించినప్పటికీ సరైన న్యాయం చేయడంలో సీమాంధ్ర ప్రభుత్వం విఫలమైంది.
-అప్రకటితంగా కంపెనీ మూసివేత
-అధికారులతోనూ కుమ్మక్కు
-ఫ్యాక్టరీని నడుపుతున్నామని అబద్ధాలు
-20 ఏళ్లుగా కంపెనీకి కార్మికులే కాపలా
-జీవితాలను కోల్పోయిన అభాగ్యులు
షాపూర్షనైకి చెందిన 24.16ఎకరాల ఇనాం భూమిని దివాన్ బహదూర్ రాంగోపాల్ 99 ఏళ్లు లీజుకు తీసుకొని 1922 నాటికి పరిక్షిశమను నిర్మించి ఉత్పత్తిని మొదలు పెట్టారు. 1984 వరకు ఇది బ్రహ్మాండంగా పని చేసింది. ఆ తర్వాత దివాన్ బహదూర్ కంపెనీని నడపటానికి ఇష్టం లేక లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. గోతికాడి నక్కల్లా కాచుక్కూర్చున్న సీమాంధ్ర దోపిడీదారులు వారికి ప్రతినిధిగా ఆనాటి సీఎం ఎన్టీరామారావు, గోదావరిజిల్లాకు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తికి డీబీఆర్మిల్ను 1984లో లీజుకు తీసుకున్నారు. తేరగా కంపెనీని చేజిక్కించుకున్న కృష్ణంరాజు ఏనాడూ ఫ్యాక్టరీని పద్ధతిగా నడపలేదు సరికదా ఎలా మూసివేయాలన్న దిశగానే పావులు కదిపాడు.
ఇదే ముడిసరుకుతో 1991 వరకు ఫ్యాక్టరీని నడిపినట్లు చేశారని కార్మికులు చెప్పారు. రకరకాల లిటిగేషన్లు పెడుతూ పని చేయించకుండా చేశాడని, ఇతని ప్రవర్తనతో ఆనాడు చాలా మంది కార్మికులు పనిలోనుంచి వెళ్లి పోయారని తెలిపారు. ఫ్యాక్టరీని నడపని కృష్ణంరాజు 1992 ఫిబ్రవరిలో ఓ అర్ధరావూతిపూట ఫ్యాక్టరీకి తాళం వేశాడు. అడ్రస్ లేకుండా పోయాడు. అంతే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కృష్ణంరాజు నేరుగా ఫ్యాక్టరీ వద్దకు రాలేదు. కానీ ఫ్యాక్టరీలో ఉన్న రూ.100 కోట్ల విలువైన మిషనరీని రాత్రి పూట తరలించుకు పోయాడు. కానీ ఇప్పటికీ పరిక్షిశమ నడుస్తున్నదనే కృష్ణం రాజుఅడ్డంగా వాదిస్తున్నారు.
లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ప్రస్తుతం భూమి విలువ గజం రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. అంటే డీబీఆర్ మిల్స్ మొత్తం భూమి విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుంది. మరో వైపు ఈ ఫ్యాక్టరీ తనదంటూ సీమాంవూధకు చెందిన ఆర్ఆర్అసోసియేట్స్ అధినేతగా చెప్పుకునే రంగాడ్డి ప్రవేశించారు. ఈయనను కృష్ణంరాజే కావాలని కార్మికుల బెడద వదిలించుకోవడానికి తీసుకువచ్చాడా... లేక రాయలసీమ డాబుతో తనే కైవసం చేసుకోవడానికి వచ్చాడా అన్న విషయాలపై సర్వత్రా సందేహాలు వెలువడుతున్నాయి.
ఇది ఇలా ఉండగానే బిగ్బజార్కు చెందిన యజమాని మాల్పాణి డీబీఆర్ఫ్యాక్టరీలో ఆరు ఎకరాల భూమి తనదని కె్లైమ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిర్మాణ పనులు చేయడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. వీరికి తోడుగా సీపీఐ, ఐఎఫ్టీయులు నిలబడడంతో వారు వెనక్కు తగ్గారు. ఆ తరువాత డీబీఆర్ ఫ్యాక్టరీ భూమి ప్రభుత్వానిదని ప్రకటిస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అక్కడ నోటీస్లు అంటించారు. ‘మా నాన్న మిల్లులో పని చేశాడు. అర్ధాంతరంగా ఫ్యాక్టరీ మూసివేయడంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. నాన్న ఫ్యాక్టరీ కోసం కాపలా కాస్తూనే చనిపోయాడు. ఈ మిల్లు కోసం అమ్మ ఎదురు చూస్తూ చనిపోయింది.
ప్రస్తుతం నేను అనాథనయ్యాను’ కార్మికుడిగా తలెత్తుకొని బతికిన. ఇప్పుడు అడ్డమీది బతుకైంది. జీవితం దుర్భరంగా మారింది. నాకు నాలుగు ఆపరేషన్లు అయ్యాయి. ప్రస్తుతం 65 ఏళ్లు. ఇంకా ఎదురు చూసే ఓపిక పోయింది. ఫ్యాక్టరీ మూత పడడంతో పిల్లలను చదివించుకోలేకపోయా. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మంచి భవిష్యత్ను ఇవ్వలేని తండ్రిగా మిగిలాను.
Take By: T News - http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=54538 Read more...
Monday, December 19, 2011
గ్రూప్-1 ఫలితాలపై అనుమానాలు!
- వరంగల్ కేంద్రం నుంచి 11మంది మాత్రమే ఎంపిక
- చిత్తూరు నుంచి 120 మందికి పైగా ...
- పేపర్లీక్ అయిందని కొందరి అభ్యర్థుల ఆరోపణ
- నేడు ఏపీపీఎస్సీ అధికారులను కలుస్తామని వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 18 (): గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో వరంగల్ కేంద్రం నుంచి పరీక్ష రాసిన వారిలో కేవలం 11 మందిని మాత్రమే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసిందని, అదే చిత్తూరు నుంచి సుమారు 120 మంది పైగా ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.h
పరీక్షా సమయంలో తిరుపతి కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకయిందని, అందుకే ముఖ్యమంత్రి జిల్లా చెందిన చిత్తూరు అభ్యర్థులు ఎక్కువగా ఇంటర్వ్యూలకు ఎంపికయి ట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆదివారం పలువురు గ్రూప్-1 అభ్యర్థులు ‘టీ న్యూస్’తో మాట్లాడారు. వీరు వ్యక్తం చేసిన అనుమానాలకు పరీక్షా సమయంలో జరిగిన సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. మెయిన్స్ పరీక్ష సందర్భంగా తిరుపతిలోని ఓ పరీక్షా కేంద్రంలో కొంత మంది అభ్యర్థులు జవాబు పత్రం (బుక్పూట్) ఇవ్వగానే బుక్పూట్లోని రఫ్ పేపర్లో సుమారు 10 ప్రశ్నలకు సంబంధించి జవాబులు రాశారు. ఒక్కో అభ్యర్థి ఒక్కో ప్రశ్నకు జవాబు రాశారు.
ఇది గమనించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారి వద్ద నుంచి జవాబు పత్రాలు తీసుకుని కొత్తవి ఇచ్చారు. తిరుపతి పరీక్షా కేంద్రంలో అబ్జర్వర్గా ఉన్న ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు చంద్రశేఖర్.. ప్రశ్నా పత్రం ఇవ్వకుండానే రాసిన జవాబులకు, ఇవ్వబోయే ప్రశ్నాపవూతంలోని ప్రశ్నలను పరిశీలిస్తే అవి అందులో ఉన్నట్టుగా నిర్దారించారు. దీంతో ముందస్తుగా పేపర్ లీక్ అయిందని గమనించిన ఏపీపీఎస్సీ..
ఆ జిల్లా కలెక్టర్తో విచారణ చేయించినట్లు సమాచారం. కానీ ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను వాల్యువేషన్ చేశారా? లేదా అన్న విషయాన్ని ఏపీపీఎస్సీ వెల్లడిస్తే తప్పా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. కాగా, పేపర్ లీకేజీతో పాటు, తెలుగు మీడియం విద్యార్థులకు జరిగిన అన్యాయంపై సోమవారం ఏపీపీఎస్సీ అధికారులను కలువనున్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు.
Take By: T News
![Validate my RSS feed [Valid RSS]](valid-rss-rogers.png)